Saturday, 21 March 2020

Acharya Movie: ‘ఆ పుకార్లను నమ్మొద్దు, రామ్ చరణ్‌కి భాగమే’.. నిర్మాతలు ప్రెస్‌ నోట్

మనిషికి కష్టసుఖాలు ఎంత సర్వసాధారణమో.. సినిమా వాళ్లపై గాసిప్స్ కూడా అంతే. టీవీ సీరియల్ చూడని ఇళ్లైనా ఉంటుందేమో కాని.. గాసిప్ లేని సినిమా ఉండదు అంటే అతిశయోక్తి కాదు. సినిమా అంటే గాసిప్.. గాసిప్ అంటే సినిమాలా మారిపోయింది పరిస్థితి. ఒక రకంగా సినిమాలకు హైప్ ఇచ్చేవి కూడా గాసిప్సే. సరే ఈ గాసిప్స్ లొల్లి ఇప్పుడెందుకు వచ్చిందంటే మెగాస్టార్ 152 మూవీ ‘ఆచార్య’పై రకరకాల రూమర్స్ వస్తున్న వీటిని ఖండిస్తూ ప్రెస్ నోట్ విడుదల చేసింది చిత్ర నిర్మాణ భాగస్వామ్యంగా ఉన్న మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్. సైరా చిత్రం తరువాత మెగాస్టార్ చిరంజీవి.. కొరటాల శివ దర్శకత్వంలో తన 152 మూవీ చిత్రాన్ని చేస్తున్నారు. మ్యాటినీ ఎంటర్‌టైన్‌మెంట్‌, కొణిదల ప్రొడక్షన్ బ్యానర్స్‌పై , నిరంజన్ రెడ్డి ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అయితే చిత్ర నిర్మాణంలో చిత్ర నిర్మాతల మధ్య విభేదాలు తలెత్తాయనే వార్త సినీ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అవుతుంది. ఈ సందర్భంలో వాటిని ఖండిస్తూ నోట్ విడుదల చేసి చేసింది మ్యాటినీ ఎంటర్‌టైన్‌మెంట్‌. Read Also: తమకు రామ్ చరణ్ నిర్మాతగా ఉన్న కొణెదల ప్రొడక్షన్స్‌కి ఎలాంటి విభేదాలు లేవని.. ఏ నిర్ణయమైన పరస్పర సంప్రదింపుల ద్వారానే జరుగుతుందన్నారు. ఈ చిత్రంపై వస్తున్న రూమర్స్ అన్నీ అవాస్తవం.. రామ్ చరణ్ నిర్మాతగా పూర్తి బాధ్యతతో పాటు సహాకారాన్ని అందిస్తున్నారు.. ఇకపై కూడా అలాగే ముందుకు వెళ్తాం’ అంటూ లేఖను విడుదల చేశారు. కాగా ఈ మూవీ షూటింగ్ కరోనా వైరస్ ప్రభావంతో వాయిదా పడగా.. ఈ చిత్రం నుంచి హీరోయిన్ త్రిష తప్పుకున్న విషయం తెలిసిందే. కథాపరమైన అంశాల్లో తేడాలు రావడంతో ఈ మూవీ నుంచి తప్పుకున్నట్టు తెలిపారు త్రిష. ఈమె ప్లేస్‌లో కాజల్‌ను హీరోయిన్ తీసుకున్నట్టు సమాచారం. చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెం.150లో నటించిన కాజల్‌.. మెగాస్టార్‌తో రెండోసారి జోడీ కట్టుబోతున్నట్టు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2J3TAwX

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....