Monday 30 September 2019

A Teaser for Christopher Nolan's Tenet Will Screen With Joker in India

A teaser trailer for Christopher Nolan's next movie, Tenet, will play in front of screenings of Joker in India. This is the same Tenet footage that was screened in front of Fast & Furious: Hobbs &...

from NDTV Gadgets - Latest https://ift.tt/2o3Yjav

Surface Device Renders Leak Ahead of Microsoft's Launch Event Tomorrow

Blass has also leaked renders of an ARM-powered Surface device that is seen donning the flip stand design, and comes with support for the S Pen as well.

from NDTV Gadgets - Latest https://ift.tt/2o3MxNv

Call of Duty Mobile Now Available for Android, iOS

Call of Duty: Mobile is now available to download and play on Android and iOS devices as a free game with in-app purchases.

from NDTV Gadgets - Latest https://ift.tt/2oRDyzl

Microsoft BitLocker Security Will Not Rely on SSD Hardware Encryption

Microsoft will no longer rely on SSD manufacturers to implement hardware encryption, instead trusting its own software, by default.

from NDTV Gadgets - Latest https://ift.tt/2o70M4c

Stranger Things Is Getting a Fourth Season, Netflix Announces

Netflix announced Monday a fourth season of retro sci-fi show Stranger Things, the site's most successful original production.

from NDTV Gadgets - Latest https://ift.tt/2oQ0b7e

'Everyone who lives here are Hindus'

'The idea of Hindu Rashtra is one of the most inclusive concepts.'

from rediff Top Interviews https://ift.tt/2mqwBUS

Apple Releases iOS 13.1.2, iPadOS 13.1.2, watchOS 6.0.1 With Bug Fixes

iOS 13.1.2 is rolling out for all iPhone and iPod touch models compatible with iOS 13, while iPadOS 13.1.2 is meant for iPad models compatible with the first iteration of iPadOS. Apple has also...

from NDTV Gadgets - Latest https://ift.tt/2o3Qvpc

iPhone Lost in River Found Still Working After 15 Months

Surprisingly the iPhone was returned to the owner in working condition.

from NDTV Gadgets - Latest https://ift.tt/2mtvWlD

షాకింగ్‌ : రానా ఇలా అయిపోయాడేంటి?

స్టార్‌ వారసుడిగా టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చి తరువాత తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్‌ యంగ్ హీరో రానా దగ్గుబాటి. మ్యాచో స్టార్ పేరు తెచ్చుకున్న ఈ యంగ్‌ హీరో తరువాత బాలీవుడ్‌, కోలీవుడ్‌లలోనూ సత్తా చాటాడు. అంతేకాదు హీరోగా క్యారెక్టర్సే చేస్తానంటూ మడి కట్టుకు కూర్చోకుండా పాత్ర బాగుంటే క్యారెక్టర్‌ రోల్స్‌తో పాటు విలన్‌ క్యారెక్టర్స్‌కు సై అంటున్నాడు. అయితే చివరగా ఎన్టీఆర్‌ మహానాయకుడు సినిమాలో కనిపించిన రానా తరువాత వెండితెర మీద కనిపించలేదు. అదే సమయంలో రానా ఆరోగ్యపరిస్థితిపై రకరకాల వార్తలు వినిపించాయి. రానా ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినిందని, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ కోసం విదేశాలకు వెళ్లాడన్న ప్రచారం జరిగింది. అయితే నిజంగానే విదేశాలకు వెళ్లిన రానా, తన ఆరోగ్య పరిస్థితి మాత్రం బాగానే ఉందంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. కానీ రానా లుక్‌ చూస్తే మాత్రం రానా ఆరోగ్యం విషయంలో అనుమానాలు రాక మానవు. బాహుబలిలో బల్లాలదేవుడిగా భారీ ఖాయంతో కనిపించిన రానా ప్రస్తుతం బక్కచిక్కిపోయి కనిపిస్తున్నాడు. ఎన్టీఆర్‌ బయోపిక్‌ సమయంలో చంద్రబాబు నాయుడు పాత్ర కోసం బరువు తగ్గానని చెప్పినా ఆ తరువాత కూడా మరింతగా బరువు తగ్గాడు రానా. దీంతో రానా ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. Also Read: తాజాగా ప్రచార చిత్రంలో రానా లుక్‌ చూసి అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా షాక్‌కి గురవుతున్నారు. సౌత్ మ్యాచో స్టార్‌ ఇలా మారిపోయాడేంటని బాధ పడుతున్నారు. మరి దగ్గుబాటి కుటుంబ సభ్యులు ఇప్పటికైన రానా ఆరోగ్యపరిస్థితిపై స్పందిస్తేగాని అభిమానుల అనుమానలకు, సోషల్ మీడియా పుకార్లకు తెరపడే అవకాశం లేదు. రానా ప్రస్తుతం తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న హాథీ మేరీ సాథీ సినిమాను పూర్తి చేయాల్సింది. ఈ సినిమా షూటింగ్‌ మధ్యలోనే రానా విదేశాలకు వెళ్లిపోయాడు. దీనికి తోడు వేణు ఉగుడుల దర్శకత్వంలో విరాటపర్వం సినిమాను ప్రారంభించాడు. సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభించాల్సి ఉంది. దీనితో పాటు రాజా మార్తండ వర్మ కథతో తెరకెక్కుతున్న బహుభాషా చిత్రం, మరో హిందీ చిత్రాలకు అంగీకరించాడు. మరి ఈ సినిమా షూటింగ్‌ ఎప్పుడు ప్రారంభమవుతుంది. రానా తిరిగి హ్యాండ్సమ్‌ లుక్‌లోకి ఎప్పుడు వస్తాడు. అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2nkulPr

TSMC Counter-Sues US Chip Rival GlobalFoundries for Patent Infringement

TSMC, the world's largest contract chipmaker, said it was seeking "substantial monetary damages from GlobalFoundries" but did not specify an amount.

from NDTV Gadgets - Latest https://ift.tt/2o0fji2

WeWork Shelves Plan for IPO, Tries to Rebuild Battered Image

WeWork's new leaders shelved plans to enter the stock market Monday as they sought to repair the battered image of a company that appeared to revolutionise the office-rental industry.

from NDTV Gadgets - Latest https://ift.tt/2mxNi0Q

Twitter Lets Users Sideline Unwanted Direct Messages

Twitter on Monday said it is rolling out a filter that will hide away unwanted direct messages, providing a new tool to stymie abuse.

from NDTV Gadgets - Latest https://ift.tt/2o3hrW6

Samsung Galaxy Fold to Launch in India Today: What You Need to Know

The event will detail the pricing and availability of the Samsung Galaxy Fold in the Indian market.

from NDTV Gadgets - Latest https://ift.tt/2mtJ3Dx

Vodafone Offers Full Talk Time on Its Rs. 45 Prepaid Plan

Rs. 45 Vodafone prepaid plan is currently available in select circles, including Assam, Bihar and Jharkhand, Karnataka, and Mumbai among others.

from NDTV Gadgets - Latest https://ift.tt/2mauyUO

Pixel 4 Themes, Wallpaper, Recorder Apps Leak Ahead of Launch

The Pixel 4 theming app offers deep personalisation features like creating custom themes, make system-wide font adjustments, customise icon shapes, and add new colour accents.

from NDTV Gadgets - Latest https://ift.tt/2nQt4iY

‘ఓ.. సైరా’ వీడియో సాంగ్: విజువల్స్ అదిరిపోయాయి

మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ఆ సమయం ఆసన్నమైంది. మరో రెండు రోజుల్లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా మెగాస్టార్ చిరంజీవి వెండితెరపై కత్తి దూయనున్నారు. టాలీవుడ్ రికార్డుల దుమ్ము దులపనున్నారు. ఇప్పటికే విడుదలైన ‘సైరా’ ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచింది. తాజాగా విడుదలైన ‘సైరా’ టైటిల్ సాంగ్ వీడియో ఆ అంచనాలను రెట్టింపు చేస్తోంది. ఆ వీడియో సాంగ్‌లో విజువల్స్ అద్భుతం అనిపిస్తున్నాయి. తెలుగు సినీ పరిశ్రమ నుంచి ‘బాహుబలి’ తరవాత మరో ఆణిముత్యంగా ‘సైరా’ నిలిచిపోతుంది అనిపిస్తుంది. తెలుగు గడ్డపై మొట్టమొదటి స్వాతంత్య్ర సమరయోధుడు, రేనాటి సూరీడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథను ‘సైరా నరసింహారెడ్డి’గా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ పోషించారు. నయనతార, తమన్నా, అమితాబ్ బచ్చన్, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, రవికిషన్ కీలకపాత్రల్లో నటించారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మించారు. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది సంగీతం సమకూర్చారు. ఇటీవల ఈ సినిమా టైటిల్ సాంగ్ లిరికల్ వీడియోను విడుదల చేశారు. అప్పుడే, పాట అద్భుతంగా ఉందని అంతా కొనియాడారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి అద్భుతమైన సాహిత్యాన్ని ఈ పాటకు అందించారు. అయితే, ఇప్పుడు ఈ పాట వీడియోను విడుదల చేశారు. విజువల్స్ పాటకు తగ్గట్టుగా అద్భుతంగా ఉన్నాయి. నయనతార, తమన్నా సైతం చాలా హుందాగా రాజబిడ్డల్లా మెరిసిపోతున్నారు. మొత్తంగా ఈ వీడియో సాంగ్ చాలా గ్రాండియర్‌గా ఉంది. పాటే ఇలా ఉంటే ఇక సినిమా ఎలా ఉండబోతోందో అని మెగా అభిమానుల్లో ఆత్రుత మరింత పెరిగిపోవడం ఖాయం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2n3reeL

OnePlus 7T to Get New Camera Features via Future Software Update

The OnePlus 7T's camera will be getting new features such as 960fps video and the ability to record at 4K resolution using the wide-angle camera via a software update.

from NDTV Gadgets - Latest https://ift.tt/2nRihFa

BSNL Brings Additional Data Benefits to Certain Prepaid Plans

BSNL has revised its Rs. 186 and Rs. 187 prepaid recharge plans to offer 3GB of daily data benefits. The Rs. 153 and Rs. 118 BSNL prepaid plans have also been upgraded with additional data benefits.

from NDTV Gadgets - Latest https://ift.tt/2nPB1F4

Dropbox Launches Spaces, a Collaborative Workspace for Desktop and Mobile

Dropbox is introducing Spaces, that lets users focus on important tasks at work and help them stay in sync with their teams.

from NDTV Gadgets - Latest https://ift.tt/2ovjVwO

YouTube Music Now Comes Pre-Installed on Android 10

Most Android 10 users and even some Android 9 users will now see YouTube Music preinstalled on their smartphones.

from NDTV Gadgets - Latest https://ift.tt/2nMDVum

'मनोज बाजपाई द फैमिली मैन के लिये बिल्कुल सही हैं'

'हमें अभी पता चला कि हमारे शो की रिलीज़ के ठीक एक सप्ताह बाद नेटफ़्लिक्स पर बार्ड ऑफ़ ब्लड आ रही है। तो अचानक दोनों की एक-दूसरे से तुलना की जाने लगी है।'

from rediff Top Interviews https://ift.tt/2n0qg2J

గోపీచంద్ ‘చాణక్య’: ఫస్టాఫ్ సరదాగా.. సెకండాఫ్ యాక్షన్

గోపీచంద్, మెహ్రీన్ హీరో హీరోయిన్లుగా న‌టించిన చిత్రం `చాణక్య`. బాలీవుడ్ హీరోయిన్ జరీన్‌ఖాన్ కీల‌క పాత్రలో న‌టించారు. తిరు ద‌ర్శక‌త్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై రామబ్రహ్మం సుంక‌ర నిర్మాత‌గా ఈ సినిమా రూపొందుతోంది. అక్టోబ‌ర్ 5న విడుద‌లవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్‌లో ఆదివారం రాత్రి జ‌రిగింది. ఈ కార్యక్రమంలో హీరో , డైరెక్టర్ తిరు, అనిల్ సుంకర, రామజోగయ్య శాస్త్రి, రాజేష్ ఖట్టర్, ఎం.వి.వి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో గోపీచంద్ మాట్లాడుతూ.. ‘‘నా నుంచి ప్రేక్షకులు ఎలాంటి అంశాలను కోరుకుంటారో అవ‌న్నీ ఈ సినిమాలో ఉన్నాయి. మంచి ఫైట్స్‌, డైలాగ్స్ ఉన్నాయి. డైరెక్టర్ తిరు ఓ హీరోను ఎలా చూపించాలో అలా చూపించారు. అబ్బూరి ర‌వి చాలా మంచి డైలాగ్స్ రాశారు. పాట‌లకు కూడా మంచి స్పంద‌న వ‌స్తుంది. విశాల్ చంద్రశేఖ‌ర్‌, శ్రీచ‌ర‌ణ్ పాకాల అద్భుత‌మైన సంగీతాన్ని అందించారు. అనిల్ సుంక‌ర‌ గారికి సినిమాలంటే ఎంతో ఇష్టం. అలాంటి వ్యక్తితో క‌లిసి ప‌నిచేయ‌డాన్ని ఆశ్వాదించాను. మీ అందరి ప్రేమతో అక్టోబర్ 5న మళ్లీ నేనేంటో నిరూపించుకుంటాను’’ అని అన్నారు. డైరెక్టర్ తిరు మాట్లాడుతూ.. ‘‘గోపీచంద్‌ గారు స‌రికొత్త పాత్రలో న‌టించారు. ఆయ‌న ఫేవ‌రెట్ సినిమాల లిస్టులో ఈ సినిమా కూడా ఉంటుంది. అక్టోబ‌ర్ 5న విడుద‌ల‌వుతున్న ఈ సినిమాను ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు. శ్రీచ‌ర‌ణ్ పాకాల‌, విశాల్ చంద్రశేఖ‌ర్ మంచి సంగీతాన్ని, బ్యాగ్రౌండ్ స్కోర్‌ను అందించారు. వెట్రిగారు చాలా మంచి విజువ‌ల్స్ ఇచ్చారు. అబ్బూరి ర‌విగారు అద్భుత‌మైన డైలాగ్స్ రాశారు. అలాగే రామ‌జోగ‌య్య శాస్త్రిగారు చాలా మంచి పాట‌ల‌ను రాశారు. సినిమా ఎంట‌ర్‌టైన్ చేసేలా ఉంటుంది. గోపీచంద్‌గారు చాలా హార్డ్ వ‌ర్క్ చేసిన చిత్రమిది’’ అని చెప్పారు. Also Read: రామ‌జోగయ్య శాస్త్రి మాట్లాడుతూ.. ‘‘సినిమా ప్రేక్షకుల అంచ‌నాల‌ను మించేలా ఉంటుంది. డైరెక్టర్ తిరు మ‌న తెలుగువాడే. ఆయ‌న నిర్మాత‌ల‌తో క‌లిసి సినిమాను బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతున్నారు. వైవిధ్యమైన చిత్రాల‌ను ఆద‌రిస్తున్న తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను కూడా ఆద‌రిస్తారనే న‌మ్మకంతో ఉన్నాం. విశాల్ చంద్రశేఖ‌ర్‌, శ్రీచ‌ర‌ణ్ పాకాల మంచి మ్యూజిక్‌ను అందించారు. ఫస్టాఫ్ స‌ర‌దాగా.. సెకండాఫ్‌లో మంచి యాక్షన్ పార్ట్ ఉంటుంది. అంద‌రినీ మెప్పించేలా సినిమా ఉంటుంది’’ అని అన్నారు. బాలీవుడ్ నటుడు రాజేష్ ఖట్టర్ మాట్లాడుతూ.. ‘‘నేను తెలుగు సినిమాల్లో న‌టించాల‌ని ఎదురు చూస్తున్న త‌రుణంలో నాకు ద‌క్కిన అవ‌కాశ‌మిది. చాణ‌క్య సినిమాతో నేను గోపీచంద్‌ గారిని క‌ల‌వ‌డం, ఆయ‌న‌తో క‌లిసి పనిచేయ‌డం సంతోషంగా ఉంది. ఈ సినిమాలో ఖురేషి పాత్రలో క‌న‌ప‌డ‌తాను. తెలుగులో నేనే డ‌బ్బింగ్ చెప్పుకున్నాను’’ అని వెల్లడించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2mbsoUY

Apple Releases iOS 13.1.1, iPadOS 13.1.1 to Address Various Bugs

iOS 13.1.1 and iPadOS 13.1.1 are available for download to all compatible iPhone, iPod touch, and iPad models.

from NDTV Gadgets - Latest https://ift.tt/2onHBmz

WhatsApp Will Soon Stop Working on iPhone Models Running This iOS Version

If WhatsApp is currently active on your iOS 8 device, you will be able to use it only until February 1, 2020.

from NDTV Gadgets - Latest https://ift.tt/2nIIdDc

Microsoft Spots 'Nodersok' Malware That Turns PCs Into Zombie Proxies

Researchers at Microsoft have uncovered a new malware campaign that is infecting thousands computers across the world.

from NDTV Gadgets - Latest https://ift.tt/2mXhfHP

Redmi K20 Pro, Mi Air Purifier 2S Price Cut Now Live in Xiaomi Diwali Sale

The Mi Air Purifier 2S is listed for a discounted price of Rs. 7,999, down from its original price of Rs. 8,999.

from NDTV Gadgets - Latest https://ift.tt/2nOMLHW

Sunday 29 September 2019

రొమాంటిక్ ఫస్ట్ లుక్: హాట్ కాదు...అరాచకం అంతే

ఒకప్పుడు బాలీవుడ్‌కి మాత్రమే పరిమితమయిన హాట్ సీన్స్, బోల్డ్ సీన్స్, లిప్ లాక్స్ ఇప్పుడు తెలుగు సినిమాల్లో కూడా కామన్ అయిపోయాయి. ఇంకా కరెక్ట్‌గా చెప్పాలంటే అవి లేకుండా సినిమా తియ్యడానికి కూడా ఎవరూ ఇష్టపడట్లేదు. పెద్ద హీరో అయినా, యంగ్ హీరో అయినా కూడా సినిమాకి మైలేజ్ పెంచే ఆ సీన్స్ మాత్రం కామన్ కంటెంట్. పెద్ద సినిమాలో అయినా కూడా లిప్ లాక్స్ లేకపోతే ట్రెండ్‌కి దూరంగా ఉన్నారు అనేస్తున్నారు అని ఆ తరహా సీన్ ఒకటయినా ఉండేలా చూసుకుంటున్నారు. Also Read: బోల్డ్ సీన్స్‌ని తెరకెక్కించడంలో పూరి మార్క్ వేరు. ఎలాంటి హీరోకి అయినా తన సినిమాలో మేకోవర్‌తో ఒక కొత్త లుక్‌తో పాటు కొత్త ఇమేజ్ కూడా ఇచ్చే పూరి హీరోయిన్స్‌కి అయితే తన సినిమాతో ఏకంగా లైఫ్ ఇచ్చేస్తాడు. ఇలియానా నుండి ఇప్పుడు నభా నటేష్ వరకు అనేకమంది హీరోయిన్స్ పూరి ప్రోడక్ట్స్. ఆయన కళ్ళలో పడి మెప్పించగలిగితే ఆమె హాట్ ఎస్సెట్స్ ఏంటి అనేది తన సినిమాల్లో వెండితెరపై ఆరబోసి మరీ ప్రూవ్ చేస్తాడు. ఇప్పుడు పూరి స్కూల్ నుండి వస్తున్న రొమాంటిక్ సినిమాలో హీరోయిన్ దశ కూడా ఈ ఒక్క సినిమాతో మారిపోతుంది అనిపిస్తుంది రొమాంటిక్ సినిమా ఫస్ట్ లుక్ చూస్తుంటే. ఎక్స్పోజింగ్ అనే మాటని పీక్స్‌లో ప్రెసెంట్ చేసి చూసుకున్నోళ్లకి చూసుకున్నంత అనేలా ఆ ఫస్ట్ లుక్‌ని ప్రెజెంట్ చేసారు. Also Read: ఆ పోస్టర్‌లో కేతికా శర్మ టాప్ లెస్‌గా కనిపిస్తుంది. ఆకాష్ పూరిని గట్టిగా హత్తుకుంది. ఆ హాట్ కౌగిలి ఆవిరిలోని ఆనందాన్ని అనుభవిస్తూ తన్మయత్వంతో కళ్ళు మూసుకున్నాడు రొమాంటిక్ హీరో . కానీ ఆ ఫస్ట్‌లుక్ పై నుండి కళ్ళు తిప్పుకోలేకపోతున్నారు కుర్రాళ్ళు. ఆ సినిమా టైటిల్‌కి జస్టిఫికేషన్ చేస్తూ ఫస్ట్ లుక్‌లోనే ఈ రేంజ్‌లో ట్రీట్ ఇచ్చారంటే సినిమాలో ఇంకెలాంటి డోస్ ఉండబోతుంది అనేది అర్ధం చేసుకోవచ్చు. ఇస్మార్ట్ శంకర్‌తో విజయం అందుకున్న పూరి కనెక్ట్స్‌కి ఈ సినిమా కూడా అదే రేంజ్ విజయం అందించబోతుందని అనే ఇంప్రెషన్ కలిగించింది ఈ పోస్టర్. గతంలో కళ్యాణ్ రామ్ కంపెనీలో విజువల్ ఎఫెక్స్ట్ సూపర్ వైజర్‌గా పనిచేసిన అనిల్ పాదూరి ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. అతనికి కూడా డైరెక్టర్‌గా స్టాండ్ ఇచ్చేలా ఉంది ఈ ఫస్ట్ లుక్. Also Read: ఆకాష్ పూరి నటించిన ఆంధ్రాపోరి, మెహబూబా రెండు సినిమాలు కూడా నిరాశపరచడంతో ఇప్పటివరకు రొమాంటిక్ సినిమాపై అంచనాలు లేవు. కానీ ఇప్పుడు మాత్రం ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని యూత్ మొత్తం ఎదురుచూసేలా ఈ ఫస్ట్ లుక్‌ని ఆవిష్కరించారు. ఇస్మార్ట్ శంకర్‌లో మాస్‌ని టార్గెట్ చేసిన పూరి ఈ సారి యూత్‌ని టార్గెట్ చేశారు. మొత్తానికి ఈ ఒక్క పోస్టర్‌తో రొమాంటిక్ రచ్చ స్టార్ట్ చేసేసాడు. థియేటర్స్‌లో రాక్ చేస్తాడో లేదో చూడాలి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2owjjal

