Monday, 23 September 2019

Sushmita konidela: తమన్నా, నయనతార చీరలను ముందు నేను కట్టుకున్నా

‘తమన్నా, నయనతారల కంటే ముందు వారి చీరలను నేనే కట్టుకున్నాను’ అని అంటున్నారు మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల. చిరు నటించిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. ఈ సినిమాకు సుస్మిత కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేశారు. ఆదివారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తాను డిజైన్ చేసిన దుస్తుల గురించి సుస్మిత ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ‘1800ల కాలంలో పురుషులు, మహిళలు ఎలాంటి దుస్తులు ధరించేవారో తెలుసుకోవడానికి చాలా రీసెర్చ్ చేశాను. నాన్న దుస్తులతో పాటు అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నాల దుస్తులను కూడా నేనే డిజైన్ చేయించాను. నాతో పాటు ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అంజు మోది, గౌతమ్ మేనన్ సోదరి ఉత్తరా మేనన్‌ కూడా నాకు సాయం చేశారు. నయనతార, తమన్నాల కోసం నేను 12 అడుగుల సిల్క్ చీరలు తెప్పించాను. అవి ధరించడం అంత సులువు కాదు. చాలా బరువు ఉంటాయి. వారు ధరించడానికి ముందు నేనే ఆ చీరలు కట్టుకున్నాను. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను. రెండేళ్ల పాటు ఈ దుస్తుల కోసమే చాలా కష్టపడ్డాను. ఇందుకోసం చెన్నైలో చాలా రోజుల పాటు ఉండాల్సి వచ్చింది. నా భర్తను చాలా మిస్సయ్యాను. లెజెండ్స్‌తో కలిసి పనిచేస్తున్నప్పుడు మనకు ప్రతిభ అంటే ఏంటో బాగా అర్థమవుతుంది. అమితాబ్, నాన్న చాలా హార్డ్ వర్కర్స్’ అని వెల్లడించారు సుస్మిత. సుస్మిత చెప్పినట్లుగానే సినిమాలో నయనతార, తమన్నాల చీరలు చాలా హుందాగా కనిపించాయి. ట్రైలర్‌లో నటీనటుల దుస్తులు చాలా హైలైట్ అయ్యాయి. మరి సుస్మిత పడిన కష్టానికి ప్రతిఫలం దక్కుతుందో లేదో సినిమా విడుదలయ్యాక చూడాలి. ఇప్పటికే సినిమాకు సెన్సార్ బోర్డు u/a సర్టిఫికేట్ ఇచ్చేసింది. సినిమా చాలా బాగుందని, తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందని సెన్సార్ వర్గాలు అంటున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాధారంగా ఈ సినిమాను సురేందర్ రెడ్డి తెరకెక్కించారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీపై రామ్ చరణ్ రూ.200 కోట్ల బడ్జెట్‌తో సినిమాను తెరకెక్కించారు. అక్టోబర్ 2న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోపక్క సినిమా విడుదలకు ముందు ఉయ్యాలవాడ కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సైరా నరసింహారెడ్డి పేరుతో చిత్రీకరించిన సినిమా కోసం తమ నుంచి సమాచారం తీసుకొని రామ్ చరణ్ ఇప్పుడు మొఖం చాటేశారని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంశస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరక్కపోతే మెగాస్టార్ చిరంజీవి ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. మరోపక్క రామ్ చరణ్.. ఉయ్యాలవాడ కుటుంబీకులకు సాయం చేయను కానీ ఆ ఊరికి సాయం చేస్తానని వెల్లడించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2mdwgoi

No comments:

Post a Comment

FM: 'Focus Of Budget Was To Keep Stable Growth Going'

'We kept this Budget on a larger plank, rather than on one incident, however serious.' from rediff Top Interviews https://ift.tt/F...