చిత్ర పరిశ్రమ నుంచి ఈ లాక్డౌన్లో బిజీగా ఉన్నది ఎవరంటే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అని ఎవరైనా చెబుతారు. కరోనా మహమ్మారి వల్ల షూటింగ్లన్నీ ఆగిపోయి సినిమా వాళ్లంతా ఇళ్లలో కూర్చుంటే.. వర్మ మాత్రం వరసపెట్టి సినిమాలను వదులుతున్నారు. కాకపోతే అవి అటుఇటుగా 30 నిమిషాల నిడివి ఉండే సినిమాలు. వీటిలో బూతు బొమ్మలు కూడా ఉన్నాయి. ఇప్పటికే రెండు బూతు బొమ్మలు ‘క్లైమాక్స్’, ‘నగ్నం’లను ఆర్జీవీ వరల్డ్ థియేటర్ (ఆన్లైన్)లో విడుదల చేసి డబ్బులు చేసుకున్నారు. ఇప్పుడు ఒక వివాదాస్పద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్పై సెటైరికల్గా ఒక చిన్న సినిమాను రూపొందిస్తున్నారు వర్మ. దీనికోసం పవన్ కళ్యాణ్లా ఉండే ఒక టిక్ టాక్ ఆర్టిస్ట్ను కూడా పట్టుకొచ్చారు ఈ వివాదాస్పద దర్శకుడు. ఈ సినిమాకు ‘పవర్ స్టార్ - ఎన్నికల ఫలితాల తర్వాత కథ’ అని టైటిల్ పెట్టారు. అంతేకాదు, పవర్ స్టార్ టైటిల్ లోగోలో జనసేన పార్టీ సింబల్ గాజు గ్లాసును కూడా ఉంచారు. మొత్తం మీద ఈ సినిమాతో మరోసారి జనాల నోటిలో నానుతున్నారు వర్మ. Also Read: ఇప్పటికే ఈ సినిమా నుంచి టైటిల్ పోస్టర్లు, వర్కింగ్ స్టిల్స్ విడుదలయ్యాయి. ఇవి చూసి ఎంజాయ్ చేసినవాళ్లు చేశారు.. తిట్టుకున్నవాళ్లు తిట్టుకున్నారు. అయితే, ఈ సినిమా నుంచి ఒక పాటను ఆదివారం సాయంత్రం వర్మ విడుదల చేశారు. ‘గడ్డి తింటావా’ అంటూ సాగే ఈ పాట కూడా సెటైరికల్గానే ఉంది. వాయిస్ మాడ్యులేషన్లోనే ఈ పాటను పాడారు. పవన్ పాత్రధారే పాడినట్టు వర్మ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. సాహిత్యం ఎవరు అందించారో తెలీదు కానీ, చాలా వెటకారం జోడించారు. ‘‘మనుషులనే నమ్మి మోసపోయాను. ఓటేశారనుకుంటే వెన్నుపోటేశారు’’ అనే లైన్ వర్మ అమ్ములపొదిలో నుంచి వచ్చిందని అర్థమవుతోంది. ఇదిలా ఉంటే, ఈ సినిమా ట్రైలర్ను చూపించడానికి కూడా ఆర్జీవీ డబ్బులు వసూలు చేస్తుండటం విమర్శలకు తావిస్తోంది. ప్రపంచ సినిమా చరిత్రలోనే ఒక సినిమా ట్రైలర్ను డబ్బులు పెట్టి చూడటం ఇదే తొలిసారి. ‘పవర్ స్టార్’ ట్రైలర్ చూడాలంటే రూ.25 చెల్లించాలని వర్మ ఇప్పటికే ప్రకటించారు. ఇక ఈ సినిమాను ఈనెల 25న ఉదయం 11 గంటలకు ఆర్జీవీ వరల్డ్ థియేటర్ వెబ్సైట్లో విడుదల చేస్తున్నారు. టిక్కెట్ ధర రూ.150.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3eJ2Cwv
No comments:
Post a Comment