TikTok Owner ByteDance's H1 Revenue Said to Be Better Than Expected

ByteDance, owner of video-sharing app TikTok and one of the world's most valuable unicorns, booked revenue of CNY 50-60 billion in a better-than-expected result for the first half, people familiar...

from NDTV Gadgets - Latest https://ift.tt/2nJvxvI

Russia Rolls Out the Red Carpet for Huawei Over 5G

Moscow has rolled out the red carpet for Huawei, letting it develop 5G networks in Russia.

from NDTV Gadgets - Latest https://ift.tt/2maiOSg

Netflix Tests Limited Free Access in India With Bard of Blood

Not sure if Bard of Blood is worth a Netflix subscription? Well, fret not. Netflix is offering limited free access to the first episode of its latest original series from India - produced by Shah...

from NDTV Gadgets - Latest https://ift.tt/2ou2UmE

Asus ROG Phone 2 Next Sale in India Scheduled for October 8

Asus ROG Phone 2 price in India is set at Rs. 37,999 for the 8GB RAM + 128GB storage option, while its 12GB RAM + 512GB storage variant is priced at Rs. 59,999.

from NDTV Gadgets - Latest https://ift.tt/2ouhpqz

Watch the Trailer for Upstarts, Netflix's Next Indian Movie

Netflix has unveiled a trailer and release date - October 18 - for Upstarts, its next Indian movie which follows three college graduates, who are "determined to ride the burgeoning wave of...

from NDTV Gadgets - Latest https://ift.tt/2opjYdm

Realme C2 Update Brings September Security Patch, Other New Features

The version number for this new Realme C2 update is RMX1941EX_11.A.17 and its rolling out over-the-air.

from NDTV Gadgets - Latest https://ift.tt/2nKZ4VM

Elon Musk Unveils New Mars Rocket Prototype, Expects Missions in Months

Starship, a shiny steel rocketship designed to ferry dozens of humans to the moon and Mars, is the top half of Musk's colossal interplanetary rocket system.

from NDTV Gadgets - Latest https://ift.tt/2nOKk8c

Vaani puts on her bikini body for War

'I am actually fighting to become the center of attraction because Hrithik and Tiger are getting all of it!'

from rediff Top Interviews https://ift.tt/2nKL4eG

Flipkart Big Billion Days Sale: Best Offers on Mobiles and Electronics

Flipkart Big Billion Days 2019 has finally unlocked offers on mobile phones and electronics as the sale enters its second day. We've handpicked some of the best offers you can grab on mobile phones,...

from NDTV Gadgets - Latest https://ift.tt/2ottzzZ

Redmi 8A Now on Sale via Flipkart, Mi.com: All You Need to Know

Redmi 8A is now on sale via Flipkart and Mi.com in India. This is the first time the phone is becoming available in the country after being launched earlier this week.

from NDTV Gadgets - Latest https://ift.tt/2m4TpJG

Realme XT Now on Open Sale via Flipkart, Realme.com Until October 4

Realme XT is now available via Flipkart and Realme India store. This is the second time the smartphone is going on sale in India after the company organised its first sale on September 16.

from NDTV Gadgets - Latest https://ift.tt/2omwD0F

మంచు విష్ణు హాలీవుడ్ మూవీలో బాలీవుడ్ హీరో

మంచు విష్ణు హీరోగా ఓ హాలీవుడ్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. హాలీవుడ్ డైరెక్టర్ జెఫెరీ చిన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో కీలక పాత్ర కోసం బాలీవుడ్ హీరో సునీల్ శెట్టిని చిత్ర యూనిట్ సంప్రదించింది. కథ విన్న సునీల్ శెట్టి వెంటనే ఓకే చెప్పేశారు. కథ ఆయనకు బాగా నచ్చిందని చిత్ర యూనిట్ వెల్లడించింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. సునీల్ శెట్టి అతి త్వరలో షూటింగ్‌లో పాల్గొననున్నారని చిత్ర యూనిట్ తెలిపింది. తెలుగు, ఇంగ్లీష్ ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విష్ణు సరసన కాజల్ అగర్వాల్, రుహానీ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై మంచు విష్ణు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా, గత కొంతకాలంగా మంచు విష్ణు బాగా వెనకబడిపోయారు. గడిచిన ఐదేళ్లుగా విష్ణుకు వరుసగా ప్లాపులే వచ్చాయి. ఈ ఏడాది ‘ఓటర్’ సినిమాతో వచ్చినా వర్కౌట్ కాలేదు. ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ సినిమా చేస్తున్నాడు. తానే నిర్మాతగా తెరకెక్కిస్తున్నారు కాబట్టి, కచ్చితంగా ఈ సినిమాలో ఏదో ప్రత్యేకత ఉండే ఉంటుంది. ఇప్పటి వరకు అయితే ఈ సినిమా గురించి పెద్దగా ప్రచారం ఏమీ లేదు. చూద్దాం ఈ సినిమా ఎలా ఉండబోతుందో..!


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2mEzeml

పూరి హీరోయిన్ పిచ్చ హాట్.. కుర్రాళ్లకు పండగే!

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సినిమాల్లో హీరోయిన్లు చాలా హాట్‌గా ఉంటారు. ఆయన గత చిత్రాలు చూస్తే ఈ విషయం ఎవ్వరికైనా అర్థమవుతుంది. తెలుగు కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొట్టే అమ్మాయిల్ని వెతికిపట్టుకొని వాళ్లను హీరోయిన్లుగా పరిచయం చేయడంలో పూరి దిట్ట. రక్షిత, అయేషా టకియా, హన్సిక, నేహా శర్మ, దిశా పటాని ఇలా చాలా మంది హాట్ హీరోయిన్లను తెలుగు ప్రేక్షకులకు ఆయన పరిచయం చేశారు. ఇప్పుడు మరో హాట్ బ్యూటీని పరిచయం చేయబోతున్నారు. పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ పూరి హీరోగా తెరకెక్కుతోన్న రెండో చిత్రం ‘రొమాంటిక్’. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, మాటలను పూరి జగన్నాథ్ అందిస్తున్నారు. అనిల్ పాదూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనకు ఇదే తొలి చిత్రం. అందమైన ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతోన్న ‘రొమాంటిక్’ షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. రేపు ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ సినిమా ద్వారా ఢిల్లీకి చెందిన మోడల్ కేతికా శర్మను హీరోయిన్‌గా పరిచయం చేస్తున్నారు. కేతికాకు ఇదే తొలి సినిమా అయినా.. సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి బోలెడంత ఫాలోయింగ్. ఎప్పుడూ హాట్ హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇన్‌స్టాలో ఈమెకు 1.6 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారంటే ఈమె క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందాలను తెగ ఆరబోస్తూ ఫొటోషూట్లు చేస్తూ ఉంటుంది. ఇంత హాట్ బ్యూటీని వెతికిపట్టుకుని తన కొడుకు పక్కన హీరోయిన్‌ను చేసేశారు పూరి. ఇన్‌స్టాగ్రామ్‌లోనే రెచ్చిపోతోన్న ఈ 23 ఏళ్ల అమ్మాయి ఇక వెండితెరపై ఆగుతుందా.. అందాల ఆరబోత ఖాయం. ఇంకేముంది, మన కుర్రాళ్లకు పండగే. సోమవారం ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల కాబోతోంది. ఈ ఫస్ట్‌ లుక్‌లో కచ్చితంగా హీరోహీరోయిన్లను చూపిస్తున్నారు. ఎందుకంటే, ఆదివారం విడుదలైన ప్రీ లుక్‌లో ఆకాశ్ భుజాలపై కేతికా శర్మ కూర్చున్న లుక్‌ను వెనుక నుంచి చూపించారు. రేపు వీళ్లిద్దరినీ ముందు నుంచి చూపించే అవకాశం ఉంది. ఏదేమైనా తన ఖాతాలో మరో హ్యాట్ బ్యూటీని వేసేసుకున్నారు పూరి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2olf9Su

పవన్ కళ్యాణ్‌కి అమితాబ్ ప్రశంసలు..ఒక సెటైర్ కూడా

ప్రమోషన్స్ కోసం చాలా టైమ్ కేటాయించారు. అలాగే చరణ్ కూడా దగ్గరుండి మరీ ఆ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. అయితే పాన్ ఇండియా సినిమాలకు హార్ట్ లాంటిది బాలీవుడ్ మార్కెట్. కనీసం అక్కడివాళ్లను మెప్పించగలిగినా కూడా సినిమా సేఫ్ అయిపోతుంది. అంత స్టామినా ఉన్న మార్కెట్ అది. అందుకే అక్కడ అమితాబ్‌తో కలిసి ఒక ఇంటర్వ్యూ‌లో పాల్గొన్నారు చిరు. అయితే ఆ ఇంటర్వ్యూ అంతా కూడా ఎదో రొటీన్‌గా కాకుండా చాలా సరదాగా సాగింది. చిరు చాలా ఫార్మల్‌గా మాట్లాడుతున్నా కూడా అమితాబ్ మాత్రం తన స్పాంటేనిటీతో, తన మార్క్ చమక్కులతో నవ్వించారు. Also Read:

అయితే ఆ ఇంటర్వ్యూ‌లో సైరా అనేది చిరంజీవి సినిమా మాత్రమే కాదు ఆ సినిమాలో మొత్తం చిరంజీవి కుటుంబం అంతా ఇన్వాల్వ్ అయ్యిందని చెప్పుకొచ్చారు బిగ్ బి. 'చిరంజీవి తనయుడు చరణ్, అలాగే కూతురు సుస్మిత కూడా సినిమాకోసం పనిచేసారు. ఆమె టాలెంట్ చూసి ఆమెకి కాంప్లిమెంట్స్ ఇచ్చాను' అని చెప్పారు. ఆ సందర్భంలో చిరంజీవి సైరా సినిమాకి వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. 'ఈ సినిమాకోసం నా తమ్ముడు పవన్ కళ్యాణ్ వాయిస్ ఇచ్చాడు... సినిమా స్టార్టింగ్‌లో ఎండింగ్‌లో కూడా వాయిస్ వస్తుంది, అతని వాయిస్ కూడా ఈ సినిమా గురించి చాలా చెబుతుంది' అని చెప్పగానే అమితాబ్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు. 'తెలుగు సినిమాకి సంబంధించినంత వరకు పవన్ కళ్యాణ్‌కి చాలా ప్రాముఖ్యత ఉంది. అక్కడ అతనికి హ్యుజ్ ఫాలోయింగ్ ఉంది' అంటూ పవన్ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు అమితాబ్. Also Read: ఇక ఇంటర్వ్యూ మొదట్లో చిరంజీవి తో తన పరిచయాన్ని గుర్తుచేసుకుంటున్న క్రమంలో అమితాబ్ అప్రయత్నంగానే చిరంజీవి‌ పై ఒక కౌంటర్ వేశారు. తర్వాత రజినీ కాంత్, పవన్ కళ్యాణ్‌లకు కూడా దాన్ని ఆపాదించారు. 'నేను చిరంజీవికి చాలా సలహాలు ఇస్తుంటాను, కానీ అవేమీ ఆయన పాటించరు. రాజీకీయాల్లోకి వెళ్లొద్దు అని చెప్పాను.రజినీ కాంత్‌కి చెప్పాను...కొంతకాలం తర్వాత చిరు రాజకీయాల్లో నుండి తిరిగివచ్చేసా అన్నాడు, కానీ తరువాత వాళ్ళ తమ్ముడు వెళుతా అంటే అతనికి కూడా చెప్పాను...వినలేదు...అతను రాజీకీయాల పట్ల చాలా ఆసక్తి కలిగిఉంటాడు'' అని నవ్వేసారు. దానికి చిరు స్పందిస్తూ ''నేను రాజకీయల్లోకి వెళ్లినందుకు ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఆ అర్హత కలిగి ఉన్నాడు'' అంటూ సపోర్ట్ చేశారు. Also Read: ఎప్పుడు చిరు, పవన్ కలవకపోయినా మెగా ఫ్యామిలీలో కలతలు అని రాసేసేవాళ్లకు ఆ ఛాన్స్ లేకుండా చేసాడు చిరంజీవి. సైరాకి వాయిస్ చెప్పినందుకు నేషనల్ మీడియాలో సైతం అతన్ని హైలైట్ చేసి, పవర్ స్టార్ అంటే తనకు ఎంత ప్రేమ అనేది చెప్పకనే చెప్పాడు. సైరా సినిమాని బాలీవుడ్‌కి చేరువ చెయ్యాలి అనే ఆ టీమ్ ప్రయత్నం ఈ ఒక ఒక్క ఇంటర్వ్యూ‌తో ఫుల్‌ఫిల్ అయ్యింది. అలుపులేకుండా సైరా టీమ్ చేస్తున్న ప్రమోషన్స్‌తో అక్టోబర్ 2న బాక్సాఫీస్ దగ్గర సైరా సంచలనాలు మామూలుగా ఉండవు అనే క్లారిటీ అయితే వచ్చేసింది. అది ఏ రేంజ్ చరిత్ర సృష్టిస్తుంది అనేది మాత్రం చూడాలి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2nG2Q2y

పాలిటిక్స్ వద్దు అని చెప్పా, చిరంజీవి వినలేదు.. నవ్వుతూనే చురకలేసిన అమితాబ్

అమితాబ్ బచ్చన్, చిరంజీవి.. వీరిద్దరూ మెగాస్టార్లే. హిందీలో దిగ్గజ నటుడు అమితాబ్ అయితే.. తెలుగులో కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న లెజెండ్ చిరంజీవి. అయితే, ఈ ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. ఆత్మీయ అనుబంధం ఉంది. ఈ బంధంతోనే చిరంజీవికి అమితాబ్ బచ్చన్ ఎన్నో సలహాలు ఇచ్చారట. కానీ, వాటిలో చిరంజీవి ఒక్కటి కూడా పాటించలేదట. ఈ విషయాన్ని అమితాబ్ స్వయంగా చెప్పారు. చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా అక్టోబర్ 2న విడుదలవుతోన్న సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదలవుతోంది. దీంతో అన్ని భాషల్లో భారీగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ ప్రమోషన్లలో భాగంగా తాజాగా చిరంజీవి, అమితాబ్‌లను హిందీలో ఈ సినిమాను విడుదలచేస్తోన్న ఫర్హాన్ అక్తర్ ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో ఈ స్టార్లు ఇద్దరూ పలు విషయాలను పంచుకున్నారు. Also Read: ఈ సందర్భంగా చిరంజీవి రాజకీయాల్లోకి ప్రవేశించడం గురించి అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ.. ‘‘మేమిద్దరం ఇప్పటికీ మాట్లాడుకుంటూనే ఉంటాం. నేను ఈయనికి సలహాలు ఇస్తూనే ఉంటాను.. కానీ, ఎప్పుడూ వాటిని పాటించలేదు. నేను పాలిటిక్స్‌లోకి వెళ్లాలని అనుకుంటున్నాను అని నాకు చెప్పారు. దయచేసి ఆ తప్పు చేయొద్దు అని చెప్పాను. రజినీకాంత్‌కు ఇదే సలహా ఇచ్చాను, మీకూ చెప్తున్నాను దయచేసి రాజకీయాల్లోకి వెళ్లొద్దు అని చెప్పాను. అయినప్పటికీ ఈయన వెళ్లారు. కొంతకాలానికి మళ్లీ బయటికి వచ్చేశారు’ అని నవ్వుతూనే చురకలంటించారు. అమితాబ్ ఈ విషయాలు చెబుతున్నంసేపు చిరంజీవి కూడా నవ్వు ఆపుకోలేకపోయారు. ‘‘ఈ అద్భుతమైన డ్రీమ్ ప్రాజెక్ట్‌లోకి మీరు ఎలా వచ్చారు?’’ అని అమితాబ్‌ను ఫర్హాన్ అక్తర్ అడిగారు. దీనికి అమితాబ్ సమాధానం ఇస్తూ.. ‘‘చాలా కాలంగా నేను, చిరంజీవి బెస్ట్ ఫ్రెండ్స్. ఆయన నన్ను ఏదైనా అడగడం చాలా అరుదు. అలాంటి వ్యక్తి ఈ పాత్ర చేస్తారా? అని అడిగారు. కచ్చితంగా చేస్తానని చెప్పాను. ఇంత పెద్ద ప్రాజెక్ట్‌లో ఆ పాత్రకు చిరంజీవి నన్ను ఎంపిక చేసుకోవడం నాకు దక్కిన గౌరవం. ఈ సినిమాలో నేను చేసింది చిన్న పాత్రే అయినా ఇంత పెద్ద ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు. ఇక అమితాబ్‌ను తీసుకోవడంపై చిరంజీవి స్పందిస్తూ.. ‘‘ఈ సినిమా చేద్దామని నిర్ణయించుకున్న తరవాత గురువు పాత్ర ఎవరు చేస్తారు అని మా డైరెక్టర్ నన్ను అడిగారు. ఎందుకంటే నిడివి ప్రకారం చూస్తే అది చిన్న పాత్ర. కానీ, నా పాత్ర కంటే గొప్ప పాత్ర. ఎవరు చేయాలి అని అనుకున్న సమయంలో నాకు గుర్తొచ్చిన ఒకే ఒక్క పేరు అమితాబ్ గారు. కానీ, ఆయన చేస్తారా అనే అనుమానం. నేను ట్రై చేస్తాను సురేందర్.. ఆయన చేయనంటే నిరుత్సాహపడొద్దు అని చెప్పా. నేను ఫోన్ చేసిన వెంటనే అస్సలు సమయం తీసుకోకుండా అమితాబ్ ఓకే చెప్పారు. ఈ పాత్రకు నేనే కరెక్ట్ అని నువ్వు అనుకుంటున్నావా అని మాత్రమే ఆయన నన్ను అడిగారు’’ అని చెప్పారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2nHJ32I

‘రొమాంటిక్’ ప్రీ లుక్: పూరి భుజాలపై పోరి!

