Monday, 16 September 2019

మహేష్ ఎందుకంత మౌనం...నెక్స్ట్ సినిమా ఎవరితో?

టాలీవుడ్ స్టార్ హీరోస్ అందరిలో కూడా చాలా కామ్‌గా ఉండేది, సినిమాలు చేస్తున్నా కూడా ఇండస్ట్రీకి ఆంటీ ముట్టనట్టు ఉండే వ్యక్తి మహేష్. అందుకే మిగతా హీరోల గురించి అందినంత సమాచారం మహేష్ గురించి బయటకు రాదు. ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమా తరువాత మహేష్ చేసే సినిమా గురించి ఇప్పటికే అనేక రూమర్స్ వినిపిస్తున్నాయి. కానీ మహేష్ మాత్రం ఆ విషయంలో ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. మహేష్ బాబుకి, అతని సినిమాలకు సంబందించిన విశేషాలని ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌కి, ప్రేక్షకులకి చేరవేసే అతని సోషల్ మీడియా టీమ్ కూడా ఇప్పుడు పాసివ్ మోడ్‌లోనే ఉంది. Also Read: ఇప్పటికే మహేష్‌తో సినిమా కోసం వంశీ పైడిపల్లి రెడీ. ఈ సంవత్సరం వరల్డ్‌కప్ టైమ్‌లోనే మహేష్‌తో ట్రావెల్ చేసి లైన్ ఓకే చేయించుకున్న వంశీ పైడిపల్లి ఆ లైన్‌ని బౌండెడ్ స్క్రిప్ట్‌గా మార్చే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ మధ్యే కష్టపడి మహేష్‌తో తన సినిమా ఓకే అనిపించుకున్న పరశురామ్ కూడా తన స్క్రిప్ట్‌కి ఫైనల్ టచప్స్ ఇస్తున్నాడు. ఇక సందీప్‌కి 'సినిమా చేస్తా కానీ టైమ్ పడుతుంది' అని చెప్పడంతో అతను బాలీవుడ్‌లో తన నెక్స్ట్ సినిమా చెయ్యడానికి రెడీ అవుతున్నాడు. ఇదీ ప్రస్తుతం మహేష్‌తో లైనప్‌లో ఉన్న, టచ్‌లో ఉన్న డైరెక్టర్స్ లిస్ట్ .అయితే ఇప్పడు ఈ లిస్ట్లోకి కొత్తగా వచ్చి చేరిన పేరు . Also Read: KGF తో కన్నడ సినిమాకి కూడా పాన్ ఇండియా లెవెల్‌లో ప్రమోషన్ అందించిన టాలెంటెడ్ డైరెక్టర్.రీసెంట్‌గా మహేష్‌తో ప్రశాంత్ నీల్ మీటింగ్ జరిగింది అన్నా కూడా మహేష్ సన్నిహితులు దానికి ఖండించారు. కానీ ఇప్పుడు ప్రశాంత్ నీల్‌తో మహేష్ సినిమా ఫైనల్ అయ్యింది. ఇంకా కరెక్ట్‌గా చెప్పాలంటే మహేష్ తన దగ్గర పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్ట్స్ అన్నీ కూడా వెనక్కు జరిపి ప్రశాంత్ నీల్ సినిమాని ముందు చెయ్యాలి అనే ఆలోచనలో ఉన్నట్టు టాక్. దానికి కారణం ప్రశాంత్ కి ఉన్న పాన్ ఇండియా లెవెల్ ఇమేజ్. Also Read: మహేష్‌కి టాలీవుడ్‌లో స్టార్ హీరో ఇమేజ్ ఉన్నా కూడా మార్కెట్ రిస్ట్రిక్ట్ అయిపోవడం వల్ల అతని రెమ్యునరేషన్ పెంచితే ప్రొడ్యూసర్స్ వెనక్కి తగ్గుతున్నారు. అందుకే పాన్ ఇండియా సినిమాతో తన మార్కెట్ పెంచుకుంటే ఆ ఇబ్బంది ఉండదు. అలాగే రాజమౌళితో సినిమా అనేది కూడా మహేష్ కెరీర్ ప్లాన్‌లో ఉంది. కానీ అప్పటికే మహేష్ కూడా బాలీవుడ్‌లో లాంచ్ అయ్యి ఉంటే ఆ సినిమా వచ్చేనాటికి మహేష్‌కి కూడా ఫుల్ క్రేజ్ వస్తుంది. అందుకే ఇవన్నీ ఆలోచించే మహేష్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్‌ని ముందుకు జరిపాడు అంటున్నారు. ఈ సినిమాకి సంబందించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వస్తే తప్ప ఇది కూడా నమ్మడానికి లేదు. ఎందుకంటే ఈ మధ్య తన సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్న మహేష్ చాలా స్ట్రాటజిక్‌గా వ్యవహరిస్తున్నాడు. నిజంగా ప్రశాంత్ నీల్‌తో మహేష్ పాన్ ఇండియా సినిమా అనౌన్స్ చేస్తే మాత్రం అది మళ్ళీ ఒక సెన్సేషన్ అవుతుంది అనే విషయంలో మాత్రం ఎలాంటి డౌట్ అక్కర్లేదు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2AqkIS8

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....