Friday, 20 March 2020

సాయంత్రం 5 గంటలకు దద్దరిల్లిపోవాలి... మహేష్ బాబు ఇంట్రస్టింగ్ ట్వీట్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడు. అనేక అంశాల పట్ల తనదైన స్టైల్లో స్పందిస్తూ ఉంటాడు. తాజాగా నిర్భయ ఘటన దోషులపై కూడా మహేష్ రెస్పండ్ అయిన విషయం తెలిసిందే. ఇక దాని తర్వాత భారత్‌ను పట్టి పీడిస్తున్న కరోనా వైరస్‌పై కూడా టాలీవుడ్ రాకూమారుడు ట్వీట్ చేశాడు. ఆదివారం రోజున ... ప్రధాని మోదీ జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చారు. ప్రధాని పిలుపుతో ఇప్పడు సైతం తన అభిమానుల కోసం ఓ పోస్టు పెట్టాడు. ప్రధాని ఇచ్చిన సూచనల్ని ప్రతీ ఒకరు పాటించాలన్నాడు. నేపథ్యంలో రేపు ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ట్విట్టర్ ద్వారా అభిమానులకు విజ్ఞప్తి చేశాడు మహేష్. మనల్ని రక్షించేందుకు తమ ప్రాణాలను పణంగా పెట్టిన ధైర్యశీలులకు శాల్యూట్ చేద్దామన్నాడు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు బాల్కనీల్లో నిల్చుని మనం కొట్టే చప్పట్లు ప్రతిధ్వనించాలి.. అదే మనం వారికిచ్చే గౌరవం, చప్పట్ల శబ్ధంలో అవి కనిపించాలి ’ అంటూ మహేష్ తన పోస్టులో పేర్కొన్నాడు. ప్రధాని పిలుపును అందరూ పాటించాలని, కరోనాను తరమికొట్టేందుకు ప్రతి ఒక్కరు జనతా కర్ఫ్యూలో భాగస్వాములు కావాలని మహేశ్‌బాబు మరో ట్వీట్ ద్వారా తన ఫ్యాన్స్‌కు, ప్రజలకు పిలుపునిచ్చాడు. ప్రధాన మోదీ ఇచ్చిన జనతా కర్ఫ్యూకు విశేష స్పందన లభిస్తోంది. మోదీ సూచనలను ప్రతి ఒక్కరు పాటించాలని పలువురు సెలబ్రిటీలో కోరుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్‌లో అనేకమంది కరోనాను తరిమికొట్టేందుకు జనతా కర్ఫ్యూను పాటించాలని చెబుతున్నారు. ప్రధాని పిలుపును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తమవంతుగా సినీ సెలబ్రిటీలు కృషి చేస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2WvTpSN

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....