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ‘మెహబూబా’ సినిమా ద్వారా తన కుమారుడు ఆకాశ్ పూరిని సోలో హీరోగా పరిచయం చేశారు. ఈ సినిమాకు పూరి జగన్నాథే దర్శకుడు, నిర్మాత. ఛార్మి సహనిర్మాతగా పూరి కనెక్ట్స్ బ్యానర్‌లో వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ఈ సినిమాకు పూరి మంచి హైప్ క్రియేట్ చేసినా అంచనాలను అందుకోవడంతో ఘోరంగా విఫలమైంది. దీంతో, తన సినీ వారసుడిగా ఆకాశ్‌ను నిలబెట్టే సినిమా ఇవ్వాలని మరో చిత్రాన్ని పూరి నిర్మిస్తున్నారు. ఆకాశ్ పూరి హీరోగా నటిస్తోన్న రెండో చిత్రం ‘రొమాంటిక్’. కేతిక శర్మ హీరోయిన్. అనిల్ పాదురి దర్శకత్వం వహిస్తున్నారు. లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ సోమవారం ఉదయం 11 గంటలకు విడుదలకానుంది. ఈ విషయాన్ని పూరి జగన్నాథ్ ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అంతేకాకుండా, ‘రొమాంటిక్’ ప్రీ లుక్‌ను విడుదల చేశారు. ఈ ప్రీ లుక్ పోస్టర్‌లో ఆకాశ్ పూరి భుజాలపై ఢిల్లీ పోరి కేతిక శర్మ దర్జాగా కూర్చుంది. ఆకాశ్ ఆమెను మోసుకుంటూ బీచ్‌లో హాయిగా నడుస్తున్నాడు. ‘‘లవ్ బర్డ్స్.. బీచ్‌లో విహరిస్తున్నారు’’ అని ఈ పోస్టర్‌కు పూరి జగన్నాథ్ క్యాప్షన్ కూడా పెట్టారు. కాగా, ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం సమకూరుస్తున్నారు. భాస్కరభట్ల సాహిత్యం అందిస్తున్నారు. Also Read: కాగా, ‘ఇస్టార్మ్ శంకర్’ సినిమా షూటింగ్ సమయంలోనే ‘రొమాంటిక్’ మూవీ షెడ్యూళ్లను కూడా పూర్తిచేశారు. గోవాలో ఈ రెండు చిత్రాలను ఒకేసారి చిత్రీకరించారు. గోవా పరిసర ప్రాంతాల్లో 45 రోజుల పాటు ‘రొమాంటిక్’ సినిమాకు సంబంధించి సన్నివేశాలను చిత్రీకరించినట్లు అప్పట్లో ఛార్మి వెల్లడించారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ‘ఇస్మార్ట్ శంకర్’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన పూరి, ఛార్మి.. ఈ ‘రొమాంటిక్’తో ఎలాంటి హిట్ కొడతారో చూడాలి..!


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2olshHf

సాఫ్ట్‌వేర్ సుధీర్ : మొత్తం కామెడీనే

ఢీ షో లో అస్తమాను హీరో అంటూ ఒక మేనరిజం పెట్టుకుని అందరిని అలరించిన, అలరిస్తున్న సుధీర్ ఇప్పుడు హీరోగా మారాడు. అక్కడ సుధీర్ హీరో అవుతా అనగానే సెటైర్స్ పడ్డాయి. కానీ ఇప్పుడు మాత్రం నిజంగానే హీరో అయిపోయాడు. అతను నటించిన సినిమా టీజర్ కూడా రిలీజ్ అయ్యింది. ఎక్స్ట్రా జబర్దస్త్‌లో సుడిగాలి సుధీర్‌గా నవ్విస్తున్న అతను ఇప్పుడు ''‌గా మారాడు. ఆ‌ టీజర్‌లో ముందు ఎదో యాక్షన్ హీరోలా రెండు మూడు బిల్డప్ షాట్స్ ఇచ్చిన సుధీర్ ఆ తరువాత మాత్రం అవుట్ అండ్ అవుట్ కామెడీ చెయ్యడానికి ప్రయత్నించాడు.అతని ఒరిజినల్ కామెడీ టైమింగ్ ఈ సినిమాలో కూడా బాగా పండినట్టు అనిపిస్తుంది. అలాగే డైలాగ్స్ చెప్పటప్పుడు ఈజ్ కూడా బావుంది. Also Read: చాలామంది బుల్లితెర నటులు కూడా హీరోలుగా వచ్చినా కూడా క్లిక్ కాలేదు. కానీ సుధీర్ మాత్రం వాళ్ళకి భిన్నంగా వెళుతున్నట్టు కనిపిస్తున్నాడు. పేరుకి ఒక పేరడీ సినిమా టైటిల్‌లా ఉన్నా కూడా ఈ సినిమాలో ఎదో చెప్పుకోదగ్గ మ్యాటర్ కూడా ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమాలో షియాజీ షిండే, నాజర్, ఇంద్రజ, పోసాని కృష్ణమురళి లాంటి చాలామంది స్టార్ కాస్ట్ ఉన్నారు. అయితే మరొక విశేషం ఏంటంటే ప్రజాగాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న గద్దర్ ఈ సినిమాలో ఒక పాట పాడాడు, సినిమాలో ఆ పాటలో ఆయనే నటించాడు కూడా. ఇక టెక్నీషియన్స్ లిస్ట్‌లో కూడా పెద్ద పేర్లే కనిపిస్తున్నాయి. భీమ్స్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక పెద్ద పెద్ద సినిమాలకు DOP గా పనిచేసిన సి.రామ్ ప్రసాద్ ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్. అలాగే గౌతమ్ రాజు ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. Also Read: ఈ సినిమాలో సుధీర్‌కి జోడిగా ధన్య బాలకృష్ణ నటిస్తుంది. ఈ టీజర్‌కి ప్రేక్షకులనుండి స్పందన కూడా బావుంది. అయితే సుధీర్‌కి జోడీగా రష్మీ అయితే బావుండేది అని కామెంట్స్ చేస్తున్నారు చాలామంది. శేఖర ఆర్ట్స్ క్రియేషన్స్ పై శేఖర రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి రాజశేఖర్ రెడ్డి డైరెక్టర్. అయితే ఈ సినిమాని అంత తేలిగ్గా తీసిపడెయ్యడానికి లేదు. ఇంతమంది పెద్ద వాళ్ళు ఈ సినిమాకి పనిచేస్తున్నారు అంటేనే సినిమాలో ఎదో ఒక బలమయిన ఎలిమెంట్ ఉండి ఉంటుంది. కానీ టీజర్ కాబట్టి సుధీర్‌ని హీరోగా పరిచయం చేస్తూ కేవలం కామెడీ ఉండేలా శాంపిల్ చూపించారు. ట్రైలర్ రీలీజ్ అయితేగానీ ఈ సినిమాలో ఏముంది అనేది పూర్తిగా తెలియదు. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2nCQnwG

స్నేహారెడ్డి బర్త్‌డే.. భార్యకు బన్నీ స్వీట్ విషెస్

టాలీవుడ్‌లోని క్యూటెస్ట్ కపుల్ జాబితాలో ముందు వరుసలో ఉన్న జంట , స్నేహారెడ్డి. ప్రేమించి.. పెద్దలను ఒప్పించి.. పెళ్లిచేసుకున్న వీరు అన్యోన్య దాంపత్య జీవితాన్ని గడుపుతున్నారు. బన్నీ సినిమాలతో బిజీబిజీగా గడుపుతుంటే.. స్నేహ పిల్లల ఆలనా పాలనా చూసుకుంటున్నారు. అయితే, ఆదివారం స్నేహారెడ్డి తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తన భార్యకు బన్నీ స్వీటెస్ట్ విషెస్ చెప్పారు. చాలా సింపుల్‌గా.. ‘‘హ్యాపీ బర్త్‌డే క్యూటీ’’ అని ఇన్‌స్టా‌గ్రామ్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. తన భార్యను హత్తుకుని తీసుకున్న ఫొటోను కూడా పోస్ట్ చేశారు. కాగా, అల్లు అర్జున్-స్నేహారెడ్డిల వివాహ బంధానికి ఎనిమిదేళ్లు. మార్చి 6న వీరిద్దరూ తమ ఎనిమిదో వివాహ వార్షికోత్సవం జరుపుకున్నారు. 2011 మార్చి 6న హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో బన్నీ, స్నేహల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వారి ప్రేమకు ప్రతిరూపంగా 2014 ఏప్రిల్ 4న అయాన్ జన్మించాడు. 2016లో కూతురు అర్హ జన్మించింది. Also Read: ఇదిలా ఉంటే, అల్లు అర్జున్ ప్రస్తుతం ‘అల... వైకుంఠపురములో...’ అనే చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్.ఎస్.తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్. తాజాగా ఈ సినిమాలోని తొలిపాటను విడుదల చేశారు. ‘సామజవరగమన’ అంటూ సాగే ఈ పాటకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన ఈ పాటను సిధ్ శ్రీరామ్ ఆలపించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2m2HH2d

Amazon and Flipkart Sales, OnePlus 7T, iPhone 11, and More News This Week

Amazon Great Indian Festival sale, Flipkart Big Billion Days sale, iPhone 11 India availability, OnePlus TV launch, OnePlus 7T price reveal, Samsung Galaxy A70s price in India reveal, and other top...

from NDTV Gadgets - Latest https://ift.tt/2mMVg6b

Ala..Vaikunthapurramloo :అల్లు అర్జున్ రేంజ్ ఇది.. దూసుకుపోతున్న రేస్ గుర్రం

అల్లు అర్జున్ మెగా హీరో గా ఎంట్రీ ఇచ్చి తన స్కిల్‌తో టాప్ హీరోగా ఎదిగాడు. అయితే బన్నీకి గత కొంతకాలంగా అన్ని విషయాల్లో నెగెటివిటీ ఎదురవుతుంది. సరైనోడు సినిమా హిట్ అయినా కూడా పవన్ కళ్యాణ్ కాంట్రవర్సీలో ఇరుక్కున్నాడు. DJ టైమ్‌లో మీడియా మీద ఎదురుదాడి చేస్తే అప్పుడొక రభస జరిగింది. అన్నీ క్లియర్ అయిపోయాయి అనుకుని భారీ బడ్జెట్‌తో నా పేరు సూర్య...నా ఇల్లు ఇండియా సినిమా చేస్తే అది కెరీర్‌లోనే వరస్ట్ డిజాస్టర్ అయ్యింది. ఇక రీసెంట్‌గా సైరా ఫంక్షన్‌కి రాలేదు అని ఏకేస్తున్నారు. ఇన్ని చిరాకుల్లో కూడా బన్నీకి మంచి బూస్టింగ్ ఇచ్చింది సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్. Also Read: త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తన మూడో సినిమా 'అల...వైకుంఠపురములో'లో నటిస్తున్నాడు బన్నీ. ఆ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. అయితే ఏ సినిమాకి అయినా కూడా సినిమా రిలీజ్‌కి ముందు మంచి ఇంప్రెషన్ కలిగించేది ఆ సినిమా ఆడియో. పైగా అక్కడినుండే సినిమా పై ఎక్స్పెక్టేషన్స్ కూడా మొదలవుతాయి. స్టార్ హీరోల సినిమాల విషయంలో కీలకమయిన ఓపెనింగ్స్ తీసురావడంలో కూడా ఆడియో కీలకపాత్ర వహిస్తుంది. అలాంటి కీలకమయిన ఆడియో విషయంలో మాత్రం అల...వైకుంఠపురములో సినిమాకి సూపర్ ఛాన్స్ వచ్చింది. ఇంతకుముందు అరవింద సమేత సినిమా కోసం త్రివిక్రమ్‌తో పనిచేసిన థమన్ ఆ సినిమాకి అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు. అదే ట్యూనింగ్‌తో గురూజీతో టీమ్ అప్ అయిన థమన్ అల...వైకుంఠపురములో సినిమాకి మొదటి పాటతోనే అదిరిపోయే టాక్ తీసుకొచ్చాడు. Also Read: ఈ మధ్య థమన్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. దాంతో ''నీ కాళ్ళను పట్టుకు వదలనన్నవి చూడే న కళ్ళు...'' అంటూ సాగిన ఆ పాట ఇప్పుడు అందరికి పట్టేసింది. థమన్ మ్యూజిక్ తోడు సీతారామశాస్త్రి సాహిత్యం కూడా అదుర్స్ అనిపించేస్తుంది. గాత్రంలోని మ్యాజిక్ కూడ జతకలిసి ఆ పాటని ట్రెండింగ్‌లో నిలబెట్టాయి. ఆ పాట రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే యూ ట్యూబ్ ట్రెండింగ్‌లో నెంబర్ 1 ప్లేస్‌కి చేరింది. కేవలం ఇక్కడ మాత్రమే కాదు నేషనల్ వైడ్‌గా కూడా టాప్ 10 లో ప్లేస్ దక్కించుకుంది 'సామజవరగమన'. Also Read: అల్లు అర్జున్‌కి తెలుగు స్టేట్స్ తో పాటు కేరళలో కూడా భారీ ఫ్యాన్ బేస్ ఉండడం వల్ల, కర్ణాటకలో కూడా మంచి ఫాలోయింగ్ ఉండడం వల్ల ఈ పాట నేషనల్ రేంజ్‌లో ట్రెండ్ అవుతుంది. బన్నీ డబ్బింగ్ సినిమాలకు బాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ గురించి ఆ సినిమాల వ్యూస్ చెబుతాయి. 100 మిలియన్స్ మార్క్ అనేది బన్నీ సినిమాలకు అలవోకగా అందుకునే టార్గెట్‌గా మారింది.అలా విస్తరించిన అల్లు అర్జున్ క్రేజ్ అల...వైకుంఠపురములో సినిమాకి బాగా ఉపయోగపడుతుంది. ఒక్క పాటతోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన బన్నీ అల...వైకుంఠపురములో తో హిట్ అందుకుంటే ఈ రేస్ గుర్రం మళ్ళీ టాప్ లీగ్ రేస్ లోకి దూసుకొచ్చినట్టే.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2nxNXj4

Saturday 28 September 2019

పవన్ కళ్యాణ్ 'సైరా' కథ ఇమ్మన్నాడు..రామ్ చరణ్‌కి కూడా నో చెప్పాం

సైరా...ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో డిస్కషన్ పాయింట్‌గా మారిన సినిమా. ఆ సినిమా రూపుదిద్దుకోవడానికి రెండున్నరేళ్లు పట్టినా కూడా ఆ కథ పుట్టి మాత్రం పదేళ్లు దాటింది. ఇదే విషయాన్ని స్వయంగా తెలియజేసారు పరుచూరి గోపాలకృష్ణ. '2006లో చిరంజీవి గారికి ఈ సినిమా కథ చెప్పాం. ఆ కథ విని అదిరిపోయింది అని దాన్ని డెవలప్ చెయ్యడం కోసం మా అన్నయ్యని దుబాయ్ తీసుకెళ్లారు, బ్యాంకాక్ తీసుకెళ్లారు, ఈ కథ పై కూర్చుంటూనే ఉన్నారు. 2008 వరకు ఈ సినిమా కథపై ఉన్నారు. ఆ తరువాత రాజకీయాల్లోకి వెళ్లిపోయారు. అప్పుడు చాలా బాధవేసింది' అని సైరా కథ గురించి అనేక ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. Also Read: 'చిరంజీవి గారు రాజకీయాల్లోకి వెళ్ళిపోయాక చాలామంది సైరా కథ ఇవ్వమని అడిగారు కానీ మేము మాత్రం ఈ కథ చిరంజీవి గారికి మాట ఇచ్చాం, ఎప్పటికయినా ఆయనే చెయ్యాలి అని చెప్పాం. ఒక‌సారి కూడా సైరా కథ ఒక్కసారి చెప్పండి, అన్నయ్య ఆ కథని ఎందుకు అంత ప్రేమిస్తున్నాడు అని అడిగారు. మధ్యలో చిరంజీవి గారు కూడా ఒక వేళ ఈ కథ నేను చెయ్యలేకపోతే రామ్ చరణ్‌కి సూట్ అవుతుందా ఒక్కసారి ఆలోచించండి అన్నారు. కానీ మేము మాత్రం ఈ కథ చేస్తే మీరే చెయ్యాలి అని చెప్పాం. చిరంజీవి సినిమాల్లోకి తిరిగొచ్చాక మళ్ళీ ఈ సినిమా గురించి డిస్కషన్ వచ్చింది. కానీ అప్పుడు మార్కెట్ ఎలా ఉందో తెలుసుకోవాలి అని ఖైదీ నెంబర్ 150 చేసారు' అంటూ సైరా కథ వెనుక జరిగిన మొత్తం కథని వివరించారు ఈ డైనమిక్ రైటర్. ఖైదీ నెంబర్ 150 విజయం తరువాత, రాజమౌళి బాహుబలి తీసాక ఈ సినిమాని ఇంత హై బడ్జెట్‌తో తెరకెక్కించారట. Also Read: ఏ సినిమా ఆడియో ఫంక్టన్‌కి అయినా,ప్రీ రిలీజ్ ఫంక్షన్ అయినా పరుచూరి గోపాలకృష్ణ వస్తే ఆ సినిమా హీరో అభిమానులను ఉర్రుతలూగించేలా మాట్లాడతారు.అయితే సైరా కథ పుట్టుకలో కీలక పాత్ర పోషించిన ఆయన సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాకపోవడం ఒక వింతయిన విషయం. ఆ లోటు ఆ వేదిక దగ్గర క్లియర్‌గా కనిపించింది. అయితే దాని వెనుక ఉన్న కారణాన్ని కూడా ఆయన చెప్పుకొచ్చారు. 'సైరా ఫంక్షన్‌కి నేను రాకపోవడం గురించి కూడా చాలామంది అడుగుతున్నారు. కానీ ఆ టైమ్‌లో నా ఆరోగ్యం బాలేదు. సైరా ఈవెంట్ టైమ్‌లో మూడు రోజులు వెనుక నరం పట్టెయ్యడంతో అడుగుతీసి అడుగువెయ్యలేని పరిస్థితిలో ఉన్నాను' అంటూ ఆ వేడుకకు ఆయన రాకపోవడానికి కారణాన్ని వివరించారు. Also Read: ఏది ఏమైనా ఒక హీరో కోసం 13 సంవత్సరాలపాటు ఒక కథని హోల్డ్ చెయ్యడం అనేది మామూలు విషయం కాదు. ఆ కథని కోటి కాదు అంతకంటే ఎక్కువే అడిగినా కూడా ఇచ్చి ఎవరో ఒకరు కొనుక్కునేవారు. కానీ పరుచూరి బ్రదర్స్ అంత డబ్బును కూడా ఒక్క మాట కోసం వదులుకున్నారు. అందుకే వాళ్ళ కలను నెరేవేరుస్తూ సైరా భారీ క్రేజ్‌తో అక్టోబర్ 2న బ్రహ్మాండమయిన విడుదలకు సిద్దమైంది. ఈ సినిమా బాహుబలి రికార్డ్‌ని కూడా దాటుతుంది అనే అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలు ఎంతవరకు నిజం అవుతాయి అనేది వచ్చే బుధవారం తేలుతుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2ocHR7S

