Friday, 20 March 2020

‘నిర్భయ.. శాంతి శాంతి శాంతి’ మంచు మనోజ్ ట్వీట్‌‌కి అదిరే రెస్పాన్స్

నిర్భయ అత్యాచార కేసులో నిందితులకు ఉరిశిక్ష విధించడం పట్ల సర్వత్ర హర్షం వ్యక్తం అవుతోంది. సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో నలుగురు నిందితులకి ఈ రోజు ఉరి పడింది..ఉదయం 5.30 గంటలకు ఢిల్లీలోని తీహార్ జైలు నెంబర్ 3 లో ఈ నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలు చేశారు. నలుగురు నిందితులకు ఒకేసారి ఉరిశిక్ష పడటం కూడా దేశంలో ఇదే తొలిసారి. నిర్భయ కేసులో నిందితులుగా ఉన్న నలుగురు ఉరి నుంచి తప్పించుకునేందుకు ఏడేళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే ఎట్టకేలకు వీళ్ల పాపం పండింది. ఈ నలుగుర్ని ఒకేసారి ఉరికంబానికి వేలాడదీయడంతో తిహార్ జైలు బయట పండగ వాతావరణం నెలకొంది. కరోనా ప్రభావంతో ఇళ్ల నుండి బయటకు రావడానికి భయపడుతున్న పరిస్థితుల్లో కూడా వేలాది మంది సామాజిక కార్యకర్తలు, సామన్య జనం పెద్ద ఎత్తున జైలు వద్దకు చేరుకుని సంబరాలు నిర్వహించుకున్నారు. దోషుల్ని ఉరితీయగానే మిఠాయిలు పంచుకుని ఆనందం వ్యక్తం చేశారు. అయితే దేశ వ్యాప్తంగా నిర్భయ దోషుల్ని ఉరి తీయడంపై హర్షం వ్యక్తం చేస్తుండగా.. సామాన్య జనంతో పాటు సెలబ్రిటీలు సైతం తమ స్పందనను తెలియజేస్తున్నారు. టాలీవుడ్, బాలీవుడ్‌కి చెందిన ప్రముఖులు ట్విట్టర్‌తో న్యాయం గెలిచింది అంటూ స్పందిస్తున్నారు. ప్రీతిజింటా, సుస్మితా సేన్, పీవీపీ, అనసూయ లాంటి సెలబ్రిటీలు ఇప్పటికే తమ స్పందనల్ని తెలియజేయగా.. సామాజిక కార్యక్రమాల్లో నేను సైతం అని ముందుండే మంచు హీరో తనదైన శైలిలో స్పందిస్తూ వరుస ట్వీట్లు చేశారు. చెడు వేలాడదీయడాన్ని చూడటం కోసం వెయిట్ చేస్తున్నా.. అంటూ నిర్భయ నిందితుల ఉరికి ముందు ట్వీట్ చేసిన మంచు మనోజ్.. ఉరి తీసిన తరువాత ‘RIP నిర్భయ అంటూ ఆమెకు సానుభూతిని తెలియజేస్తూ.. శాంతి, శాంతి, శాంతి’ అని ట్వీట్ చేశారు. మంచు మనోజ్ ట్వీట్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇలాంటి సోషల్ ఇష్యూస్‌పై స్పందించాలి అంటే మీరే అన్నా అంటూ ఆయన ఫ్యాన్స్ రీ ట్వీట్లు చేస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/390wu4I

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....