Saturday, 27 July 2019

దర్శకుడితో విజయ్ దేవరకొండకు విభేదాలు.. ఆగిపోయిన కొత్త సినిమా!

‘ఇండస్ట్రీలో ఎవరిపని వాళ్లు చేసుకోవాలి.. ఒకరి పనిలో ఒకరు వేలు పెడితే అవుట్ పుట్ అట్టర్ ఫ్లాప్ అవుతుంది. అందుకే నా పని నేను చూసుకుంటా.. దర్శకుడి దర్శకుడు, నిర్మాత పని నిర్మాత చూసుకుంటారు’ అంటుంటారు మహేష్ బాబు. అందుకే ఆయన సూపర్ స్టార్ అయ్యారు. అయితే సెన్సేషన్ స్టార్ ఆ టైపు కాదు. ఆయన అన్నింట్లోనూ ఉంటారు. కథ విన్నామా? ఓకే చేశామా? రెమ్యునరేషన్ తీసుకున్నామా? అన్నట్టుగా కాకుండా.. కథ విన్నది మొదలు ప్రమోషన్స్ మొత్తం భుజాలపై వేసుకుంటారు. ఇక కథ, ప్రొడక్షన్ విషయాల్లో కూడా పర్సనల్ ప్లానింగ్‌తో ముందుకు వెళ్తుంటారు. అయితే ఇది కొన్ని సందర్భాల్లో ఈ వేలుపెట్టే కార్యక్రమం వరం అయితే మరికొన్ని సందర్భాల్లో శాపం అవుతుంది. ఆ ఉపోద్ఘాతం అంతా ఆయన అప్ కమింగ్ మూవీ ‘హీరో’కి సంబంధించినదే. విజయ్ దేవరకొండ నటించిన ‘డియర్ కామ్రేడ్’ శుక్రవారం నాడు విడుదలై మిక్స్ టాక్‌‌తో రన్ అవుతోంది. ఈ సినిమా తరువాత విజయ్ దేవరకొండ.. తమిళ దర్శకుడు ఆనంద్‌ అన్నామలైతో ‘హీరో’ అనే చిత్రంలో నటిస్తున్నారు. మాళవికా మోహన్‌ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఇటీవల రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి మేజర్ సీన్స్ చిత్రీకరించారు. అయితే దర్శకుడు ఆనంద్ అన్నామలైతో స్క్రిప్ట్ విషయంలో విభేదాలు తలెత్తడంతో విజయ్ దేవరకొండ ‘హీరో’ చిత్రం ఆగిపోయినట్టు తెలుస్తోంది. కథ విషయంలో మార్పులు చేర్పులతో పాటు డైరెక్షన్‌లో కూడా విజయ్ దేవరకొండ కల్పించుకోవడంతో దర్శకుడు ఆనంద్ వ్యతిరేకించారట. ఇద్దరికీ సఖ్యత కుదరకపోవడంతో ఈ ప్రాజెక్ట్‌ను ఆపేస్తేనే మంచిదనే నిర్ణయానికి వచ్చిందట నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్. అయితే ఈ చిత్రానికి ఇప్పటికే రూ. 15 కోట్లకు పైగా ఖర్చు చేయడంతో.. అదే దర్శకుడితో ఈ చిత్రాన్ని కొనసాగిస్తారా? లేక దర్శకుడ్ని మార్చి విజయ్‌తో కొనసాగిస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. ఈ ఇష్యూపై మైత్రి మూవీస్ ఎలాంటి ప్రకటన చేయలేదు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2yepGjV

No comments:

Post a Comment

'Most Dargahs And Mosques Will Be Threatened'

'The new Waqf bill sows the seed for conflict in every town and village of India.' from rediff Top Interviews https://ift.tt/UcHi9...