Sye Raa Review: ‘సైరా’ ఫస్ట్ రివ్యూ: ఇతని రేటింగ్‌ని నమ్మలేం

మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటేనే హైప్ ఓ రేంజ్‌లో ఉంటుంది. అందులోనూ ఆయన ఎన్నాళ్ల నుండో చేయాలనుకుంటున్న పాత్రను సొంత నిర్మాణంలో చేస్తున్నారు. తొలి తెలుగు స్వాతంత్య్ర పోరాట యోధుడు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ పాత్రను చిరంజీవి పోషిస్తూ.. ‘సైరా’గా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. బాహుబలి, సాహో చిత్రాల తరువాత టాలీవుడ్ నుండి రాబోతున్న భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా మూవీ ఇదే కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. టీజర్, ట్రైలర్‌లతో ఈ అంచనాలు రెట్టింపుకావడంతో ఈ సినిమా రిజల్ట్ కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఈ సందర్భంలో సినిమాకి ఉన్న హైప్‌ని క్యాష్ చేసుకుంటూ విడుదలకు ముందే రివ్యూలు ఇచ్చే దుబాయ్ సెన్సార్ బోర్డ్ సభ్యుడుగా చెప్పుకునే మూవీ మార్కెట్ పీఆర్ ఎక్స్ పర్ట్ ఉమైర్ సంధు ‘సైరా’ చిత్రానికి ఫస్ట్ రివ్యూ ఇచ్చేశారు. ‘సైరా చిత్రం ఎమోషనల్ రైడ్‌తో అద్భుతంగా ఉంది. రోమాలు నిక్కబొడుచుకునే సన్నివేశాలతో సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ పొందుతారు. బాహుబలి చిత్రం కల్పన కాని.. ఇది వాస్తవ కథ ఆధారంగా రూపొందించబడింది. ఏపీ అన్ని రికార్డ్‌లను సైరా స్మాష్ చేస్తుంది. మెగాస్టార్ అభిమానులకు ఈ చిత్రం పండగే’ అంటూ నాలుగు ఫైర్ స్టార్‌లు వేసేశాడు. అయితే ఇతను నిజంగానే సినిమాలను చూసి రివ్యూలు ఇస్తాడా? లేక హైప్‌ని దృష్టిలో పెట్టుకుని రివ్యూలు ఇస్తాడో తెలియదు కాని.. హిట్ చిత్రాలతో పాటు కొన్ని అట్టర్ ఫ్లాప్ చిత్రాలకు సైతం ఐదు స్టార్లు వేసిన ఘనత ఇతనికి ఉంది. పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’, మహేష్ బాబు ‘స్పైడర్’, అల్లు అర్జున్ ‘నాపేరు సూర్య’ వంటి అట్టర్ ఫ్లాప్ చిత్రాలకు ఈయన టాప్ రేటింగ్ ఇచ్చారు. రీసెంట్‌గా ‘సాహో’ చిత్రానికి సైతం మైండ్ బ్లోయింగ్ అంటూ రివ్యూ ఇచ్చారు. ఈ లెక్కన ఆయన రివ్యూలను నమ్మే పరిస్థితి లేదని చెప్పాలి. ఇతని రివ్యూ సంగతి పక్కనపెడితే.. ‘సైరా’ తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం ప్రేక్షకుల్లో అయితే బలంగానే ఉంది. ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మూవీ లవర్. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ భారీ చారిత్రాత్మక చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మించిన ఈ సినిమా ప్రమోషన్స్ ఓ రేంజ్‌లో జరుగుతున్నాయి. ఈ చిత్రంలో నటించిన చిరు, అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు వంటి స్టార్లు ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. నిర్మాత రామ్ చరణ్‌తో పాటు మెగా డాటర్స్‌ కూడా ‘సైరా’ ను ప్రమోట్ చేస్తున్నారు. సుమారు రూ.270 కోట్ల బడ్జెట్‌తో రామ్ చరణ్ నిర్మించిన ఈ చిత్రానికి అమితి త్రివేది సంగీతం సమకూర్చారు. రత్నవేలు సినిమాటోగ్రఫీ అందించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2nEPlQF

సినీ రచయిత కోన వెంకట్‌పై చీటింగ్ కేసు

సినీ రచయిత, నిర్మాత, దర్శకుడు కోన వెంకట్‌పై చీటింగ్‌ కేసు నమోదైంది. ఆయనపై జెమినీ ఎఫ్‌ఎక్స్‌ డైరెక్టర్‌ ప్రసాద్‌.. జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కథ ఇస్తానని చెప్పి 2017లో రూ.18.50 లక్షలు తీసుకున్నారని.. కథ ఇవ్వకపోగా, డబ్బులు అడిగితే బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ప్రసాద్ ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్‌ పోలీసులు కోన వెంకట్‌పై 406, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పీవీ ఎక్స్‌ప్రెస్ వేకు సంబంధించిన ఓ ట్వీట్‌తో కోన వెంకట్ ఇటీవల వార్తల్లో ప్రముఖంగా నిలిచిన సంగతి తెలిసిందే. మెహిదీపట్నం నుంచి శంషాబాద్ ఎయిర్‌ పోర్ట్‌కు వెళ్లేందుకు, సిటీ నుంచి ఇన్నర్ రింగ్‌ రోడ్డు, ఔటర్ రింగ్‌ రోడ్డు వైపు వెళ్లేందుకు ప్రయాణికులు ఉపయోగించే పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌ వే డ్యామేజ్ అయ్యింది. పిల్లర్ నంబర్ 20 వద్ద పీవీ పెచ్చులూడి, పగుళ్లు ఏర్పడి ప్రమాదకరంగా మారింది. కోన వెంకట్ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా.. జీహెచ్ఎంసీ, మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. Must Read: అమీర్‌పేట్ మెట్రో రైల్వే స్టేషన్ దగ్గర పెచ్చులూడిపడి మహిళ మృతి చెందిన భాగ్యనగరంలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి ఫ్లై ఓవర్లు, మెట్రో రైల్వే నిర్మాణాలపై పడింది. ఈ క్రమంలో కోన వెంకట్.. పీవీ ఎక్స్‌ప్రెస్ వే విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. ఎలాంటి ప్రమాదం జరగక ముందే చర్యలు తీసుకోవాలని అధికారులను విజ్ఞప్తి చేశారు. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2npEf21

పూరీ బర్త్ డే వేడుకలో చార్మి భావోద్వేగం.. ఇస్మార్ట్‌కి ముందు రూ. 50 వేలు కూడా లేవు

నేడు (సెప్టెంబర్ 28) డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ బర్త్ డే సందర్భంగా ఆయన పుట్టిన రోజు వేడుకలను హైదరాబాద్‌లో అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు హీరోయిన్ . ఈ సందర్భంగా.. ఇండస్ట్రీలో సినిమాలు లేక ఖాళీగా ఉన్న 20 మంది డైరెక్టర్లు, కో డైరెక్టర్లు ఒక్కొక్కరికి 50 వేల చొప్పున ఆర్ధికసాయం అందించారు చార్మి. ఈ పుట్టిన రోజు వేడుకలో ఎమోషనల్ స్పీచ్‌తో ఆకట్టుకున్నారు చార్మి. ఆమె మాట్లాడుతూ.. ‘నేను కెమెరా ముందు నటించడానికి, స్టేజ్‌ మీద మాట్లాడటానికి పెద్దగా భయపడను. కాని ఈరోజు ఎందుకో ఏం మాట్లాడాలి? దేనిపై మాట్లాడాలని టెన్షన్‌గా ఉంది. అప్పట్లో దాసరి గారు చెప్పారు.. పూరీ జగన్నాథ్ నా వారసుడు అని. ఆ మాట విన్న పూరీ గారు నా దగ్గర చాలా ఎమోషన్ అయ్యారు. ఆరోజు నా మనసులో అనిపించింది.. దాసరిగారు అంత పెద్ద మాట పూరీ గురించి అన్నప్పుడు దాన్ని రెస్పాన్సిబిలిటీగా తీసుకుని ముందుకు వెళ్లాలని. Read Also: పూరీ ప్రొడక్షన్‌లో పనిచేస్తున్న నేను.. ఆయనకు ఏం కావాలో అది ఇవ్వడమేనా? సినిమాలు తీయడమేనా? హిట్లు కొట్టడమేనా? అనే ఆలోచన వచ్చినప్పుడు అయితే మా దగ్గర డబ్బులు లేవు. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకి పూరీ నేను ఫైనాన్సియల్‌గా ఇబ్బందుల్లో ఉన్నాం. ఈ విషయాన్ని ఎప్పుడూ మేం ఎవరివద్ద డిస్కస్ చేయలేదు. ఎవరి సాయం కోరలేదు. ఆ టైంలో మా దగ్గర కేవలం రూ. 50 వేలు మాత్రమే ఉన్నాయి. ఆ టైంలో ఒకరికి ఒకరం బలంగా నిలబడ్డాం. ఆ టైంలో పూరీ గారు.. నాకు ఒక మాట చెప్పారు. ‘రేయ్.. ఈరోజు మన దగ్గర డబ్బుల్లేవు చాలా కష్టాల్లో ఉన్నాం. కాని.. ముందు మనం మన హెల్త్‌ని బాగా చూసుకుందాం. నేను హెల్త్‌ని చూసుకుంటూ కథలు రాస్తా. నువ్ ఎక్కడ ఏ సినిమా చేయాలని మనం ప్లాన్ చేద్దాం. ఏమీ కాదు.. ఆస్తులు వస్తాయి పోతాయి. మనం స్ట్రాంగ్‌‌గా ఉందాం అని చెప్పారు. కాని ఇస్మార్ట్ శంకర్‌ సెట్ కావడానికి చాలా టైం పట్టింది. హీరో రామ్.. రియల్ లైఫ్‌ హీరో అనిపించారు. పూరీ గారి కథ చెప్పినప్పుడు ఎలాంటి డౌట్‌లు లేకుండా ఆయన్ని నమ్మారు. మేం కష్టాల్లో ఉన్నామా? మాకు హిట్లు ఉన్నాయా? ఫ్లాప్‌లు ఉన్నాయా? ఇలాంటివేం చర్చించకుండా ఆయన పూరీతో చేయాలనే ఒకే ఒక్క నిర్ణయంతో ఓకే చేశారు. మనస్పూర్తిగా చెబుతున్నా.. సాయం చేసే గుణం అతనిలో చూశా. ఇస్మార్ట్ శంకర్‌ సినిమాతో ఆయన మళ్లీ హిట్ అందుకున్నారు. ఆయన సత్తా ఏంటో అందరికీ తెలిసింది. పూరీ కోసం నాకు ఒక మెసేజ్ పంపించారు.. అందులో ఆయన.. ‘మనం అందరం ఏదో సాధించాలని తపన పడుతుంటాం. అయితే కొంతమంది స్టార్స్ అవుతారు. మిగతా వాళ్లు కాలేరు. అంతే వాళ్లు సక్సెస్ అయినట్టు మిగతా వాళ్లు ఫెయిల్ అయినట్టు కాదు. నా అభిప్రాయం ప్రకారం నిజమైన సక్సెస్ ఏంటంటే.. నీకిష్టమైన పనికోసం కష్టమొచ్చినా.. నష్టమొచ్చినా దానికోసం చావడమే నిజమైన సక్సెస్. ఆ పని వల్ల పది రూపాయిలు రావచ్చు. కోటిరూపాయిలు రావచ్చు. ఇష్టమైన పనికోసం చావండి’ అని చెప్పారు. ఈ విషయాన్ని మీకు చెప్పమన్నారంటూ పూరీ సందేశాన్ని అందించింది చార్మి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2ob2xgN

Puri Birthday: నచ్చిన పనికోసం చచ్చిపోండి: పూరీ బర్త్ డే మెసేజ్

ఇండస్ట్రీకి ఎంతో మంది దర్శకులు వస్తుంటారు.. పోతుంటారు.. కాని పూరీ లాంటి దర్శకులు అప్పుడప్పుడూ మాత్రమే పుడుతుంటారు. గొప్ప సినిమాలు తీశారని కాదు.. గొప్ప మనసు ఉంది కాబట్టే ఆయన గ్రేట్ డైరెక్టర్ అయ్యారు. స్టార్ హీరోలకు బ్లాక్ బస్టర్‌ హిట్లు ఇచ్చిన ఆయన ఒకప్పుడు అత్యధిక పారితోషికం తీసుకున్న డైరెక్టర్. అయితే కాలం కలిసి రాకపోవడంతో స్టార్ హీరోలు మెల్లగా సైడ్ అయ్యారు. చేతిలో కనీసం రూ. 50 వేలు లేని స్థితికి వచ్చేసినా.. పూరీ.. ఎవరి ముందూ చేయి చాచలేదు. తాను నమ్ముకున్న మెగా ఫోన్‌కి పదును పెట్టారు. ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో తిరిగి హిట్ కొట్టి తానేంటో నిరూపించుకున్నారు. నేడు బర్త్ డే సందర్భంగా.. అభిమానుల సమక్షంలో పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు హీరోయిన్ చార్మి. ఈ సందర్భంగా సినిమాలు లేక ఖాళీగా ఉన్న ఓ 20 మంది డైరెక్టర్లు, కో డైరెక్టర్లు ఒక్కొక్కరికి 50 వేల చొప్పున సాయం చేయచేశారు. కష్టం విలువ తెలిసిన పూరీ మరోసారి ది గ్రేట్ డైరెక్టర్ అనిపించుకుని ఆదర్శంగా నిలిచారు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్.. గోవాలో విజయ్ దేవకొండ సినిమా స్క్రిప్ట్ పనిలో ఉండగా.. తన బర్త్ డే మెసేజ్‌ను చార్మి ద్వారా షేర్ చేశారు. ఇందులో ఆయన మాట్లాడుతూ.. ‘మనం అందరం ఏదో సాధించాలని తపన పడుతుంటాం. అయితే కొంతమంది స్టార్స్ అవుతారు. మిగతా వాళ్లు కాలేరు. అంతే వాళ్లు సక్సెస్ అయినట్టు మిగతా వాళ్లు ఫెయిల్ అయినట్టు కాదు. నా అభిప్రాయం ప్రకారం నిజమైన సక్సెస్ ఏంటంటే.. నీకిష్టమైన పనికోసం కష్టమొచ్చినా.. నష్టమొచ్చినా దానికోసం చావడమే నిజమైన సక్సెస్. ఆ పని వల్ల పది రూపాయిలు రావచ్చు. కోటిరూపాయిలు రావచ్చు. ఇష్టమైన పనికోసం చావండి’ అంటూ చార్మీ ద్వారా మెసేజ్ పంపారు పూరీ జగన్నాథ్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2mBTbdm

LG G8s ThinQ With Hand ID, Snapdragon 855 SoC Launched in India

G has launched its G8s ThinQ smartphone in India that packs triple rear cameras and the Snapdragon 855 processor.

from NDTV Gadgets - Latest https://ift.tt/2mE6Xfo

Xiaomi's Diwali With Mi Sale Kicks Off: Check Offers on Phones, TVs, More

Xiaomi's ongoing Diwali With Mi Sale brings a tonne of offers on Xiaomi's product portfolio including phones, TVs, and more.

from NDTV Gadgets - Latest https://ift.tt/2o54eMt

'Unpatchable' Exploit May Leave Millions of iPhones Prone to Jailbreaking

A new iOS exploit called Checkm8 has been discovered that potentially leaves millions of iPhones prone to jailbreaking.

from NDTV Gadgets - Latest https://ift.tt/2mooyYY

Indians Throng Apple Retailers, Strong Festive Demand for iPhone 11

iPhone lovers on Friday thronged Apple Authorised Resellers and premium stores across India to grab new iPhones 11 - a scene reminiscent of the arrival of Apple 6 and 7 series in the country in 2014...

from NDTV Gadgets - Latest https://ift.tt/2npuS2t

WhatsApp Was Extensively Abused During India Elections: Study

Despite WhatsApp's efforts to reduce the spread of fake news by limiting the number of forwards to five, the platform was extensively abused to spread unfounded rumours and create misinformation...

from NDTV Gadgets - Latest https://ift.tt/2nXCmtA

Venu Madhav: ఆ రాత్రి.. వేణు మాధవ్ నేను ఒకే బెడ్‌పై పడుకున్నాం.. అతను ఇలా చేశాడు: షకీలా

‘రాత్రి పూట, లైట్స్ అన్నీ బంద్‌లో ఉన్నాయి. వేణు నా బెడ్‌పై పడుకుని నిన్ను ఒకటి అడుగుతూ కాదనకూడదు.. అని హస్కీ వాయిస్‌తో అడుగుతుంటుంటే.. ఏంట్రా నీ ప్రాబ్లమ్ అని గట్టిగా అడిగా. ఆ టైంలో వేణు ఏం చేస్తున్నాడంటే’.. అంటూ చిలిపి చేష్టలను తలుచుకుంటూ ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేశారు శృంగార తార . వేణు మాధవ్ అకాల మరణంతో ఇండస్ట్రీ మొత్తం ఆయనతో ఉన్న తీపి జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు. ఇటీవల ‘కొబ్బరి మట్ట’ చిత్రంలో నటించిన షకీలా.. ఆ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మాట్లాడుతూ.. వేణు మాధవ్ స్నేహానికి ఎంత విలువనిస్తాడో ఒక సంఘటన ద్వారా తెలియజేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. ‘వేణు నేను ఓ సినిమా షూటింగ్‌కి వెళ్లాం.. అక్కడ బ్రహ్మానందం, రఘుబాబు ఇలా చాలామంది ఉన్నారు. బయట నుండి చాలా మంది ఆడియన్స్ మమ్మల్ని చూడటానికి హోటల్‌కి వచ్చేవారు. ఆ టైంలో వేణు నా గదిలోనే ఉన్నాడు. అప్పుడు ఒకడొచ్చి బెడ్ మీద పడి వేణుతో మాట్లాడుతున్నాడు. వాళ్లు రూంలు వాళ్లు క్లీన్‌గా ఉంచుకునేవాళ్లు. నా రూమ్‌‌ మాత్రం దరిద్ర్యం చేసేవాళ్లు. అందుకే నా రూమ్ నీట్‌గా లేకపోవడంతో వేణు.. నీ రూంకి వస్తా పడుకుంటా అని అడిగా. సరే రా అన్నాడు. ఇద్దరం కలిసి ఒకే బెడ్ మీద పడుకున్నాం. కాసేపు అయిన తరువాత ఎవరో ఏదో చేస్తున్నారనే డిస్టబెన్స్ అనిపించింది. టీవీ అద్దంపై ఒక షాడోలా కనిపిస్తుంది. ఆ టైంలో వేణు మాధవ్.. ‘నేను నిన్ను ఒక మాట అడగనా.. నిన్ను ఒకటి అడుగుతా దానికి ఒప్పుకుంటావా? అన్నాడు. అరే.. నేను ఫ్రెండ్ అని వచ్చానే.. నిజంగా తప్పుగా అడిగితే మా మధ్య ఫ్రెండ్ షిప్ ఉండదనుకుని.. సరే అడిగి చావు అన్నాను. నువ్ దానికి నో చెప్పకూడదు.. అంటూ హస్కీ వాయిస్‌‌తో మాట్లాడుతున్నాడు. రాత్రి పూట, లైట్స్ అన్నీ బంద్‌లో ఉన్నాయి. వేణు నా బెడ్‌పై పడుకుని దానికి ఒప్పుకుంటావా? అని అడుగుతుంటుంటే.. ఏంట్రా నీ ప్రాబ్లమ్ అని గట్టిగా అడిగా. ఆ టైంలో వేణు ఏం చేస్తున్నాడంటే.. మా ఇద్దరి మధ్యలో అడ్డుగా పిల్లోలు (తలదిండులు) పెడుతున్నాడు. ఏం రా.. ఇది అంటే.. ‘ఏం లేదు.. నాకు పెళ్లై ఇద్దరు బిడ్డలు ఉన్నారు తెలుసు కదా నీకు.. వాళ్లు బాగుండాలంటే నేను బతికి ఉండాలి.. నువ్ నిద్రలో నీ పెద్ద పెద్ద కాళ్లు తీసి నాపై వేస్తే బతకడం కష్టం. నువ్ కాళ్లు వేయాలనుకుంటే ఆ తలదిండులపై వేసుకో’ అని అన్నాడు. దానికి నేను నైట్ అంతా నవ్వి.. నెక్స్ట్ డే కూడా నవ్వుతూనే ఉన్నా. ఈ విషయం బ్రహ్మానందం, రఘు అందరికీ చెప్పేశా. ఇది కదా ఫ్రెండ్ షిప్ అంటే.. నేను తప్పుగా అనుకున్నానే అని బాధపడ్డా’ అంటూ వేణు మాధవ్ గురించి చెప్పుకొచ్చింది షకీలా.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2movBRp

‘Ram Charan.. లవ్యూ రా లవ్యూ రా..’

