ప్రముఖ యాంకర్ అనసూయ భరద్వాజ్పై వస్తున్న కామెంట్స్, ట్రోలింగ్పై ఆగ్రహం వ్యక్తం చేసారు ప్రముఖ జర్నలిస్ట్ శ్వేతారెడ్డి. ఇష్టమైన హీరోయిన్ అయితే ఆమెను తెగ పొగిడేస్తారు, ఇష్టంలేకపోతే దరిద్రంగా తిట్టడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు. ‘‘చిల్లర నా కొడుకులకు ఏం పనీ పాటా ఉండదు కాబట్టి అనసూయ, సుమలు ట్యాక్స్లు కట్టడంలేదు అని కామెంట్స్ చేసారు. సుమ ఇండస్ట్రీలోనే సీనియర్ యాంకర్. ఆమె ఎందుకు పన్ను కట్టరు. అనసూయ చదువుకున్న మహిళ. ఆవిడకు ట్యాక్స్ కట్టాలన్న సెన్స్ ఉంటుంది. ఎవరో ఏదో అనేసారని సుమ, అనసూయ పన్నులు కట్టడంలేదంటరా అని తెగ గుసగుసలాడేసుకుంటారు. వీళ్లపై కామెంట్స్ చేసేవారు విజయ్ మాల్యాపై, తెలుగు రాష్ట్రాల్లో కోట్లకు కోట్లు దోచుకుంటున్నవారిపై ఎందుకు మాట్లాడరు? ఇక అనసూయ వేసుకునే దుస్తులపై వచ్చే కామెంట్స్ గురించి మాట్లాడితే.. అసలు అనసూయ ఏ దుస్తులు వేసుకుంటే మీకెందుకు?’’ READ ALSO: ‘‘ఆమె ప్రొఫెషన్లో అలాంటి దుస్తులు వేసుకోవాలి కాబట్టి ఇష్టమొచ్చింది వేసుకుంటారు. బాలీవుడ్, హాలీవుడ్లో వేసుకోవడంలేదా? సమంత ఎక్స్పోజింగ్ చేయడంలేదా? మీకు నచ్చిన హీరోయిన్ అయితే ఒకలా నచ్చకపోతే మరోలా కామెంట్ చేస్తారా. నా అభిప్రాయంలో అనసూయ తనపై వస్తున్న కామెంట్స్ గురించి సోషల్ మీడియాలో పెట్టకుండా డైరెక్ట్గా వెళ్లి కంప్లైంట్ చేసి ఉంటే బాగుండు అనిపిస్తోంది. ఎందుకంటే సెలబ్రిటీ స్టేటస్ ఉన్న ఆవిడ నేరుగా స్టేషన్కు వెళ్తే ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. సమాజంలో ఉన్న ఆడపిల్లలకు కూడా ఆన్లైన్ చీటింగ్పై అవగాహన వస్తుంది. అప్పుడు ఆడవాళ్లు గురించి దరిద్రమైన కామెంట్ పెట్టాలంటే ఒక్కొక్కడికి వణుకు వస్తది’’ అని వెల్లడించారు. READ ALSO:
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3bD09Ui
No comments:
Post a Comment