Sunday 14 July 2019

‘బిగ్ బాస్’ షురూ: 100 రోజులు.. 15 మంది సెలబ్రిటీలు

‘బిగ్ బాస్’ తెలుగు సీజన్ 3కి సర్వం సిద్ధమైంది. జులై 21 నుంచి ‘బిగ్ బాస్’ షో ప్రసారం కానున్నట్టు ఇప్పటికే ప్రోమో వీడియో ఒకటి స్టార్ మా ఛానల్‌లో ప్రసారమవుతోంది. ఇప్పుడు ఆ షో నిడివి, సెలబ్రిటీల సంఖ్యను ఖరారుచేస్తూ స్టార్ మా ఛానల్ ట్వీట్ చేసింది. 100 రోజులపాటు ఈ షో కొనసాగనుంది. మొత్తం 15 మంది సెలబ్రిటీలు బిగ్ హౌజ్‌లోకి అడుగుపెట్టనున్నారు. గతంలో మాదిరిగానే శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు, సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9.30 గంటలకు ఈ షో ప్రసారం కానుంది. ఈ సీజన్‌కు కింగ్ హోస్ట్‌గా వ్యవహరిస్తుండటంతో అందరి దృష్టి ఈ షోపైనే ఉంది. 15 మంది సెలబ్రిటీలు పాల్గొంటున్నట్లు వెల్లడించారు కానీ వారు ఎవరెవరు అనేది ఇంకా ఫైనల్ చేయలేదు. వీరి పేర్లను నేరుగా 21వ తేదీన రివీల్ చేస్తారో లేదంటే షో ప్రారంభంకావడానికి ముందుగానే ట్విట్టర్ ద్వారా చెబుతారో చూడాలి. కాగా, షో ప్రారంభం రోజు ఆదివారం ఎపిసోడ్ సుధీర్ఘంగా సాగనున్నట్లు తెలుస్తోంది. కంటెస్టెంట్లు అందరినీ ఆరోజే ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నట్లు సమాచారం. సోమవారం నుంచి వారు హౌజ్‌లో చేసే సందడిని ప్రసారం చేయనున్నట్లు తెలిసింది. చూద్దాం ‘బిగ్ బాస్’ హౌజ్‌లోకి వెళ్లేది ఎవరో! Also Read: ఇదిలా ఉంటే, ‘బిగ్ బాస్’ తొలి సీజన్‌తోనే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తొలి సీజన్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించడంతో ఎక్కడలేని క్రేజ్ వచ్చేసింది. ఆయన కూడా అద్భుతంగా హోస్ట్ చేయడంతో తెలుగు టీవీ చరిత్రలోనే అత్యధిక టీఆర్‌పీ రేటింగ్‌తో ఈ షో దూసుకుపోయింది. ఇక రెండో సీజన్‌కు నేచురల్ స్టార్ నాని హోస్ట్‌గా వ్యవహరించారు. ఈ సీజన్ 100 రోజులపాటు సుధీర్ఘంగా సాగింది. హౌజ్‌లో మసాలా, గొడవలతో మొదటి సీజన్‌ను మించి హైలైట్ అయ్యింది. మరి ఈ మూడో సీజన్ ఎలా ఉండబోతోందో!! Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2XKq5Kf

No comments:

Post a Comment

'Nifty Pullback Needs To Be Taken In Stride'

'The biggest near-term risk to Indian equities is the outflow of investments to China as tactical trades by foreign investors.' fr...