‘ఈ అడవి నాదే వేటా నాదే’ అంటూ తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు మెగాస్టార్ చిరంజవి తనయుడు రామ్ చరణ్. ఆయన నటించిన తొలి చిత్రం ‘చిరుత’. తొలి సినిమాను డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో చేశారు. సినిమా వంద రోజుల పాటు ఆడి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇందులో నేహా శర్మ కథానాయికగా నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. సినిమా విడుదలైన నేటికి 12 ఏళ్లు అవుతోంది. ఈ సందర్భంగా ప్రముఖ లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి సినిమాతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. సినిమాలోని ‘లవ్యూ రా లవ్యూ రా నా మనసంతా నువ్వేరా’ అనే పాట గుర్తుందా. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాశారు. చరణ్ కోసం ఆయన రాసిన మొదటి పాట ఇదేనని ట్విటర్ వేదికగా వెల్లడించారు. అంతేకాదు సినిమా షూటింగ్‌ను కూడా పాటతోనే మొదలుపెట్టినట్లు తెలిపారు. చిరంజీవి కొడుకు కావడంతో సినిమా ఓ రేంజ్‌లో దూసుకెళ్లింది. రామ్ చరణ్ కెరీర్‌ విజయవంతంగా సాగేలా చేసింది. చిరు ఫ్యామిలీ నుంచి ఎవరైనా ఇండస్ట్రీలోకి వచ్చారంటే వారిపై ఏ రేంజ్‌లో అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక చిరు కుమారుడే ఎంట్రీ ఇస్తున్నాడంటే హైప్ ఎంతుంటుందో ఆలోచించండి. అందుకే సినిమా ఆడకపోయినా ఫర్వాలేదు కానీ తన తండ్రి స్థాయికి మాత్రం ఎలాంటి చెడ్డపేరు తీసుకురాకూడదని చరణ్ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. మొత్తానికి తొలి చిత్రంతోనే చిరు కొడుకా మజాకా అనిపించాడు. చిరుత సినిమాకు వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్వినీ దత్ నిర్మాతగా వ్యవహరించారు. రూ.18 కోట్ల బడ్జెట్‌తో సినిమాను తెరకెక్కిస్తే బాక్సాఫీస్ వద్ద రూ.22.5 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ప్రకాశ్ రాజ్, ఆశిష్ విద్యార్థి, బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, అలీ సహాయ పాత్రలు పోషించారు. ఈ సినిమాకు వచ్చిన సక్సెస్ రేట్‌ను చూసి బెంగాలీలో ‘రంగ్‌బాజ్’ అనే టైటిల్‌తో రీమేక్ చేశారు. ఆ తర్వాత ఇదే టైటిల్‌తో హిందీలో డబ్బింగ్ కూడా చేశారు. సినిమా కాన్సెప్ట్ ఒక ఎత్తైతే.. ఇందులో పాటలు మరో ఎత్తు. పాటలకు చాలా మంది స్పందన వచ్చింది. పాటలకు సంబంధించిన క్యాసెట్లు, సీడీలు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఇప్పుడు రామ్ చరణ్ మెగా పవర్‌స్టార్ ట్యాగ్‌తో కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. ఆయన చివరగా నటించిన ‘వినయ విధేయ రామ’ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాతో చరణ్ బిజీగా ఉన్నారు. దీంతో పాటు తన తండ్రి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా నిర్మాణ పనులను కూడా చూసుకుంటున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2nXpYd5

Amazon Great Indian Festival Sale Kicks Off: All the Best Offers

Amazon Great Indian Festival 2019 sale has started for Prime members. The sale offers hundreds of deals on mobile phones and electronics. We've handpicked all the best deals and offers available right...

from NDTV Gadgets - Latest https://ift.tt/2lQ3c6p

Vivo U10 Goes on Sale via Amazon for Prime Subscribers in India

Vivo U10, packing triple rear cameras, is now available via Amazon for Prime subscribers, whereas the other buyers will be able to order it starting September 29.

from NDTV Gadgets - Latest https://ift.tt/2nZmff3

Facebook Libra Launch Could Be Delayed Over Regulatory Concerns: Executive

The launch of Facebook's Libra could be pushed back to tackle the regulatory concerns that have been raised around the world, the head of the organisation set up to oversee the cryptocurrency told...

from NDTV Gadgets - Latest https://ift.tt/2lOe9oV

Friday 27 September 2019

LG Q60 With Triple Rear Cameras, 3,500mAh Battery Launched in India

LG has launched a new Q-series smartphone in India, dubbed the LG Q60, that packs triple rear cameras.

from NDTV Gadgets - Latest https://ift.tt/2o3SgCV

Samsung Galaxy M30s, Galaxy M10s Go on Sale via Amazon for Prime Subscribers

Samsung Galaxy M30s and Galaxy M10s are now on sale in the country for Amazon Prime subscribers. The Galaxy M30s will go on sale for other consumers beginning midnight tonight via Amazon as well as...

from NDTV Gadgets - Latest https://ift.tt/2nVODPd

Elon Musk and Tesla Violated US Federal Labour Law, Judge Rules

A US judge ruled Friday that Tesla and its chief executive, Elon Musk, broke federal labour law by targeting union activity, the latest in a series of stinging rebukes to the electronic vehicle...

from NDTV Gadgets - Latest https://ift.tt/2myyuPx

Spider-Man to Keep Swinging in Marvel Cinematic Universe

Sony Pictures Entertainment and Walt Disney Studios have announced that they will team up on another Spider-Man film, after negotiations between the two had reportedly soured.

from NDTV Gadgets - Latest https://ift.tt/2mv9cBO

Apple Plans Theatrical Runs for Movies Before Their Streaming Debut: Reports

Apple plans to give its feature-length film productions extended theatrical releases before making them available on its streaming TV service, the Wall Street Journal reported on Friday.

from NDTV Gadgets - Latest https://ift.tt/2nnk9W7

‘అల.. వైకుంఠపురములో..’ తొలి మెలొడీ వచ్చేసింది సిద్ శ్రీరామ్ మళ్లీ చించేశాడు

స్టైలిష్ స్టార్ , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న మరో చిత్రం ‘అల..వైకుంఠపురములో’. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. కాగా ఈ సినిమాలోని తొలి మెలొడీ పాట అయిన ‘సామజవరగమన’ వీడియో సాంగ్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. ఎస్.ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ‘ఉండిపోరాదే’ పాటతో ఫేమస్ అయిపోయిన సిద్ శ్రీరామ్ ఈ పాటను ఆలపించారు. వీడియోలో తమన్ పియానో వాయిస్తుండగా శ్రీరామ్ పాట ఆలపిస్తూ కనిపించారు. ‘నీ కాళ్లని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు.. ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు.. నీ కళ్లకి కావలి కాస్తాయే కాటుకలా నా కలలు..నువ్వు నులుముతుంటే ఎర్రగా కంది చిందేనే సెగలు’ అంటూ సాగుతున్న ఈ పాట వినడానికి ఎంతో వినసొంపుగా ఉంది. తమన్ ఎప్పుడూ తన మ్యూజిక్‌తో కుర్రకారును మెస్మరైజ్ చేస్తారు. ఇక సిద్ శ్రీరామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన పాట కాబట్టి మంచి క్రేజ్ ఏర్పడుతుందని చెప్పొచ్చు. ఇక అల్లు అర్జున్, పూజా హెగ్డే కెమిస్ట్రీ ఈ పాటకు కలిస్తే ఆ కిక్కే వేరు. వీడియో మధ్యలో సినిమాలో అల్లు అర్జున్, పూజా హెగ్డే, రాహుల్ రామకృష్ణ, నవదీప్ మధ్య వచ్చే సన్నివేశాలను చూపించారు. ఈ పాటకు ప్రముఖ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించారు. ఆయన సాహిత్యం అంటే త్రివిక్రమ్ ఎనలేని అభిమానం. అందుకే తన సినిమాల్లో అన్ని పాటలకు కాకపోయినా కొన్ని పాటలకైనా సిరివెన్నెల చేత సాహిత్యం రాయించుకుంటారు. ఈ చిత్రంలో టబు, నివేదా పేతురాజ్, రాజేంద్ర ప్రసాద్, జయరామ్, సుశాంత్, వెన్నెల కిశోర్, సునీల్, బ్రహ్మాజీ, మురళీ శర్మ, హర్ష వర్ధన్, సచిన్ ఖెడేకర్ కీలక పాత్రలు పోషించారు. హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లపై అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అల..వైకుంఠపురములో సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. అందుకే ఇప్పటినుండి ఆ సినిమాకి ఫుల్‌గా బజ్ పెంచే పనిలో బిజీ అయ్యారు. సినిమా ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లా ఉంటుందని తెలుస్తోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2nl3S48

సూర్య ‘బంగారు’ మనసు.. చిత్రబృందానికి అదిరిపోయే సర్‌ప్రైజ్

ప్రముఖ తమిళ నటుడు సూర్యది నిజంగానే బంగారంలాంటి మనసు. సినిమాలకు సంతకం చేశామా వచ్చామా షూటింగ్‌లో పాల్గొని వెళ్లిపోయామా అన్నట్లు కాకుండా సెట్స్‌లోని అందరితో ఎంతో ఫ్రెండ్లీగా ఉంటారు. వారి కష్టసుఖాలను పంచుకుంటారు. అంతేకాదు తాను చేసే సినిమా తన మనసుకు దగ్గరైందనిపిస్తే చిత్రబృందానికి కానుకలు ఇచ్చి సర్‌ప్రైజ్ చేస్తుంటారు. ప్రస్తుతం ‘సూరారి పొట్రు’ అనే తమిళ చిత్రంలో నటిస్తున్నారు. సుధ కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యనే నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఎయిర్ డెక్కన్ ఫౌండర్ కెప్టెన్ జీఆర్ గోపీనాథ్ జీవితాధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాగా.. ఈ సినిమా చిత్రబృందానికి సూర్య అదిరిపోయే కానుక ఇచ్చారు. దాదాపు 150 మందికి 8 గ్రాములు ఉన్న బంగారు కాయిన్స్ ఇచ్చి తన మంచి మనసును చాటుకున్నారు. తాను నిర్మిస్తున్న సినిమా కావడంతో యూనిట్ సభ్యులు మరింత ఆసక్తిగా సినిమా కోసం పనిచేయాలని ఈ రకంగా ప్రోత్సహిస్తున్నారన్నమాట. అంతేకాదు అభిమానులకు ఏదన్నా ఆపద వస్తే వెంటనే సాయం చేయడానికి ముందుకొస్తారు సూర్య. ఈ సినిమాలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కీలక పాత్రను పోషిస్తున్నారు. ఇందులో ఆయన పాత్ర పేరు అర్జున్ శక్తివేల్ స్వామి. తెలుగు, తమిళం, హిందీలో సినిమాను తెరకెక్కిస్తున్నారు. సినిమా విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు. సూర్యలాగే కీర్తి సురేశ్‌ కూడా ఇలాగే తాను నటించిన సినిమా సెట్‌లోని వారికి బంగారు కాయిన్స్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేస్తుంటారు. అలనాటి నటి సావిత్రి జీవితాధారంగా తెరకెక్కిన ‘మహానటి’ సినిమా సెట్ సభ్యులకు బంగారు కాయిన్స్ ఇచ్చారు. ఆ తర్వాత తమిళంలో ఆమె నటించని ‘సందకోళి 2’ సినిమా చిత్రీకరణ పూర్తయ్యాక యూనిట్ సభ్యులకు 150 గ్రాములు ఉన్న బంగారు కాయిన్స్‌ను కానుకగా ఇచ్చారు. ఏదన్నా సినిమా తన మనసుకు దగ్గరైంది అనిపిస్తే ఇలా బంగారు నాణేలు ఇస్తుంటానని చెప్పారు. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కూడా ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా సెట్‌లోని సభ్యులకు ఇలాంటి సర్‌ప్రైజే ఇచ్చారు. షూటింగ్ విదేశాల్లో జరుగుతున్నప్పుడు కొందరు యూనిట్ సభ్యులకు కొన్ని డాలర్లు ఇచ్చి షాపింగ్ చేసుకోమన్నారట. అంతేకాదు ఈ సినిమా దర్శకుడు సురేందర్ రెడ్డి కోసం ఫ్యామిలీ ట్రిప్ టికెట్లు ఉచితంగా ఇచ్చారట.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2njEA6u

Samsung Galaxy A70s With 64-Megapixel Camera Goes on Sale in India Today

Samsung Galaxy A70s goes on sale in India today. The phone is being offered via e-retailers and Samsung online store. It will also be offered via offline stores.

from NDTV Gadgets - Latest https://ift.tt/2mkjTY1

ఆవిరి టీజర్: ఈ ఇంట్లో ఆత్మ ఉందట.. మీకు కనిపించిందా?

వెన్నులో వణుకు పుట్టించే దెయ్యం సినిమాలను తీయడంలో దర్శకుడు రవిబాబుది అందెవేసిన చెయ్యి. దెయ్యం సినిమాలనే కాదు క్రైమ్ థ్రిల్లర్‌లకు కూడా చాలా రసవత్తరంగా తెరకెక్కించే సామర్థ్యం ఉన్న దర్శకుడు. తాజాగా ఆయన తెరకెక్కించిన మరో ఆసక్తికరమైన చిత్రం ‘ఆవిరి’. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ తాజాగా విడుదలైంది. ‘ఈ ఇంట్లో రాజ్‌కుమార్ రావు, అతని కుటుంబం నివసిస్తోంది. వారితో పాటు ఓ ఆత్మ కూడా ఉంది. దానిని మీరు కనిపెట్టగలరా?’ అన్న సబ్‌ టైటిల్స్‌తో టీజర్ మొదలైంది. ఓ డైనింగ్ టేబుల్‌ను తదేకంగా చూపిస్తూ ఒక్కసారిగా ఆ ఆత్మ కుర్చీ పక్కకు లాక్కుని జ్యూస్ గ్లాస్‌లో పోసుకుంటున్న సన్నివేశం దడ పుట్టించేలా ఉంది. మనిషి కనిపించకుండా అతని బూట్లు మాత్రమే నడుస్తుండడం, ఓ బాత్‌టబ్‌ నుంచి పొగలు వస్తుండడం, అందులోని ఓ చెయ్యి బయటికి రావడం చూస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు, రవిబాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కుక్కర్‌లో ఉడుకుతున్న మనిషి తలను ఫస్ట్‌లుక్‌లో చూపించినప్పుడే సినిమాలో ఏదో భయపెట్టే కంటెంట్ ఉందన్న విషయాన్ని చెప్పకనే చెప్పారు రవి బాబు. ఇప్పుడు టీజర్ ఆ అంచనాలను మరింత పెంచేసింది. ఈ సినిమాలో రవిబాబు ప్రధాన పాత్రలో నటించారు. ఆయనతో పాటు నేహా చౌహాన్, శ్రీ ముక్తా, భరణి శంకర్, ముఖ్తార్ ఖాన్ కీలక పాత్రలు పోషించారు. సినిమాకు కథ రాసింది కూడా రవిబాబే. ఆయన ఇతరుల చేత కథలే రాయించుకోవడం కంటే తన సొంత క్రియేటివిటీతో మంచి కథలు రాసుకుని వాటిని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంటారు. కొన్ని సార్లు ఆయన కాన్సెప్ట్‌లు బాక్సాఫీస్ వద్ద బెడిసికొడుతుంటాయి. ఇందుకు ‘అదుగో’ సినిమానే ఉదాహరణ. ఓ పంది పిల్లను ప్రధాన పాత్రగా చూపిస్తూ తీసిన సినిమా ఇది. చిన్న పిల్లల కోసం మాత్రమే అన్నట్లుగా ఈ సినిమా తీయడంతో అది ఫ్లాపైంది. దాంతో ‘ఆవిరి’ సినిమాతో అయినా ‘అదుగో’ సినిమాతో నష్టపోయిన డబ్బును తిరిగి పొందాలని అనుకుంటున్నారు రవిబాబు. ఎందుకైనా మంచిదని ఈసారి నిర్మాత దిల్ రాజు సాయం తీసుకున్నారు. రవిబాబు క్రియేటివిటీపై నమ్మకం ఉంచిన దిల్ రాజు ఈ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించడానికి ఒప్పుకొన్నారు. మరి ఈ సినిమా ఏ రేంజ్‌లో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2mu6jRJ

OnePlus 7T, OnePlus TV Q1 Range to Go on Sale Today: All Details

The OnePlus TV is available in two variants, the OnePlus TV Q1 and OnePlus TV Q1 Pro, and is priced at Rs. 69,900 and Rs. 99,900, respectively.

from NDTV Gadgets - Latest https://ift.tt/2nqnMdN

How Shah Rukh Khan Helped Shape Netflix's Bard of Blood

Bard of Blood is the first product of Netflix's partnership with Shah Rukh Khan's Red Chillies. According to the cast and crew of the Netflix series, Khan contributed with valuable feedback...

from NDTV Gadgets - Latest https://ift.tt/2mfaFMi

కిర్రాక్ లుక్‌లో విజయ్ దేవరకొండ.. వైరల్

సెన్సేషన్ స్టార్ పేరు చెప్పగానే మనకు ముందుగా ‘అర్జున్ రెడ్డి’లోని గుబురు గెడ్డం లుక్ గుర్తుకు వస్తుంది. నిజానికి ఆ లుక్ విజయ్‌కి ట్రేడ్ మార్క్ అయిపోయింది. ఆ తరవాత ‘గీతగోవిందం’లో విజయ్ క్లీన్ షేవ్ లుక్‌లో కనిపించారు. కానీ, ఈ మధ్య వచ్చిన ‘డియర్ కామ్రేడ్’లో మరోసారి గుబురు గెడ్డంలో దర్శనమిచ్చారు. ఈ లుక్ కూడా అందరినీ ఆకట్టుకుంది. ఇటీవల వచ్చిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ఫస్ట్ లుక్ పోస్టర్‌లోనూ విజయ్ గెడ్డంతోనే కనిపించారు. దీంతో ప్రేక్షకులు కాస్త బోర్ ఫీలయ్యారు. ఎప్పుడూ ఇదే లుక్కా అని పెదవి విరిచారు. అయితే, తన అభిమానులతో పాటు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూ అదిరిపోయే క్లీన్ షేవ్ లుక్‌లో తాజాగా విజయ్ కనిపించారు. గతంలో విజయ్ క్లీన్ షేవ్‌లో కనిపించిన లుక్‌కి.. ఈ కొత్తలుక్‌కి తేడా ఉంది. ఈ కొత్త లుక్‌లో విజయ్ హెయిర్ స్టైల్ డిఫరెంట్‌గా ఉంది. అంతేకాదు, ట్రిమ్ చేసిన గెడ్డం కూడా కొత్తగా ఉంది. దీంతో ఈ లుక్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ కేఎల్ఎం షాపింగ్ మాల్‌కు విజయ్ దేవరకొండ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కంపెనీ హైదరాబాద్‌లోని ఏఎస్ రావు నగర్‌లో కొత్త షోరూంను ఏర్పాటుచేసింది. ఈ షోరూంను గురువారం విజయ్ దేవరకొండ ప్రారంభించారు. విజయ్‌ను చూసేందుకు ఆయన అభిమానులు భారీగా షోరూం వద్దకు తరలివచ్చారు. అయితే, ఈ సందర్భంగా విజయ్ తీసుకున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. Also Read: కాస్ట్యూమ్స్ విషయంలో డిఫరెంట్‌గా ఆలోచించే విజయ్ దేవరకొండ.. షోరూం ఓపెనింగ్‌కి కూడా వెరైటీ డ్రెస్‌లో వచ్చారు. విజయ్ ధరించిన జాకెట్, ఆయన హెయిర్ స్టైల్, కళ్లజోడు అన్నీ డిఫరెంట్‌గా ఉన్నాయి. మొత్తానికి మరోసారి విజయ్ దేవరకొండ అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2n5uDJC

OnePlus 7 and OnePlus 7 Pro Price in India Slashed for Amazon Sale

OnePlus 7 and OnePlus 7 Pro prices have been reduced to Rs. 29,999 and Rs. 44,999 respectively, during the Amazon Great Indian Festival from September 29 to October 4.

from NDTV Gadgets - Latest https://ift.tt/2n6Enn3

Watch a Black Hole Rip Apart an Unfortunate Star in NASA Video

NASA's TESS revealed the detailed timeline of a star 375 million light-years away warping and spiralling into the unrelenting gravitational pull of a supermassive black hole

from NDTV Gadgets - Latest https://ift.tt/2lAUvwE

Realme 3 Pro Gets an Update With Digital Wellbeing, More in India

Realme 3 Pro is receiving a new software update in India, the Chinese smartphone maker has announced. The new update started reaching a limited number of users earlier this week and the broader...

from NDTV Gadgets - Latest https://ift.tt/2nETHHC

Bard of Blood Is Now Streaming on Netflix in India

The first Shah Rukh Khan-produced Netflix original is here. Bard of Blood - based on the book of the same name from first-time author Bilal Siddiqi, who is also a creator on the series - is now...

from NDTV Gadgets - Latest https://ift.tt/2lZCMPL

Thursday 26 September 2019

Huawei Mate 30 Pro Camera Gets Top Spot in DxoMark Review, Night Mode Lauded

Huawei Mate 30 Pro managed to score 131 points in the photo department, and 100 points in the video department.

from NDTV Gadgets - Latest https://ift.tt/2lADJxG

మెగాస్టార్ అంటే పిచ్చి.. అందుకే లేడీ ‘గ్యాంగ్ లీడర్’ అయ్యింది!

