Saturday 31 July 2021

Windows 11 Beta Released: Here's How to Get It

Windows 11 has got its first beta for members of the Windows Insider Program. The new OS from Microsoft was announced last month after which the developer preview was released. Microsoft says this...

from NDTV Gadgets - Latest https://ift.tt/3ieCcru

రజనీకాంత్ సినిమాపై లేటెస్ట్ అప్‌డేట్.. వచ్చే నెలలో పూర్తి.. ఆ టైమ్‌కి రిలీజ్ పక్కా..

దక్షిణాది ఇండస్ట్రీల్లోనే కాదు.. ఆయన సినిమా విడుదల అవుతుందంటే.. యావత్ భారతదేశ సినీ ప్రేక్షకులు సంబరాలు చేసుకుంటారు. ఆయన సినిమా రిలీజ్ అంటే చాలు కొన్ని కార్యాలయాలు సెలవులు కూడా ప్రకటిస్తాయి. ఆయన క్రేజ్ దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిపోయింది. ఆయన సూపర్‌స్టార్ రజనీకాంత్. స్టైల్‌కి, హీరోయిజంకి కేరాఫ్ అడ్రస్ ఏదైనా ఉంది అంటే అది అనే ఆయన అభిమానులు చెబుతారు. అయితే రజనీ వెండితెరపై కనిపించి చాలాకాలమైంది. చివరిగా ‘దర్బార్’ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ప్రస్తుతం రజనీకాంత్ నటిస్తున్న చిత్రం ‘’. ‘సన్ పిక్చర్స్’ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత కళానిధి మారన్ నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతుంది. విశ్వాసం, వివేకం తదితర సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న శివకుమార్ జయకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా షూటింగ్ ప్రారంభం అయి చాలా కాలమే అయినప్పటికీ.. ఈ మధ్యలో కరోనా రావడం.. ఆ తర్వాత కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల రజనీ షూటింగ్‌లో పాల్గొనలేకపోవడం తదితర అంశాలు సినిమా విడుదలను వాయిదా వేస్తూ వచ్చాయి. అయితే ఇప్పుడు అన్ని సజావుగా జరుగుతుండటంతో.. సినిమా షూటింగ్‌ని శేరవేగంగా జరుపుతోంది చిత్ర యూనిట్. వచ్చే నెలాఖరు వరకూ సినిమా షూటింగ్‌ పూర్తి అయ్యే అవకాశం ఉంది. దీంతో ఈ ఏడాది దీపావళి కానుకగా ఈ సినిమాను విడుదల చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో రజనీకాంత్ ఓ ఊరి పెద్ద పాత్రలో నటిస్తుండగా.. హీరోయిన్లుగా మీనా, కుష్బూ, నయనతార నటిస్తున్నారు. ఓ ప్రత్యేక పాత్రలో కీర్తీ సురేష్ కనిపించనుంది. జాకీ షాఫ్ర్, ప్రకాష్ రాజ్, జగపతి బాబు, వేల రామ్మూర్తి తదితరులు ప్రధాన తారగణంగా ఉండనున్నారు. డి.ఇమ్మాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3C5G5H0

RRR దోస్తీ వచ్చేసింది: కీరవాణి మ్యాజిక్.. రాజమౌళి విజువల్ ట్రీట్.. ఎన్టీఆర్, రామ్ చరణ్ అలా!

దర్శకధీరుడు స్ట్రాటజీని అర్థం చేసుకోవడం అంత ఈజీ విషయం కాదు. ఆయన ఏది చేసినా కూడా పక్కా ప్రణాళికతో చేస్తుంటారు. జనాల్లోకి ఇట్టే రీచ్ అయ్యే విధంగా అప్‌డేట్స్ ఇస్తుంటారు. తాజాగా అలాంటి స్కెచ్చే వేసి స్నేహితుల దినోత్సవం కానుకగా 'RRR దోస్తీ' సాంగ్ రిలీజ్ చేశారు. నుంచి విడుదలైన ఈ ఫస్ట్ సాంగ్‌ క్షణాల్లో వైరల్ అయింది. యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతూ అత్యంత వేగంగా దూసుకుపోతోంది. అంటూ సాగే ఈ ప్రమోషనల్ సాంగ్ కోసం 5 భాషల నుంచి ఐదుగురు సింగర్లను రంగంలోకి దించారు జక్కన్న. ఆగస్ట్ ఒకటో తారీఖున ఈ సాంగ్ రిలీజ్ చేస్తున్నట్లు ముందే ప్రకటించి మెగా, నందమూరి అభిమానుల్లో జోష్ నింపారు. తాజాగా చెప్పిన సమయానికి ఈ సాంగ్ విడుదల చేసి అందరిలో సినిమాపై ఉన్న అంచనాలకు రెక్కలు కట్టారు. , అనిరుధ్, అమిత్ త్రివేది, విజయ్ జేసుదాస్, యాజిన్ నిజర్ పాడిన ఈ పాటలో కీరవాణి అందించిన బాణీలు స్పెషల్ అట్రాక్షన్ అయ్యాయి. సాంగ్ చివరలో మెగా స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నడుస్తూ వస్తున్నట్లు కనిపించిన సీన్.. సరికొత్త వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. కీరవాణి భుజంపై చేయి వేసిన ఈ ఇద్దరు స్టార్స్ ఫ్యాన్స్ విజిల్స్ వేసేలా స్టిల్స్ ఇచ్చారు. ప్రతి భాషలోని సినీ ప్రేక్షకుడికి ఈజీగా కనెక్ట్ అయ్యేలా ఈ సాంగ్ షూట్ చేశారు. ఇకపోతే ఇప్పటికే ఈ సాంగ్ గురించి స్పందించిన హేమచంద్ర.. ''సాంగ్ షూట్ అయితే వేరే లెవెల్. ప్రతీ పాట పాడేటప్పుడు ఒత్తిడి ఉంటుంది. ఇలాంటి భారీ ప్రాజెక్ట్‌లో పాడటం ఇంకా ఎక్కువ ప్రెజర్ ఉంటుంది. అంతే కాకుండా ప్రమోషన్ సాంగ్‌లో ఉండటం, అది వచ్చిన తీరు మైండ్ బ్లోయింగ్. ఇక సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాసిన లిరిక్స్ అద్భుతంగా ఉన్నాయి. ప్రతీ లైన్ సూపర్‌గా ఉంది. ఓవరాల్ ప్యాకేజ్ ఇది'' అని తెలిపిన సాంగ్‌పై క్యూరియాసిటీ పెంచారు. పాన్‌ ఇండియా మూవీగా రాజమౌళి రూపొందిస్తున్న ఈ సినిమాపై అన్ని వర్గాల ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌ చరణ్‌, కొమురం భీంగా ఎన్టీఆర్‌ కనిపించనుండటం మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. ఒలీవియా మోరిస్, ఆలియా భట్ హీరోయిన్లుగా నటిస్తుండగా అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రీయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అక్టోబర్ 13న గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3zWDJsd

Here's How You Can Stop Random People From Adding You to WhatsApp Groups

WhatsApp users can avoid being added to random groups by tweak their privacy settings. Follow the steps mentioned below to add a wall of protection and eliminate group spam.

from NDTV Gadgets - Latest https://ift.tt/3lhPNA9

Here's How to Schedule an Email in Gmail via Desktop Browser, App

Google added email scheduling to Gmail in April of 2019. It allows you to draft a mail and send it at your chosen time in the future. Email scheduling on Gmail is available on both the mobile app and...

from NDTV Gadgets - Latest https://ift.tt/3lhKfFP

హోటల్ రూములో నగ్నంగా వీడియోలు! బలవంతంగా యువ నటి చేష్టలు.. ఇండస్ట్రీలో మరో సంచలనం

ఓ వైపు శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా కేసు సినీ వర్గాల్లో సంచలనంగా మారగా, ఇప్పుడు అనూహ్యంగా మరో యువనటి పోర్న్ రాకెట్ కేసు తెరపైకి రావడంతో అంతా షాకవుతున్నారు. యువ నటి నందితా దత్తాపై ఓ మోడల్ సంచలన ఆరోపణలు చేసింది. తనను బలవంతం చేసి న్యూడ్ వీడియోలు షూట్ చేసిందని చెప్పడంతో పోలీసులు ఈ ఇష్యూపై కఠిన చర్యలు తీసుకున్నారు. నందితా దత్తాతో పాటు ఆమె అసిస్టెంట్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. నందితా దత్తా, ఆమె ఫొటోగ్రాఫర్ మైనిక్ ఘోష్ ఇద్దరూ కలిసి కొంతమంది మోడల్స్‌తో బలవంతంగా ఓ స్టూడియోలో న్యూడ్ వీడియోలు చేసి వాటిని పోర్నోగ్రఫీ వెబ్‌ సైట్స్‌లో అప్‌లోడ్ చేస్తున్నట్లు తెలియడంతో పోలీసులు అటాక్ చేశారు. న్యూడ్ ఫొటోషూట్ జరిగిన స్టూడియో ఓనర్ బలిగంజ్‌ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని.. న్యూటౌన్ పోలీస్ స్టేషన్‌కి తరలించారు. స్టూడియోలోని కెమెరా, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకొని పలు విషయాలపై లోతుగా విచారణ జరుపుతున్నారు. నందితా దత్తా, తనను బలిగంజ్ స్టూడియోకి తెచ్చి బలి చేసిందని సదరు మోడల్ ఆరోపించింది. తనతో న్యూడ్ వీడియో బలవంతంగా చేయించారని, వద్దని వారిస్తున్నా అస్సలు వినలేదని చెప్పింది. అంతేకాదు తన ఫ్రెండ్స్‌లో ఓ యువతికి వెబ్ సిరీస్ ఆఫర్ ఇప్పిస్తానని చెప్పి కోల్‌కతాలోని న్యూ టౌన్ హోటల్‌కి తీసుకెళ్లి అక్కడి హోటల్ రూములో ఆమెతో నగ్న వీడియోలు షూట్ చేయించిందని ఆమె ఆరోపించింది. దీంతో సినీ ఇండస్ట్రీలో పోర్న్ రాకెట్ వ్యవహారం సంచలనంగా మారింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3jbnD7u

Navarasa, The Kissing Booth 3, and More on Netflix India in August

Mani Ratnam's Navarasa, Joey King's The Kissing Booth 3, Jason Momoa's Sweet Girl, Comedy Premium League with Tanmay Bhat and Prajakta Koli, John David Washington's Beckett, Lin-Manuel...

from NDTV Gadgets - Latest https://ift.tt/3ljxOcK

తిమ్మరుసు కలెక్షన్స్: బాక్సాఫీస్ వద్ద సత్యదేవ్ పర్‌ఫార్‌మెన్స్.. వసూళ్ల పరంగా రిపోర్ట్ చూస్తే!

కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు మూతపడ్డ థియేటర్స్ మళ్ళీ తెరుచుకున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ శుక్రవారం కొత్త సినిమాల హవా కనిపించింది. కరోనా పాండెమిక్ తర్వాత ఆడియన్స్ ముందుకు వచ్చిన ఫస్ట్ మూవీగా '' నిలిచింది. ఈ సినిమాకు తొలి రోజు పాజిటివ్ టాక్ రావడంతో చెప్పుకోదగ్గ కలెక్షన్స్ వచ్చాయి. ఫస్ట్ షో స్లోగానే ఓపెన్ అయినా మౌత్ టాక్ బాగా రావడంతో తర్వాతి షోలు పుంజుకున్నాయి. సినిమాలో నటన, కథపై డైరెక్టర్ గ్రిప్పింగ్ ప్రేక్షకులను ఆకర్షించాయి. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ మార్క్ కనిపించిందని అంటున్నారు. ట్రేడ్ వర్గాలు చెబుతున్న లెక్కల ప్రకారం 'తిమ్మరుసు' మూవీ తొలి రోజుకు గాను 47 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా 27 లక్షల రూపాయల షేర్ వచ్చిందని రిపోర్ట్స్ చెబుతున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సత్యదేవ్ లాంటి హీరో సినిమాకు ఈ రేంజ్ కలెక్షన్స్ వచ్చాయంటే సినిమాకు మంచి ఆదరణే లభించిందని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఈ సినిమా బిజినెస్ లెక్క మొత్తం మీద 2.4 కోట్ల దాకా ఉండటంతో బ్రేక్ ఈవెన్ కావాలంటే 2.5 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది. ఫస్ట్ డే కలెక్షన్స్ తర్వాత చూస్తే మరో 2.30 కోట్ల రేంజ్‌లో షేర్ రాబడితే సేఫ్ అయినట్లు. అయితే ఫస్ట్ డే కన్నా సెకెండ్ డే ఓపెనింగ్స్ బెటర్‌గా ఉన్నాయని తెలుస్తుండటం సినిమాకు బాగా ప్లస్. ఇక మూడో రోజు ఆదివారం కూడా సెలవుదినం కావడంతో ఈ సినిమాకు బెటర్ కలెక్షన్స్ వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ 'తిమ్మరుసు' సినిమాను క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కించి ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. సత్యదేవ్, ప్రియాంక జవల్కర్ ప్రధాన పాత్రలు పోషించగా.. బ్రహ్మాజీ కీలక పాత్రలో కనిపించి అలరించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3liAzes

పవన్, మహేష్, ప్రభాస్ మధ్య వార్.. ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ షేక్ కావడం ఖాయమే! ఇవీ లెక్కలు

సినీ ఇండీస్ట్రీలో బిగ్గెస్ట్ సీజన్ అంటే సంక్రాంతి. ప్రతి ఏడాది సంక్రాంతికి ఎన్నో సినిమాలు విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంటాయి. సంక్రాంతికి తమ సినిమా రిలీజ్ చేస్తే భారీ హిట్ ఖాయం అని కొందరు దర్శకనిర్మాతలు సైతం నమ్మకం పెట్టుకుంటారు. చిన్న, పెద్ద హీరోల సినిమాలతో థియేటర్స్ వద్ద సంక్రాంతి శోభ కనిపిస్తుంటుంది. అయితే వచ్చే ఏడాది సంక్రాంతికి మాత్రం ఏకంగా ముగ్గురు బడా హీరోలు, అది కూడా భారీ ఫాలోయింగ్ ఉన్న స్టార్స్ రంగంలోకి దిగనుండటం జనాల్లో చర్చనీయాంశం అయింది. వరుస విజయాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్న సూపర్ స్టార్ ఈ సారి 'సర్కారు వారి పాట' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి బరిలో దింపారు డైరెక్టర్ పరశురామ్. జనవరి 13న మూవీ రిలీజ్ ఉంటుందని చెప్పేశారు. మరోవైపు యంగ్ రెబల్ స్టార్ భారీ సినిమా 'రాధే శ్యామ్' కూడా జనవరి 14న రంగంలోకి దిగుతోంది. ఈ సినిమా కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాసేలా వెయిట్ చేస్తున్నారు. అయితే వీళ్ళతో పోటీగా కూడా సంక్రాంతి బరిలో నిలవబోతున్నారని తెలుస్తుండటం హాట్ టాపిక్ అయింది. మలయాళీ సూపర్ హిట్ మూవీ 'అయ్యప్పనుమ్ కోషియమ్' సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ శరేవేగంగా సాగుతోంది. అయితే ఈ మూవీ రిలీజ్ విషయంలో మేకర్స్ ఓ అంచనాకు వచ్చేశారని సమాచారం. జనవరి 12వ తేదీన విడుదల చేయాలని ఫిక్సయ్యారనే టాక్ బలంగా వినిపిస్తోంది. దీంతో పవన్, మహేష్, ప్రభాస్ మధ్య పోటీ తప్పదని తెలుస్తోంది. మరోవైపు ఈ సంక్రాంతికి ముగ్గురు పెద్ద హీరోలు రంగంలోకి దిగుతుండటంతో ఇన్ని రోజులు వెలవెలబోయిన థియేటర్స్ ఇక కళ సంతరించుకుంటాయని అంతా ఆనందంగా ఉన్నారు. పవన్, మహేష్ఎం ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరికివారు ఈ పోటీలో తమ హీరో అంటే తమ హీరోదే విజయం అని నెట్టింట హంగామా చేస్తున్నారు. సో.. చూడాలి మరి ఏం జరుగుతుందనేది!.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3C3i57p

Mi 12 Tipped to Integrate Newly Announced LPDDR5X RAM

Mi 12, Xiaomi's upcoming flagship, may pack the newly announced LPDDR5X memory. The new RAM configuration offers maximum data transfer rate of 6,400Mbps to 8,533Mbps, double of what LPDDR4X can...

from NDTV Gadgets - Latest https://ift.tt/3BYdlAb

'Tesla Is Getting It Done': Elon Musk On Real World AI For Robotaxis

Tesla CEO Elon Musk, who has tweeted and spoken extensively about the latest self-driving technology developed and deployed by his electric car company, has reiterated and reassured that Tesla's...

from NDTV Gadgets - Latest https://ift.tt/3xcxUoN

దాన్ని చూసి కఠిన సత్యాలు తెలుసుకోండి.. సుమంత్ వివరణపై ఆర్జీవీ సెటైర్స్

ఈ మధ్య సినిమాలను ప్రమోట్ చేసుకునేందుకు వింత వింత దారులు తొక్కుతున్నారు. పెళ్లి,ఎంగేజ్మెంట్ అనే వాటిని అడ్డం పెట్టుకుని సినిమాలను జనాల్లోకి తీసుకెళ్తున్నారు. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది ఎందుకు వైరల్ అవుతుంది.. అది అలా ఎందకు అవుతోంది? అని ఆలోచనలు ఉండవు. అలా ఆ రూమర్ వైరస్‌లా వ్యాప్తి చెందుతూనే ఉంటుంది. మొన్న అంతా కూడా రెండో పెళ్లి గురించి వార్తలు వైరల్ అయ్యాయి. వెడ్డింగ్ కార్డ్ అంటూ ఒకటి చక్కర్లు కొట్టింది. అందులో వివాహానికి సంబంధించిన వివరాలేవీ లేకపోయినా కూడా సోషల్ మీడియా మొత్తం సుమంత్ రెండో పెళ్లి గురించి చర్చించుకుంది. అలా మొత్తానికి తన రెండో పెళ్లి అంటూ వస్తున్న రూమర్లపై క్లారిటీ ఇచ్చారు. అంతకు ముందే వర్మ ఈ సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. పెళ్లి అంటే పెద్ద పెంట.. నీకు ఇంకా బుద్ది రాలేదా? మళ్లీ పెళ్లి చేసుకుంటావా? అని సుమంత్‌ని చెడామడా తిట్టేశాడు. తాను రెండో పెళ్లి చేసుకోవడం లేదని, ఆ వెడ్డింగ్ కార్డ్ తన తదుపరి సినిమా కాన్సెప్ట్‌కు సంబంధించింది అని చెప్పుకొచ్చారు. పెళ్లి, విడాకుల మీద రాబోతోన్న సినిమా అని అసలు విషయం క్లారిటీగా చెప్పారు. మొత్తానికి వాళ్లే లీక్ చేసి ఇలా తమ సినిమాను జనాల్లో హాట్ టాపిక్ అయ్యేలా చేశారని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. అదెలా ఉన్నా గానీ సుమంత్ ఇచ్చిన వివరణతో కాస్త చల్లబడ్డట్టున్నారు. ఈ విషయం చెప్పినందుకు థ్యాంక్స్ సర్.. ఇదంతా సినిమా కోసమే అని చెప్పినందుకు ఆ దేవుడికి దయ్యానికి థ్యాంక్స్. మళ్లీ మొదలైందది అనే సినిమాను అందరూ చూడండి.. పెళ్లి గురించి కఠిన సత్యాలను తెలుసుకోండి.. పెళ్లి అనేది నరకంలో ప్రమాదవశాత్తు జరిగేదని తెలుసుకోండని వర్మ అన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3jnIXa3

Chiranjeevi : జీవితసత్యాలు ఎప్పటికీ మార్గదర్శకంగా.. అల్లు రామలింగయ్యపై చిరు కామెంట్స్

