Tuesday, 24 March 2020

చిరంజీవి ఫస్ట్ ట్వీట్: ప్రియమైన కేసీఆర్, జగన్.. ఉగాది రోజున చిరు విన్నపం

మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలోకి అడుగుపెట్టారు. ఉగాది నాడు ఆయన ట్విట్టర్ అకౌంట్‌ను ప్రారంభించారు. సరిగ్గా 11 గంటల 11 నిమిషాలకు ట్వీట్ చేశారు. తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, కరోనా వైరస్‌పై కలిసికట్టుగా పోరాడి జయిద్దామని పిలుపునిచ్చారు. ‘‘అందరికీ శార్వరి నామ ఉగాది శుభాకాంక్షలు. నా తోటి భారతీయులందరితో, తెలుగు ప్రజలతో, నాకు అత్యంత ప్రియమైన అభిమానులందరితో నేరుగా ఈ వేదిక నుంచి మాట్లాడగలగటం నాకెంతో ఆనందంగా ఉంది. ఈ సంవత్సరాది రోజు ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా మహమ్మారిని కలిసికట్టుగా జయించడానికి కంకణం కట్టుకుందాం. ఇంటి పట్టునే ఉందాం. సురక్షితంగా ఉందాం’’ అని ట్వీట్‌లో చిరంజీవి పేర్కొన్నారు. దీనికి కొనసాగింపుగా మరో ట్వీట్ చేసిన చిరంజీవి.. ‘‘21 రోజులు మనందరినీ ఇళ్లలోనే ఉండమని మన భారత ప్రభుత్వం ఇచ్చిన ఆదేశం కరోనా మహమ్మారిని ఎదర్కోవటానికి ఓ అనివార్యమైన చర్య. ఈ క్లిష్ట సమయంలో మనం, మన కుటుంబాలు, మన దేశం సురక్షితంగా ఉండటానికి మన ప్రియ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు, మన ప్రియ ముఖ్యమంత్రులు శ్రీ కేసీఆర్ గారు, శ్రీ జగన్ గారు ఇచ్చే ఆదేశాలను పాటిద్దాం. ఇంటు పట్టునే ఉందాం. సురక్షితంగా ఉందాం’’ అని పేర్కొన్నారు. కాగా, చిరంజీవి ట్వీట్లకు విపరీతమైన స్పందన వచ్చింది. నిజానికి ఆయన ట్వీట్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తోన్న అభిమానులు వెంటనే రీట్వీట్‌లు చేయడం మొదలుపెట్టారు. వరుసపెట్టి కామెంట్లు చేస్తున్నారు. మొదటి ట్వీట్‌ను అప్పుడే 5 వేల మంది రీట్వీట్ చేశారు. రెండో ట్వీట్‌ను 2.5 వేల మంది రీట్వీట్ చేశారు. మొదటి ట్వీట్‌కు 1.6 వేల కామెంట్లు వచ్చాయి. 10.8 వేల మంది లైక్ చేశారు. ఇదంతా కేవలం కొన్ని నిమిషాల్లోనే. ఒక్క రోజు గడిస్తే ఈ లెక్కలు ఎక్కడిదాకా వెళ్తాయో. దటీజ్ మెగాస్టార్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3bmu3ek

No comments:

Post a Comment

Will Hathiram Be Killed In Paatal Lok?

'I insisted only Jaideep could play Inspector Haathiram Chaudhary.' from rediff Top Interviews https://ift.tt/RHLTIwD