Saturday, 7 March 2020

మహేష్‌ బాబుకు రొటీన్ స్టోరీ.. ఎక్కువ ఊహించేసుకోవద్దన్న టీం

సూపర్‌స్టా్ర్ తర్వాతి సినిమాలపై రోజుకో రూమర్ వస్తూనే ఉంది. ఇప్పటికే ఆయన మెగాస్టార్ చిరంజీవితో కలిసి ‘ఆచార్య’ సినిమాలో కీలక పాత్ర పోషించేందుకు ఇటీవల ఓకే చెప్పారట. ఆ తర్వాత అనిల్ రావిపూడితో కలిసి ‘f3’ సినిమాలో నటించేందుకు కూడా ఒప్పుకున్నారట. దీంతో పాటు ‘గీత గోవిందం’తో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న దర్శకుడు పరశురామ్‌తోనూ సినిమా చేయబోతున్నారని టాక్. అయితే పరశురామ్ ఇటీవల మహేష్‌కు ఓ కథ చెప్పారట. అది కూడా రొటీన్ స్టోరీ చెప్పినట్లు టాక్. బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టి వేల కోట్లు మింగేసిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీలను ఇండియాకు రప్పించడానికి ఏం చేసారు అన్న కాన్సెప్ట్‌ను పరశురామ్ మహేష్‌ కోసం రాసుకున్నారట. ఈ టాపిక్ వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విటర్‌లో బాగా ఫార్వర్డ్ అయింది. దాంతో మహేష్ బాబు టీం దీనిపై స్పందించారు. సొంతంగా ఊహించేసుకోవద్దు అని వార్నింగ్ ఇచ్చారట. ‘విజయ్ మాల్యా, నీరవ్ మోదీలకు సంబంధించిన పాయింట్‌ పరశురామ్ రాసుకున్న స్క్రిప్ట్‌లో ఉంది. కానీ అది స్క్రిప్ట్‌లో ఓ లేయర్ మాత్రమే. స్టోరీ గురించి సోషల్ మీడియాలో ఏవైతే తిరుగుతున్నాయాలో వాటిలో నిజం లేదు. ఎక్కువగా ఊహించేసుకోవద్దు’ అని క్లారిఫై చేసారట. ఇకపోతేే చిరంజీవి సినిమాలో మహేష్ అనగానే ఎంతో హైప్ వచ్చేసింది. ఆచార్య సినమాలో మహేష్ విద్యార్థి సంఘ నాయకుడిగా నటిస్తున్నారని టాక్. ఆయనకు జోడీగా పూజా హెగ్డే నటించనున్నారట. ఇక చిరంజీవికి జోడీగా త్రిష కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. కొరటాల శివ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే సినిమాలో మహేష్‌కు బదులు రామ్ చరణ్‌నే పెట్టుకోవచ్చు కదా అని చిరు కొరటాలకు చెప్పారట. అలా అయితే మహేష్‌కు మరో 40 కోట్లు రెమ్యునరేషన్ ఇవ్వాల్సిన అసవరం ఉండేది కాదని ప్రొడక్షన్ ఖర్చులు తగ్గుతాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేసారట.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/38uXOru

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....