తెలుగు వారికి పేరును పరిచయం చేయనక్కర్లేదు. నాటి తరం నేటి తరం అని తేడా లేకుండా ప్రతీ ఒక్క తెలుగు వ్యక్తికి ఆయన పేరు తెలుస్తుంది. మరీ ముఖ్యంగా సినీ అభిమానులకు ఆయన ఎప్పుడూ ప్రత్యేకమే. ఆయన వేసిన పాత్రలు, తరతరాలను నవ్వించిన తీరు ఎప్పటికీ చిరస్మరణీయమే. ఎన్టీఆర్ ఏఎన్నార్ నుంచి.. దాదాపు మూడు నాలుగు జనరేషన్స్‌ అంటే సునీల్ వంటి వారితోనూ కలిసి కామెడీని పండించారు. చివరగా కళ్యాణ రాముడు చిత్రంలోనూ అందరినీ నవ్వించేశారు. అల్లు రామలింగయ్య 2004లో జూలై 31న తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఇక నేడు ఆయన వర్దంతి. ఈ క్రమంలో అల్లు, మెగా ఫ్యామిలీలే కాకుండా ఇతర సెలెబ్రిటీలు సైతం ఆ మహనీయుడిని తలుచుకుంటున్నారు. ఈ క్రమంలో మెగా స్టార్ వేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ‘శ్రీ అల్లు రామలింగయ్య గారు భౌతికంగా మనమధ్య లేకపోయినా ఆయన నేర్పిన జీవితసత్యాలు ఎప్పటికీ మార్గదర్శకంగా వుంటాయి.ఒక డాక్టర్ గా,యాక్టర్ గా, ఫిలాసఫర్ గా,ఓ అద్భుతమైన మనిషిగా,నాకు మావయ్య గా ఆయన ఎల్లప్పుడూ మా స్మృతుల్లో ఉంటారు.ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన జ్ఞాపకాలు మరోసారి నెమరువేసుకుంటూ’ అని చెప్పుకొచ్చారు. ఇక మరో వైపు బండ్ల గణేష్ కూడా అల్లు రామలింగయ్య వర్దంతి గురించి పోస్ట్ చేశారు. అల్లు వారి ముద్రను ఇండస్ట్రీపై బలంగా వేయాలని అరవింద్, బన్నీ బాగానే కష్టపడుతున్న సంగతి తెలిసిందే. అందుకే అల్లు స్టూడియోను కూడా ప్రారంభించేశారు. గత ఏడాది అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా స్టూడియో పనులను ప్రారంభించిన సంగతి తెలిసిందే.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3fg1Een

Balamevvadu Title Song : ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.. సుహాసిని

సినిమాకు ఎన్నో బలాలున్నాయి. ఓ వైపు మెలోడి బ్రహ్మా మణిశర్మ సంగీతం.. మరో వైపు కీరవాణి గాత్రం ఇంకో వైపు నటనలో వంకపెట్టలేనటు వంటి సీనియర్ నటి సుహాసిని. ఇలా బలమెవ్వడు సినిమా ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఆ మధ్య వదిలిన కాన్సెప్ట్ పోస్టర్ నెట్టింట్లో ఎంతగా హల్చల్ చేసిందో అందరికీ తెలిసిందే. కరోనా, మెడికల్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కించినట్టు కనిపిస్తోన్న ఈ మూవీ కాన్సెప్ట్ పోస్టర్‌లో తళుక్కున మెరిశారు. తెలుగు, తమిళ చిత్రాల్లో తన అద్భుత నటనతో ప్రేక్షకుల హృదయంలో స్థానం సంపాదించుకున్న సుహసినీ.. చాలా గ్యాప్ తరువాత టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. "బలమెవ్వడు" సినిమాలో డాక్టర్ యశోద పాత్రలో నటిస్తున్నారు సుహసినీ. మెడికల్ మాఫియాకు వ్యతిరేకంగా పోరాడే నిజాయితీ గల వైద్యురాలి పాత్రలో సుహసినీ నటన అద్బుతంగా ఉండబోతోన్నట్టు కనిపిస్తోంది. అయితే ఇప్పుడు ఈ మూవీ నుంచి టైటిల్ సాంగ్‌ను వదిలారు. దీనికి మణిశర్మ సంగీతం అందించగా.. కీరవాణి పాడారు. కళ్యాణ్ చక్రవర్తి అద్భుతంగా ఈ పాటను రాశారు. ధృవన్ కటకం, నియా త్రిపాఠీ జంటగా నటిస్తున్న "బలమెవ్వడు" సినిమా వైద్యరంగంలోని దోపిడీని ప్రశ్నించబోతోంది. ఈ చిత్రానికి సత్య రాచకొండ దర్శకత్వం వహిస్తున్నారు. సనాతన దృశ్యాలు సమర్పణలో ఆర్ బి మార్కండేయులు "బలమెవ్వడు" చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన "బలమెవ్వడు" కాన్సెప్ట్ టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. నిజ జీవిత ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3icl1a7

'I was scared the most'

'You don't go on Khatron Ke Khiladi to overcome your fears, you go there to experience your fears and what those fears do to you.'

from rediff Top Interviews https://ift.tt/3j9JOuv

Friday 30 July 2021

Pokemon on Pebble? Pebblemon Brings a Clone of the Game to Your Smartwatch

Pokemon, the iconic game series from Nintendo, debuted in Japan nearly two-and-a-half decades ago. It took the game only a few years to taste immense popularity in not just the US but in several other...

from NDTV Gadgets - Latest https://ift.tt/3xf9LOu

Cryptocurrency Jargons Explained - All the Terms You Need to Know

Whether you're interested in buying cryptocurrency now or later, knowing the lingo is a good first step. We explain some of the more common terms you might hear, like whales, gas, and fiat.

from NDTV Gadgets - Latest https://ift.tt/37q2eSF

WhatsApp Faces Proceedings in Russia Over Violation of Personal Data Law

Russia launched administrative proceedings against Facebook's WhatsApp for what it said was a failure to localise data of Russian users on Russian territory.

from NDTV Gadgets - Latest https://ift.tt/3rJVkRf

Crypto Mining Operation Uncovered at Polish Police Headquarters: Report

Polish police said they had uncovered a Bitcoin mining operation in their own headquarters in Warsaw.

from NDTV Gadgets - Latest https://ift.tt/3j9hj06

Amazon Fined Record EUR 746 Million in Luxembourg Over Data Privacy

Amazon was fined EUR 746 million (roughly Rs. 6,585 crores) by Luxembourg authorities over allegations it flouted the EU's data protection rules, the online retail giant said.

from NDTV Gadgets - Latest https://ift.tt/3faQWpx

Google Request for Microsoft Documents Is Relevant, US Judge Says

A US federal judge asked Microsoft to let him know how big of a burden it would be for the company to provide documents requested by long-time rival Google, in an antitrust lawsuit.

from NDTV Gadgets - Latest https://ift.tt/3fePvqb

Blue Origin Protest Over NASA Lunar Contract Rejected by US Watchdog

A US government watchdog sided with NASA over its decision to pick a single lunar lander provider, rejecting a protest filed by Blue Origin and defence contractor Dynetics.

from NDTV Gadgets - Latest https://ift.tt/3ygP7yQ

Twitter to Offer 'Bounty' to Find Algorithmic Bias

Twitter said it would offer a cash "bounty" to users and researchers to help root out algorithmic bias on the social media platform.

from NDTV Gadgets - Latest https://ift.tt/3C1O7kg

Elon Musk Says 'Epic Is Right,' Takes Sides in Battle With Apple

Tesla CEO Elon Musk showed his support for Fortnite maker Epic Games that has challenged Apple's fees on its App Store. "Apple app store fees are a de facto global tax on the Internet," Musk said.

from NDTV Gadgets - Latest https://ift.tt/3ltuRqj

Kaatuka Kanule రేర్ ఫీట్.. ఇది సమష్టి విజయం

హీరోగా అపర్ణా బాలమురళీ అనే అమ్మాయిని హీరోయిన్‌గా పరిచయం చేస్తూ సుధా కొంగర తెరకెక్కించిన చిత్రం (తమిళంలో సూరారై పొట్రూ). ఎన్నో ఏళ్లుగా సరైన విజయం కోసం ఎదురుచూసిన సూర్యకు ఆకాశం నీ హద్దురా ఊపిరినిచ్చింది. అందరి మన్నళలు అందుకోవడమే కాకుండా ఆస్కార్ బరిలో నిలిచింది. ఇక సూర్య నటనను దేశం మొత్తం మరోసారి చూసింది. అలా ఓటీటీలో గత ఏడాది విడుదలైన ఈ చిత్రం ఇప్పటికీ ఏదో ఒక రకంగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని హిందీలోనూ రీమేక్ చేస్తున్నారు. అసలు ఈ సినిమా అంతలా ఆదరణకు నోచుకోవడానికి బోలెడన్నీ కారణాలున్నాయి. అందులో సంగీతం కూడా ఒకటి. ఆ పాటలన్నీ కూడా సంగీత ప్రియుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. వాటిని తెరకెక్కించిన విధానం కూడా అంతే ముచ్చటగా ఉంటుంది. మరీ ముఖ్యంగా అంటూ హీరోయిన్ పాడే పాట, చేసే అల్లరి అందరినీ ఫిదా చేసేసింది. ఆ పాటకు ఇప్పుడు యూట్యూబ్‌లో రేర్ ఫీట్ దక్కింది. వీడియో సాంగ్‌కు వంద మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఈ పాటను ఇంత అద్భుతంగా రాసిన భాస్కర భట్ల, పాడిన తమిళ సింగర్ ఢీ, సంగీతమందించిన జీవీ ప్రకాశ్, కొరియోగ్రఫీ చేసిన శోభీ, శేఖర్ మాస్టర్ ఇలా అందరూ కలిసి సమష్టిగా కృషి చేయడంతోనే ఆ పాట అందరినీ ఇంతలా ఆకట్టుకోగలిగింది. ఓ సందర్భంలో మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పాటల రచయిత భాస్కర్ భట్ల ఈ పాట రాసిన సందర్భాన్ని, అందులోని పదాల వాడుక గురించి ఎంతో గొప్పగా చెప్పారు. ఆ పాటకు సంబంధించి భాస్కర భట్ల చెప్పిన విశేషాలు కింద లింకులో చదవొచ్చు. Also Read


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3lgGgJW

From F9 to The Suicide Squad, What to Watch in August

F9, The Suicide Squad, Bhuj: The Pride of India, Shershaah, Navarasa, The Conjuring 3, Brooklyn Nine-Nine season 8, The Empire, Cruella, Marvel's What If...?, Nine Perfect Strangers - the biggest...

from NDTV Gadgets - Latest https://ift.tt/3yhpyxt

RC 15 : రామ్ చరణ్‌కు జోడి దొరికేసింది.. శంకర్‌తో కియారా మాటామంతీ!

రామ్ చరణ్ దిల్ రాజు ప్రాజెక్ట్ గురించి సోషల్ మీడియాలో జరిగే చర్చల గురించి అందరికీ తెలిసిందే. ఈ భారీ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసిన క్షణం నుంచి ఏదో ఒక టాపిక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇన్ని రోజులుగా ఉన్న సస్పెన్స్‌కు ఇప్పుడు తెర దించారు. పక్కన కియారా అద్వాణీ మరోసారి జోడి కట్టబోతోందని చెప్పేశారు. తమ 50వ చిత్రంలో కియారా అద్వాణీ హీరోయిన్ అని దిల్ రాజు ప్రకటించేశారు. మొత్తానికి ఇన్నాళ్ల రూమర్లకు శంకర్ ఓ క్లారిటీ ఇచ్చారు. రామ్ చరణ్ పక్కన బాలీవుడ్ బ్యూటీని దించుతారని ఇది వరకు రూమర్లు వచ్చాయి. అందులో ముఖ్యంగా కియారా అద్వాణీ పేరే ఎక్కువగా వినిపించింది. ఆల్రెడీ ఈ జోడి వినయ విదేయ రామతో అలరించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రం ఫ్లాప్ అయినా కూడా ఈ జోడికి మంచి మార్కులే పడ్డాయి. అంతేకాకుండా మార్కెట్ పరంగానూ ఆలోచించి కియారాను తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కియారాకు బాలీవుడ్‌లో ఫుల్ డిమాండ్ ఉంది. ఇక దక్షిణాదిలోనూ కియారాకు విపరీతమైన క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. అందుకే దిల్ రాజు శంకర్ ఇలా కియారాను తీసుకొచ్చినట్టు టాక్. నేడు (జూలై 31) కియారా బర్త్ డే సందర్భంగా ఈ అప్డేట్‌ను ఇచ్చారు. ఇక ఇప్పటికే శంకర్‌తో కియారా మాటామంతీ జరిపినట్టు.. స్క్రిప్ట్ గురించి చర్చించినట్టు కనిపిస్తోంది. దర్శకుడు హీరోయిన్ ఇద్దరూ కూడా వైట్ డ్రెస్సులో మెరిసిపోతోన్నారు. ఇద్దరూ కూర్చుని సినిమా గురించి బాగానే చర్చిస్తోన్నట్టు కనిపిస్తోంది. సీన్ల గురించి ఇప్పుడే శంకర్ తన హీరోయిన్‌కు బాగా వివరించి చెబుతున్నట్టున్నారు. ఈ మేరకు మరో ఫోటో బయటకు వచ్చింది. ఇందులో శంకర్‌ను కియారా తీక్షణంగా గమనిస్తున్నారు. మొత్తానికి రామ్ చరణ్ శంకర్ ప్రాజెక్ట్ మరో సారి ట్రెండ్ అవుతోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3zUrrkd

ఇంట్లో ఒక్కదాన్నే ఉంటున్నా.. ఇక నాకు అదే పని : రష్మిక మందన్నా

సోషల్ మీడియాలో చేసే అల్లరికి అభిమానులు ఫిదా అవుతుంటారు. ఇక అమె షేర్ చేసే ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంటాయి. ఈ మధ్య ఆమె ఒక పని చేస్తున్నారు. నిత్యం తానేమీ చేశానో అభిమానులకు క్లియర్‌ కట్‌గా చెబుతున్నారు. ఓ రకంగా తన డైరీని సోషల్ మీడియాలో పెడుతున్నారు. పొద్దున లేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే వరకు ఏమేం చేస్తుంటారో అలా చెప్పుకుంటూ వెళ్తారు. అయితే అందులో ఎక్కువగా తన పెట్ ఆరా గురించి ఉంటుంది. తాజాగా రష్మిక పోస్ట్ చేసిన తన డైరీలోనూ అదే ఉంది. ప్రస్తుతం రష్మిక పలు సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు. బాలీవుడ్, టాలీవుడ్ అంటూ అటూ ఇటూ తిరుగుతున్నారు. ఒక రోజు ముంబైలోఉంటే మరో రోజు హైద్రాబాద్‌లో ఉంటున్నారు. అలా తెలుగులో , ఆడాళ్లు మీకు జోహార్లు అనే సినిమాతో బిజీగా ఉన్నారు. బాలీవుడ్‌లో మరో రెండు ప్రాజెక్ట్‌లు సెట్స్ మీదున్నాయి. మొత్తానికి అంత బిజీగా ఉన్న రష్మిక ఇప్పుడు కాస్త రెస్ట్ తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. తాజాగా తాను షూటింగ్‌లు ఏం లేక ఇంట్లోనే ఒంటరిగా ఉంటున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు తన డైరీలో చెప్పుకొచ్చిన విశేషాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. జూలై 29వ తారీఖున తానేం చేసిందో రష్మిక చెప్పుకొచ్చారు. పొద్దున్నే లేచాను.. తిన్నాను.. టీవీ చూశాను.. మళ్లీ తిన్నాను.. ఆరాతో ఆడుకున్నాను.. మళ్లీ తిన్నాను.. పడుకున్నాను. ప్రతీ రోజూలానే ఈ రోజు కూడా చేసేశాను. నవ్వుకోవడానికి నాకు నేను చాలు. అయితే ఇంట్లో నేను ఒక్క దాన్నే ఉంటున్నా కూడా నా హెయిర్ బ్యాండ్ మిస్ అవుతూనే ఉంది. ప్రపంచంలో అందరూ ఇలానే ఉంటారా? అని ఆశ్చర్యపోతుంటాను. ఈ ఏడాదిలో నేను బాధపడుతున్న విషయం అదే.. ఎప్పుడూ అది ఎక్కడ మిస్ అయిందా? అని ఇళ్లంతా చూస్తుంటాను. కానీ అది ఆరా పని అనుకుంటున్నాను’ అని రష్మిక చెప్పుకొచ్చారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/37fLtsU

ఇది మరీ అరాచకం.. లోపల ధరించేవాటిపై శ్రుతీ హాసన్ ఫోటోలు.. ప్రియుడి వెక్కిరింతలు!

చర్యలు ఈ మధ్య శ్రుతి మించిపోతోన్నాయి. పబ్లిక్‌గా ప్రియుడి మీద పడిపోవడం, ముద్దులు పెట్టేయడం, ఇక ఇంట్లో అయితే ఆ ఆరాచకం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. రోజూ ఏదో ఒకటి చేస్తూ ట్రెండింగ్‌లో ఉంటున్నారు. ఈ ఇద్దరూ ప్రస్తుతం ముంబైలో ఎంజాయ్ చేస్తున్నారు. శ్రుతీ హాసన్ తన పనిలో తాను బిజీగా ఉంటే.. తన ఆర్ట్ గీసుకునే పనిలో తాను బిజీగా ఉంటున్నారు. ఇక ఈ జంట చేసే చిలిపి పనులకు నెటిజన్లు షాక్ అవుతున్నారు. తాజాగా శ్రుతీ హాసన్ చేసిన పనికి ప్రియుడు సైతం నవ్వుకున్నారు. మొన్నటికి మొన్న ముంబైలోని ఓ సూపర్ మార్కెట్‌లో ఈ జంట హల్చల్ చేసింది. ప్రియుడి మీద కాలు ఎత్తి మరీ.. అతడిని ముద్దుల్లో ముంచెత్తింది. ఇక రెండ్రోజుల క్రితం తమ ఇంట్లోనే శ్రుతీ హాసన్ పిచ్చి పిచ్చిగా ఎగిరారు. ఆమెతో పాటుగా శంతను కూడా కాలు కదిపాడు. అకస్మాత్తుగా శ్రుతీ హాసన్ ఎగిరి వచ్చి ఆయన మీద పడింది. దీంతో శంతను ఒక్కసారిగా షాక్ అయ్యారు. అలా ఆ వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. ఇక శంతను గోడ మీద ఆర్ట్ వేసుకుని ప్రాక్టీస్ చేసుకోకుండా.. శ్రుతీ హాసన్ శరీరాన్ని వాడేసుకున్నారు. ఆమె నడుము భాగం మీద తన ప్రతిభను చూపించారు. నడుము చుట్టూ కూడా శంతను ఆర్ట్ వేసేశారు. థగ్ లైఫ్ అంటూ రాసేశారు. ఇక ఇప్పుడు శ్రుతీ హాసన్ మరో లెవెల్‌కు చేరుకున్నారు. తన మీద తనకు ఎంత ప్రేమ ఉందో చూపించేందుకు శ్రుతీ హాసన్ ఈ పని చేసినట్టున్నారు. కాళ్లకు ధరించే సాక్స్ మీద శ్రుతీ హాసన్ తన ఫోటోలను ప్రింట్ చేయించుకున్నారు. ఇదేంటి? ఇలా కూడా చేస్తారా? అని శంతను నవ్వేశారు. అవును నాకు నేనంటే ఇష్టం అందుకే ఇలా చేశాను అంటూ వాటిని కాళ్లకు ధరించుకున్నారు. మొత్తానికి శ్రుతీ హాసన్ మాత్రం ఓ రేంజ్‌లో హల్చల్ చేస్తున్నారు. ఆమె ఇప్పుడు ప్రభాస్ పక్కన సలార్ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3zTgT4H

ఆన్ లైన్ క్లాసుల మహిమ.. అల్లు అర్హ ఎంత బుద్దిగా వింటోంది?