చిరంజీవి సూపర్ హిట్ సినిమా ‘అభిలాష’ ఆ అమ్మాయి పేరు. మరో సూపర్ హిట్ సినిమా ‘గ్యాంగ్ లీడర్’ ఆమె క్యారక్టర్. ఇక మెగాస్టార్ చిరంజీవి అంటే అభిలాషకు ఎంత పిచ్చి అంటే.. ‘జై చిరంజీవా’ అంటూ చేతికి పచ్చ బొట్టు పొడిపించుకునేంత. ఇంతకీ ఈ అభిలాష కథేంటి? చిరంజీవి కోసం చచ్చిపోయేంతగా పెంచుకున్న మెగాభిమానం ఆమెకు చేసిన మేలేంటి? ‘గ్యాంగ్ లీడర్’గా ఆమె ఎందుకు మారాల్సి వచ్చింది? వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే.. ‘సురభి 70ఎం.ఎం’ సినిమా చూడాల్సిందే అంటున్నారు దర్శక నిర్మాత వై.గంగాధర్. మెగా ఫ్యాన్‌గా అందాల భామ అక్షత శ్రీనివాస్ నటిస్తున్న ‘సురభి 70ఎం.ఎం’ చిత్రాన్ని శ్రీ భ్రమరాంబ సమేత మల్లిఖార్జున స్వామి పిక్చర్స్, అద్వైత పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వై.గంగాధర్ సొంత నిర్మాణంలో దర్శకత్వం వహిస్తున్నారు. ‘సురభి 70ఎం.ఎం’ అనే ధియేటర్‌ను కబ్జా చేసేందుకు ప్రయత్నించే ఓ రౌడీని మెగా ఫ్యాన్ అయిన అక్షత శ్రీనివాస్ తన గ్యాంగ్‌తో ఎలా ప్రతిఘటించింది? ఆ క్రమంలో ఆమె ‘గ్యాంగ్ లీడర్’ ఎలా అయ్యింది? వంటి ఆసక్తికర విషయాలు వెండి తెరపై చూడాల్సిందే అంటున్నారు దర్సక నిర్మాత వై.గంగాధర్. మెగా ఫ్యాన్ అభిలాషగా నటిస్తున్న యువ కథానాయకి అక్షత శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘స్వతహాగా మెగా స్టార్‌కు పెద్ద ఫ్యాన్ అయిన నాకు ‘సురభి 70ఎం.ఎం’లో మెగాభిమానిగా గ్లామర్‌తో పాటు నటనకు ప్రాధాన్యత ఉన్న ‘అభిలాష’ అనే పాత్రలో లేడి గ్యాంగ్ లీడర్‌గా నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇందుకుగాను మా దర్శకనిర్మాత గంగాధర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ చిత్రం నా కెరీర్‌ను మలుపు తిప్పుతుందని నమ్మకంగా చెప్పగలను. మా బాస్ చిరంజీవి టైటిల్ రోల్ ప్లే చేసిన ‘సైరా’ సంచలన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అని అన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2n9hgrI

Apple Watch Series 5 to Go on Sale in India Today: What You Need to Know

The Apple Watch Series 5 price in India starts at Rs. 40,900 and goes up to Rs. 69,900 for the most premium variant.

from NDTV Gadgets - Latest https://ift.tt/2mcu1lo

OnePlus 7T vs iPhone 11 vs Samsung Galaxy S10

We take a look at the how the OnePlus 7T stacks up to the iPhone 11 and Samsung Galaxy S10, on paper.

from NDTV Gadgets - Latest https://ift.tt/2lBgaVw

నేను, నా తమ్ముడు అందుకే ఓడాం.. రాజకీయాల్లోకి వద్దు: రజినీ, కమల్‌కు చిరు సూచన

సున్నితమైన మనస్తత్వం కలిగినవారికి రాజకీయాలు సరిపడవని సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్‌ను ఉద్దేశించి మెగాస్టార్ చిరంజీవి అన్నారు. వీళ్లిద్దరూ రాజకీయాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని సలహా ఇచ్చారు. తనను, తన తమ్ముడిని చూసైనా వారు రాజకీయాల్లోకి రావొద్దని సలహా ఇచ్చారు. ఈ మేరకు ప్రముఖ తమిళ మ్యాగజైన్ ‘ఆనంద వికటన్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి వెల్లడించారు. రాజకీయాల గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. ‘‘సినిమా కెరీర్‌లో నేను నంబర్ వన్‌గా ఉన్నప్పుడు ప్రజలకు మంచి చేద్దామనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాను. కానీ, ప్రస్తుతం రాజకీయాలు డబ్బు చుట్టూ తిరుగుతున్నాయి. నా ప్రత్యర్థులు కోట్ల రూపాయలు కుమ్మరించి నా సొంత నియోజకవర్గంలోనే నన్ను ఓడించారు. నా తమ్ముడు పవన్ కళ్యాణ్ విషయంలోనూ ఇదే జరిగింది. డబ్బు, కులం చుట్టూనే రాజకీయాలు తిరుగుతున్నాయి’’ అని చిరంజీవి వ్యాఖ్యానించారు. రాజకీయాల్లోకి వచ్చిన తరవాత ఓటమి, నిరుత్సాహం, అవమానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని చిరంజీవి అన్నారు. రజినీకాంత్, కమల్ హాసన్ కచ్చితంగా రాజకీయాల్లో ఉండాలని, ప్రజలకు సేవ చేయాలని నిర్ణయించుకుంటే గనుకు ఎన్నో సవాళ్లను, నిరాశ నిస్పృహలను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. నిజానికి గత పార్లమెంట్ ఎన్నికల్లో కమల్ హాసన్ పార్టీ గెలుస్తుందని తాను భావించానని, కానీ దురదృష్టవశాత్తు అలా జరగలేదని చిరంజీవి అన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో కమల్ హాసన్ పోటీ చేయలేదు కానీ, ఆయన పార్టీ మక్కల్ నీధి మయ్యం పోటీ చేసింది. అయితే, ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించారు కానీ, ఇంకా పార్టీ పెట్టలేదు. త్వరలోనే ఆయన కూడా తన పార్టీని ప్రకటించే అవకాశం ఉంది. వీరిద్దరూ ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాలూ చేస్తున్నారు. కానీ, వీరిద్దరినీ రాజకీయాల్లోకి రావద్దని చిరంజీవి వారిస్తున్నారు. చిరంజీవి 2008 ఆగస్టులో ప్రజారాజ్యం పార్టీని ప్రకటించారు. తిరుపతిలో భారీ బహిరంగ సభ పెట్టి మరీ పార్టీ జెండాను ఆవిష్కరించారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పోటీ చేసింది. అయితే, మొత్తం 294 సీట్లలో కేవలం 18 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. చిరంజీవి తిరుపతి నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచారు. సొంత నియోజకవర్గం పాలకొల్లులో ఓడిపోయారు. ఇక 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పోటీచేసి కేవలం ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది. పవన్ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓడారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2n1z5cl

NASA Says Vikram Had a Hard Landing, Releases Images of Site

Vikram had a "hard landing", NASA said on Friday, as it released high-resolution images captured by its reconnaissance orbiter of the Moon's unchartered south pole where the Chandrayaan 2 lander...

from NDTV Gadgets - Latest https://ift.tt/2nDtk4N

FIFA 20 India Map Does Not Feature Jammu and Kashmir Yet Again

For supposedly the third year in a row, the map of India in EA Sports' FIFA - the newest being FIFA 20 - does not feature Jammu and Kashmir at all.

from NDTV Gadgets - Latest https://ift.tt/2mejG8z

Facebook-Backed Libra Group Pledges to 'Reassure' Regulators

The head of the Libra Association said Thursday the project's leaders would aim to "reassure" regulators who have voiced mounting concern over the virtual money.

from NDTV Gadgets - Latest https://ift.tt/2mcTmeP

Uber Adds More Services to Its App in Its Quest for Profit

Uber on Thursday unveiled a revamped version of its smartphone app that weaves together services from shared rides to public transit schedules while adding more security features.

from NDTV Gadgets - Latest https://ift.tt/2nJHBxb

Netflix's Bard of Blood Is Bad, and Shah Rukh Khan Should Feel Bad

In our Bard of Blood review, we look at how a callous and careless approach to its setting and people - Balochistan and Muslims - along with writing that defies logic and a show built out of...

from NDTV Gadgets - Latest https://ift.tt/2mc27WG

DoorDash Breach Exposes Data of Nearly 5 Million Users

DoorDash on Thursday said a breach of its system exposed nearly five million customers, eateries and "Dashers" to a data breach.

from NDTV Gadgets - Latest https://ift.tt/2mdwdsG

Mi Outdoor Bluetooth Speaker With IP55 Water Resistance Launched

The pill-shaped cylindrical Mi Outdoor Bluetooth speaker comes with IP55 water and dust resistance, supports Bluetooth v5, and has a USB Type-C port for charging.

from NDTV Gadgets - Latest https://ift.tt/2lTdVNm

Amazon Offers a Way to Delete Alexa Recordings Automatically

Amazon says it saves voice commands to improve the service. But the practice has raised concerns with privacy experts.

from NDTV Gadgets - Latest https://ift.tt/2nIVJqn

'Modi is a master of this kind of political theatre'

'I give Modi full credit, for brilliantly using his personal diplomacy, his personal stature, to accomplish his goals...'

from rediff Top Interviews https://ift.tt/2n3vmLo

Why Asif Kapadia made a movie on Maradona

'It was difficult, but we wanted to show an honest portrayal.'

from rediff Top Interviews https://ift.tt/2lzfbFi

'Bureaucracy is one of the main problems of India'

Marc Faber, editor and publisher of The Gloom, Boom & Doom report tells Puneet Wadhwa there are pockets of value emerging across the globe.

from rediff Top Interviews https://ift.tt/2n7DPxi

iPhone 11, iPhone 11 Pro, iPhone 11 Pro Max to Go on Sale in India Today

iPhone 11 price in India starts at Rs. 64,900, while the iPhone 11 Pro price begins at Rs. 99,900 and iPhone 11 Pro Max price starts at Rs. 1,09,900.

from NDTV Gadgets - Latest https://ift.tt/2nGWO21

iPhone 11 Will Alert You When a Non-Genuine Display Is Used

Apple will display a warning on the iPhone 11, iPhone 11 Pro, and iPhone 11 Pro Max if the devices are unable to verify a genuine display after a screen repair job.

from NDTV Gadgets - Latest https://ift.tt/2nr8TIx

Airtel Rs. 97 Prepaid Plan Revised: Everything You Need to Know

The Airtel Rs. 97 prepaid plan now offers only 500MB data in total, unlimited voice calling without any ceiling FUP, and 300 SMS messages for the validity period of 14 days.

from NDTV Gadgets - Latest https://ift.tt/2lINjyG

vivo V17Pro Brings a Powerful Camera Setup Right in Your Hands

vivo V17Pro comes with a set of powerful cameras to let you explore more and inspire everyone around you.

from NDTV Gadgets - Latest https://ift.tt/2mMk0LN

eBay CEO Clashes With Board, Steps Down

eBay Chief Executive Officer Devin Wenig stepped down on Wednesday, citing differences with the company's recently revamped board, which is looking to sell some of its businesses amid pressure from...

from NDTV Gadgets - Latest https://ift.tt/2lesbzR

Tinder Owner Sued for Using Fake Profiles in Ads on Match.com

The owner of Tinder and OkCupid is being sued by US regulator for seeking to draw in potential subscribers with emails from fake users expressing interest in pairing up.

from NDTV Gadgets - Latest https://ift.tt/2lRz8Y1

Amazon Brings 3 New Echo Devices to India, Pre-Orders Open

Refreshing its Echo smart home speakers line-up, Amazon on Wednesday announced to bring three new Echo devices - All-new Echo, Echo Dot with clock, and Echo Studio - to India, in an effort to add a...

from NDTV Gadgets - Latest https://ift.tt/2noEfiP

Wednesday 25 September 2019

లక్ష్మీనగర్ శ్మశాన వాటికలో వేణుమాధవ్ అంత్యక్రియలు

ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం మౌలాలీలోని లక్ష్మీనగర్ శ్మశాన వాటికలో జరగనున్నాయి. గతకొంత కాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతోన్న వేణుమాధవ్.. సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మధ్యహ్నం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆస్పత్రి నుంచి నిన్న సాయంత్రం వేణుమాధవ్ పార్థీవదేహాన్ని మౌలాలీని హెచ్‌బీ కాలనీలో ఉన్న ఆయన ఇంటికి తరలించారు. అక్కడే చాలా మంది ప్రముఖులు వేణుమాధవ్‌కు నివాళులర్పించారు. సినీ ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం ఈరోజు మధ్యాహ్నం వేణుమాధవ్ పార్థీవదేహాన్ని ఫిల్మ్ ఛాంబర్‌లో ఉంచనున్నారు. ఇప్పటికే మౌలాలి నుంచి వేణుమాధవ్ పార్థీవదేహంతో వాహనం ఫిల్మ్ నగర్‌కు బయలుదేరింది. ఫిల్మ్ ఛాంబర్‌లో గంటన్నర పాటు వేణుమాధవ్ పార్థీదేహాన్ని ఉంచనున్నారు. ఈ సమయంలో సినీ పరిశ్రమకు చెందినవారంతా నివాళులర్పించనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటల తరవాత మళ్లీ పార్థీవదేహాన్ని మౌలాలీకి తీసుకెళ్తారు. అక్కడ లక్ష్మీనగర్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. Also Read: కోదాడలో జన్మించిన వేణుమాధవ్ మౌలాలీలో స్థిరపడ్డారు. సినిమా ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్‌గా మారినప్పటికీ ఆయన ఫిల్మ్ నగర్ వైపు రాకుండా మౌలాలీలోనే ఉండిపోయారు. దీనికి కారణం అక్కడి వాళ్లతో ఆయనకు ఏర్పడిన అనుబంధం. మౌలాలీలోని హెచ్‌బీ కాలనీ వాసులతో వేణుమాధవ్‌కు మంచి అనుబంధం ఉంది. ఆ కారణంతోనే ఆయన ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి రాలేదు. ఇప్పుడు వేణుమాధవ్ మరణంతో వారంతా శోకసంద్రంలో మునిగిపోయారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2mOCCur

'Modi sent a clear message to the Pakistanis'

'... to Imran Khan, that there's not going to be any mediation of any meaningful sort given his (Modi's) special relationship with Trump.'

from rediff Top Interviews https://ift.tt/2nmIQSx

Why Bard of Blood Creators Don't Think the Netflix Show Is Political

Due to the very nature of what it's dealing with, Bard of Blood is an inherently political show. It's set in Balochistan, involves Indian agents going up against terrorists supported by the...

from NDTV Gadgets - Latest https://ift.tt/2mTy1af

Facebook Unveils Virtual Social Space for Its Oculus Users

Facebook said Wednesday it will launch a virtual social community where users of its Oculus headgear can "explore new places" and "create their own new experiences."

from NDTV Gadgets - Latest https://ift.tt/2lImo67

Google Unveils Android 10 (Go Edition) With Focus on Speed and Security

Google has announced the next iteration of Android Go platform called Android 10 (Go Edition) that will be zippier and more secure.

from NDTV Gadgets - Latest https://ift.tt/2mKHT6q

OnePlus 7T, OnePlus 7T Pro Renders Leak Hours Before Official Launch

OnePlus 7T and OnePlus 7T Pro leaks haven't stopped even though we are just hours away from the official launch. The newly leaked renders suggest that OnePlus 7T will be offered in Glacier Blue and...

from NDTV Gadgets - Latest https://ift.tt/2nhfzZp

Marvel President Kevin Feige Is Working on a New Star Wars Movie

From Marvel to Star Wars. Marvel Studios President Kevin Feige is developing a Star Wars movie, Walt Disney Studios Co-Chairman and Chief Creative Officer Alan Horn has confirmed.

from NDTV Gadgets - Latest https://ift.tt/2npzplt

Amazon Alexa Will Soon Understand Hindi, English Simultaneously in India

Amazon Alexa will receive the multilingual mode starting next month to support Hindi and English simultaneously in India, alongside supporting English and Spanish in the US and French and English in...

from NDTV Gadgets - Latest https://ift.tt/2lht6ja

‘సైరా’ ట్రైలర్ 2: గడ్డిపరక కూడా గడ్డ దాటకూడదు

మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది సంగీతం సమకూర్చారు. రత్నవేలు సినిమాటోగ్రఫీ అందించారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం వచ్చేనెల 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదలవుతోంది. ఇప్పటికే విడులైన ట్రైలర్ విపరీతంగా ఆకట్టుకుంది. చిత్రంపై అంచనాలను రెట్టింపు చేసింది. ఇప్పుడు మరో ట్రైలర్‌ను విడుదల చేశారు. సినిమాలోని ప్రధానమైన యుద్ధ సన్నివేశాలను మచ్చుకగా చూపిస్తూ ఈ ట్రైలర్‌ను రూపొందించారు. ట్రైలర్‌లో చిరంజీవి చెప్పిన డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. ఈ ట్రైలర్ చూస్తుంటే వెండితెరపై నరసింహారెడ్డి సమరసింహపై ఆంగ్లేయులను చీల్చి చండాలడం ఖాయంగా కనిపిస్తోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2mNEAv4

Amazon Announces New Products to Keep Pushing Alexa Everywhere

Amazon unveiled a lineup of new Alexa-powered products on Wednesday extending from homes and cars to wearable devices.

from NDTV Gadgets - Latest https://ift.tt/2mKLwcz

Modern Family Season 11, Episode 1 Now Streaming on Hotstar in India

The Pritchetts & Co. are back for the final time. The eleventh season premiere of Modern Family is now streaming on Hotstar in India. Modern Family season 11, episode 1 is titled "New Kids on the...

from NDTV Gadgets - Latest https://ift.tt/2l9PP0m

Amazon Focuses on Alexa Privacy as It Unveils New Gadgets

Amazon defended the privacy features of its Alexa digital assistant -- and introduced some new tools to reassure users -- following months of debate about the practices of the technology giant and its...

from NDTV Gadgets - Latest https://ift.tt/2mNvePY

'What auto slowdown are you talking about?'

