Sunday, 12 July 2020

బెల్లంకొండ బ్యాంగ్ బ్యాంగ్.. ఆ సినిమాల సరసన ‘కవచం’

బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్‌ అగర్వాల్‌, మెహరీన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కవచం’. 2018 డిసెంబర్ 7న విడుదలైన ఈ సినిమాకు తెలుగు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. అయితే, హిందీ ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాను విపరీతంగా ఆదరిస్తున్నారు. ‘కవచం’ హిందీ వర్షన్ యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. ‘ఇన్‌స్పెక్టర్‌ విజయ్‌’ టైటిల్‌తో కిందటేడాది ఏప్రిల్‌లో యూట్యూబ్‌లో విడుదలైన ‘కవచం’ హిందీ అనువాద చిత్రాన్ని ఇప్పటి వరకు 2 కోట్ల (200 మిలియన్) మంది వీక్షించారు. అంతేకాదు, 1 మిలియన్‌కు పైగా లైక్స్ వచ్చాయి. తెలుగులో ప్రేక్షకులను పెద్దగా అలరించలేకపోయిన సినిమా హిందీ ఆడియన్స్‌ను ఇంతలా ఆకట్టుకోవడం విశేషం. అయితే, యూట్యూబ్‌లో టాలీవుడ్ హిందీ అనువాద చిత్రాలు 200 మిలియన్ మార్క్‌ను అందుకోవడం కొత్తేమీ కాదు. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ‘సరైనోడు’, ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాలు 200 మిలియన్ మార్క్‌ను ఎప్పుడో అందుకున్నాయి. ప్రస్తుతం ‘సరైనోడు’ చిత్రం 290 మిలియన్ వ్యూస్‌తో అగ్రస్థానంలో ఉంది. ఇక ‘దువ్వాడ జగన్నాథం’ 250 మిలియన్ వ్యూస్ సాధించింది. Also Read: అలాగే, ఎనర్జిటిక్ స్టార్ రామ్ చిత్రాలకు కూడా హిందీలో ఆదరణ బాగా లభిస్తోంది. ‘నేను శైలజ’, ‘హలో గురు ప్రేమ కోసమే’ సినిమాలు 200 మిలియన్ వ్యూస్ సాధించాయి. మరోవైపు, నితిన్-సమంత జంటగా నటించిన ‘అ ఆ’ సినిమా కూడా 200 మిలియన్ వ్యూస్ మార్క్‌ను అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రాల నడుమ బెల్లంకొండ శ్రీనివాస్ ‘కవచం’ కూడా నిలిచింది. కాగా, ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముకేశ్ విలన్‌గా నటించారు. శ్రీనివాస్ మామిళ్ల దర్శకత్వం వహించారు. థమన్ సంగీతం సమకూర్చారు. ఈ సినిమాను ఆర్కే దుగ్గల్ స్టూడియోస్ కొనుగోలు చేసి హిందీలోకి అనువదించింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/38Qr1Pj

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....