Saturday, 24 August 2019

బిక్షాటన To బాలీవుడ్.. ఆ గాయకుడితో స్వరం కలిపిన యాచకురాలు, తొలిపాట అదుర్స్!

శ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లాలోని రాణాఘట్ రైల్వే స్టేషన్‌లో రాణు మరియా ముండల్ అనే యాచకురాలు.. లతా మంగేష్కర్ ఆలపించిన ‘‘ఏక్ ప్యార్ కా నగ్‌మా హే’’ పాటను పాడి వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఆమె అద్భుతమైన గాత్రానికి బాలీవుడ్ సైతం ఫిదా అయిపోయింది. దీంతో ఆమె రాత్రికి రాత్రే సెలబ్రిటీగా మారిపోయింది. చిన్న పనులు చేసుకుంటూ.. రైల్వే స్టేషన్లో తన పాటలతో మెప్పించి బిచ్చమెత్తుకుంటూ జీవితాన్ని వెళ్లదీస్తున్న రాణుకు ఇటీవల ఓ ఎంటర్‌టైన్మెంట్ ఛానెల్ అవకాశం కల్పించింది. దీంతో ఆమె తొలిసారిగా ముఖానికి మేకప్ వేసుకుంది. యాచకురాలి రూపం నుంచి సింగర్ అవతారమెత్తిన ఆమె ఇప్పుడు ప్రముఖ బాలీవుడ్ గాయకుడు, నటుడు హిమేష్ రెషమ్మియాతో సైతం స్వరం కలిపి ఔరా అనిపిస్తోంది. హిమేష్ రెషమ్మియా రూపొందిస్తున్న ‘తేరి మేరీ కహానీ’ ఆల్బమ్‌లో ఓ పాటలో పాడే అవకాశాన్ని రాణుకు ఇచ్చాడు. హిమేష్ ఓ రియాల్టీ షోలో రాణుకు కలిశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రతిభ ఎప్పుడూ వృథా కాకూడదని, ప్రతిభావంతులకు సాయం చేయడానికి నిత్యం ప్రయత్నిస్తుండాలని సల్మాన్ ఖాన్ తండ్రి సలీమ్ ఖాన్ నాకు చెప్పారు’’ అని తెలిపాడు. ‘‘ఈ రోజు నేను రాణును కలిశాను. ఆమెకు దైవత్వం తోడుందేమో అనిపించింది. ఆమె స్వరం నన్ను మెస్మరైజ్ చేసింది. దీంతో ఆమెకు పాడే అవకాశం ఇవ్వకుండా ఉండలేకపోయాను. ఆమె గాత్రం దేవుడిచ్చిన వరం. త్వరలో రానున్న నా సినిమా ద్వారా ఆమె పాటను ప్రపంచానికి పరిచయం చేస్తా’’ అని తెలిపాడు. మరి ఇంకెందుకు ఆలస్యం హిమేష్ రేషమ్మియాతో ఆమె ఆలాపించిన పాటను ఈ కింది ట్వీట్‌లో చూడండి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2L9TggH

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....