'The August phenomenon of decline in sales occurs every year.'

from rediff Top Interviews https://ift.tt/2mSvME7

Your Amazon Alexa Will Soon Sound Just Like Samuel L. Jackson

Samuel L. Jackson and other celebrities will voice speech for the Amazon's virtual assistant Alexa, one of a range of new features designed to attract more users to the service.

from NDTV Gadgets - Latest https://ift.tt/2nofrYh

Meet the Chhichhore called Tushar Pandey

'It's a good thing when your first film is not a hit. The important thing is to sustain. I've been lucky to work with Shoojit Sircar, Nitish Tiwari, Sooraj Barjatya...'

from rediff Top Interviews https://ift.tt/2lTj2NB

PMC Bank Crisis: 'RBI must be more pro-active'

'What is critical today in India is confidence of depositors.'

from rediff Top Interviews https://ift.tt/2lcJzoF

OnePlus 7T, OnePlus TV Set to Launch in India Today: How to Watch Livestream

OnePlus 7T and OnePlus TV launch event is taking place in New Delhi at 7pm IST today. OnePlus 7T Pro may also get official at the event.

from NDTV Gadgets - Latest https://ift.tt/2mOw9zw

Bard of Blood Cast and Crew on Challenges and Changes

Bard of Blood used Ladakh and Rajasthan to stand in for Balochistan, Pakistan. But that came with its own problems. The Netflix series has made several changes from the book, bringing in new...

from NDTV Gadgets - Latest https://ift.tt/2mYsWgW

Windows 10 Now on More Than 900 Million Devices, Says Microsoft

Microsoft said that there have been more new Windows 10 devices in the last 12 months than in any previous year.

from NDTV Gadgets - Latest https://ift.tt/2kYrzhI

YouTube Creators Hit by Massive Wave of Account Hijacks: Report

The YouTube account hacks said to be the result of hackers use phishing emails to lure victims on fake Google login pages.

from NDTV Gadgets - Latest https://ift.tt/2lA8539

Pixel 3a, Pixel 3a XL Get New Android 10 Update: How to Download

There's no clarity on what this large update brings, but Google should detail it out soon.

from NDTV Gadgets - Latest https://ift.tt/2lz9A1I

హాస్యనటుడు వేణుమాధవ్ కన్నుమూత

ప్రముఖ హాస్యనటుడు కన్నుమూశారు. గత కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతోన్న వేణుమాధవ్.. సికింద్రాబాద్‌లోకి యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందతూ బుధవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య శ్రీవాణి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వేణుమాధవ్ స్వస్థలం సూర్యపేట జిల్లా కోదాడ. 1979 డిసెంబర్ 30న ఆయన జన్మించారు. మిమిక్రీ ఆర్టిస్టుగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన వేణుమాధవ్.. తెలుగు ప్రేక్షకులు మెచ్చిన హాస్యనటుడిగా ఎదిగారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2lBDylJ

Tuesday 24 September 2019

Gmail App for Android and iOS Begins Receiving Dark Theme

Google has begun the rollout of dark theme in the Gmail app for Android and iOS.

from NDTV Gadgets - Latest https://ift.tt/2lo0FQN

tvOS 13 Debuts With Multi-User Support, Ability to Connect Game Controllers

tvOS 13 has been released for the Apple TV 4K and Apple TV HD with multi-user support and Apple Arcade integration.

from NDTV Gadgets - Latest https://ift.tt/2mBgV0I

Xiaomi Diwali Sale Discounts, Offers Revealed for All Phones

Phones like the Redmi K20, Redmi K20 Pro, Redmi Note 7 Pro, Redmi 7A, Redmi Go, and Redmi Y3 will be listed with price cuts.

from NDTV Gadgets - Latest https://ift.tt/2lnqRel

iOS 13.1, iPadOS Updates Released: Here Is What's New

iPadOS and iOS 13.1 have been released by Apple for all compatible iPad, iPhone, and iPod touch models. The new iPadOS has features such as Slide Over, Split View, and Enhanced Spaces specifically for...

from NDTV Gadgets - Latest https://ift.tt/2mvyEqu

Huawei CFO Fighting US Extradition Says Her Rights Were Violated

Evidence shows police originally planned to board Meng Wanzhou's flight from once it landed in Vancouver and arrest her, her lawyers said.

from NDTV Gadgets - Latest https://ift.tt/2n5lL6T

Vivo U3x With Triple Rear Cameras, 5,000mAh Battery Launched

Vivo U3x has gone official in China packing triple rear cameras,octa-core Snapdragon 665 SoC, and a 5,000mAh battery.

from NDTV Gadgets - Latest https://ift.tt/2mvuejm

Redmi 8A With 12-Megapixel Camera Launching in India Today: Live Updates

Redmi 8A will make its India debut today. Xiaomi is hosting an online launch show for the phone that will start at 12pm (noon) and feature the official introduction of the phone.

from NDTV Gadgets - Latest https://ift.tt/2lo6Sfx

Shah Rukh Khan, David Letterman Special to Release in October on Netflix

The Shah Rukh Khan-centred special episode of David Letterman's talk show My Next Guest Needs No Introduction will release in October on Netflix.

from NDTV Gadgets - Latest https://ift.tt/2kWRCpt

Amazon Launches Initiative to Bundle Virtual Assistants on Single Device

Notable exclusions from Amazon's initiative are Google Assistant, Apple's Siri, and Samsung's Bixby.

from NDTV Gadgets - Latest https://ift.tt/2kXlj9Y

Facebook Will Not Label or Remove Politicians' Rule-Breaking Posts

Facebook will take down posts if a politician's content has the potential to incite violence or pose a safety risk that outweighs the public interest value.

from NDTV Gadgets - Latest https://ift.tt/2kXe69U

Apple Warns About Third-Party Keyboard Bug in iOS 13, iPadOS

Apple is warning users that there is a bug in the iOS 13 and iPadOS involving third-party keyboards. The company has said that it is working on a fix and an upcoming software update will roll it out...

from NDTV Gadgets - Latest https://ift.tt/2n304Eu

వేణుమాధవ్ బతికే ఉన్నారు.. చంపేయకండి: ‘జబర్దస్త్’ రాకేష్

ప్రముఖ హాస్యనటుడు ఆరోగ్య పరస్థితి చాలా విషమంగా ఉందని, ఆయనకు సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై అత్యవసర చికిత్స అందిస్తున్నారని మంగళవారం సాయంత్రం వార్తలు వచ్చాయి. ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉందని సన్నిహితులు ద్వారా తెలిసింది. అయితే, ఆ వార్త బయటికొచ్చిన వెంటనే వేణుమాధవ్ చనిపోయారంటూ మరోవార్త సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టింది. చాలా మంది ‘రిప్ వేణుమాధవ్’ అంటూ ఫేస్‌బుక్ పోస్టులు, ట్వీట్‌లు మొదలుపెట్టారు. ఇదిలా ఉంటే, వేణుమాధవ్ చనిపోయారంటూ వచ్చిన రూమర్‌పై ‘జబర్దస్త్’ ఫేమ్ రాకింగ్ రాకేష్ స్పందించారు. వేణుమాధవ్ బతికే ఉన్నారని, ట్రీట్‌మెంట్‌కు ఆయన స్పందిస్తున్నారని చెప్పారు. తాను హాస్పిటల్‌కు వెళ్లి డాక్టర్లతో మాట్లాడనని వెల్లడించారు. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో ఆయనొక వీడియో మేసేజ్‌ పెట్టారు. Also Read: ‘‘వేణుమాధవ్ అన్నయ్యను చూసి ఇన్‌స్పైర్ అయ్యి ఇండస్ట్రీకి వచ్చిన వ్యక్తిని నేను. ఆయనలా మిమిక్రీ చేయాలని ఇండస్ట్రీకి వచ్చాను. అలాంటి వ్యక్తి చనిపోయారని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆయన ఇక మన మధ్యలేరని ఏవేవో వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో, వివిధ టీవీ ఛానళ్లలో ఈ వార్తలు ప్రచారం చేస్తున్నారు. అలాంటిదేమీ లేదు. ఆయన ట్రీట్‌మెంట్‌కు స్పందిస్తున్నారు. కోలుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. నేను హాస్పటిల్‌లోనే ఉన్నాను. డాక్టర్‌తో మాట్లాడాను. వేణుమాధవ్ గారి తల్లి అయితే ఇదేంటి నాన్న వాళ్లంతా చనిపోయారని వేసేస్తున్నారు.. దయచేసి మీడియాకు చెప్పు అంటే నేను ఈ వీడియో పెడుతున్నాను. చావుబతుకుల మధ్య ఉన్న వ్యక్తిని త్వరగా కోలుకోవాలని కోరుకోవాలి తప్ప.. రిప్ అని, ఇకలేరని దయచేసి పోస్టులు పెట్టకండి’’ అని రాకేష్ ఆవేదన వ్యక్తం చేశారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2l1RmFU

'Manoj Bajpayee is the best fit for The Family Man'

'We got to know about Bard of Blood coming up on Netflix, just a week after The Family Man's release. So suddenly there are comparisons between the two.'

from rediff Top Interviews https://ift.tt/2mCeNWv

WeWork's Neumann Surrenders Control, CEO Role Following Investor Revolt

The decision came after We Work parent We Company postponed its IPO last week following push-back from perspective stock market investors.

from NDTV Gadgets - Latest https://ift.tt/2n4N29x

'Modi buttered Trump up big time'

'Modi skillfully navigated Trump's ego and pushed the right buttons.'

from rediff Top Interviews https://ift.tt/2ljHHL3

Economic crisis: 'Modi should consult Manmohan'

'Vajpayee used to consult the Opposition; Indira Gandhi used to consult the Opposition. Which khet ki mooli is Modi?'

from rediff Top Interviews https://ift.tt/2lvfjFJ

This Is Us Season 4, Episode 1 Now Streaming on Hotstar in India

The Pearsons are back. The fourth season premiere of This Is Us is now streaming on Hotstar in India. This Is Us season 4, episode 1 "Strangers" will jump to the 1970s to show us when Jack (Milo...

from NDTV Gadgets - Latest https://ift.tt/2mrIIAN

Redmi 8A to Launch in India Today: How to Watch Live Stream

Redmi 8A launch in India is set for today, and the smartphone is expected to come with a starting price of Rs. 5,999.

from NDTV Gadgets - Latest https://ift.tt/2lkZK3w

Pixel 3, Pixel 3A Series Discounted for Flipkart Big Billion Days Sale

Flipkart is offering discounted pricing on the Google Pixel 3 and 3A series during the Big Billion Days Sale.

from NDTV Gadgets - Latest https://ift.tt/2le2wY7

Vivo Said to Launch 5G Phone With Samsung Exynos 980 SoC Later This Year

Vivo's Executive Vice President reportedly revealed in an interview that the company will launch a 5G phone with Exynos 980 later this year.

from NDTV Gadgets - Latest https://ift.tt/2lguhiC

Oppo A11x With Quad Rear Cameras, 5,000mAh Battery Launched

Oppo A11x is the latest mid-range smartphone from the Chinese smartphone maker to join its A-series. Oppo A11x will only be sold in one version – 8GB + 128GB.

from NDTV Gadgets - Latest https://ift.tt/2lhx1MT

Monday 23 September 2019

Yahoo Mail App Gets Updated With New Interface

Yahoo Mail app has been updated on both Android and iOS platforms with an all-new interface and tons of new customisations to take on the likes of Gmail and Outlook.

from NDTV Gadgets - Latest https://ift.tt/2kGmwlS

Videocon D2h, Dish TV Offer Up to 2-Months Free on Long Term Plans

D2h subscribers that avail three months subscription will get 14-days extra service for free.

from NDTV Gadgets - Latest https://ift.tt/2ldVLFK

'मैंने उन्हें कभी सनी देओल के रूप में नहीं जाना है; वो हमेशा ही मेरे पापा रहे हैं'

'फिल्म के डायरेक्टर और प्रोड्यूसर मेरे डैड हैं, इसलिये घर का माहौल काफी शांत, घबराहट, रोमांच से भरा हुआ है, और सच कहूं तो मैं चाहता हूं कि जल्द से जल्द यह काम पूरा हो जाये। ताकि मैं आराम कर सकूं और ज़िंदग़ी के नये दौर में कदम रख सकूं।'

from rediff Top Interviews https://ift.tt/2mEb0Ij

Green Gaming: Video Game Firms Make Climate Promises at UN

Gaming is going green - and some of the biggest game companies hope players will, too.

from NDTV Gadgets - Latest https://ift.tt/2mlSdkN

Tech Companies Back Independent Watchdog to Tackle Online Extremism

The Global Internet Forum to Counter Terrorism was created in 2017 under pressure from US and European governments.

from NDTV Gadgets - Latest https://ift.tt/2mlLvv7

Google Will Start Transcribing Audio Recordings Again

Google is restarting a practice in which human contractors listen to and transcribe some voice commands people give.

from NDTV Gadgets - Latest https://ift.tt/2mlQmfO

Xiaomi Diwali Sale Offers Include Price Cuts on Redmi Phones, Mi TVs

Phones like the Redmi Note 7 Pro, Redmi 7A, and Redmi Y3, including Mi Band 3, Power Banks, and more will be listed with price cuts.

from NDTV Gadgets - Latest https://ift.tt/2mJVkn1

Vivo U10 With Snapdragon 665 SoC Launching in India Today: Live Updates

Vivo U10 is all set to make its India debut today as a part of the Chinese smartphone maker's new online-exclusive U-series. The Vivo U10 launch event starts at 12pm (noon).

from NDTV Gadgets - Latest https://ift.tt/2mFrS1j

Redmi K20 Pro Gets Android 10-Based MIUI 10 in India: Reports

Xiaomi has begun the rollout of a stable MIUI 10 update based on Android 10 for the Redmi K20 Pro in India.

from NDTV Gadgets - Latest https://ift.tt/2mfqjai

Facebook to Buy Brain Science Startup CTRL-labs in Reported $1-Billion Deal

Facebook Vice President of AR/VR Andrew Bosworth announced the deal in a Facebook post.

from NDTV Gadgets - Latest https://ift.tt/2l3htMK

Realme X2 Goes Official With Snapdragon 730G SoC, Quad Rear Cameras

Realme X2 price in China is set at CNY 1,599 (roughly Rs. 15,900) for the base 6GB RAM + 64GB storage variant, while its 8GB RAM + 128GB storage option carries a price tag of CNY 1,899 (roughly Rs....

from NDTV Gadgets - Latest https://ift.tt/2kFDWz2

Jonah Hill, Jeffrey Wright in Talks to Be Cast in The Batman: Reports

Jonah Hill and Jeffrey Wright are in talks to star in The Batman, per multiple new reports. Wright in being eyed for the role of Commissioner Jim Gordon. Hill is "in early talks" to play a...

from NDTV Gadgets - Latest https://ift.tt/2mmjVxR

Corporate Tax Cut to Boost Smartphone Manufacturing in India: Executives

India slashed its headline corporate tax rate to 22 percent from 30 percent on Friday in a surprise gambit aimed at wooing manufacturers.

from NDTV Gadgets - Latest https://ift.tt/2mlCbaA

Apple to Make New Mac Pro PCs in US After Some Tariff Exemptions

Apple said on Monday it will make new Mac Pro desktop computers at its Austin, Texas facility, following some relief on tariffs by the US government.

from NDTV Gadgets - Latest https://ift.tt/2mmcsij

'Don't want to do something with too much skin show'

'I say no to 70 percent of the TV work because I cannot relate to it.'

from rediff Top Interviews https://ift.tt/2mgTHwO

Google Launches App, Game Subscription to Take on Apple Arcade

Google Play Pass will cost $5 a month and give subscribers access to 350 games and apps.

from NDTV Gadgets - Latest https://ift.tt/2l2T89S

Sushmita konidela: తమన్నా, నయనతార చీరలను ముందు నేను కట్టుకున్నా

‘తమన్నా, నయనతారల కంటే ముందు వారి చీరలను నేనే కట్టుకున్నాను’ అని అంటున్నారు మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల. చిరు నటించిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. ఈ సినిమాకు సుస్మిత కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేశారు. ఆదివారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తాను డిజైన్ చేసిన దుస్తుల గురించి సుస్మిత ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ‘1800ల కాలంలో పురుషులు, మహిళలు ఎలాంటి దుస్తులు ధరించేవారో తెలుసుకోవడానికి చాలా రీసెర్చ్ చేశాను. నాన్న దుస్తులతో పాటు అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నాల దుస్తులను కూడా నేనే డిజైన్ చేయించాను. నాతో పాటు ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అంజు మోది, గౌతమ్ మేనన్ సోదరి ఉత్తరా మేనన్‌ కూడా నాకు సాయం చేశారు. నయనతార, తమన్నాల కోసం నేను 12 అడుగుల సిల్క్ చీరలు తెప్పించాను. అవి ధరించడం అంత సులువు కాదు. చాలా బరువు ఉంటాయి. వారు ధరించడానికి ముందు నేనే ఆ చీరలు కట్టుకున్నాను. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను. రెండేళ్ల పాటు ఈ దుస్తుల కోసమే చాలా కష్టపడ్డాను. ఇందుకోసం చెన్నైలో చాలా రోజుల పాటు ఉండాల్సి వచ్చింది. నా భర్తను చాలా మిస్సయ్యాను. లెజెండ్స్‌తో కలిసి పనిచేస్తున్నప్పుడు మనకు ప్రతిభ అంటే ఏంటో బాగా అర్థమవుతుంది. అమితాబ్, నాన్న చాలా హార్డ్ వర్కర్స్’ అని వెల్లడించారు సుస్మిత. సుస్మిత చెప్పినట్లుగానే సినిమాలో నయనతార, తమన్నాల చీరలు చాలా హుందాగా కనిపించాయి. ట్రైలర్‌లో నటీనటుల దుస్తులు చాలా హైలైట్ అయ్యాయి. మరి సుస్మిత పడిన కష్టానికి ప్రతిఫలం దక్కుతుందో లేదో సినిమా విడుదలయ్యాక చూడాలి. ఇప్పటికే సినిమాకు సెన్సార్ బోర్డు u/a సర్టిఫికేట్ ఇచ్చేసింది. సినిమా చాలా బాగుందని, తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందని సెన్సార్ వర్గాలు అంటున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాధారంగా ఈ సినిమాను సురేందర్ రెడ్డి తెరకెక్కించారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీపై రామ్ చరణ్ రూ.200 కోట్ల బడ్జెట్‌తో సినిమాను తెరకెక్కించారు. అక్టోబర్ 2న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోపక్క సినిమా విడుదలకు ముందు ఉయ్యాలవాడ కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సైరా నరసింహారెడ్డి పేరుతో చిత్రీకరించిన సినిమా కోసం తమ నుంచి సమాచారం తీసుకొని రామ్ చరణ్ ఇప్పుడు మొఖం చాటేశారని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంశస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరక్కపోతే మెగాస్టార్ చిరంజీవి ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. మరోపక్క రామ్ చరణ్.. ఉయ్యాలవాడ కుటుంబీకులకు సాయం చేయను కానీ ఆ ఊరికి సాయం చేస్తానని వెల్లడించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2mdwgoi

'Each man had purely political goals'

'The biggest takeaway is that the US-India relationship, which has sputtered a bit in recent months, enjoyed a big boost.'

from rediff Top Interviews https://ift.tt/2mIJKsm

'Govt must not throw away money to corporates'

'You can't take money from Shaktikanta Das (the RBI governor) and give it to Nirmala Sitharaman (the Union finance minister). She will blow it away on Modi.'

from rediff Top Interviews https://ift.tt/2merRkS

Vivo U10 With Snapdragon 665 SoC Set to Launch in India Today

Vivo U10 specifications include an HD+ display and a Qualcomm Snapdragon 665 SoC, paired with 4GB of RAM. Its launch will be live streamed through the Vivo India YouTube channel.