ప్రస్తుత పరిస్థితుల్లో చదువులు ఎలా కొనసాగుతున్నాయో అందరికీ తెలిసిందే. గత ఏడాది నుంచి అంతా ఆన్ లైన్ చదువులే అయిపోయాయి. మధ్యలో బడులు తెరిచినా కూడా కరోనా దెబ్బకు మూసేయాల్సి వచ్చింది. అలా ప్రతీ సారి ప్రభుత్వాలకు ఎదురుదెబ్బే తగులుతోంది. ఇక ఇప్పుడు అందరూ కూడా ఆన్ లైన్ బాటే పడుతున్నారు. పిల్లలందరూ ఇంట్లోనే క్లాసులు వింటున్నారు. జూమ్ మీటింగ్ అంటూ అటెండ్ అవుతున్నారు. మొత్తానికి చదువులన్నీ కూడా ఫోన్లు, ల్యాప్ టాప్‌ల్లోకి ఎక్కేశాయి. ఇంట్లో ఉంటే పిల్లలు క్లాసులు ఎలా వింటారో అందరికీ తెలిసిందే. ఎవ్వరూ కూడా మనసు పెట్టి క్లాసులు వినరు. కానీ అల్లు పిల్లలు మాత్రం ఎంతో బుద్దిగా వింటున్నట్టు కనిపిస్తోంది. ఇప్పుడు ఆన్ లైన్‌లో క్లాసుల్లో బిజీగా ఉంది. తాజాగా ఓ వీడియోను తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేశారు. ఇందులో అల్లు అర్హ ఎంతో బుద్దిగా కూర్చుని ఆన్ లైన్ క్లాసులు వింటోంది. అందులో తన తోటీ వారంతా జూమ్ మీటింగ్‌లో ఉన్నట్టు కనిపిస్తోంది. అందరూ విఘ్నేశ్వరుని శ్లోకంతో ప్రారంభించినట్టున్నారు. వారిని వంత పాడుతూ ఆ శ్లోకాన్ని అల్లు అర్హ కూడా చెప్పేస్తోంది. మొత్తానికి అర్హ మాత్రం అల్లరి పిల్ల మాత్రమే కాదు.. ఎంతో వినయం, విధేయతలున్న చిచ్చర పిడుగు అని తెలుస్తోంది. ఇక అర్హ ఇప్పుడు సినీ ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. సమంత, గుణ శేఖర్ కాంబినేషన్‌లో వస్తోన్న శాకుంతల సినిమాలో అర్హ నటిస్తున్నారు. అలా మొత్తానికి అల్లు వారి నాల్గో తరం కూడా వెండితెరపై వెలిగేందుకు రెడీ అవుతోంది. శాకుంతలం సినిమాలో భరతుడి పాత్రలో అర్హ నటిస్తున్నారు. మొదటి రోజు షాట్‌లోనే అర్హ అదరగొట్టేసిందని సమంత చెప్పుకొచ్చారు. అర్హకు అదిరిపోయే డైలాగులున్నాయని కూడా తెలిపారు. డైలాగ్ విషయంలో, యాక్టింగ్ విషయంలో సాయం చేయాలని సమంతను అల్లు స్నేహారెడ్డి కోరారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2UYvVaN

RRR డేరింగ్ స్టెప్... క్లిష్ట పరిస్థితుల్లోనూ అలాంటి నిర్ణయం.. హీరోలిద్దరికీ రిస్కే!

ప్రస్తుతం ప్రపంచంలో ఎలాంటి పరిస్థితులున్నాయో అందరికీ తెలిసిందే. ఇంకా కరోనా మహమ్మారి మానవాళిని వెంటాడుతూనేఉంది. థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉంది. ఇలాంటి సమయంలో ఇక్కడ షూటింగ్‌లు చేసుకోవడం కూడా కష్టమే. కానీ అన్ని జాగ్రత్తలు పాటిస్తూ సినిమాను పూర్తి చేస్తున్నారు మేకర్స్. ఇలాంటి సమయంలో సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. హీరోలిద్దరి సీన్లను తెరకెక్కించేందుకు టీం మొత్తానికి ఉక్రెయిన్‌కు తరలించారట. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్ర బృందం చివరి షెడ్యూల్‌ షూటింగ్‌ కోసం ఉక్రెయిన్‌కు పయనమైందని సమాచారం. కరోనా సెకెండ్‌ వేవ్‌ తర్వాత హైదరాబాద్‌లో షెడ్యూల్‌ ప్రారంభించిన రాజమౌళి అండ్‌ కో ఇటీవల ఈ షూటింగ్‌ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దోస్తీ పేరిటి మొదటి సాంగ్‌తో రచ్చ చేసేందుకు టీం మొత్తం రెడీ అయింది. ఐదు భాషలు.. ఐదుగురు సింగర్లతో కీరవాణి మ్యాజిక్ చేయబోతోన్నారు. ఒక వైపు రాజమౌళి తన హీరోలను విదేశాలకు పట్టుకెళ్తున్నారు. మొన్నటి హైద్రాబాద్ షెడ్యూల్‌లో హీరోలిద్దరిపై కీలక సన్నివేశాలను రామ్‌చరణ్‌పై ఓ పాటను చిత్రీకరించారు. ఆగస్ట్‌ ఒకటో తేదీ నుంచి ఉక్రెయిన్‌లో చివరి షెడ్యూల్‌ ప్రారంభిస్తారని తెలిసింది. ఇప్పటికే చిత్ర బృందం ఉక్రెయిన్‌కి బయలుదేరిందని తెలిసింది. ఒకటో తేదిన ప్రధాన తారాగణం, దర్శకుడు అక్కడికి చేరుకుని రెండో తేదిన షూటింగ్‌ మొదలుపెడతారని సమాచారం. ఆగస్ట్‌ రెండోవారం వరకూ చిత్రీకరణ జరుగుతుందని తెలుస్తోంది. ఈ కరోనా పరిస్థితుల్లో అక్కడకి వెళ్లడం నిజంగానే రాజమౌళి సాహసం. ఈ చిత్రాన్ని అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారనే విషయం తెలిసిందే.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3rLVckw

Narappa Success meet : ధనుష్‌పై ప్రశంసలు.. దటీజ్ వెంకీ

విక్టరీ ఎప్పుడూ కూడా తన సినిమాల గురించి గొప్పలు చెప్పుకోరు. తన నటన, తన సినిమాల ఫలితం గురించి అంతగా చెప్పుకోరు. అయితే తన సినిమా సక్సెస్ ఫంక్షన్‌లో కూడా దాని ఒరిజినల్ సినిమా గురించి మాట్లాడుతూ అక్కడి దర్శకుడు, హీరోల గురించి కామెంట్ చేశారు. ఈ క్రమంలో దటీజ్ వెంకీ అని అభిమానులు ఆయన మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. నిన్న జరిగిన ఈ సక్సెస్ మీట్‌లో వెంకటేష్ మాట్లాడిన మాటలు తెగ వైరల్ అవుతున్నాయి. థియేటర్లలో చూడాల్సిన ‘నారప్ప’ ఓటీటీలో వచ్చినందుకు ప్రేక్షకులకు బాధగా అనిపించినా.. మా పరిస్థితిని అర్థం చేసుకుని గొప్పగా ఆదరిస్తున్నారు. ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను అని వెంకటేష్‌ ఎమోషనల్ అయ్యారు. సినిమాను ఇంత బాగా ఆదరిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. 25ఏళ్ల కెరీర్‌లో ఎన్నో ఛాలెంజింగ్‌ పాత్రలు చేశాను. కానీ, ఈ సినిమా, ఇందులో నా పాత్ర చాలా విభిన్నమైనది. నటుడిగా నాకెంతో సవాల్‌గా నిలిచింది. ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు వెట్రిమారన్‌, ధనుష్‌లకు థ్యాంక్స్‌. వాళ్లు ‘అసురన్‌’ చేయకపోతే.. ఈరోజు ఈ ‘నారప్ప’ లేదు. కచ్చితంగా ప్రేక్షకులందరికీ థియేటర్లో మరో మంచి సినిమా చూపిస్తానని మనస్ఫూర్తిగా చెప్తున్నా. సంక్రాంతికి ‘ఎఫ్‌3’ సినిమాతో తప్పకుండా వినోదాలు అందిస్తానని అన్నారు. అంటే ఈ లెక్కన దృశ్యం 2 చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయబోతోన్నామని పరోక్షంగా చెప్పినట్టైంది. ఈ సక్సెస్ మీట్‌లో అనిల్‌ రావిపూడి, ప్రియమణి, కార్తిక్‌ రత్నం, రాఖీ, అనంత శ్రీరామ్‌, గాంధీ తదితరులు పాల్గొన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/37bkGyg

సేవ్ సినిమా.. రివ్యూ రైటర్స్‌కి బ్రహ్మాజీ అభ్యర్థన! అలా చేయండంటూ నేరుగా చెప్పిన యాక్టర్

సినిమా అనే రంగుల ప్రపంచంలో ప్రతి ఒక్కరి పాత్ర కీలకమే. నిర్మాత, దర్శకుడు మొదలుకొని చిత్ర నిర్మాణంలో భాగమయ్యే నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరిపై ఒక్కో బాధ్యత ఉంటుంది. ఎవరికి వారు వారి వారి పనులకు న్యాయం చేస్తేనే అనుకున్న అవుట్‌పుట్ బయటకొస్తుంది. ఇక ఆ సినిమా రిలీజ్ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది? ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారనే దానిపై చిత్ర విజయం ఆధారపడి ఉంటుంది. అయితే ఈ ప్రక్రియలో రివ్యూ రైటర్స్‌ది కీలక పాత్ర అని చెప్పుకోవచ్చు. మూవీ రిలీజ్ అయ్యాక రివ్యూ రైటర్స్ సగటు ప్రేక్షకుడిని దృష్టిలో పెట్టుకొని సినిమాపై వారి వారి ఒపీనియన్స్ బయటపెడుతుంటారు. హీరో హీరోయిన్ల నటనతో పాటు దర్శకుడి ప్రతిభ, నిర్మాణ విలువలు, సాంకేతిక నిపుణుల పనితీరుపై ఓ వివరణ ఇస్తుంటారు. ఇవన్నీ కూడా సినిమా హిట్ కావడం, కాకపోవడంపై ఎంతోకొంత ప్రభావం చూపుతుంటాయి. అయితే తాజా పరిస్థితుల నడుమ సీనియర్ నటుడు రివ్యూ రైటర్స్‌కి బ్రహ్మాజీ ఓ అభ్యర్థన పెట్టడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ''ఈ గడ్డు కాలంలో ఓ రెండు మంచి మాటలు రాసి జనాలను థియేటర్‌కి రప్పించండి. లేకపోతే రివ్యూ రాయడానికి సినిమాలు ఉండవు.. సినిమా చూడడానికి థియేటర్స్ ఉండవు.. సేవ్ సినిమా సేవ్ థియేటర్స్. థాంక్యూ'' అని పేర్కొంటూ తన సోషల్ మీడియా ఖాతాలో ట్వీట్ చేశారు బ్రహ్మాజీ. ఆయన చేసిన ఈ పోస్ట్‌పై నెటిజన్స్ మిశ్రమంగా స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ రోజే విడుదలైన 'తిమ్మరుసు' సినిమాలో కీలక పాత్ర పోహ్సించారు బ్రహ్మాజీ. ఆయన చేసిన కామెడీ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ అయిందని తెలుస్తోంది. ఈ మేరకు 'తిమ్మరుసు'పై ఇప్పటివరకు వచ్చిన ట్విట్టర్ రెస్పాన్స్ పోస్ట్ చేస్తూ సినిమాపై హైప్ తీసుకొస్తున్నారు బ్రహ్మాజీ.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3j22E6U

Thursday 29 July 2021

Samsung Galaxy A03s Expected to Launch in India Soon

Samsung Galaxy A03s could launch in India soon as its support page on the Samsung India website has gone live. The support page has listed the smartphone with the model number SM-A037F/DS and suggests...

from NDTV Gadgets - Latest https://ift.tt/3BWZ8TZ

Major Ethereum Upgrade Set to Alter Supply, Fix Transaction Fees

Ethereum, the second largest blockchain network, is about to undergo a technical adjustment that will significantly alter the way transactions are processed, as well as reduce the supply of the ether...

from NDTV Gadgets - Latest https://ift.tt/3lcr6oY

Marvel Unveils Release Date, First Look for Disney+ Series Hawkeye

Hawkeye premieres November 24 on Disney+ and Disney+ Hotstar. First look at new Marvel series features Jeremy Renner and Hailee Steinfeld. It's unclear how this affects Ms. Marvel that's also...

from NDTV Gadgets - Latest https://ift.tt/378fomT

Motorola Edge 20 Series With 108-Megapixel Cameras Launched

Motorola Edge 20, Motorola Edge 20 Lite, and Motorola Edge 20 Pro have been unveiled as successors to the Motorola Edge series from April last year. Motorola Edge 20 is one of the slimmest 5G phones...

from NDTV Gadgets - Latest https://ift.tt/3j7fsJl

Microsoft Said to Be in Talks to Tap Into Oyo Before Its Potential IPO

Microsoft is in advanced talks to invest in Indian hotel chain Oyo at a $9-billion (roughly Rs. 66,850 crores) valuation, a source familiar with the matter said.

from NDTV Gadgets - Latest https://ift.tt/3ldnAuy

Realme 8s Specifications Surface in Detail Ahead of Official Announcement

Realme 8s specifications have been leaked on the Web. Some renders suggesting the design of the new Realme phone have also appeared. The Realme 8s is said to launch in India soon alongside the Realme...

from NDTV Gadgets - Latest https://ift.tt/3xekIQq

Huawei Watch GT 2 Pro ECG, Band 6 Pro Wearables With SpO2 Tracking Launched

Huawei Watch GT 2 Pro ECG smartwatch and Huawei Band 6 Pro fitness band have launched in the Chinese market. The two wearables are 5ATM water-resistant and offer a minimum of 96 sports modes. Both...

from NDTV Gadgets - Latest https://ift.tt/3xd5UBw

Scarlett Johansson Sues Disney Over Black Widow Streaming Release

Disney is being sued by Scarlett Johansson over its decision to release superhero movie Black Widow on streaming at the same time as in theatres, alleging a breach of contract which cost the star...

from NDTV Gadgets - Latest https://ift.tt/3fdBs41

LinkedIn Allows Employees to Opt for Full-Time Remote Work

LinkedIn will allow employees to opt for full-time remote work or a hybrid option as offices gradually reopen, Chief People Officer Teuila Hanson said.

from NDTV Gadgets - Latest https://ift.tt/3j2xH2t

Jungle Cruise Disney+ Hotstar Release Date Revealed

Jungle Cruise to release November 12 on Disney+ Hotstar in India. No word on a theatrical release date in India. Jungle Cruise is out now on Disney+ Premier Access.

from NDTV Gadgets - Latest https://ift.tt/3BRRvyl

Sridevi Soda Centre Teaser: సోడాల శ్రీదేవి ఇక్కడ.. పగిలిపోద్ది! సుధీర్ బాబుకు పంచ్ ఇచ్చిన హీరోయిన్.. వీడియో వైరల్

యంగ్ హీరో హీరోగా రాబోతున్న కొత్త సినిమా ''. ఈ సినిమాలో సుధీర్ బాబు క్యారెక్టర్ చాలా డిఫరెంట్‌గా ఉండబోతోంది. 'అక్కడుంది లైటింగ్ సూరి బాబు.. కొంచెం ఓల్టేజ్ ఎక్కువే ఉంటది' అంటూ మాస్ అప్పీయరెన్స్ ఇవ్వబోతున్నారు. డిఫరెంట్ కంటెంట్‌తో ఈ మూవీ తెరకెక్కుతోందని ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, వీడియోలు చెప్పకనే చెప్పేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా సోడాల శ్రీదేవిని పరిచయం చేస్తూ ఇంట్రో వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. చిత్రంలో సుధీర్ బాబు సరసన నటిస్తున్న హీరోయిన్ 'సోడాల శ్రీదేవి'గా నటిస్తోంది. తాజాగా విడుదలైన ఇంట్రో వీడియోలో ఆమె లుక్, డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. 'గోలి గొంతులోకి దిగుద్ది జాగత్త', 'ఒకడు సోడా సోడా అని మా కొట్టు దగ్గర తిరిగితే సోడా తీసి వాడి నెత్తిమీద కొట్టా. అప్పటినుంచి నా పేరు అయింది' అంటూ వచ్చిన డైలాగ్స్ ఆసక్తి రేకెత్తించాయి. ఇకపోతే ఈ వీడియోను సోషల్ మీడియా ద్వారా పంచుకున్న సుధీర్ బాబు.. ''తట్టుకోలేనంత కోపం, పట్టలేనంత ప్రేమ'' అంటూ ట్యాగ్ చేశాడు. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ప‌లాస 1978 సినిమాతో అరంగేట్రంలోనే మంచి పేరు సంపాదించిన క‌రుణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ 'శ్రీదేవి సోడా సెంటర్' సినిమా తెరకెక్కుతోంది. 70 ఎమ్ ఎమ్ ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై ప్రొడ‌క్ష‌న్ నెం. 4గా నిర్మితమవుతున్న ఈ చిత్రానికి విజ‌య్ చిల్లా, శ‌శిదేవి రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మెలోడి కింగ్ మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నారు. చిత్రంలో లైటింగ్ మెన్ సూరిబాబు పాత్రలో సుధీర్ బాబు కనిపించనున్నారు. నరేష్, రఘుబాబు, అజయ్‌, సత్యం రాజేశ్‌, హర్షవర్థన్‌, సప్తగిరి, రోహిణి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అతి త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3fcu494

'In 2024, Indians will boot out this govt'

'Let me assure the nation on behalf of the Sanyukt Kisan Morcha that our protests have not weakened at all or lost steam.'

from rediff Top Interviews https://ift.tt/2V2eTZf

Amazon Sales Growth Slows as Online Shopping Surge Eases

Amazon said sales growth would slow in the next few quarters as customers venture more outside the home, a tepid start to CEO Andy Jassy's reign after 27 years with Jeff Bezos at the retailer's helm.

from NDTV Gadgets - Latest https://ift.tt/3fcUTKb

Galaxy S21+ | Epic Features of the Pro-Grade Camera You Must Know About

​​​​​​​

from NDTV Gadgets - Latest https://ift.tt/2V2WDPs

What Is Cryptocurrency? Everything You Need to Know About Bitcoin, Ether, Dogecoin and More

A cryptocurrency, often just called crypto, is a sort of digital money as opposed to "fiat" or traditional currency and has become a popular asset for investors.

from NDTV Gadgets - Latest https://ift.tt/3ljpgT0

Radhe Shyam Release Date: రాధే శ్యామ్ రిలీజ్ డేట్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్.. సంక్రాంతి రేసులో ప్రభాస్

యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న '' సినిమాకు సంబంధించి కీలక అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. భారీ పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్, టీజర్‌లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత లాక్ డౌన్ రావడం, షూటింగ్స్ వాయిదా పడటంతో చిత్ర యూనిట్ అప్‌డేట్స్ కరువయ్యాయి. పైగా ముందుగా చెప్పిన రిలీజ్ డేట్ జులై 30కి ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాలేకపోయింది. ఈ నేపథ్యంలో అదే రోజు జులై 30న కీలక అప్‌డేట్ ఇస్తామని ప్రకటించిన చిత్రయూనిట్.. తాజాగా కొత్త పోస్టర్ వదులుతూ న్యూ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ప్రభాస్ సంక్రాంతి బరిలో నిలుస్తారని తెలుపుతూ అధికారిక ప్రకటన ఇచ్చారు. వచ్చే ఏడాది జనవరి 14వ తేదీన 'రాధే శ్యామ్' ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు. ఈ మేరకు రిలీజ్ చేసిన కొత్త పోస్టర్‌లో చేతిలో సూట్ కేసు పట్టుకొని యమ స్టైలిష్ లుక్‌లో కనిపించి అట్రాక్ట్ చేశారు ప్రభాస్. విడుదలైన కొన్ని క్షణాల్లోనే ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రభాస్ ఫ్యాన్స్ లైకులతో మోత మోగిస్తున్నారు. పీరియాడికల్‌ లవ్‌ స్టోరీగా యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ 'రాధే శ్యామ్' సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. యు.వి.కృష్ణంరాజు సమర్పణలో వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్‌ ఉప్పలపాటి నిర్మిస్తున్నారు. భాగ్య శ్రీ, సచిన్ కేడ్కర్, ప్రియదర్శి, సాషా ఛేత్రీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళీ, హిందీ, కన్నడ భాషల్లో ఈ మూవీ రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ మూవీ చివరి షెడ్యూల్ ఫినిష్ అయినట్లు తెలిపిన దర్శకనిర్మాతలు అతి త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేయనున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3BPZwUp

What made Pankaj Tripathi Cry

'Never had I imagined even in my wildest dreams that this 18-year-journey through 80 films would bring me so much love, respect and appreciation.'

from rediff Top Interviews https://ift.tt/3fazLo7

KTR: మరీ ఇంత దారుణమా? పరిష్కారం మీరే చూపాలంటూ రష్మి తీవ్ర ఆవేదన.. మంత్రి కేటీఆర్‌‌కి రిక్వెస్ట్

బుల్లితెర యాంకర్‌గా జబర్దస్తీ చేస్తూ అప్పుడప్పుడూ వెండితెరపై తళుక్కున మెరుస్తున్న యాంకర్ తాజాగా ఓ విషయమై తీవ్ర ఆవేదన చెందింది. తన ప్రోగ్రామ్స్, షూటింగ్స్ తదితర కార్యక్రమాలతో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషిస్తూ నిత్యం పలు విషయాలపై రియాక్ట్ అవుతుంటుంది ఈ జబర్దస్త్ యాంకర్. ఈ నేపథ్యంలోనే తీవ్ర ఆవేదనతో తాజాగా మంత్రి కేటీఆర్‌ని ట్యాగ్ చేస్తూ ఓ రిక్వెస్ట్ చేసింది రష్మి. ఈ సృష్టిలోని మూగ జీవాలంటే రష్మికి ఎంతో ఇష్టం. మూగ జీవులను రక్షించే బాధ్యత మనుషులపై ఉందని ఇప్పటికే పలుసార్లు సూచించింది రష్మి. మూగ జీవాలన్నాక చిన్న పెద్ద అనే తేడాలేదని, సృష్టి లోని జీవాలన్నింటినీ కాపాడుకోవాలంటూ పలు సందర్భాల్లో ఆమె చెప్పుకొచ్చింది. ఈ సృష్టిలోని మూగ జీవాలను ఏ చిన్న హాని కలిగిందని తెలిసినా ఓ జంతు ప్రేమికురాలిగా వెంటనే దాన్ని ఖండిస్తూ వస్తోంది రష్మి. లాక్ డౌన్ వేళ అంతా అన్నదానాలు, ఆర్ధిక సాయాలు చేస్తుంటే రష్మి మాత్రం మూగ జీవాల ఆకలి తీర్చింది. వీధి కుక్కలకు స్వయంగా ఆహారం పంచుతూ వాటిపై ప్రేమను చాటుకుంది. అయితే కొంతకాలంగా హైదరాబాద్‌ (GHMC) పరిధిలో వీధి కుక్కల సంతతిని తగ్గించేందుకు గాను వీధుల్లోని శునకాలకు వైద్య సిబ్బంది ఆపరేషన్‌ చేసి అలాగే వదిలేస్తున్నారు. ఆపరేషన్‌ తర్వాత చేయాల్సిన చికిత్స చేయకుండానే రోడ్లపై విడిచి పెడుతున్నారు. ఈ విషయాన్ని ‘సేవ్‌ యానిమల్స్‌ ఇండియా’ అనే ట్విటర్‌ ఖాతా ద్వారా ఓ నెటిజన్‌ కొంతకాలంగా ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ సదరు వీధికుక్కల ఫొటోస్ కూడా పోస్ట్ చేస్తున్నాడు. ఇది రష్మి కంటపడటంతో వెంటనే ఆమె మంత్రి కేటీఆర్ సాయం కోరింది. GHMC పరిధిలోని శునకాలకు ఏబీసీ (యానిమల్‌ బర్త్‌ కంట్రోల్‌) వారు ఆపరేషన్‌ చేసి అలాగే వదిలేస్తున్నారని, దీనికి సరైన పరిష్కార చర్యలు తీసుకోవాలని కేటీఆర్‌కి రిక్వెస్ట్ పెట్టింది. మరోవైపు, కొంతమంది వైద్య సిబ్బంది తమ రోజువారీ టార్గెట్‌ రీచ్ కావడం కోసం ఇలా నోరులేని జీవాలను హింసించడం సరికాదని అభిప్రాయం జనాల నుంచి వ్యక్తమవుతోంది. చూడాలి మరి రష్మి రిక్వెస్ట్‌పై కేటీఆర్ రియాక్షన్ ఎలా ఉంటుందనేది!.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3fbnJe4

తిమ్మరుసు ట్విట్టర్ రివ్యూ: సినిమాపై ప్రేక్షకుల అభిప్రాయం ఎలా ఉందంటే..

వైవిద్యభరితమైన సినిమాలు ఎంచుకుంటూ తనదంటూ ప్రత్యేకమైన దారి అని నిరూపించుకుంటున్నారు యాక్టర్ సత్యదేవ్. సినిమా సినిమాకీ వైవిధ్యం ప్రదర్శించే నటుల్లో ఈయన ఒకరని చెప్పుకోవచ్చు. లీడ్ రోల్ పోషించిన తాజా సినిమా ''. నేడు (జులై 30) ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఇప్పటికే యూఎస్ షోస్, ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ ఈ సినిమాపై తమ తమ అభిప్రాయాలు వెల్లడిస్తూ ట్వీట్స్ పెడుతున్నారు. అందులో కొన్ని పరిశీలించి వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుందామా.. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ 'తిమ్మరుసు' సినిమాను క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కించి ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంతో సాగే ఈ సినిమాలో వినోదమే ప్రధానమని, ఆ తర్వాత నెమ్మదిగా కథలోకి తీసుకెళ్తామని మూవీ ప్రమోషన్స్‌లో యాక్టర్ సత్యదేవ్ అన్నారు. డిఫరెంట్ మూవీ కాన్సెప్ట్ అని తెలియడం, పైగా కరోనా సెకండ్ వేవ్ లాక్‌డౌన్‌ తర్వాత థియేటర్లలో విడుదలవుతున్న సినిమా ఇదే కావడంతో ప్రేక్షకులు అంచనాలు పెట్టుకున్నారు. అయితే 'తిమ్మరుసు' ప్రీమియర్స్ చూసిన జనం చేస్తున్న ట్వీట్లను బట్టి చూస్తే ఈ సినిమా అంచనాలను రీచ్ అయినట్లే తెలుస్తోంది. ఈ చిత్రంలో ట్విస్టులు బాగున్నాయని, అలాగే ఇంటర్వెల్ బ్యాంగ్ ఆకట్టుకుందని అంటున్నారు. క్లైమాక్స్ కూడా సినిమాకు ప్లస్ అనే ట్వీట్స్ కనిపిస్తున్నాయి. ఇక యాక్టర్ సత్యదేవ్ నటన అద్భుతం అని చెబుతున్నారు. శ్రీ చరణ్ పాకాల అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుందని, యాక్టర్ బ్రహ్మాజీ క్లాస్ కామెడీ సీన్స్ కడుపుబ్బా నవ్విస్తాయని అంటున్నారు. మొత్తానికైతే ఈ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతుండటం గమనించవచ్చు. మరోవైపు పలువురు సెలబ్రిటీలు ఈ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటూ ట్వీట్స్ చేశారు. కొద్దిసేపట్లో ఈ సినిమా పూర్తి రివ్యూతో మీ ముందుకు రాబోతోంది 'సమయం తెలుగు'.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3lau7WJ

COVID-19 and Diabetes: What You Must Know

'COVID-19 and diabetes have a very intricate relationship.'

from rediff Top Interviews https://ift.tt/3lcfBh2

పోసాని కృష్ణమురళికి కరోనా పాజిటివ్‌.. ఆయన భార్యకు కూడా! ఆసుపత్రిలో చికిత్స

మహమ్మారి ఉదృతితో ఇప్పటికే సినీ ఇండీస్ట్రీ కకావికలం అయింది. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ తాకిడిలో కొందరు సినీ నటులు కన్నుమూయగా, ఎంతోమంది యాక్టర్స్ కోవిడ్ బారినపడి తిరిగి కోలుకున్నారు. అయితే రీసెంట్‌గా కరోనా సెకండ్ వేవ్ ముగిసిందని ఉపిరిపీల్చుకున్న జనానికి.. ఇప్పుడు కరోనా థర్డ్ వేవ్ టెన్షన్ పట్టుకుంది. కొత్త కొత్త వేరియంట్లు వెలుగులోకి వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితుల నడుమ తాజాగా తనకు, తన కుటుంబసభ్యులకు కరోనా సోకిందని అధికారికంగా తెలిపారు నటుడు . గత కొన్నిరోజులుగా ఆనారోగ్యంతో బాధపడుతున్న పోసాని కృష్ణమురళి.. ఇటీవల ఆరోగ్య పరీక్షలు చేయించుకోగా ఆయనకు కరోనా అని తేలింది. దీంతో ఆయన కుటుంబ సభ్యులందరికీ కరోనా పాజిటివ్ టెస్ట్ చేశారు. వాళ్లకు కూడా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో అంతా గచ్చిబౌళిలోని ఏఐజీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన పోసాని.. తనకు సినిమా అవకాశాలు ఇచ్చిన దర్శక నిర్మాతలు, హీరోలను క్షమించమని కోరారు. కరోనా రావడం వల్ల తాను నటిస్తున్న రెండు పెద్ద సినిమాల షూటింగ్స్ వాయిదా పడ్డాయని, తన వల్ల సినిమా షూటింగ్స్ ఆగిపోవడం బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు పోసాని కృష్ణమురళి. తనను మనస్ఫూర్తిగా మన్నించాలని నిర్మాతలకు విజ్ఞప్తి చేశారు. ప్రేక్షకులు, సినీ పరిశ్రమ ఆశీస్సులు, దేవుడి దయవల్ల త్వరలోనే కోలుకొని పూర్తి ఆరోగ్యంతో మళ్లీ షూటింగ్‌లకు హాజరవుతానని ఆయన తెలిపారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3lbFMEE

Infosys Plans for the New Digital Era

'India is still a small market but whatever we do, we do it with full focus.'

from rediff Top Interviews https://ift.tt/3C61gci

Nokia T20 Tablet Price, Specifications Have Leaked

Nokia T20 is said to be the first tablet from HMD Global. The tablet was spotted on a retailer website in the UK that has leaked its price and key specifications. The Wi-Fi only variant is listed at...

from NDTV Gadgets - Latest https://ift.tt/2Wsb2F7

Turn Off, Turn On: Simple Step Can Thwart Top Phone Hackers

At a time of widespread digital insecurity, it turns out that the oldest and simplest computer fix there is - turning a device off then back on again - can thwart hackers from stealing information...

from NDTV Gadgets - Latest https://ift.tt/3yfV4My

'Never Gonna Give You Up' - the Rick-Roll Video - Gets 1 Billion Views

Rick Astley's 1987 song "Never Gonna Give You Up" passed one billion views on YouTube. Over two decades after the music video was released, it became an Internet hit when it was used for the...

from NDTV Gadgets - Latest https://ift.tt/3l7keJj

బెడ్ మీద నుంచి పరుగెత్తిన బ్యూటీ.. ప్యాంట్ మరిచిన లావణ్య త్రిపాఠి!

అందాల రాక్షసి తెరపై ఎలా ఉంటారో అందరికీ తెలిసిందే. అందాల ఆరబోతకు ఆమడ దూరంలో ఉండే లావణ్యత్రిపాఠి ఈ మధ్య రూటు మార్చినట్టు కనిపిస్తున్నారు. ఒకప్పుడు తెర మీదా తెర వెనుకా నిండైన దుస్తులతోనే కనిపించేవారు. సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ కూడా హద్దులు దాటలేదు. కానీ గత ఏడాది మాత్రం లావణ్య ఒక్కసారిగా తన అభిమానులకు షాకిచ్చారు. పొట్టి దుస్తుల్లో కనిపించి ఆశ్చర్యపరిచారు. అభిమానులందరూ కాస్త హర్ట్ అయ్యారు. ఇలాంటి దుస్తులు ధరించొద్దు అని వేడుకున్నారు. కానీ లావణ్య మాత్రం సోషల్ మీడియాలో దుమ్ములేపుతున్నారు. తెరపై అంతగా అందాలను ఆరబోయని లావణ్య ఇప్పుడు వాటిని కూడా చేసేస్తున్నారు. మొన్న వచ్చిన ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమాలో మొదటిసారిగా లావణ్య త్రిపాఠి ముద్దు సీన్లకు ఓకే చెప్పేశారు. లిప్ లాక్‌కు లావణ్య యస్ చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. అలా లావణ్య త్రిపాఠి తన రూల్స్‌ను తానే మార్చుకున్నట్టు కనిపిస్తోంది. ఇక సోషల్ మీడియాలో అయితే పొట్టి దుస్తుల్లో కనిపిస్తూ రచ్చ చేస్తున్నారు. తాజాగా ఆమె ఓ వీడియోను తన ఇన్ స్టా స్టోరీలో పెట్టేశారు. అందులో ఆమె బెడ్ మీద నుంచి ఉదయాన్నే అలా లేచిపరిగెత్తుకుంటూ వచ్చారు. ఆమె అందులో ప్యాంట్ వేసుకోవడం మరిచినట్టున్నారు. అలా బెడ్ మీద నుంచి వచ్చి.. స్విమ్మింగ్ పూల్‌లో దూకేద్దామని చూశారు. కానీ ఆశ దోశ అన్నట్టుగా మధ్యలోనే ఆగిపోయారు. అలా ఆమె వీడియో, అందులో ఆమె ఆహార్యం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3x5Hji0

Kewal Tamang : బ్లడ్ క్యాన్సర్‌తో ప్రాణాపాయ స్థితి!.. కాపాడండని వేడుకుంటున్న ప్రియమణి

ఇప్పుడు వెండితెర, బుల్లితెర అనే తేడా లేకుండా అన్ని చోట్లా తన హవాను చూపిస్తున్నారు. బుల్లితెరపై జడ్జ్‌గా అదరగొడుతూనే..వెండితెరపై అద్భుత పాత్రలను పోషిస్తున్నారు. ఇక ఓటీటీలో ప్రియమణి చేస్తోన్న రచ్చ అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ప్రియమణి ఓ పోస్ట్ చేశారు. ఇందులో తన ఫ్రెండ్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు సాయం చేయండి అంటూ వేడుకున్నారు. ఢీ కంటెస్టెంట్లలో ఒకరైన తమంగ్ బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఈ మేరకు ఆయన ప్రాణాలు కాపాడేందుకు సాయం చేయమని ప్రియమణి అందరినీ వేడుకుంటున్నారు. మరో వైపు ఢీ ఫేమ్ సైతం తన అసిస్టెంట్ కేవల్ కోసం ప్రార్థిస్తున్నారు. రక్తదానం చేయండి అంటూ అందరినీ వేడుకున్నారు. ఈ మేరకు ఆయన షేర్ చేసిన వీడియో అందరినీ కదిలిస్తోంది. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. నా అసిస్టెంట్ కేవల్ మీ అందరికీ తెలుసు. అతను ఇప్పుడు బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. ఇప్పుడు అతడికి వేలూరులోని సీఎంసీ హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నారు. అయితే ఇప్పుడు అర్జెంట్ పన్నెండు మంది బ్లడ్ ఇవ్వాల్సి ఉంది. దాని కోసం ఇక్కడి నుంచి మేం బయల్దేరుతున్నాం. కానీ తిరుపతి, చెన్నై, బెంగూళరు ఇలా అక్కడ దగ్గర్లో ఉన్న వారు ఎవరైనా సాయం చేయండి. వెళ్లి రక్తాన్ని ఇవ్వండి. మీకు మిగతా సమాచారాన్ని చెబుతాను. ఇక్కడ ఫోన్ నంబర్ కూడా ఇస్తాను. ప్లీజ్ అతని కోసం ప్రార్థించండి’ అని అన్నారు. ఇక ప్రియమణి సైతం తన ఫ్రెండ్ కోసం చేతనైన సాయం చేస్తోంది. కేవల్ తమంగ్‌ను కాపాడండి.. అర్జెంట్‌గా 12 మంది బ్లడ్ ఇవ్వాలి. బ్లడ్ గ్రూప్‌తో సంబంధం లేకుండా.. ఎవ్వరైనా సరే 12 మంది రక్తాన్ని ఇవ్వండి. అతను బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఆయన్ను ప్రస్తుతం వేలూరులోనీ సీఎంసీ హాస్పిటల్‌లో ఉన్నారు. దయచేసి కేవల్‌ను కాపాడండి అని ఏడుస్తున్న ఎమోజీలను షేర్ చేస్తూ దండం పెట్టేశారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3yhc7xC

Karthik Hospitalised: హీరో కార్తీక్‌కి తీవ్ర గాయాలు.. కండిషన్ సీరియస్

‘సీతకోక చిలుక’ వంటి సూపర్ హిట్ సినిమాలో నటించి ప్రేక్షకులను అలరించిన సీనియర్ నటుడు ఆస్పత్రి పాలయ్యారు. ఇంట్లో కసరత్తు చేస్తుండగా ఆయన కాలికి తీవ్ర గాయం కావడంతో వెంటనే ఆయన్ని అడయార్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే ఇందులో ఆందోళన చెందాల్సిన విషయం ఏమిటంటే ఆయనకి గతంలోనే అదే కాలికి గాయం అయింది. దీంతో అప్పుడు డాక్టర్లు ఆయనకి శస్త్ర చికిత్స అందించారు. ఇప్పుడు మళ్లీ అదే చోట గాయం కావడం కుటుంబసభ్యులను కలవరపెడుతోంది. తమిళ ఇండస్ట్రీలో ప్రముఖ నటుడు ఆర్ ముతురామన్ కుమారుడిగా ఇండస్ట్రీలోకి కార్తీక్ అడుగుపెట్టారు. అయితే నటనతో పాటు గాయకుడిగా కూడా ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో ‘అన్వేషణ’, ‘మగరాయుడు’, ‘అభినందన’, ‘అనుబంధం’, ‘గోపాల రావు గారి అబ్బాయి’ తదితర సినిమాల్లో ఆయన నటించారు. అయితే 2000 తర్వాత ఆయనకు పెద్దగా సినిమా అవకాశాలు రాలేదు. దీంతో ఆయన రాజకీయాలపైపు అడుగులు వేశారు. తన సొంతంగా ఆయన పార్టీ కూడా ప్రారంభించి.. కొన్ని అనివార్య కారణాలతో రద్దు చేశారు. ప్రస్తుతం ఆస్పత్రిలో ఆయన కాలికి డాక్టర్లు స్కానింగ్ నిర్వహించారు. గతంలో గాయం అయిన చోటే మళ్లీ చిన్న క్రాక్ వచ్చినట్లు డాక్టర్లు ఈ స్కానింగ్‌లో గుర్తించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని.. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేమని వైద్యులు అంటున్నారు. ఇక కార్తీక్ ఆయన కుమారుడు గౌతమ్‌ని కూడా నటుడిని చేశారు. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘కడలి’ అనే సినిమాతో గౌతమ్ వెండితెరకు పరిచయం అయ్యాడు. కార్తీక్ ఆస్పత్రిలో ఉన్నారని తెలియగానే ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3BVoRfo

