Monday, 16 September 2019

మీరు సింగిలా? అయితే కాజల్ అగర్వాల్ మెసేజ్ మీకోసమే!

ప్రేమలో విఫలమైనవారికి.. ప్రేమలో పడనివారికి నటి ఓ సందేశాన్ని ఇచ్చారు. సోమవారం కాజల్ తన కుటుంబంతో కలిసి ప్రపంచంలోని అద్భుతాల్లో ఒకటైన తాజ్ మహల్‌ను వీక్షించేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా తాజ్ మహల్ ముందు నిలబడి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రేమకు చిహ్నమైన తాజ్ మహల్‌ను జీవితంలో తొలిసారి వీక్షిస్తున్నానంటూ కాజల్ ప్రేమలో పడనివారికి ఓ సందేశాన్నిచ్చారు. ‘ప్రేమకు చిహ్నమైన తాజ్ మహల్‌ను చూశాక నాకు ప్రేమ గురించి మీతో ఓ విషయం పంచుకోవాలని అనిపించింది. ప్రస్తుతం సమాజంలో మనం ప్రేమను సీరియస్‌గా తీసుకోవడం లేదు. ప్రేమను ఆస్వాదించేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. కానీ మనం వాటిని చూసీచూడనట్లు వదిలేస్తున్నాం. మన చుట్టూ ఉండే ఎందరో స్నేహితులు, మనం చేసే పని, మనకు మద్దతుగా నిలిచేవారి నుంచి కూడా మనం ప్రేమను ఆస్వాదించొచ్చు. ఇది మనం కామన్‌గా వినే విషయం కాదు. కాబట్టి నాతో సహా.. ఇక్కడున్న ఎందరో సింగిల్స్‌కి నేను చెప్పే విషయం ఏంటంటే.. ప్రేమించడానికి, ప్రేమించబడటానికి మనం అర్హులం కాదేమో అనుకోకూడదు. చాలా కాలం పాటు నేను నా జీవితాన్ని సింగిల్‌గానే గడిపాను. దీని వల్ల ప్రేమపై నాది ఎంత చిన్న చూపో తెలుసుకున్నాను. అంతేకాదు జీవితం సంతోషంగా ఉండటానికి మూల కారణం రొమాంటిక్ రిలేషన్‌షిప్పే అని తప్పుగా అర్థం చేసుకున్నాను. మనకు ప్రేమలో పడే అవకాశం రాక మనం సింగిల్‌గా ఉండటం లేదు. ఇది మనం ఎంచుకున్న ఛాయిస్. కాబట్టి.. మనం జీవితంలో ఎంత సంతోషంగా ఉంటామనేది పూర్తిగా మన మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనల్ని సంతోషంగా ఉంచే బాధ్యతని మన జీవిత భాగస్వామి మీదకు నెట్టకుండా వారితో కలిసి మీ సంతోషాన్ని పంచుకోవడానికి ప్రయత్నించండి. జీవితంలో తొలిసారి తాజ్ మహల్‌ను చూడగానే మెస్మరైజ్ అయిపోయాను. తాజ్ అందాల గురించి ఎన్నో విషయాలు విన్నాను. ఇప్పుడు వాటిని ఆస్వాదిస్తున్నాను. ఈ ప్రయాణం నన్ను మళ్లీ చరిత్రలోకి తీసుకెళ్లింది’ అని పేర్కొన్నారు కాజల్. READ ALSO: కాజల్ ఇప్పుడంటే సింగిల్‌గా ఉన్నారు కానీ ఒకప్పుడు ఆమె కూడా ప్రేమలో ఉన్నవారే. కెరీర్ తొలినాళ్లలో కాజల్‌ ఓ వ్యాపారవేత్తతో ప్రేమలో ఉన్నారు. అయితే కాజల్ కెరీర్ జోరు మీద ఉండటంతో అతని కోసం సమయం కేటాయించలేకపోయారు. దాంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. విడిపోయారు. అతని కోసం చాలా ఏడ్చానని కాజల్ ఓ సందర్భంలో వెల్లడించారు. కొన్ని రోజుల తర్వాత అతన్ని పూర్తిగా మర్చిపోయానని తెలిపారు. వర్క్ పరంగా కాజల్ ప్రస్తుతం ‘పారిస్ పారిస్’, ‘భారతీయుడు 2’, ‘ముంబయి సాగా’ సినిమాలతో బిజీగా ఉన్నారు. బాలీవుడ్‌లో మంచి విజయం అందుకున్న ‘క్వీన్’ సినిమాకు ‘పారిస్ పారిస్’ రీమేక్‌గా రాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకొంటోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2O4LUxX

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....