Saturday, 17 August 2019

Adivi Sesh Evaru: ‘ఎవరు’ కలెక్షన్స్.. మైదా పిండి ఖర్చులే కాదు కోట్లతో కంపెనీ పెట్టొచ్చు

చిన్న చిత్రంగా విడుదలై పెద్ద విజయాన్ని అందుకుంది అడివి శేష్ నటించిన ‘ఎవరు’. సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఆగస్టు 15న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకులు పాజిటివ్ స్పందనలతో యునానిమస్‌గా హిట్ ఇచ్చారు. ‘క్షణం’, ‘గూఢచారి’ చిత్రాలతో మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్న అడివి శేష్.. ‘ఎవరు’ చిత్రంతో కెరియర్ హయ్యెస్ట్ వసుళ్లను రాబట్టారు. చిన్న చిత్రంగా విడుదలైన ఈ చిత్రం ఊహించని స్థాయి కలెక్షన్లు రాబట్టింది. తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.75 కోట్ల షేర్‌తో డిస్ట్రిబ్యూటర్స్‌కి కాసుల పంట పండించగా.. మూడోరోజు ఆక్యుపెన్సీ సాధించి లాభాల బాట పట్టింది. Read Also: గూఢచారి చిత్రానికి తొలిరోజు రూ. 60 లక్షలు మాత్రమే కాగా.. ‘ఎవరు’ చిత్రానికి మూడు రెట్లు అధికంగా కలెక్షన్లు రాబట్టింది. తొలి రెండురోజుల్లోనూ తెలుగు రాష్ట్రాల్లో రూ. 2.76 కోట్ల వసూలు చేసి.. రికార్డు కలెక్షన్ల వైపుగా పరుగులు తీస్తున్నారు ‘ఎవరు’. ఇక ప్రపంచ వ్యాప్తంగా రూ.3.65కోట్ల పైగా వసూళ్లు చేయడంతో వీకెండ్‌లో మరింత ఊపందుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లో తన తొలిసినిమాకు మైదా పిండి ఖర్చులు కూడా రాలేదన్న అడవి శేష్.. ‘ఎవరు’ చిత్రంతో మైదా పిండి కంపెనీ పెట్టేలా కోట్లు కొల్లగొడుతున్నాడు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2MudFjN

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....