Poco X3 GT Will Not Be Launching in India

Poco X3 GT was launched in Malaysia and Vietnam just a day ago. It is a rebrand of the Redmi Note 10 Pro 5G that was launched in China in May. Poco India Director Anuj Sharma has now announced that...

from NDTV Gadgets - Latest https://ift.tt/3zN94O1

WhatsApp Privacy Case Must Be Decided in a Month, EU Watchdog Says

European Data Protection Board (EDPB) gave the Irish data protection agency a month to issue a long-delayed decision on compliance by Facebook's WhatsApp after its peers objected to its draft finding.

from NDTV Gadgets - Latest https://ift.tt/3xeIGuG

Motorola Edge 20 Fusion Surfaces Ahead of August 5 Launch

Motorola Edge 20 Fusion is tipped to be the fourth model in the Motorola Edge 20 series that is expected to launch on August 5. The phone could come alongside Motorola Edge 20 Lite, Motorola Edge 20,...

from NDTV Gadgets - Latest https://ift.tt/3zLaOXX

PlayStation 5 'Goodwill Discount' Offers New Consoles at 20 Percent Off

PlayStation 5 owners can reportedly buy a new console at 20 percent off with Sony's "goodwill discount" if their PS5 has had some physical damage. The company announced it has sold over 10...

from NDTV Gadgets - Latest https://ift.tt/3x9Oplx

Facebook Antitrust Case: New York, Other US States to Fight Dismissal of Lawsuit

New York and other US states filed a notice saying they will fight the dismissal of an antitrust lawsuit that they launched against Facebook in an appeals court.

from NDTV Gadgets - Latest https://ift.tt/3faEpSO

Watch a New Trailer for Shang-Chi, the Next Marvel Movie

Shang-Chi gets a new teaser trailer. Shang-Chi release date is September 3. Simu Liu, Tony Leung, Awkwafina lead Shang-Chi movie cast.

from NDTV Gadgets - Latest https://ift.tt/3faiKu3

Suunto Sports Smartwatches With GPS Launched in India Starting at Rs. 29,999

Suunto has marked its entry into the Indian market with the launch of Suunto 9, Suunto 7, Suunto 5 smartwatches. The Suunto 9 is the most expensive of the lot priced at Rs. 54,499. The Suunto 7...

from NDTV Gadgets - Latest https://ift.tt/3l7ustp

Wednesday 28 July 2021

HBD Sanjay Dutt: సీనియర్ నటుడుకి బర్త్ డే గిఫ్ట్.. అదిరిపోయే పోస్టర్ రిలీజ్ చేసిన కేజీఎఫ్ టీమ్

బాల నటుడుగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత రాకీ అనే సినిమాతో హీరోగా పరిచయం అయిన నటుడు . ఆయన జీవితంలో ఎన్ని విజయాలు ఉన్నాయో.. అన్ని వివాదాలు ఉన్నాయి. ప్రముఖ సినీ నటుడు సునీల్ దత్, నర్గీస్ దత్‌ల కుమారుడిగా వెండితెరకు పరిచయం అయిన ఆయనా.. ఆ తర్వాత తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. సాజన్, ఖల్‌నాయక్, వాస్తవ్, మున్నాభాయ్ ఎంబీబీఎస్, లగే రహో మున్నాభాయ్ తదితర సినిమాలతో ఆయన ప్రేక్షకులను ఎంతో అలరించారు. అయితే 1993లో సంజయ్ దత్ జీవితంలో ఓ ఊహించని మలుపు చోటు చేసుకుంది. ముంబై పేలుళ్ల కేసులో ఉగ్రవాదులకు సహకారం అందించారనే కారణంతో ఆయన ఐదు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించారు. 2018లో సంజయ్ దత్ జీవితగాధ ఆధారంగా రణ్‌బీర్ కపూర్ ప్రధాన పాత్రలో వచ్చిన ‘సంజూ’ అనే సినిమా కూడా మంచి సక్సెస్ సాధించింది. ఇక గత ఏడాది ఆయన ఊపిరితిత్తుల క్యాన్సర్ బారినపడ్డారు. అయితే మెరుగైన వైద్యం అందడంతో సంజయ్ క్యాన్సర్‌ను జయించారు. కాగా, సంజయ్ దత్ నేడు (జూలై 29) తన 62వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అభిమానులు, సహ నటీనటులు ఆయనకు పెద్దఎత్తున శుభాకాంక్షలు చెబుతున్నారు. ఆయన ప్రస్తుతం నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘’. ఈ సినిమాలో ఆయన ప్రధాన విలన్ ‘అధీరా’ పాత్రలో కనిపించనున్నారు. అయితే సంజయ్ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఓ ప్రత్యేక పోస్టర్‌ని విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో సంజయ్ దత్ ఓ పెద్ద ఖడ్గం పట్టుకొని నిలుచొని ఉన్నారు. చూస్తుంటే ఇది ఓ భారీ ఫైట్ సీన్‌లో సన్నివేశంలా తెలుస్తోంది. ‘యుద్ధం అంటే అందులో పురోగతి ఉండాలి.. నేను చెప్పేదాన్ని రాబందులు కూడా ఒప్పుకుంటాయి’ అని అధీరా చెబుతారు అంటూ చిత్ర యూనిట్ పేర్కొంది. ఇక కన్నడ రాక్‌స్టార్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. హోంబులే ఫిలిమ్స్ బ్యానర్‌లో వస్తున్న ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా.. ప్రకాష్ రాజ్, రవీనా టండన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3j2BZqw

Dell Stops Some US Gaming PC Shipments Over New Energy Efficiency Rules

Dell said it has stopped shipping some versions of its powerful gaming systems to California and five other US states because the products do not meet new energy efficiency standards.

from NDTV Gadgets - Latest https://ift.tt/3ibl2uV

Flipkart Big Saving Days Sale Ends Soon: Best Offers

Flipkart Big Saving Days 2021 sale will end at midnight. We have handpicked the best tech deals and offers available on the last day of Flipkart's Big Saving Days sale that are worth checking out.

from NDTV Gadgets - Latest https://ift.tt/2UZaSVs

Facebook Rides Advertising Surge to Post Over $10-Billion Profit

Facebook reported that its second-quarter profits doubled thanks to a massive increase in advertising revenue. However, concerns about a revenue growth slowdown pushed its shares lower in after-hours...

from NDTV Gadgets - Latest https://ift.tt/3l8IomY

Samsung Rides Pandemic-Led Demand for Chips to Report Surge in Profits

Samsung Electronics' net profits surged more than 70 percent in the second quarter thanks to higher memory chip prices fuelled by pandemic-led demand, the South Korean tech giant reported.

from NDTV Gadgets - Latest https://ift.tt/3iTP1GS

‘మహాసముద్రం’లో పాత్రలు ఇవే.. త్వరలోనే సినిమా నుంచి మరిన్ని అప్‌డేట్స్

తొలి సినిమా ‘ఆర్ఎక్స్ 100’తోనే తన సత్తా నిరూపించుకున్న దర్శకుడు అజయ్ భూపతి ఇప్పుడు మరో విభిన్నమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. , హీరోలుగా ఆయన ‘’ అనే సినిమాని రూపొందిస్తున్నారు. రొటీన్ సినిమాల్లా కాకుండా ఓ డిఫరెంట్ కథతో ఈ సినిమా తెరకెక్కిస్తుంది. వైజాగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఎ.కె.ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కొద్ది రోజుల క్రితం ఇద్దరు హీరోలతో కూడా పోస్టర్‌ని రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ తాజాగా ఈ సినిమాలోని అన్ని పాత్రలను పరిచయం చేస్తూ ఓ వీడియోని విడుదల చేసింది. సినిమాలో ఉన్న ముఖ్యపాత్రలు అన్ని మనం ఈ వీడియోలు చూడొచ్చు. త్వరలో సినిమాకు సంబంధించి మరిన్ని అప్‌డేట్స్ వస్తాయని యూనిట్ ప్రకటించింది. అద్భుతమైన ఈ పాత్ర ప్రదర్శనను చూసేందుకు సిద్ధంగా ఉండండి అని అభిమానులకు తెలిపింది. ‘ఫీల్ ది ఇంటెన్సిటీ’ అంటూ చిత్ర యూనిట్ పేర్కొన్నారు. ఇక ఈ సినిమాలో అదితిరావ్ హైదరీ- అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటిస్తుండగా జగపతిబాబు, రావు రమేష్ లాంటి సీనియర్లు కీలక పాత్రల్ని పోషిస్తున్నారు. ఈ చిత్రంలో రావు రామేష్ గూని పాత్రలో నటించడం మరో విశేషం. యువ సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చారు. ఇప్పుటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. తెలుగు, తమిళ భాషల్లో ఆగస్టు 19న థియేటర్లలో రిలీజ్ అవుతుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3C1RNTp

'Weddings never portrayed like this'

'A young film-maker like me doesn't have the luxury of first choices.'

from rediff Top Interviews https://ift.tt/3f7cuU6

Twitter Closes Re-Opened US Offices Due to Surge in COVID-19 Delta Cases

Twitter is shutting its reopened offices in the US, while other big tech companies are making vaccination mandatory for on-campus employees, as the highly infectious Delta COVID-19 variant drives a...

from NDTV Gadgets - Latest https://ift.tt/3iY0vJw

పూరి జగన్నాథ్‌కు అభిమానులు రిక్వెస్ట్.. ఆ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తే చూస్తారట..

డైరెక్టర్‌ రామ్ గోపాల్ వర్మ శిష్యుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన పూరి జగన్నాథ్‌ తరువాత తనదైన స్పెషల్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. ఇతర దర్శకుల సినిమాల కంటే పూరి సినిమాలు కాస్త విభిన్నంగా ఉంటాయి. ఆయన సినిమాల్లో చూపించే హీరోయిజం వేరే లెవెల్‌లో ఉంటుంది. అందుకే పూరి సినిమాలకు ఇండస్ట్రీలో ఉండే క్రేజ్ వేరు. ఆయన సినిమా రిలీజ్ అయితే హిట్, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా చూస్తారు ఫ్యాన్స్. ప్రస్తుతం పూరి, విజయ్ దేవరకొండతో కలిసి ‘లైగర్’ అనే సినిమాలో తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమాలో విజయ్ కిక్ బాక్సర్‌గా కనిపిస్తుండగా.. అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. దర్శకత్వంతో పాటు పూరి ఈ సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఓ సినిమాకు సంబంధించి పూరికి తెగ రిక్వెస్ట్‌లు వస్తున్నాయట. ఆ సినిమా మరేదో కాదు.. పూరి తనయుడు ఆకాష్ నటించిన ‘’. రెండేళ్ల క్రితం మొదలైన ఈ సినిమా కరోనా కారణంగా కొంచెం ఆలస్యమైన.. ఎలాగోలా షూటింగ్ పూర్తి చేశారు. ఈ సినిమా ద్వారా కేతికా శర్మ హీరోయిన్‌గా పరిచయం అవుతుంది. అయితే ఇప్పటివరకూ ఈ సినిమా విడుదల విషయంలో ఇప్పటివరకూ క్లారిటీ లేదు. స్వయంగా నిర్మించిన ఈ సినిమా విడుదల విషయంలో ఎందుకు ఇంతా జాప్యం జరుగుతుందని సందేహాలు పుట్టుకొస్తున్నాయి. కనీసం ఓటీటీలో విడుదల చేసిన చూస్తామంటూ పూరిని అభిమానులు పెద్ద ఎత్తున కోరుతున్నారు. అయితే ఈ సినిమా విడుదల విషయంలో స్పష్టత విషయం పక్కనపెడితే ఆకాష్ మాత్రం మరో రెండు ప్రాజెక్టులు సైన్ చేశాడు. తాజాగా తన నెక్ట్స్ సినిమా ‘చోర్ బజార్’ ఫస్ట్‌లుక్ విడుదలైంది. దీంతో పాటు.. మరో సినిమాను కూడా అతను ట్రాక్‌లో పెట్టినట్లు తెలుస్తోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3l9jK5E

RadheShyam: ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. మరో మూడు రోజుల్లో సర్‌ప్రైజ్‌కి సిద్ధంగా ఉండండి!

‘బాహుబలి’ సినిమా తర్వాత యంగ్ రెబల్ స్టార్ రేంజ్ మారిపోయింది. ఈ సినిమాతో ఆయన అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే ఆ తర్వాత వచ్చిన ‘సాహో’ సినిమా కాస్త నిరాశపరిచినప్పటికీ.. కలెక్షన్లు మాత్రం బాగానే రాబట్టింది. ప్రస్తుతం ఆయన వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాల్లో రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘’ ఒకటి. ఈ సినిమా గురించి ప్రకటన వచ్చిన చాలాకాలమే అయింది. ఇప్పటికే వచ్చిన ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్, టీజర్‌లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత చిత్ర యూనిట్ గురించి అప్‌డేట్లు కరువయ్యాయి. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త ఆగ్రహంగానే ఉన్నారు. అందరూ హీరోలకు సంబంధించిన అప్‌డేట్లు ఎప్పటికప్పుడు వస్తుంటే.. తమ హీరో సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ ఎందుకు విడుదల చేయడం లేదంటూ చిత్ర యూనిట్‌పై మండిపడుతున్నారు. ఇదిలా ఉండగా డార్లింగ్ అభిమానులకు సినిమా దర్శకుడు రాధాకృష్ణ తాజాగా గుడ్ న్యూస్ అందించారు. సినిమా చివరి షెడ్యూల్ కూడా పూర్తి అయిందంటూ ఆయన ట్వీట్ చేశారు. ‘ఈ పాండమిక్ మనందరి ఊహలను నిరాశపరిచింది. ఎంతో ఓపికగా డార్లింగ్ ఫ్యాన్స్ అందరిపై నా ప్రేమను కురిపిస్తున్నాను. అధికారక అప్‌డేట్ మరో మూడు రోజుల్లో వస్తుంది. అందరం ఎదురుచూద్దాం’ అంటూ రాధాకృష్ణ పేర్కొన్నారు. ఇక యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. పీరియాడికల్‌ లవ్‌ స్టోరీగా యు.వి.కృష్ణంరాజు సమర్పణలో రాబోతున్న ఈ సినిమాను వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్‌ ఉప్పలపాటి నిర్మిస్తున్నారు. భాగ్య శ్రీ, సచిన్ కేడ్కర్, ప్రియదర్శి, సాషా ఛేత్రీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా తెలుగు, తమిళ, మలయాళీ, హిందీ, కన్నడ భాషల్లో ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో ప్రభాస్ విక్రమాదిత్యగా కనిపించనున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3BURVUi

Binance Founder Willing to Go Whenever He Finds a Better Successor

Binance founder Changpeng Zhao said he was willing to step down whenever he finds a successor who can do a "better job," as one of the world's biggest cryptocurrency exchanges, under pressure from...

from NDTV Gadgets - Latest https://ift.tt/3rHMjsa

Snap Camera Can Turn You Into a Cartoon for Zoom Calls: Here's How

Snapchat desktop app Snap Camera now allows users to apply a Disney/ DreamWorks/ Pixar-like cartoon filter in Zoom calls. The multimedia messaging app has a stylistic cartoon filter in its mobile...

from NDTV Gadgets - Latest https://ift.tt/374PrVj

OnePlus Becomes Fastest Growing Vendor in US Market: Counterpoint

Smartphone market in the US grew 27 percent year-over-year in the first half of 2021, with OnePlus emerging as the fastest growing vendor, Counterpoint said in its report.

from NDTV Gadgets - Latest https://ift.tt/3y8Z4hO

Cyberattacks May Result in US Engaging in 'Real Shooting War': Joe Biden

US President Joe Biden warned that if the US ended up in a "real shooting war" with a "major power" it could be the result of a significant cyberattack on the country, highlighting what Washington...

from NDTV Gadgets - Latest https://ift.tt/2Vj65xJ

Citizen App Now Pays Users $25 per Hour to Livestream Crime Scenes

Citizen app, available on both Android and iOS platforms, is now paying its users in New York to broadcast crime as and when it happens. The app was founded a few years ago by developers sp0n with the...

from NDTV Gadgets - Latest https://ift.tt/3f6ZFJ8

LG Display Rides Pandemic-Led Demand for TVs, Laptops to Beat Q2 Estimates

LG Display posted a better-than-expected second-quarter profit as pandemic-led demand for TVs and laptops drove up panel prices, pushing its shares up as much as 4.2 percent in morning trade.

from NDTV Gadgets - Latest https://ift.tt/2WsG3ZI

Tuesday 27 July 2021

Instagram Reels Video Length Limit Expanded to 60 Seconds

Instagram users will be able to make up to 60 second Reels, in addition to 15 second and 30 second options. Reels arch-rival TikTok recently expanded its limit to 3 minutes to offer its creators an...

from NDTV Gadgets - Latest https://ift.tt/3iYL1ES

ZTE Axon 30 5G With Under-Display Selfie Camera Launched

ZTE Axon 30 5G has been launched with a "next-generation under-display camera" in China. It is powered by the Qualcomm Snapdragon 870 SoC and is offered in four storage configurations. The...

from NDTV Gadgets - Latest https://ift.tt/3f5Z8Hr

Apple, Alphabet, Microsoft Report Combined Profits of Over $50 Billion

Apple, Microsoft, and Google-owner Alphabet reported combined profits of more than $50 billion in the April-June quarter, underscoring their unparalleled influence and success at reshaping the way we...

from NDTV Gadgets - Latest https://ift.tt/3f45K9e

Netflix Buys Will Smith Action Thriller Movie From John Wick Director

Netflix has acquired global rights to Fast & Loose, an action thriller movie with Will Smith in the lead and directed by David Leitch (John Wick, Deadpool 2). In Fast & Loose, Smith plays an amnesiac...

from NDTV Gadgets - Latest https://ift.tt/2UNGQUH

OnePlus 9T Series May Not Launch at All

OnePlus 9T is tipped to not launch this year. It's unlike the company's existing portfolio that has 'T' models as mid-year upgrades to its flagship phones.

from NDTV Gadgets - Latest https://ift.tt/3iaAg36

Huawei Nova 8 SE Vitality Edition With 40W Fast Charging Launched

Huawei Nova 8 SE Vitality Edition has been launched in China. It is the latest entrant in the Huawei Nova 8 SE lineup following the High Edition model from November last year. The phone is powered by...

from NDTV Gadgets - Latest https://ift.tt/3rBSkGC

Microsoft Sees Steady Cloud Growth After Record Quarterly Profit

Microsoft posted its most profitable quarter, beating Wall Street expectations for revenue and earnings, as PC sales declines stemming from a global chip shortage were more than made up for by a boom...