from NDTV Gadgets - Latest https://ift.tt/2kIJSaH

Naga Babu: గెటప్ శ్రీనుని ఉపయోగించుకోకపోతే ఇండస్ట్రీకే నష్టం

ఎందరో కమెడియన్లకు, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లకు కెరీర్‌ను అందించింది ప్రముఖ కామెడీ షో ‘జబర్దస్త్’. మెగా బ్రదర్ నాగబాబు, నటి రోజా ఈ షోకు జడ్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. అయితే జబర్దస్త్ స్టార్ కమెడియన్స్ అయిన సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీనులు ప్రధాన పాత్రల్లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు ‘త్రీ మంకీస్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమా ప్రెస్ మీట్‌లో భాగంగా నాగబాబు మాట్లాడారు. తనకు సుధీర్‌తో, రాంప్రసాద్‌తో, శ్రీనులతో ఉన్న అనుబంధం గురించి చెప్పారు. ‘జబర్దస్త్‌లో ఎందరో టాలెంటెడ్ యాక్టర్స్ ఉన్నారు. వారిలో నాకు బాగా ఇష్టమైనవారు సుధీర్, రాం ప్రసాద్, శ్రీను. రాంప్రసాద్‌లో ఓ గొప్ప రైటర్ ఉన్నాడు. అతను బాగా పంచ్‌లు రాస్తుంటాడు. రాంప్రసాద్ వేసే పంచ్‌లను మనం ఎవ్వరూ ఊహించలేం. రాంప్రసాద్ ఆటో పంచ్‌లు వేస్తాడని మేమంతా సరదాగా ఏడిపిస్తుంటాం కానీ ఓ హీరోకు ఉండాల్సిన అన్ని క్వాలిటీలు రాం ప్రసాద్‌కు ఉన్నాయి. రాంప్రసాద్‌ చాలా మంది రైటర్. ఇక గురించి చెప్పాలంటే నేను బాగా అభిమానించే వ్యక్తి ఎవరైనా జబర్దస్త్‌లో ఉన్నారంటే అది గెటప్ శ్రీను. ఎందుకు చెప్తున్నానంటే.. అతని గురించి పబ్లిక్‌లో చెప్పడానికి నాకు అవకాశం రాలేదు. కానీ ఇప్పుడు చెప్తున్నాను. ఏ భాషలోనైనా సరే.. అంతర్జాతీయ స్థాయిలో నటించగలిగే ఏకైక నటుడు గెటప్ శ్రీను. ఎంత గొప్ప నటుడంటే అతను ఇప్పటికీ 90 రకాల క్యారెక్టర్స్ చేశాడు. 90 రకాల డిక్షన్, బాడీ లాంగ్వేజెస్‌లో కామెడీ పండించాడు’ ‘ అది ఏ నటుడికీ సాధ్యం కాదు. ఎంతటి కష్టమైన టాస్క్ ఇచ్చిన ఇట్టే చేసేస్తాడు. నాకు కామెడీ అంటే చాలా ఇష్టం. నేను ఇంటర్నేషనల్ కామెడీ నుంచి పంజాబీ కామెడీ వరకు అన్నీ చూస్తాను. ఎంత మందిని చూసినా ఎవర్ని చూసినా శ్రీనుకు పోటీగా ఎవ్వరూ నటించలేరు అనిపించింది. ఇప్పటివరకు ఇండస్ట్రీలో శ్రీనుకు రావాల్సిన గుర్తింపు ఎందుకు రాలేదో నాకు తెలీదు. అతను నాకు కొడుకు కాదు. మా మధ్య బంధుత్వం లేదు. జబర్దస్త్‌లో ఒక కమెడియన్ మాత్రమే. ఓ కొడుకుగా భావించి అతని గురించి ఇవన్నీ ఇండస్ట్రీలో ఉన్నవారికి తెలియాలి. శ్రీను గురించి ఒక్కటి మాత్రం చెప్పగలను. తెలుగు చిత్ర పరిశ్రమ అతన్ని ఉపయోగించుకోకపోతే మాత్రం ఒక ఆణిముత్యాన్ని కోల్పోయిన వాళ్లమవుతాం. శ్రీనును ఉపయోగించుకోకపోతే అతను కోల్పోయేదేం ఉండదు. కానీ తెలుగు చిత్ర పరిశ్రమకే నష్టం’ అంటూ శ్రీనును ఆకాశానికెత్తేశారు నాగబాబు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2LGgj4a

గద్దలకొండ గణేష్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. ఆల్మోస్ట్ సేఫ్

నటించిన వాల్మీకి చివరి నిమిషంలో పేరు మార్చుకుని గద్దలకొండ గణేష్‌గా థియేటర్స్‌లోకి వచ్చింది. అయినా కూడా ఆ సినిమాలో ఉన్న మాస్ కంటెంట్ ప్రేక్షకులకు బాగానే నచ్చింది. దాంతో క్లాస్, మాస్ అనే తేడా లేకుండా సింగిల్ స్క్రీన్స్ నుండి మల్టీప్లెక్స్ వరకు కూడా కలెక్షన్స్ దందాకి అడ్డులేకుండా పోయింది. దీంతో మొదటి రోజే 5.5 కోట్ల భారీ డిస్ట్రిబ్యూటర్ షేర్ రాబట్టిన గద్దలకొండ గణేష్ శని,ఆదివారాల్లో కూడా బాగానే సంపాదించాడు. దాంతో ఈ సినిమా మొదటి మూడు రోజులకు గాను ప్రపంచవ్యాప్తంగా 15.19 కోట్లు కొల్లగొట్టింది. ఈ సినిమాకి నైజం ఏరియాలో మంచి థియేటర్స్ దక్కాయి. అలానే ఈ సినిమాకి పోటీగా ఏ సినిమా కూడా లేకపోవడం వల్ల కూడా టికెట్ కౌంటర్ దగ్గర గద్దలకొండ గణేష్ హవా కొనసాగుతుంది. ఒక్క నైజాంలోనే మూడు రోజులకు గాను నాలుగున్నర కోట్లు వచ్చాయి. ఇక ఇది మాస్ సినిమా కావడంతో ఓవర్సీస్ ప్రేక్షకులకు సరిగా కనెక్ట్ అయినట్టు లేదు. అందుకే అక్కడ ఈ సినిమా కేవలం 1.30 కోట్లు మాత్రమే రాబట్టగలిగింది. దీంతో అక్కడ ఈ సినిమా ఫుల్‌రన్‌లో స్వల్పంగా నష్టాలు మిగిల్చేలా ఉంది. మెగా ఫ్యాన్‌బేస్ ఎక్కువగా ఉన్న వెస్ట్ గోదావరి, నెల్లూరు వరకు మాత్రం ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్ అయ్యింది. సో, సైరా వచ్చేవరకు పెద్దగా చెప్పుకోదగ్గ సినిమా ఏది థియేటర్స్‌లోకి వచ్చే అవకాశం లేదు. దీంతో ఈ సినిమా కొనుకున్నవాళ్లందరికి కూడా మంచి లాభాలే అందించే అవకాశం ఉంది. ఈ సినిమాలో గద్దలకొండ గణేష్‌గా వరుణ్ తేజ్ నటన, పూజాహెగ్డే గ్లామర్, రెండు పాటలు కూడా ప్రేక్షకులకు బాగా నచ్చాయి. ఇక క్లయిమాక్స్‌లో ఎమోషన్ కూడా సినిమాకు మంచి టాక్ రావడానికి, కలెక్షన్స్ స్టడీగా ఉండడానికి కారణం అయ్యింది. అయితే ఈ మధ్య సినిమాలు ఎక్కువగా మొదటి వీకెండ్ తరువాత డ్రాప్ చూపిస్తున్నాయి.మరి ఈ సినిమా మండే టెస్ట్‌‌లో ఎలాంటి రిజల్ట్ అందుకుంటుంది అనేది కూడా ఈ సినిమా ఫైనల్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్‌పై ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఓవరాల్‌గా చూస్తే హరీష్ శంకర్ కష్టం, వరుణ్ తేజ్ నమ్మకం, కొత్త బ్యానర్ 14 రీల్స్ అన్నిటికి మంచి ఫేవరబుల్ గిఫ్ట్ అందించాడు గద్దలకొండ గణేష్. గద్దలకొండ గణేష్ వీకెండ్ కలెక్షన్స్(మూడు రోజుల కలెక్షన్స్) నైజాం - 4.51 కోట్లు ఉత్తరాంధ్ర - 1.64 కోట్లు సీడెడ్ - 2.05 కోట్లు గుంటూరు - 1.23 కోట్లు ఈస్ట్ - 0.97 కోట్లు వెస్ట్ - 0.97 కోట్లు కృష్ణా - 1.07 కోట్లు నెల్లూరు - 0.55 కోట్లు రెస్ట్ ఆఫ్ ఇండియా - 0.90 కోట్లు ఓవర్సీస్ - 1.30 కోట్లు మొత్తం - 15.19 కోట్లు (మూడు రోజులకు)


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/30jK97x

Asus ROG Phone 2 With Snapdragon 855+ SoC, 120Hz Display Launched in India

Asus ROG Phone 2 sporting a 6.4-inch AMOLED display with 120Hz refresh rate and packing the Snapdragon 855+ processor has been launched in India.

from NDTV Gadgets - Latest https://ift.tt/2NtD3Xd

Airtel's New Rs. 599 Prepaid Recharge Includes Rs. 4 Lakh Insurance Cover

Airtel has introduced its new Rs. 599 prepaid bundle with 2GB data per day, unlimited calls to any network and 100 SMS per day, and also offers Rs. 4 lakh life insurance cover from Bharti AXA Life...

from NDTV Gadgets - Latest https://ift.tt/2ADmG1J

Realme X2 Specifications Teased Ahead of Official Launch

Realme X2 key specifications have been revealed by company CMO Xu Qi Chase just a day before its formal launch that is scheduled in China for 10am local time (7:30am IST) on Tuesday.

from NDTV Gadgets - Latest https://ift.tt/2IiWldK

‘సైరా’ టైటిల్ సాంగ్.. సిరివెన్నెల కలం నుంచి జాలువారిన మరో ఆణిముత్యం

దుర్మార్గమైన ఆంగ్లేయుల పాలనను వ్యతిరేకించి ఆ పాలకులపై కత్తిదూసిన మొట్టమొదటి స్వాతంత్య్ర యోధుడు, రేనాటి సూరీడు, తెలుగు బిడ్డ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను సినిమాగా తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ‘సైరా నరసింహారెడ్డి’గా వస్తోన్న ఈ సినిమాలో ఆ యోధుడి పాత్రను మెగాస్టార్ చిరంజీవి పోషించారు. సురేందర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మించారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టైటిల్ సాంగ్‌ను ఆదివారం రాత్రి జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో దర్శక ధీరుడు రాజమౌళి విడుదల చేశారు. ఈ పాటలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గొప్పతనాన్ని, శౌర్యాన్ని వివరించారు. ఈ పాటను దిగ్గజ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించారు. అంటే, ఈ పాట స్థాయి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సిరివెన్నెల కలం నుంచి జాలువారిన మరో ఆణిముత్యం ఈ ‘సైరా’ టైటిల్ సాంగ్. Also Read: ఈ పాటలో సిరివెన్నెల వాడిన పదాలు చాలా గొప్పగా అందరికీ అర్థమయ్యే విధంగా ఉన్నాయి. ఇంత అందమైన సాహిత్యాన్ని ప్రముఖ గాయని శ్రేయా ఘోషాల్ అంతే గొప్పగా ఆలపించారు. అమిత్ త్రివేది స్వరపరిచిన ఈ పాట కేవలం మెగా అభిమానులనే కాదు.. ప్రతి ఒక్కరినీ కచ్చితంగా ఆకట్టుకుంటుంది అనడంలో సందేహం లేదు. మరి అంతగొప్ప పాటను మీరు కూడా స్వయంగా మీ స్వరంతో ఆలపించాలనుకుంటే ఇక్కడ మేమందించే సాహిత్యంతో ప్రతయ్నించొచ్చు. పల్లవి పవిత్ర ధాత్రి భారతాంబ ముద్దు బిడ్డవవురా ఉయ్యాలవాడ నారసింహుడా.. చరిత్ర పుటలు విస్మరించ వీలులేని వీరా రేనాటిసీమ కన్న సూర్యుడా మృత్యువే స్వరాన చిరాయురస్తు అనగా ప్రసూతి గండమే జయించినావురా నింగి శిరసువంచి నమోస్తు నీకు అనగా నవోదయానివై జనించినావురా హో సైరా.. హో సైరా.. హో సైరా.. ఉసస్సు నీకు ఊపిరాయెరా హో సైరా.. హో సైరా.. హో సైరా.. యసస్సు నీకు రూపమాయెరా చరణం 1 అహంకరించు ఆంగ్ల దొరలపైన హుంకరించగలుగు ధైర్యమా తలొంచి బతుకు సాటివారిలోన సాహసాన్ని నింపు శౌర్యమా శృంఖలాలనే తెంచుకొమ్మని స్వేచ్ఛ కోసమే శ్వాసనిమ్మని నినాదం నీవేరా ఒక్కొక్క బిందువల్లె జనులనొక్కచోట చేర్చి సముద్రమల్లె మార్చినావురా ప్రపంచమొనికిపోవు పెనుతుఫానులాగ వీచి దొరల్ని ధిక్కరించినావురా మొట్టమొదటి సారి స్వతంత్ర సమరభేరి పెఠిల్లు మన్నది ప్రజాలి పోరిది కాలరాత్రి వంటి పరాయి పాలనాన్ని దహించు జ్వాలలో ప్రకాశమే ఇది హో సైరా.. హో సైరా.. హో సైరా.. ఉసస్సు నీకు ఊపిరాయెరా హో సైరా.. హో సైరా.. హో సైరా.. యసస్సు నీకు రూపమాయెరా చరణం 2 దాస్యాన జీవించడం కన్న చావెంతో మేలంది నీ పౌరుషం మనుషులైతే మనం అనిచివేసే జులుం ఒప్పుకోకంది నీ ఉద్యమం ఆలని బిడ్డని అమ్మని జన్మని బంధనాలన్ని ఒదిలి సాగుదాం ఓ.. నువ్వే లక్షలై ఒకే లక్ష్యమై అటేవేయని ప్రతి పదం కదనరంగమంతా కొదమసింగమల్లె ఆక్రమించి విక్రమించి తరుముతోందిరా అరివీర సంహారా హో సైరా.. హో సైరా.. హో సైరా.. హో సైరా.. హో సైరా.. హో సైరా.. ఉసస్సు నీకు ఊపిరాయెరా


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2LLM6kl

SoftBank Seeks to Oust Adam Neumann as WeWork CEO: Report

SoftBank Group reportedly wants to oust Adam Neumann as the CEO of WeWork, a US firm that provides shared workspaces for startups

from NDTV Gadgets - Latest https://ift.tt/2AFattG

Lenovo K10 Plus With Triple Rear Cameras, 19:9 Display Launched in India

Lenovo K10 Plus price in India is set at Rs. 10,999 for the lone 4GB RAM + 64GB storage option. The smartphone houses triple rear cameras and sports a waterdrop-style display notch.

from NDTV Gadgets - Latest https://ift.tt/331BPGa

Oppo K5 Tipped to Pack 64-Megapixel Camera, Snapdragon 730G SoC

A leaked specifications sheet suggests that the Oppo K5 will come equipped with quad rear cameras with a 64-megapixel main snapper.

from NDTV Gadgets - Latest https://ift.tt/351q30z

Oppo F11 6GB RAM Variant, Oppo F11 Pro Price in India Slashed

Oppo F11 price in India now comes at Rs. 16,990 for the 6GB RAM + 128GB storage variant, while Oppo F11 Pro 6GB RAM + 128GB storage option is available at Rs. 19,990.

from NDTV Gadgets - Latest https://ift.tt/2V8fnZi

ఇద్దరు చిలకలతో మాస్ స్టెప్పులు.. చితక్కొట్టేస్తున్న 'ఇస్మార్ట్ శంకర్'

వరుసగా ఫ్లాప్స్ తీస్తున్న పూరికి, ఒక్క హిట్ వస్తే బావుండును అనుకుంటున్న రామ్‌కి కూడా ఊహించినదానికంటే పెద్ద హిట్‌గా నిలిచింది ఇస్మార్ట్ శంకర్. ఆ సినిమా థియేటర్స్‌లో కలెక్షన్స్ కుమ్మేసింది. సరయిన కంటెంట్‌తో వస్తే మాస్‌బొమ్మకి ఉండే పవర్ ఏంటి అనేది ఇస్మార్ట్ శంకర్ మరొకసారి ప్రూవ్ చేసి చూపించాడు. ముందు పెద్దగా అంచనాలు లేని ఈ సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం కొనుకున్నవాళ్లందరికి కూడా రూపాయికి రూపాయి మిగిలేలా చేసింది. ఆ సినిమా థియేటర్స్‌లో నుండి వెళ్ళిపోయినా చాలా మందికి మైండ్స్‌లో నుండి మాత్రం పోలేదు. అందుకే ఆ సినిమా ఆన్‌లైన్‌లో ఎప్పుడు ప్రత్యక్షమవుతుందా అని వెయిట్ చేస్తున్నారు చాలామంది. Also Read: అయితే ఆ సినిమా రిలీజ్ కంటే ముందే ఆ సినిమా నుండి 'దిమాక్ ఖరాబ్' అనే వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. థియేటర్స్‌లో ఆ సాంగ్‌కి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది అనేది అందరికి తెలిసిందే. మణిశర్మ ఇచ్చిన మాసీ ట్యూన్‌కి రామ్ వేసిన స్టెప్పులు మాస్ ప్రేక్షకుల్ని అసలు సీట్స్‌లో కూర్చోనివ్వకుండా చేసాయి. ఇక ఆ పాటలో ఒకపక్క నభా నటేష్, మరోపక్క నిధి అగర్వాల్ కూడా తమ అందాలతో ఇస్మార్ట్ శంకర్‌కి ఫుల్లుగా సపోర్ట్ ఇచ్చారు. దాంతో ఆ పాట కోసమే సినిమాకి వెళ్లిన రిపీట్ ఆడియన్స్ కూడా ఉన్నారు. ఆ పాట ఇప్పుడు యూట్యూబ్‌లో రిలీజ్ అయ్యింది. దాంతో ఆ పాట మార్చకుండా చూసి ఆ పాటకి కొత్త రికార్డ్స్ కట్టబెడుతున్నారు ఇస్మార్ట్ శంకర్ ఫ్యాన్స్. Also Read: మణిశర్మ ఇచ్చిన సూపర్ మాస్ ట్యూన్‌కి కాసర్ల శ్యామ్ కూడా అదే రేంజ్‌లో ఈజీగా కనెక్ట్ అయిపోయే లిరిక్స్ ఇచ్చాడు. కీర్తనశర్మ, సాకేత్ కూడా ఆ లిరిక్స్‌లోని ఇంటెన్సిటీ కరెక్ట్ గా రీచ్ అయ్యేలా పాడారు. ఇక శేఖర్ మాస్టర్ కూడా ఇంతటి ఊర మాస్ సాంగ్‌కి ఎలాంటి స్టెప్పులు అయితే సూట్ అవుతాయో అలాంటి స్టెప్పులతో దుమ్మురేపాడు. వాటిని రెడ్‌బుల్ తాగినట్టు ఎనర్జీగా ఉండే రామ్ కూడా దిమాక్ ఖరాబ్ స్టెప్పులతో అదరగొట్టాడు. ఆ పాట సిట్యుయేషన్ కూడా సినిమాలోని కీలకమైన పాయింట్‌కి లింక్‌అప్ అయ్యి ఉండడంతో అందరికి ఇట్టే కనెక్ట్ అయిపోయింది. అందుకే అప్పుడే 10 మిలియన్స్ వ్యూస్‌కి చేరువయింది. ఒక మీడియం బడ్జెట్ సినిమాలోని పాట ఇంత త్వరగా ఈ రేంజ్ వ్యూస్ దక్కించుకోవడం అరుదు. ధాబా బ్యాక్‌డ్రాప్‌కి పక్కా మాస్ సాంగ్‌గా వచ్చిన 'దిమాక్ ఖరాబ్' ముందు ముందు మరిన్ని సంచలనాలు క్రియేట్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/30LHheN

'Residential, hospitality are best-performing sectors'

'The overall market cycle is very positive.' from rediff Top Interviews https://ift.tt/iTjSyPd