పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ వార్త విని సినీ ఇండస్ట్రీ షాక్కు గురైంది. అటు బాలీవుడ్తో పాటు.. ఇటు టాలీవుడ్ ప్రముఖులు సైతం అమితాబ్ ఆరోగ్యంపై స్పందించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. చిరంజీవి, నాగార్జున వంటి ప్రముఖ హీరోలంతా ట్వీట్ చేశారు. తాజాగా పవర్ స్టార్ సైతం అమితాబ్కు కరోనా రావడంపై స్పందించారు. ఈ వార్త వినగానే తనకు ఎంతో బాధ కలిగిందన్నారు పవన్. తామంతా అమితాబ్ బచ్చన్ అభిమానులమని పవన్ వెల్లడించారు. మీరంటే మాకెంతో ప్రేమ... అందుకు మీ ప్రతిభ ఒక్కటే కారణం కాదు.. మీ పోరాటస్ఫూర్తి, నిరాడంబరత, వినయవిధేయతలు కూడా కారణాలే అంటూ చేశారు. "నాకిప్పటికీ గుర్తు. అప్పట్లో మీరు 'కూలీ' చిత్రం షూటింగ్ సందర్భంగా గాయపడితే మా కుటుంబం యావత్తు తల్లడిల్లిపోయింది. మా అమ్మ, నాన్నతో సహా ప్రతి ఒక్కరం మీ ఆరోగ్యం కోసం ప్రార్థించాం. అన్ని వయసుల వారి నుంచి మీరు ఎల్లప్పుడూ ప్రేమాభిమానాలు, ఆప్యాయతానురాగాలు అందుకుంటున్నారు. కానీ.. మీరు, మీ కుమారుడు అభిషేక్ బచ్చన్ కరోనా బారినపడ్డారని తెలియగానే ఎంతో బాధపడ్డాను. ఆ భగవంతుడు మిమ్మల్ని దీవించాలని, మీరు, అభిషేక్ సంపూర్ణ ఆయురారోగ్యాలు సంతరించుకోవాలని ఆశిస్తున్నాను... ఇట్లు మీ అభిమాని పవన్ కల్యాణ్" అంటూ సందేశాన్ని సోషల్ మీడియా వేదికగా పోస్టు చేశారు. Read More: నిన్నరాత్రే అభిషేక్, అమితాబ్ బచ్చన్లు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా ఐశ్వర్య ఆమె కుమార్తె ఆరాధ్య సైతం కరోనా పాజిటివ్ అని తేలింది. ఐశ్యర్యరాయ్, ఆమె కూతురు ఆరాధ్యకు కరోనా నెగెటివ్గా వచ్చిందని తెలిపిన కొద్ది సమయానికే రెండో విడత పరీక్షల్లో పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఇప్పటికే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్, ఆయన తనయుడు అభిషేక్ బచ్చన్కు కరోనా పాజిటివ్ రావడంతో వారు నివసించే ప్రాంతాన్ని అధికారులు కంటైన్మెంట్ జోన్గా ప్రకటించారు. భవవనానికి బీఎంసీ అధికారులు సీల్ వేశారు. బిల్డింగ్ బయట కంటైన్మెంట్ జోన్ అని నోటీస్ అతికించారు. అనంతరం ఆ ప్రాంతాన్ని శానిటైజ్ చేశారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2CrYV0Z
No comments:
Post a Comment