from NDTV Gadgets - Latest https://ift.tt/2UUHbVv

సినిమాల్లోకి వెంకటేష్ తనయుడు.. కీలక విషయాలు వెల్లడించిన పర్సనల్ మేకప్‌మాన్

సినీ ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ అనేది సర్వసాధారణం. బాలీవుడ్ టు టాలీవుడ్ ఎందరో హీరోహీరోయిన్ల పిల్లలు సినీ గడప తొక్కారు. నటీనటులే గాక దర్శకనిర్మాతల వారసులు కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుండటం చూస్తున్నాం. దగ్గుబాటి వారి వారసుడిగా కూడా అలాగే ఎంట్రీ ఇచ్చి విక్టరీ హీరోగా స్టార్ స్టేటస్ అనుభవిస్తున్నారు. అయితే ఇప్పుడు వెంకటేష్ వారసుడిగా ఆయన కుమారుడు ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా వస్తున్న వార్తలపై ఆయన పర్సనల్ మేకప్‌మెన్ క్లారిటీ ఇచ్చాడు. రీసెంట్‌గా వచ్చిన 'నారప్ప' సినిమాతో భారీ హిట్ సొంతం చేసుకున్నారు వెంకటేష్. దీంతో ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, ఇతర టెక్నీషియన్స్‌ని యూట్యూబ్ ఛానెల్స్ ఇంటర్వ్యూ చేస్తున్నాయి. వెంకటేష్ పర్సనల్ మేకప్‌మెన్‌గా వ్యవహరిస్తున్న రాఘవ తాజా ఇంటర్వ్యూలో సినిమా విశేషాలతో పాటు పలు కీలక విషయాలు వెల్లడించారు. వెంకటేష్ కుమారుడి సినిమా ఎంట్రీ గురించి కూడా మాట్లాడారు. వెంకటేష్ కుమారుడు అర్జున్ ఓ ఎక్స్ట్రార్డినరీ పర్సన్ అని చెప్పిన ఆయన.. తాను ఎప్పుడు చూసినా అర్జున్ పుస్తకాలతోనే కనిపించేవాడు అని చెప్పుకొచ్చారు. సాధారణంగా స్టార్లకి తమ పిల్లలని సినిమారంగంలోకి తీసుకురావాలని ఉంటుందని వారి కోసం స్పెషల్‌గా ఒక మంచి డెబ్యూ సినిమా కూడా ప్లాన్ చేయాలని ఉంటుందని కానీ వెంకటేష్ కుమారుడు విషయానికి వస్తే అలాంటిదేమీ లేదని అన్నాడు. సినిమాల పట్ల అతనికి ఆసక్తి ఉన్నట్లు తనకైతే అనిపించడం లేదని చెప్పాడు. బహుశా చదువు పూర్తయ్యాక అప్పుడు సినిమాల మీద దృష్టి పెట్టే అవకాశం ఉండొచ్చేమో అని రాఘవ అన్నాడు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3x8PBWg

Oppo Reno 6 4G With Snapdragon 720G SoC, Quad Rear Cameras Launched

Oppo Reno 6 4G has launched in Indonesia and is a variant of the Oppo Reno 6 5G model launched in May. The Oppo Reno 6 4G not only lacks 5G support, but also has a slightly different design and wildly...

from NDTV Gadgets - Latest https://ift.tt/3BS8Yqq

Alphabet Reaches Record Quarterly Revenue, Profit in Advertising Boom

Google parent Alphabet's quarterly revenue and profit surged to record highs, powered by a rise in advertising spending as more consumers shopped online.

from NDTV Gadgets - Latest https://ift.tt/3xdINGW

Watch the New Trailer for Ghostbusters: Afterlife, Out in November

Ghostbusters: Afterlife trailer #2 is here. Ghostbusters: Afterlife release date in India is November 11. Carrie Coon, McKenna Grace lead Ghostbusters: Afterlife cast.

from NDTV Gadgets - Latest https://ift.tt/3rDT5Pk

Apple Profit Nearly Doubles as COVID-19 Lockdowns Eased

Apple said its profit in the just-ended quarter nearly doubled amid improving consumer spending and a "growing sense of optimism" as COVID-19 pandemic lockdowns eased.

from NDTV Gadgets - Latest https://ift.tt/3BQap8w

10 Months in Afghanistan

'The Afghans used to say that if there is any person whose name should be taken after Allah, it is Hindustani.'

from rediff Top Interviews https://ift.tt/2WhNFxV

Pooja Hegde: స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌పై పూజా హెగ్డే కామెంట్స్.. ఆయన వ్యక్తిత్వం అలాంటిదంటూ ఓపెన్

ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ యంగ్ హీరోయిన్స్‌లో హవా ఎక్కువగా నడుస్తోంది. వరుస అవకాశాలతో మంచి ఫామ్‌లో ఉంది బుట్టబొమ్మ. దక్షిణాది భాషల్లో వరుస హిట్స్ ఖాతాలో వేసుకుంటూనే బాలీవుడ్ తెరపై హంగామా చేస్తోంది. క్రేజీ హీరోయిన్‌గా సత్తా చాటుతున్న ఆమె.. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ ఓపెన్ అయింది. సల్మాన్‌ ఖాన్‌తో కలసి పూజా హెగ్డే 'భైజాన్‌' అనే మూవీలో నటించనుంది. అతిత్వరలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనున్న నేపథ్యంలో.. ఇటీవల ఓ మీడియాతో మాట్లాడుతూ సల్మాన్‌తో సెట్స్ పైకి వెళ్లేందుకు చాలా ఆతృతగా ఉందని చెప్పింది. సల్మాన్ ఖాన్ గురించి చెబుతూ.. లోపల ఒకలా, పైకి మరోలా కనిపించే వ్యక్తిత్వం ఆయనది కాదని చెప్పుకొచ్చింది. కొందరు వ్యక్తులు తమ వ్యక్తిత్వాలకు ముసుగు వేసుకొని బయట మరోలా కనిపిస్తుంటారు కానీ సల్మాన్‌ ఖాన్‌ అలాంటి వారు కాదని తెలిపింది. నిజాయితీగా, ముక్కుసూటిగా తమకు నచ్చినట్టు ఉండే మనిషి అని, అలా ఉండటం చాలా గ్రేట్‌, అలాంటి సల్మాన్ వ్యక్తిత్వం అంటే తనకు చాలా ఇష్టమని చెప్పింది పూజా. పూజా హెగ్డే సినిమాల విషయానికొస్తే.. అక్కినేని అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో రాబోతున్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' అనే సినిమాలో నటిస్తోంది. దీంతో పాటు ప్రభాస్ సరసన పిరియాడిక్ రొమాంటిక్ లవ్ స్టోరీ 'రాధేశ్యామ్' సినిమా చేస్తోంది. రాధాకృష్ణ రూపొందిస్తున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి హీరోగా రాబోతున్న 'ఆచార్య'లో కూడా భాగమవుతోంది పూజా. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన ఆమె కనిపించనుంది. హిందీలో రణ్‌వీర్‌ సింగ్‌తో ‘సర్కస్‌’ మూవీ చేస్తోంది. సినిమాలతో ఇంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలోనూ యాక్టివ్ రోల్ పోషిస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది ఈ ముద్దుగుమ్మ.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3xcnWnk

The FTII student who Won at Cannes

'Indian universities have helped to free us from the society that usually binds young people.'

from rediff Top Interviews https://ift.tt/374mrNv

మళ్లీ లైమ్‌లైట్‌లోకి హీరోయిన్ త్రిషా.. ఈసారి ఆ స్టార్ హీరోకి జోడిగా..

ఒకసారి వెలుగులోకి వచ్చాక.. దాన్ని అలాగే కాపాడుకుంటూ ఇండస్ట్రీలో కొనసాగడం హీరోయిన్ల విషయంలో చాలా అరుదుగా జరుగుతుంది. మొదటి సినిమాతో హిట్ సాధించి.. ఆ తర్వాత వరుసగా రెండు, మూడు ప్రాజెక్టులు దక్కించుకున్నా.. కనుమరుగైన హీరోయిన్లు చాలామందే ఉన్నారు. కానీ, మొదటి సినిమా నుంచి అదేస్థాయిలో ప్రేక్షకులను అలరిస్తూ.. చాలాకాలం స్టార్ హీరోయిన్‌గా వెలుగొంది వాళ్లు కొంతమందే. అలా చాలాకాలం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా కొనసాగిన నటి . ఒక దశాబ్ధకాలం వరకూ తెలుగుతో పాటు.. తమిళ .. కన్నడ .. మలయాళ భాషల్లో ప్రేక్షకులను అలరించిన ఆమె.. గత కొంతకాలంగా మాత్రం సరైన హిట్లు లేక వెలవెలబోతుంది. గత కొంతకాలంగా కేవలం లేడీ ఓరియెంటెడ్ సినిమాలకే పరిమితమవుతూ.. సరైన హిట్ కోసం ఎదురుచూస్తుంది త్రిషా. అయితే ప్రస్తుతం ఆమె తెలుగులో అవకాశాలు లేనప్పటికీ.. తమిళంలో మాత్రం ఓ అరడజను వరకూ సినిమాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఓ బంగారు అవకాశం త్రిషా గుమ్మం తట్టింది. కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్ కుమార్‌ హీరోగా నటిస్తున్న కొత్త సినిమాలో మరోసారి త్రిషాని హీరోయిన్‌గా ఎంపిక చేశారట. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘పవర్’ అనే సినిమా మంచి సక్సెస్ సాధించింది. అంతేకాదు.. కలెక్షన్ల పరంగా కూడా ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు పవన్ కుమార్ దర్శకత్వంలో పునీత్ 'ద్విత్వ' అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో ఆయనకు జోడీగా త్రిషా నటించనుంది. ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం కానుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3i64aFK

Ishq Movie: టాలీవుడ్ నా సెకండ్‌ హోమ్‌.. తెలుగువాళ్ల టేస్ట్ నాకు తెలుసు: ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్‌ ఇంటర్వ్యూ

‘ఓరు ఆధార్ లవ్’ మలయాళ మూవీతో హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మైన ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్... ఒకే ఒక్క కన్ను గీటుతో 'వింక్‌గాళ్‌'గా దేశ వ్యాప్తంగా భారీ క్రేజ్‌ని సంపాదించుకుంది. ప్ర‌స్తుతం ప్రియా ప్ర‌కాశ్ హీరో తేజ స‌జ్జాతో క‌లిసి ‘ఇష్క్‌` చిత్రంలో హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ చిత్రానికి య‌స్‌.య‌స్‌. రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఆర్‌.బి. చౌద‌రి స‌మ‌ర్పణ‌లో ఎన్వీ ప్ర‌సాద్‌, పార‌స్ జైన్‌, వాకాడ అంజ‌న్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జులై30న `ఇష్క్` సినిమా విడుద‌ల‌వుతున్న‌ సంద‌ర్భంగా ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ మీడియాతో ముచ్చ‌టించింది. ఆ విశేషాలు మీకోసం.. ఈ సినిమా రోటిన్‌ లవ్‌స్టోరీలా ఉండదు ‘ఇష్క్‌’ సినిమాను నేను సైన్‌ చేయడం చాలా తొందరగా జరిగిపోయింది. మాములుగా అయితే ప్రతీ సినిమాకి కొన్ని నెలల గ్యాప్ నేను తీసుకొని మధ్యలో చాలా సార్లు డిస్కషన్స్ పెట్టి ఓకే చేస్తాను కానీ ఈ సినిమాకి మాత్రం రెండు రోజుల్లోనే ఓకే చేశాను. మలయాళ ‘ఇష్క్‌’ చిత్రాన్ని నేను చూశాను. ఈ చిత్రంలోని కథ, థ్రిల్లింగ్‌ అంశాలు నచ్చాయి. దీంతో ‘ఇష్క్‌’ సినిమా తెలుగు రీమేక్‌కు వెంటనే అంగీకరించాను. ఈ సినిమా రోటిన్‌ లవ్‌స్టోరీలా ఉండదు. ప్రేక్షకులకు కొత్తగా అనిపిస్తుంది. నాకు తేజ బాగా హెల్ప్ చేశాడు ‘ఇష్క్‌’ సినిమా జర్నీని నేను చాలా బాగా ఏంజాయ్‌ చేశాను. తేజ మంచి కో స్టార్‌. మీకు అందరికీ తెలుసు, తేజ చాలా యాక్టీవ్ గా ఉంటాడు కాబ‌ట్టి సెట్స్ లో ప్రతి ఒక్కరిని నవ్విస్తూ సెట్ అంతటినీ లైవ్ లో ఉంచుతాడు. నాకు తెలుగు డైలాగ్స్‌ విషయంలో బాగా హెల్ప్‌ చేశాడు. సూపర్‌గుడ్‌ ఫిలిమ్స్ వంటి పెద్ద బ్యానర్‌లో చేయడం చాలా హ్యాపీగా ఉంది.. ఈ చిత్ర దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజు సహకారం వల్ల మరింత బాగా నేను నటించగలిగాను. ‘మలయాళ వెర్షన్‌లోని హీరోయిన్‌ను మర్చిపో.. నీ స్టైల్‌ ఆఫ్‌ యాక్టింగ్‌ చేయ్యి’ అని దర్శకుడు రాజు చెప్పారు. నాకు ఫుల్‌ ఫ్రీడమ్‌ ఇచ్చారు. దీంతో ఎలాంటి ఒత్తిడి లేకుండా నటించగలిగాను. సూపర్‌గుడ్‌ ఫిలింస్‌ వంటి పెద్ద బ్యానర్‌లో నేను నటించడం చాలా సంతోషంగా ఉంది. అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థ్యాంక్స్‌. తెలుగువాళ్ల అభిరుచి నాకు తెలుసు మలయాళ ఆడియన్స్, తెలుగు ఆడియన్స్‌ల అభిరుచులు వేరని తెలుసు. అందుకే మలయాళ వెర్షన్‌ స్టోరీలోని సోల్‌ను మాత్రమే మేం తీసుకున్నాం. తెలుగు ఆడియన్స్‌కు తగ్గట్లు మార్పులు చేశాం. టెక్నికల్‌థింగ్స్‌ అలాగే ఉన్నాయి. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది. తెలుగు భాషను అర్థం చేసుకోగలను.. టాలీవుడ్‌ నా సెకండ్‌ హోమ్‌ కథ, కథలోని పాత్ర తాలుకూ ప్రధాన్యం నన్నుఓ కొత్త సినిమా అంగీకరించేలా చేస్తాయి. కథే నాకు ముఖ్యం. తెలుగు భాషను నేను అర్థం చేసుకోగలను. భవిష్యత్‌లో పూర్తిగా తెలుగులో మాట్లాడతానన్న నమ్మకం ఉంది. ఇందుకు తగ్గ శిక్షణ తీసుకుంటున్నాను. టాలీవుడ్‌ నా సెకండ్‌ హోమ్‌. ‘చెక్‌’ రిజల్ట్‌ను పక్కనపెడితే ‘చెక్‌’ సినిమాలో నాది చిన్నపాత్రే. ఈ సినిమా రిజల్ట్‌ను పక్కనపెడితే నా పాత్ర మేరకు నేను నటించాను. నాకు మంచి ఫీడ్‌ బ్యాక్‌ వచ్చింది. చెక్‌ చిత్రంలో నా స్క్రీన్‌ టైమ్‌ చాలా తక్కువ. కానీ ‘ఇష్క్‌’లో సినిమా అంతా తెరపై కనిపిస్తాను. తెలుగు, మలయాళం, హిందీ వరుస ప్రాజెక్ట్‌లు ప్రస్తుతం తెలుగులో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను. త్వ‌ర‌లోనే మేక‌ర్స్ అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ ఇస్తారు. అలాగే మ‌ల‌యాళంలో ఒక స్ట్రాంగ్ స‌బ్జెక్ట్ కోసం చూస్తున్నాను. అలాగే హిందీలో రెండు సినిమాల‌కి సంబంధించిన అప్డేట్స్ రావాల్సి ఉంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3BGPHrP

Redmi K40 Gaming Edition Gets a New Inverse Scale Colour Option

Redmi K40 Gaming Edition Inverse Scale colour option has been launched. It comes in a single 12GB + 256GB storage option and is priced at CNY 2,699 (roughly Rs. 30,900). The new colour option has a...

from NDTV Gadgets - Latest https://ift.tt/3eZIYj4

Nokia XR20 With Military-Grade Build, Snapdragon 480 SoC Launched

Nokia XR20 was launched on Tuesday as HMD Global's rugged smartphone with a military-grade build. The Finnish company also announced the Nokia C30 entry-level smartphone and Nokia 6310 (2021)...

from NDTV Gadgets - Latest https://ift.tt/2UJXwMR

Logitech Sales Rise 66 Percent on Higher Work-From-Home Demand

Logitech said it was seeing no let-up in demand from stay-at-home workers, after reporting higher operating income and sales at the start of its 2022 business year.

from NDTV Gadgets - Latest https://ift.tt/3BUoMcf

Tesla Rides Sale of Cheaper EVs to Post Record Profits

Tesla posted a bigger second-quarter profit than expected thanks to higher sales of its less-expensive electric vehicles, as it raised vehicle prices and cut costs.

from NDTV Gadgets - Latest https://ift.tt/3eZKMsg

This Wearable Can Generate Electricity From Your Sweat

A team of scientists at the University of California San Diego has designed a new device that uses sweat from your fingertips to generate energy. Similar in appearance to a Band-Aid, a user can wrap...

from NDTV Gadgets - Latest https://ift.tt/3ybGCFk

Dubai's New Drone Initiative Will Reduce Police Response Time to 1 Minute

Dubai Police have launched a Drone Box platform that aims to reduce police response time in the city to 1 minute from the current 4 minutes and 40 seconds.

from NDTV Gadgets - Latest https://ift.tt/3zCoODu

Anasuya Bharadwaj: లో- దుస్తులు వేసుకోలేదా అంటూ నటిపై ట్రోల్స్.. ఆ ఫొటో చూపిస్తూ జబర్దస్త్ రియాక్షన్

నానాటికీ విస్తరిస్తూ వస్తున్న సోషల్ మీడియా కొన్ని సందర్భాల్లో సెలబ్రిటీలను ఇబ్బందుల్లో నెట్టేస్తోంది. సామజిక మాధ్యమాల్లో తమకు నచ్చిన కామెంట్స్ చేసే వెసులుబాటు ఉండటంతో కొందరు నెటిజన్స్ హద్దుమీరుతున్నారు. నెగెటివ్ కామెంట్ చేసినా అది ఓ పరిమితి వరకైతే ఓకే కానీ హీరోయిన్లపై నీచంగా మాట్లాడటం ఈ మధ్యకాలంలో తరచుగా చూస్తున్నాం. రీసెంట్‌గా మరాఠి నటి హేమాంగి కవికి ఇలాంటి దారుణ పరిస్థితే ఎదురైంది. ఆమె డ్రెస్సింగ్ విషయమై నెటిజన్స్ హద్దులు దాటి కామెంట్స్ చేయడంతో ఈ ఇష్యూ వైరల్ అయింది. నటి తన ఇంట్లో చపాతీలు చేస్తున్న ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే చపాతీలు చేసే విధానాన్ని చూడటం మానేసిన కొందరు ఆకతాయిలు ఆమె వస్త్రాధారణపై కన్నేశారు. అంతటితో ఆగక ''ఏంటి లో-దుస్తులు ధరించలేదా..?, లోపల నీ బాడీ స్పష్టంగా కనిపిస్తోంది'' అంటూ నీచమైన కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేశారు. దీంతో దీనిపై సదరు నటి ఘాటుగానే రియాక్ట్ అయింది. ''మగవారికి ఉన్నట్టుగానే మాక్కూడా అన్నీ ఉంటాయి. కాళ్లు చేతులు కదులుతుంటే దానికి తగ్గట్టుగానే అవి కూడా కదులుతుంటాయి. అలా కదలని వారు ఎవరైనా ఉంటే నాకు చూపించండి. అయినా ఇంట్లో ఉన్నప్పుడు ఏం ధరించాలో ధరించకూడదో అది నా ఇష్టం'' అంటూ ట్రోలర్స్‌పై ఎటాక్ చేసింది నటి హేమాంగి కవి. అయితే హేమాంగి కవి డేరింగ్, ఆమె ఇచ్చిన ఆ సమాధానం చూసి ఈ ఇష్యూపై ఓ రేంజ్ చర్చలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో హేమాంగికి పలువురు నటీమణుల సపోర్ట్ లభిస్తోంది. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలపై పాజిటివ్‌గా స్పందిస్తున్నారు సినీ తారలు. ఇప్పటికే అనుపమ పరమేశ్వరన్ స్పందిస్తూ.. డ్రెస్సింగ్ సెన్స్ అనేది కచ్చితంగా మా ఛాయిస్, అందులో ఎలాంటి సందేహం అవసరం లేదని చెప్పింది. ఇదే ఇష్యూపై రియాక్ట్ అయిన 'ఎంతో ధైర్యవంతురాలివి నువ్వు.. అదిరిపోయేలా జవాబిచ్చావు' అనే కోణంలో కామెంట్ చేసింది. ట్రోలర్స్‌ని తిప్పికొట్టడంలో ఎప్పుడూ ముందుండే అనసూయ తోటి నటీమణులకు కూడా మద్దతు ఇస్తుండటం విశేషం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3rzH5yy

