Thursday, 19 March 2020

నిర్భయ దోషుల ఉరిపై అనసూయ ట్వీట్.. అర్థం కాలేదంటున్న నెటిజన్స్

నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలుపై తాజాగా స్పందించింది. ఈ సందర్భంగా అనసూయ హిందీలో ట్వీట్ చేసింది. ‘ఇన్‌సాఫ్‌కి సుభాహ్.. దేర్ సే హి సహీ’ అంటూ హిందీలో పోస్టు పెట్టింది. న్యాయోదయం... కాస్త ఆలస్యం అయినా సరైనది ’ అంటూ అర్థం వచ్చేలా హిందీలో ట్వీట్ చేసింది అనసూయ. దీంతో జబర్దస్త్ బ్యూటీ పోస్టుపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఆమె పెట్టిన పోస్టుకు అర్థం ఏంటని అడుగుతున్నారు. మరికొందరు సూపర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంకొందరు న్యాయం గెలిచిందని ట్వీట్ చేస్తున్నారు. ఇవాళ ఉదయం 5:30 గంటలకు నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై దేశ వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. ఉరిశిక్ష పూర్తికాగానే తీహార్ జైలు బయట పలువురు సంబరాలు చేసుకున్నారు. స్వీట్లు పంచుకున్నారు. ఉదయం నాలుగు గంటలకే నలుగురికి అల్పహారం అందించారు జైలు అధికారులు. అయితే రాత్రి ఎవరూ సరిగా నిద్రపోలేదని తీహార్ జైలు అధికారులు చెబుతున్నారు. ఉరిశిక్ష అమలు చేస్తారన్న భయం, ఆవేదన వారిలో కనిపించాయని తెలిపారు. నలుగురు దోషులకు ఉరిశిక్ష వేసిన అనంతరం అరగంటపాటు ఉరికంబాలకే వేలాడిదీసి ఉంచారు. చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత వారిని కిందకు దింపి వైద్యులు పరీక్షలు జరిపారు. నలుగురు దోషుల మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహిస్తారు. అనంతరం వారి కుటుంబసభ్యులకు మృతదేహాల్ని అప్పగిస్తారు. దాదాపు నిర్భయ హత్యాచార ఘటన జరిగిన ఏడేళ్ల నాలుగు నెలల కాలం తర్వాత దోషులకు ఉరిశిక్ష పడింది. దీంతో దేశ వ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3dhkIGD

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....