'Taliban resurgence will boost sleeper cells in India'

'India has to ensure its borders are properly sealed and there is no infiltration from PoK.

from rediff Top Interviews https://ift.tt/2URCb3Y

'Dancing with Shilpa Shetty was surreal'

'Even today when I think of it, I wonder how it fell on my plate.'

from rediff Top Interviews https://ift.tt/3i26LR7

Monday 26 July 2021

Prime Day Sale: Best Deals and Offers on Laptop Bags

Amazon Prime Day Sale 2021 has kick-started with discounts as high as 80 percent and many other offers. A wide variety of laptop bags for all tastes and preferences have also been included in the...

from NDTV Gadgets - Latest https://ift.tt/3l1Ejk7

Money Heist Season 5 Trailer Release Date Set for Monday, August 2

Money Heist season 5 trailer release date is Monday, August 2. Money Heist season 5 release date is September 3 on Netflix. Úrsula Corberó, Álvaro Morte lead Money Heist season 5 cast.

from NDTV Gadgets - Latest https://ift.tt/3zExaKJ

iOS and iPadOS 14.7.1, macOS Big Sur 11.5.1 Released With Critical Bug Fixes

iOS 14.7.1 and iPadOS 14.7.1 updates from Apple fix an issue with an application that may be able to execute arbitrary code with kernel privileges. Apple says that vulnerability CVE-2021-30807 may...

from NDTV Gadgets - Latest https://ift.tt/2Vcxgun

Intel to Build Qualcomm Chips, Aims to Catch Foundry Rivals by 2025

Intel said its factories will start building Qualcomm chips and laid out a roadmap to expand its new foundry business to catch rivals such as TSMC and Samsung Electronics by 2025.

from NDTV Gadgets - Latest https://ift.tt/3l0zaJa

Nokia Clarity, Comfort, Micro, Go Earbuds With ANC, IP Rating Launched

Nokia Clarity Earbuds, Comfort Earbuds, Micro Earbuds, and Go Earbuds series have been announced by brand license HMD Global. The audio products were unveiled alongside the Nokia XR20, Nokia 6310, and...

from NDTV Gadgets - Latest https://ift.tt/3f0lUR5

RRR: అదిరిపోయే అప్‌డేట్.. మెగా, నందమూరి ఫ్యాన్స్ కోసం 'దోస్తీ'.. థీమ్ సాంగ్ రిలీజ్ డేట్ అనౌన్స్

ప్రస్తుతం దేశవ్యాప్తంగా RRR గురించిన చర్చలే వినిపిస్తున్నాయి. 'రౌద్రం రణం రుధిరం' పేరిట పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్న ఈ సినిమాలో మెగా పవన్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ హీరోలుగా నటిస్తున్నారు. వెండితెరపై ఈ ఇద్దరి క్యారెక్టర్స్ మెగా, నందమూరి అభిమానులకు కన్నుల పండగ కావాలని స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు డైరెక్టర్ రాజమౌళి. ఈ నేపథ్యంలో ఇద్దరు హీరోల ఫ్యాన్స్ ఫిదా అయ్యేలా భారీ రేంజ్‌లో 'థీమ్ సాంగ్' రూపొందించిన RRR టీమ్, తాజాగా దానికి సంబంధించిన వివరాలు తెలిపారు. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, కన్నడ.. ఈ ఐదు భాషల్లో RRR మూవీ రూపొందుతుండటంతో ఒక్కో భాషలో ఒక్కో సింగర్‌తో ఈ పాటని పాడించినట్లు తెలుపుతూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. హేమచంద్ర, అనిరుధ్‌ రవిచందర్‌, విజయ్‌ ఏసుదాసు, అమిత్‌ త్రివేది, యాజిన్‌ నైజర్‌ ఆలపించిన ఈ పాటను ఆగస్టు 1వ తేదీన ఉదయం 11 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. 'దోస్తీ' అంటూ సాగిపోతూ స్నేహం విలువని చాటిచెప్పే ఈ గీతానికి సిరివెన్నెల సీతారామ శాస్త్రి లిరిక్స్ రాయగా.. కీరవాణి బాణీలు కట్టారు. పాన్‌ ఇండియా మూవీగా రాజమౌళి రూపొందిస్తున్న ఈ సినిమాపై అన్ని వర్గాల ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌ చరణ్‌, కొమురం భీంగా ఎన్టీఆర్‌ కనిపించనుండటం మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. ఒలీవియా మోరిస్, ఆలియా భట్ హీరోయిన్లుగా నటిస్తుండగా అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రీయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అక్టోబర్ 13న గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3zDrmRD

Amazon Denies Report of Accepting Bitcoin as Payment

Amazon denied a media report saying the e-commerce giant was looking to accept Bitcoin payments by the end of the year.

from NDTV Gadgets - Latest https://ift.tt/3rzMZQ0

Facebook Sets Up New Team to Work on VR 'Metaverse'

Facebook is creating a product team to work on the "metaverse," a digital world where people can move between different devices and communicate in a virtual environment, CEO Mark Zuckerberg said.

from NDTV Gadgets - Latest https://ift.tt/3BCPR3g

Paytm Said to Eye IPO by End of October: All We Know So Far

Paytm expects to launch its IPO at around the end of October, pending regulatory approvals, a source familiar with the matter said.

from NDTV Gadgets - Latest https://ift.tt/3i61lof

'Amazon bypassing Indian law'

'I approached the ministries for a response, but they did not respond on time, so I had to approach the court.'

from rediff Top Interviews https://ift.tt/3BIeMm1

Amazon Prime Day Sale Ends Soon: Don't Miss These Deals

Amazon Prime Day 2021 sale in India will end at midnight tonight. We've handpicked the best offers on mobile phones, Amazon devices, TVs, and electronics that are still available on the last day of...

from NDTV Gadgets - Latest https://ift.tt/3zG0mRy

Raj Kundra: పోర్నోగ్రఫీ తప్పు కాదంటున్న రామ్ గోపాల్ వర్మ.. శృంగారమే బంగారం అంటూ షాకింగ్ కామెంట్స్

కేసులో శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ తర్వాత పరిణామాలు సంచలనంగా మారాయి. అడల్ట్ సినిమాలు రూపొందించి అప్‌లోడ్ చేస్తున్నారనే అభియోగంతో అరెస్ట్ అయిన రాజ్ కుంద్రాపై లోతుగా విచారణ కొనసాగుతోంది. ఆయనతో సంబంధం ఉన్న ఏ ఒక్కరినీ వదలకుండా విచారిస్తున్నారు క్రైం బ్రాంచ్ పోలీసులు. ఈ పరిస్థితుల నడుమ పోర్నోగ్రఫీపై రియాక్ట్ అవుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు . రాజ్ కుంద్రా అరెస్ట్, పోర్నోగ్రఫీ ఇష్యూపై ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడిన ఆర్జీవీ.. ఇంటర్వ్యూ ఆరంభంలోనే తన దృష్టిలో శృంగారమే బంగారం అంటూ తనదైన స్టైల్‌లో కామెంట్ వదిలారు. ఇద్దరికీ ఇష్టమైనప్పుడు సెక్స్ చేయడం తప్పు కాదని, ఆ ఇద్దరి అంగీకారంతో వేరొక వ్యక్తి షూట్ చేయడంలోనూ తప్పు లేదనేది తన అభిప్రాయం అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. పోర్నోగ్రఫీ తప్పుకాదంటూ అన్నీ ఓపెన్‌గా మాట్లాడారు. ఒకవేళ బలవంతంగా చేస్తే తప్పు అని ఆయన పేర్కొన్నారు. XXX అంటే వివరణ ఇస్తూ కొన్నేళ్ల క్రితం సింగిల్ X, XX, XXX అనే కేటగిరీస్ ఉండేవని చెప్పిన వర్మ.. సింగిల్ X అంటే కొంచెం, XX అంటే కొంచెం ఎక్కువ, XXX అంటే పూర్తిగా అని అర్థం అంటూ తన వీడియో లైబ్రరీ రోజుల నాటి విషయాలను గుర్తు చేశారు. యూట్యూబ్‌లో వందల, వేల పోర్న్ రిలేటెడ్ వీడియోలు ఉన్నాయని అవన్నీ బయటకు తీస్తే చాలామందిని అరెస్ట్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. రాజ్ కుంద్రా అనేవాడు శిల్పా శెట్టి భర్త, పైగా ప్రముఖ వ్యాపారవేత్త కాబట్టి ఈ ఇష్యూ బాగా హైలైట్ అవుతుంది తప్ప ఇంకేమీ లేదని అన్నారు వర్మ. పోర్న్ షూట్ చేయడానికి, దాన్ని వేరే వాళ్లకు చూపిస్తూ బిజినెస్ చేయడానికి చాలా తేడా ఉందంటూ లాజిక్స్ మాట్లాడారు వర్మ. ఓటీటీ వల్లనే చెడిపోతున్నారని చెప్పడం తప్పు.. ఇష్టం ఉంటే చూడండి.. లేకపోతే ఓటీటీ చూడకండి అంతే. పోర్న్ చూడటం వల్ల సమాజానికి నష్టం జరగదని వర్మ తెలిపారు. పోర్నోగ్రఫి చూసినంత మాత్రాన సమాజంలో దారుణాలు జరుగుతాయని అనుకోవడం తప్పు అని ఆయన అన్నారు. కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మార్పులు వస్తున్నాయని, వాటినే మనం ఫాలో అవుతున్నామని తెలిపారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3i6mdeZ

'BSY wanted to get away'

'It was not the individual's decision. It was the collective decision (that BSY should resign).'

from rediff Top Interviews https://ift.tt/3zAY4Dp

బాలయ్యను చూసి భయపడ్డా.. సెట్లో ఆయన తీరు! ప్రగ్యా జైస్వాల్ ఓపెన్ కామెంట్స్

నందమూరి నటసింహం బాలయ్య బాబుతో '' సినిమాలో నటిస్తోంది బ్యూటిఫుల్ హీరోయిన్ . బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాతో మాస్ ఆడియన్స్‌కి స్పెషల్ ట్రీట్ ఇవ్వబోతున్నారట. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్‌లో ఉంది. చిత్రంలో బాలయ్య బాబు డిఫరెంట్ గెటప్‌లో కనిపించబోతున్నారు. అయితే తాజాగా బాలయ్యతో స్క్రీన్ షేర్ చేసుకోవడంపై ఓపెన్ అయింది హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్. సినిమాలో నటించే అవకాశం అనగానే చాలా భయమేసిందని, షూటింగ్ మొదలైనప్పుడు కూడా మొదట్లో ఆయనను చూస్తే భయపడేదాన్ని అని చెప్పిన ప్రగ్యా.. ఆయనతో కొన్ని రోజులు మాట్లాడిన తర్వాత ఎంత సరదా మనిషి, ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదనేది అర్థమైందని చెప్పింది. సెట్లో కూడా చాలా హుషారుగా ఉంటూ సెట్ అంతా సందడి వాతావరణం నెలకొల్పుతుంటారని తెలిపింది. ఇక బాలయ్య గురించి బయట వినిపిస్తున్న మాటలకు, ఆయన క్యారెక్టర్‌ చాలా భిన్నం అంటోంది ప్రగ్యా. ఇకపోతే బాలయ్య చేస్తున్న 'అఖండ' సినిమాలో తనది ప్రాధాన్యతతో కూడిన రోల్ అని ఆమె చెప్పుకొచ్చింది. ఈ సారి కేవలం గ్లామర్ పాత్రకు పరిమితం కాలేదని, చిత్రంలో వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్ చేస్తున్నానని చెప్పింది. సినిమా కథలో కూడా తన పాత్రకు చాలా దగ్గరి సంబంధం ఉంటుందని, ఇలాంటి సినిమా ఛాన్సులు చాలా అరుదుగా వస్తాయని కూడా వివరణ ఇచ్చింది. ఈ మూవీ ట్రైలర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆతృతగా ఉందని, మూవీ ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉందని చెప్పింది. అంటే ఈ సినిమాతో తన కెరీర్ టర్న్ అవుతుందని భావిస్తున్న ఆమె.. భారమంతా బాలయ్య పైనే వేసేసిందని చెప్పుకోవచ్చు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3i62wUP

Motorola Edge 20 Renders Tip Flat Display Design, Key Specifications Leaked as Well

Motorola Edge 20 has leaked in renders revealing design details and key specifications. The phone is tipped to have a centred hole-punch display with flat edges and a triple rear camera setup. There...

from NDTV Gadgets - Latest https://ift.tt/3eVnZOm

Samsung Galaxy A80 Gets Latest Security Patch With New Update: Report

Samsung Galaxy A80 is the latest smartphone from the South Korean giant to receive the latest Android security patch. The July 2021 patch claims to fix more than 20 vulnerabilities, most of them by...

from NDTV Gadgets - Latest https://ift.tt/3rwJAla

ఆ పాన్ ఇండియా ప్రాజెక్టులో వినోదం తగ్గదు.. ప్రభాస్ సినిమాలో కామెడీ కింగ్ బ్రహ్మానందం

ఒకప్పుడు తెలుగులో ఓ సినిమా వచ్చిందంటే అందులో ఓ వ్యక్తికి పాత్ర ఉండాల్సిందే. ఆయన ఉంటేనే ఆ సినిమా సంపూర్ణం అవుతుంది. కేవలం తన హావభావాలతో కోట్లాది మంది ప్రేక్షకులను అలరించిన నటుడు ఆయన. స్క్రీన్ మీద ఆయన కనిపించారంటే చాలు థియేటర్లో నవ్వుల వర్షం కురుస్తోంది. ఇదంతా చూశాక ఆయనెవరో ఇప్పటికే మీకే అర్థం అయిపోయి ఉంటుంది. ఆయన హాస్య బ్రహ్మ.. కామెడీ కింగ్ . ఆయన సినిమా తెరపై మళ్లీ చూడాలని అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. అయితే కొంతకాలం క్రితం ఆయన ‘జాతిరత్నాలు’ అనే సినిమాలో జడ్జి పాత్రలో నటించి ప్రేక్షకులను పలకరించారు. చేసిన పాత్ర చిన్నది అయినప్పటికీ.. బ్రహ్మానందం క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. ఈ సినిమా తర్వాత ఆయన మళ్లీ ఏ సినిమాలో కనిపిస్తారా.. అని ప్రేక్షకులు అంతా ఎదురుచూస్తున్నారు. అయితే బ్రహ్మానందం ఫ్యాన్స్‌కి ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చిత్ర బృందం శుభావార్త అందించారు. దర్శకత్వంలో ప్రస్తుతం ఓ సైన్స్ ఫిక్షన్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ‘ప్రాజెక్ట్ K’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా షూటింగ్ ఈ మధ్యే సెట్స్‌పైకి వెళ్లింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్‌డేట్ సోషల్‌మీడియాలో అభిమానులను ఉర్రూతలూగిస్తుంది. ఈ ‘ప్రాజెక్ట్ K’ అనే సినిమాలో బ్రహ్మానందం కూడా ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆరోగ్యం సహకరించకపోయినా.. పాన్ ఇండియా ప్రాజెక్ట్ కాబట్టి బ్రహ్మానందం ఈ సినిమాకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాలో బ్రహ్మానందం ఏ పాత్రలో నటిస్తున్నారో.. ఆయన ఏ రేంజ్‌లో కామెడీని క్రియేట్ చేస్తారో తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు ఎదురుచూడాల్సిందే.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2ULt6ti

'Sputnik V provides longer immunity'

'Its efficacy is 97.6 per cent.'

from rediff Top Interviews https://ift.tt/2UNjjTI

Amazon Wants to Hire a Digital Currency Expert. A Hint at Bitcoin Payments?

Amazon has listed a job posting that suggests it may be looking at providing Bitcoin and other cryptocurrencies as payment options in the near future. The company says it's looking for a Digital...

from NDTV Gadgets - Latest https://ift.tt/3iOJaT3

'India is more fortunate than other EMs'

'It is less dependent on imported capital.'

from rediff Top Interviews https://ift.tt/3eS6gXS

Sunday 25 July 2021

Oppo A93s 5G With 90Hz Refresh Rate, Triple Rear Cameras Launched

Oppo A93s 5G has been launched in China. The phone is powered by the MediaTek Dimensity 700 SoC and features a 90Hz hole-punch display. It has a triple rear camera setup with a 48-megapixel main...

from NDTV Gadgets - Latest https://ift.tt/3zyorK6

OnePlus 9, 9 Pro Get New OxygenOS Update With Bitmoji Always On Display

OnePlus 9, OnePlus 9 Pro are receiving the OxygenOS 11.2.8.8 update with bug fixes, system stability improvements, a new OnePlus store app, and a Bitmoji Always On Display option. The update is...

from NDTV Gadgets - Latest https://ift.tt/3BIjeBq

HP Victus 16 Gaming Laptops With RTX 30 Series GPUs Launched in India

HP Victus 16 gaming laptop models have launched in India. The HP Victus E series is powered by up to AMD Ryzen 7 processors while the HP Victus D series is powered by up to Intel Core i7 processor.

from NDTV Gadgets - Latest https://ift.tt/2UNYFmn

Google to Display 'About This Result' to Explain How it Ranks Search Results

Google Search is introducing "About This Result" feature for search queries to let users get more information about the results.

from NDTV Gadgets - Latest https://ift.tt/373lMf8

శ్యామ్ సింగరాయ్ షూటింగ్‌ పూర్తి.. ఇక అదే తరువాయి అంటూ నాని ట్వీట్

నేచురల్ స్టార్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. వరుసగా రెండు మూడు ప్రాజెక్ట్‌లను లైన్‌లో పెట్టేశారు. ఇప్పటికే టక్ జగదీశ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించాల్సింది. కానీ కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు సినిమాను వాయిదా వేశారు. దీంతో పాటు నాని నటిస్తున్న మరో రెండు సినిమాలు ‘’, ‘అంటే సుందరానికి’. గత ఏడాది ప్రారంభమైన ‘శ్యామ్ సింగరాయ్’ షూటింగ్ ఆ మధ్య కరోనా కారణంగా వాయిదాపడింది. ఆ తర్వాత పరిస్థితులు మామూలు అయ్యాక షూటింగ్‌ని ప్రారంభించారు. మహమ్మారి కారణంగా ఏర్పడిన విపత్కర పరిస్థితుల్లోనూ తగిన జాగ్రత్తల నడుమ షూటింగ్‌ని జరిపారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని నాని స్వయంగా ట్వీట్ చేశారు. ‘షూటింగ్ పూర్తయింది. ఒక మంచి టీమ్ ఉన్నప్పుడు ఫలితం కూడా అంతే మంచిగా వస్తుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభం అయ్యాయి’ అంటూ నాని పేర్కొన్నారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రాబోతోన్న ఈ సినిమాలో , కృతి శెట్టి, మడోనా సెబాస్టియన్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సత్యదేవ్ జంగా (ఎ ఫిల్మ్ బై అరవింద్ ఫేమ్) కథను అందిస్తున్నారు. నిహారికా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాలో జిషు సేన్ గుప్తా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. కోల్‌కతా‌లో జరిగే కథ కావడంతో హైదరాబాద్‌లోనే భారీ వ్యయంతో కోల్‌కతా సెట్‌ను రూపొందించి అందులోనే షూటింగ్ జరిపించారు. అన్ని జాగ్రత్తల మధ్య నిర్మించిన సెట్‌లో షూటింగ్ జరగడంతో.. నటీనటులు కూడా ఎలాంటి భయం లేకుండా షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో ఇక నాని ‘అంటే సుందరానికి’ సినిమాపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. వివేక్ ఆత్రేయ కాంబోలో రాబోతోన్న అంటే సుందరానికీ సినిమాను మైత్రీ మూవీస్ నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3eVWkgd

'Want to get work done before time is up'

'The thought of death doesn't scare me, but the possibility of becoming an invalid does.'

from rediff Top Interviews https://ift.tt/3l9FHl9

Poco F3 GT Goes on Sale for First Time Today via Flipkart

Poco F3 GT launched in India last week. The first sale is all set to go live today. The phone is listed on Flipkart and comes in Gunmetal Silver and Predator Black colour options. Poco F3 GT is...

from NDTV Gadgets - Latest https://ift.tt/2Tyqm1S

Instagram's New Sensitivity Filter Said to Be Censoring Users' Work

Instagram users are reportedly complaining that the platform's new sensitivity filter is blocking their posts.

from NDTV Gadgets - Latest https://ift.tt/3kRQJLy

Bitcoin, Ether Prices Go Up After Tweets from Elon Musk, Jack Dorsey

Bitcoin rose as far as 12.5 percent to hit $39,850 (roughly Rs. 29.6 lakhs), its highest since mid-June, while ether hit a three-week peak of $2,344 (roughly Rs. 1.74 crores). Last week,...

from NDTV Gadgets - Latest https://ift.tt/3iNhfmD

Amazon Prime Day 2021 Sale Begins: All the Best Deals and Offers

Amazon Prime Day 2021 sale has kicked off in India. We have handpicked the best deals and offers available on mobile phones, Amazon devices, and electronics. The two-day sale is open only to Amazon...

from NDTV Gadgets - Latest https://ift.tt/3iQ8V5o

How to Pre-Order PlayStation 5 Restocks in India

PS5 back in stock in India on July 26 at Amazon, Croma, Flipkart, Games The Shop, Prepaid Gamer Card, Reliance Digital, Sony Center, and Vijay Sales. PS5 price in India is Rs. 49,990.

from NDTV Gadgets - Latest https://ift.tt/3zyD7c1

Jayanthi Death: సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. సీనియర్ నటి జయంతి కన్నుమూత

సీనియర్ నటి (76) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా శ్వాసకోశ సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె నేటి ఉదయం (సోమవారం) తుది శ్వాస విడిచారు. ఈ విషాద వార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. సౌత్ ఇండియన్ భాషల్లో 500 లకు పైగా చిత్రాల్లో నటించిన ఆమె.. పలు జాతీయ అవార్డులు సొంతం చేసుకున్నారు. 1960, 70 దశకాల్లో వెండితెరపై జయంతి హవా నడించింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళీ, మరాఠీ, హిందీ భాషా చిత్రాల్లో నటించింది జయంతి. కన్నడ, తెలుగు, మళయాళం భాషల్లో నటించినా సొంతంగానే డైలాగులు చెప్పి ప్రత్యేకత చాటుకునేది జయంతి. కన్నడ ఇండస్ట్రీలో బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ నటిగా ఆమెకు గుర్తింపు లభించింది. దర్శకులు కె.వి. రెడ్డి, కె.విశ్వనాథ్‌, కె.బాలచందర్లు ఈమెకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చి మంచి వేషాలు ఇప్పించారు. లెజెండరీ యాక్టర్స్ ఎంజీఆర్, రాజ్ కుమార్, ఎన్టీఆర్ లతో స్క్రీన్ షేర్ చేసుకున్న జయంతి తన కెరీర్‌లో ఎన్నో అవార్డ్స్ సొంతం చేసుకుంది. ''స్వాతికిరణం, శాంతి నివాసం, శ్రీదత్త దర్శనం, జస్టిస్‌ చౌదరి, రాజా విక్రమార్క, కొదమ సింహం, దొంగమొగుడు, కొండవీటి సింహం, అల్లూరి సీతారామరాజు, శ్రీరామాంజనేయ యుద్ధం, శారద, దేవదాసు'' వంటి అనేక చిత్రాల్లో జయంతి నటించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/370i1Hr

సినిమా రౌండప్: నాగ చైతన్య న్యూ స్టెప్.. సర్దేసిన ఆలియా! ఏమవుతానో ఊహించలేదన్న హాట్ బ్యూటీ

సర్దేసిన ఆలియా! షూటింగ్ నిమిత్తం గత వారం హైదరాబాద్‌ వచ్చిన ఆలియా భట్‌.. ఆ పని ముగించుకొని ముంబై వెళ్ళిపోయింది. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న రామ్‌చరణ్‌కు జోడీగా సీత పాత్రలో ఆలియా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఆలియా లుక్స్ హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. నాగ చైతన్య న్యూ స్టెప్ క్రమంగా ఓటీటీల హవా పెరుగుతున్న నేపథ్యంలో నాగ చైతన్య కన్ను కూడా అక్కడే పడిందట. తెలుగు నిర్మాత శరత్‌ మరార్‌ సిద్ధం చేయించిన ఓ కథతో నాగచైతన్య డిజిటల్‌ ఎంట్రీ ఖాయమైంది అంటున్నారు. ప్రస్తుతం ''లాల్‌సింగ్‌ చద్దా, బంగార్రాజు'' సినిమాల్లో నటిస్తున్నారు చైతూ. చిరంజీవి డ్యూయల్ రోల్ మెగాస్టార్ చిరంజీవి, డైరెక్ట‌ర్ బాబీ కాంబినేష‌న్‌లో మైత్రీ మూవీ మేకర్స్ బ్యాన‌ర్‌పై ఓ సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో చిరంజీవి డ్యూయల్ రోల్ చేయనున్నట్లు సమాచారం. ప్ర‌స్తుతం ‘ఆచార్య’ మూవీతో బిజీగా ఉన్న చిరంజీవి.. ఆ వెంటనే ‘లూసిఫ‌ర్’ రీమేక్‌ ఫినిష్ చేసి బాబీ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా మొదలు పెట్టనున్నారు. ఏమవుతానో ఊహించలేదన్న హాట్ బ్యూటీ తన కెరీర్ స్టార్ట్ చేసి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తనను ఆదరిస్తున్న అభిమానులకు కృతజ్ఞతలు చెప్పింది శృతి హాసన్. ''12 ఏళ్ల క్రితం ఈ రోజున నేనేంటో.. ఏమవుతానో కూడా ఊహించలేదు. ఇష్టపడిన పని చేయాలని, ప్రతిరోజు గొప్పగా ఉండాలని తపన పడేదాన్ని. ఇప్పటికీ అదే పద్దతి అనుసరిస్తూ.. ఎత్తు పల్లాలతో సంబంధం లేకుండా ప్రతిరోజు కొత్తదిగా భావిస్తాను. నా సక్సెస్‌లో ప్రేక్షకులదే కీలక పాత్ర. ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటాను'' అని తెలిపింది. రిక్షా తొక్కిన సోనూ సూద్ కరోనా కష్టకాలంలో నేనున్నా అంటూ ఆపద్బాంధవుడిగా నిలిచిన సోను సూద్ ఎన్నో సేవలు చేశారు. పేదవాడి హృదయంలో దేవుడిగా చోటు సంపాదించాడు. కాగా తాజాగా సోనూ సూద్ మిల్క్ మ్యాన్‌గా మరి రిక్షా తొక్కాడు. రైతు పశుగ్రాసం తీసుకుని వెళ్తున్న ఓ రిక్షాలో ఆ రైతుకు కుర్చోబెట్టుకొని రిక్షా తొక్కుతూ వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకున్నాడు సోనూ. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Wk1g86

'To escape future waves, we need more vaccination

'Wherever the Delta variant is spreading, and the population is not vaccinated, there is death and devastation.'

from rediff Top Interviews https://ift.tt/3BEB4oS

Redmi Note 10T 5G Set to Go on Sale for the First Time Today

Redmi Note 10T 5G sale in India is taking place today (July 26). It will take place through Amazon and Mi.com, among other channels. Redmi Note 10T 5G is a rebranded Poco M3 Pro that was launched in...

from NDTV Gadgets - Latest https://ift.tt/3i08LcG

నాకైతే అలాంటివి ఇష్టం లేదు.. సింపుల్‌గా 'నో' అనేస్తా.. ఓపెన్‌గా చెప్పేసిన నిధి అగర్వాల్

కెరీర్ పరంగా చూస్తే చాలా స్పీడ్‌గా పాపులర్ అయింది . నాగ చైతన్య హీరోగా వచ్చిన 'సవ్యసాచి' సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ బ్యూటీ ఆ తర్వాత వెంటనే అక్కినేని అఖిల్‌తో 'మిస్టర్ మజ్ను' సినిమాలో రొమాన్స్ చేసింది. ఇక పూరి జగన్నాథ్ రూపొందించిన 'ఇస్మార్ట్ శంకర్' అమ్మడి కెరీర్‌కి టర్నింగ్ పాయింట్ అయింది. హుషారెత్తించే పాటల్లో అందాల ఆరబోతకు ఎక్కడా వెనక్కి తగ్గకుండా యమ జోష్‌లో చిందులేస్తుంటుంది నిధి. అయితే వినోదం పంచడంలో అన్నీ ఓకే కానీ, ఒక్క విషయంలో మాత్రం తన వల్ల కాదని చెబుతోంది ఈ ముద్దుగుమ్మ. సాధారణంగా సినిమాల్లో సాంగ్స్ అనేవి మేజర్ అసెట్. మ్యూజిక్, హీరోహీరోయిన్స్ డాన్స్ లాంటి అంశాలు ఇందులో చాలా ముఖ్యం. వీటితో పాటు పాటకు తగ్గ లొకేషన్స్ ఎంచుకొని అట్రాక్ట్ చేస్తుంటారు మేకర్స్. ఈ కోణంలో చాలా సినిమాల్లో వాన పాటలతో హూషారెత్తించారు. అయితే నిధి మాత్రం వాన పాటలు చేయనని చెబుతుండటం విశేషం. వాన పాటలంటే అస్సలు ఇష్టం లేదని చెబుతున్న ఆమె.. వాన పాటలు చేయడం అంత ఈజీ కాదని అంటోంది. వాన చినుకులు పడుతుంటే.. కళ్లు తెరిచి ఉంచి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం, నటించటం తన వల్ల కాదని, వీలైనంత వరకు వాన పాటలకు దూరంగా ఉంటా అని ఓపెన్‌గా చెప్పేసింది నిధి అగర్వాల్. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న '' సినిమాలో నటిస్తోంది నిధిఅగర్వాల్. 17వ శతాబ్దం నేపథ్యంలో పీరియాడికల్‌ డ్రామాగా రాబోతున్న ఈ సినిమాకు క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. పవన్‌తో నిధి మొట్టమొదటి సినిమా ఇదే. మరోవైపు తమిళ ఇండస్ట్రీ నుంచి అవకాశాలు కొట్టేస్తోంది నిధి అగర్వాల్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3eVavSm

OnePlus Nord 2 5G Goes on Sale: Price in India, Specifications

OnePlus Nord 2 5G has gone on sale in India today (July 26). The OnePlus phone comes as a successor to the original OnePlus Nord that was launched last year. The OnePlus Nord 2 is available for...

from NDTV Gadgets - Latest https://ift.tt/3BDpB8Y

ఓ వైపు దుప్పటి కప్పుకుని మరో వైపు తింటూ.. షూటింగ్ గ్యాప్‌లో నిహారిక రచ్చ

మెగా డాటర్ సోషల్ మీడియాలో చేసే సందడి మామూలుగా ఉండదు. గత రెండు మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. తన స్నేహితుడు, తన ప్రాజెక్ట్‌లకు దర్శకుడైన ప్రణీత్ బర్త్ డే సందర్బంగా నిహారిక చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. నిహారిక నటించిన వెబ్ సిరీస్, సినిమాకు ప్రణీత్ దర్శకత్వం వహించారు. ముద్దపప్పు ఆవకాయ్, నాన్నకూచి, సూర్యకాంతం వంటి ప్రాజెక్ట్‌లను తెరకెక్కించారు. అలా నిహారికతో ప్రణీత్ జర్నీ కొనసాగుతూ వస్తోంది. తన ఫ్రెండ్‌కు నిహారిక చెప్పిన విషెస్ బాగానే వైరల్ అయ్యాయి. ప్రణీత్ బర్త్ డే సందర్భంగా గ్యాంగ్ అంతా కూడా రెట్రో థీమ్‌ను ప్లాన్ చేశారు. ఇందులో ఒక్కొక్కరు ఒక్కో హీరో హీరోయిన్ క్యాస్టూమ్‌ను ఫాలో అయ్యారు. అతిలోక సుందరి శ్రీదేవీగా నిహారిక, బావగారూ బాగున్నారా స్టైల్లో నిహారిక భర్త చైతన్య కనిపించారు. ఇలా నిహారిక వెరైటీగా ప్లాన్ చేసిన ఈ థీమ్ పార్టీ బాగానే వైరల్ అయింది. అయితే తాజాగా నిహారిక షూటింగ్ గ్యాప్‌లో రీల్స్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. మనం సినిమా చూసేటప్పుడు కొంతమంది విసిగిస్తుంటారు. తరువాత ఏం జరుగుతుంది? అదేంటి? ఇదేంటి? అని నసపెడుతుంటారు. అలా మీకు ఎప్పుడైనా జరిగిందా? ఎవరైనా డిస్టర్బ్ చేశారా? అని నిహారిక ఓ రీల్ వీడియోను చేశారు. ఇందులో ప్రణీత్, నిహారిక సినిమా చూస్తున్నట్టుగా నటించారు. ఇక మధ్య మధ్యలో నిహారిక ప్రశ్నలు అడగడంతో ప్రణీత్ అరిచేసేశాడు. అలా మొత్తానికి నిహారిక చేసిన ఈ ఫన్నీ వీడియోలో అలా దుప్పటి కప్పుకోవడం, తింటూ ఉండటం అన్నీ కూడా క్లిక్ అయ్యాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2UPKixM

టుడే ఇన్‌స్టా హిట్స్: ఆయనతో కలిసి వాణి.. నవ్వులతో ముంచేస్తున్న హెబ్బా.. తెగకష్టపడుతున్న అంజలి

ఆయనతో కలిసి షూటింగ్ విశేషాలు పంచుకున్న వాణి ‘ఆహా కళ్యాణం’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన నటి . తెలుగు చేసిన సినిమాలు కొన్నే అయినప్పటికీ.. ఈ భామకు క్రేజ్ మాత్రం తక్కువ లేదు. తాజాగా తన తాజా షూటింగ్‌కు సంబంధించిన వివరాలను ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. షూటింగ్‌ వెనుక జరిగేది ఇదే అంటూ ఆమె అక్షయ్ త్యాగితో కలిసి దిగిన వీడియోని షేర్ చేసింది. కంటి చూపుతో తుఫాను సృష్టిస్తాను: అండ్రియా ఒక నటిగా మాత్రమే కాదు.. సింగర్‌గా, డ్యాన్సర్‌‌గా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది నటి . ‘యుగానికొక్కడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఆమె.. ఆ తర్వాత కొన్ని సినిమాలతో వినోదాన్ని పంచారు. కొంతకాలంగా సోషల్‌మీడియా ద్వారానే ప్రేక్షకులకు చేరువలో ఉన్నారు. తాజాగా.. ‘కంటి చూపుతోనే తుఫాను సృష్టిస్తాను’ అంటూ తన నాభి అందాలను ఫోకస్ చేస్తూ.. ఆమె ఓ పోస్ట్ చేశారు. తెగకష్టపడిపోతున్న .. ‘ఏమో.. నాకు అన్ని తెలిసిపోతాయి’ అంటూ సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయిన నటి అంజలి. ఈ ఏడాది ‘వకీల్‌సాబ్’ సినిమాతో ఆమె మంచి సక్సెస్ అందుకుంది. తాజాగా తన ఫిట్‌నెస్‌కి కారణం ఏంటనే విషయాన్ని అంజలి బయటపెట్టింది. ఓ అరుదైన యోగా భంగిమలో ఆమె ఫోటో పోస్ట్ చేసింది. ‘నేను తలవంచుకున్నాను.. కానీ, విరిగిపోను’ అంటూ ఆమె పేర్కొన్నారు. నీడలో అలా కనిపిస్తున్న దీపికా బాలీవుడ్ నటి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె ఏ సినిమా చేసినా అది ఓ సంచలనం అవుతుంది. బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. ఆ తర్వాత హాలీవుడ్‌లో కూడా సినిమాలు చేసి తన సత్తా నిరూపించుకున్నారు. ప్రస్తుతం ఆమె పలు పెద్ద ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. తన కొత్త సినిమాకు సంకేతంగా సగతం నీడలో ఉండి ఓ ఫోటోని పోస్ట్ చేశారు దీపికా. మరి ఇది దేనికి సంకేతం అనే విషయంపై దీపికానే క్లారిటీ ఇవ్వాలి. నవ్వులు చిందిస్తూ.. హెబ్బా ఫోటో.. హీరోయిన్ సోషల్‌మీడియాలో ఏ రేంజ్‌లో యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. తరచూ హాట్ ఫోటోషూట్‌లు నిర్వహిస్తూ.. ఆమె అభిమానులకు కావాల్సినంత వినోదాన్ని పంచుతారు. తాజాగా నవ్వుల పూవులు పూయిస్తూ.. కొంచెంగా తన అందాలను చూపిస్తూ.. ఆమె ఓ సెల్ఫీని సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3kT7FBf

ఏ ఒక్క హీరో కూడా సొంతంగా ఎదగలేడు.. ‘నారప్ప’పై వెంకీ ఎమోషనల్

విక్టరీ సినిమాలంటే తెలుగు ప్రేక్షకులందరూ కూడా ఆసక్తిని కనబరుస్తుంటారు. ఫ్యామిలీ హీరోగానే కాకుండా మాస్ హీరోగానూ తన సినిమాలతో వరుసగా హిట్ల మీద హిట్లు కొట్టేశారు. ఇక వెంకటేష్ చేసే రీమేక్ సినిమాలు అయితే బ్లాక్ బస్టర్ హిట్లు అవుతుంటాయి. ఒరిజినల్ సినిమాల కంటే వెంకీ చేసిన రీమేక్ చిత్రాలే ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంటాయి. అలా ఈ మధ్య నారప్పగా వెంకీ తన విశ్వరూపాన్ని చూపించారు. తమిళంలో అసురన్ తెలుగులో నారప్పగా వచ్చేశారు. గత వారం విడుదలైన ఈ మూవీ ఇప్పటికీ హాట్ టాపిక్ అవుతోంది. విడుదలకు ముందు ఎన్నో వివాదాలు చెలరేగాయి. ఓటీటీలో వద్దని కొందరు గొడవలు చేశారు. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు మీడియా ముందుకు వచ్చి వాపోయారు. కొందరు అభిమానులు వినూత్న నిరసనలు చేశారు. నారప్పను థియేటర్లోనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కానీ చివరకు నారప్ప ఓటీటీలోనే వచ్చింది. అందరి నోటి నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. అలా నారప్ప పాసైపోయాడు. నారప్పగా వెంకటేష్ నటన, ఆ యాక్షన్ సీక్వెన్స్‌లు ఓ రేంజ్‌లో క్లిక్ అయ్యాయి. అయితే సినిమా హిట్ అవ్వడం ఒక్కరి చేతిలో ఉండదని అదంతా కూడా సమష్టి కృషి అని నారప్ప టీం గురించి చెప్పుకొచ్చారు. ఈ మేరకు వెంకీ.. ఏ ఒక్క హీరో కూడా సొంతంగా ఎదగలేడు. నారప్పను ఇంత స్ట్రాంగ్ అండ్ పవర్ ఫుల్‌గా నిలబెట్టిన మా టీం అందరికీ థ్యాంక్స్ అని యాక్షన్ సీక్వెన్స్ మేకింగ్ వీడియోను షేర్ చేశారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2VbjaJq

'Residential, hospitality are best-performing sectors'

'The overall market cycle is very positive.' from rediff Top Interviews https://ift.tt/iTjSyPd