Monday, 16 September 2019

‘సైరా’ బడ్జెట్: వీఎఫ్ఎక్స్‌కే రూ.45 కోట్లు.. మొత్తం ఎంతో తెలుసా?

ప్రస్తుతం భారీ బడ్జెట్ సినిమాలకు టాలీవుడ్ కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ‘బాహుబలి’తో ఎస్.ఎస్.రాజమౌళి ఒక ట్రెండ్ సెట్ చేస్తే.. దాన్ని ఇప్పుడు అంతా ఫాలో అవుతున్నారు. ఇటీవలే రూ.350 కోట్ల బడ్జెట్‌తో ‘సాహో’ సినిమా వచ్చింది. ఇప్పుడు మరో భారీ చిత్రం ‘సైరా నరసింహా రెడ్డి’ విడుదలకు సిద్ధమవుతోంది. ‘బాహుబలి’, ‘సాహో’ మాదిరిగా ‘సైరా’ను కూడా పాన్ ఇండియా మూవీగా విడుదల చేస్తోన్న సంగతి తెలిసిందే. అందుకే నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడకుండా బడ్జెట్‌కు వెనకాడకుండా నిర్మాత రామ్ చరణ్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సరేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో వీఎఫ్ఎక్స్‌కు పెద్దపీట వేశారు. అందుకే వీఫ్ఎక్స్ కోసం భారీగా ఖర్చుపెడుతున్నారు. ఇండస్ట్రీ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం, ప్రపంచ వ్యాప్తంగా 17 వీఎఫ్ఎక్స్ కంపెనీలు ‘సైరా’ కోసం పనిచేస్తున్నాయి. ప్రతి సన్నివేశాన్ని సహజసిద్ధంగా చూపించేందుకు ఈ కంపెనీలు కష్టపడుతున్నాయి. ఈ విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఏకంగా రూ.45 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు అంచనా. మొత్తంగా చూసుకుంటే ఈ సినిమాకు అయ్యే బడ్జెట్ సుమారు రూ.270 కోట్లు. అంటే, ఇండియన్ సినిమాలోని భారీ బడ్జెట్ మూవీల్లో ‘సైరా’ ఒకటి. Also Read: రాయలసీమ పోరాట యోధుడు, స్వాతంత్య్ర సమరానికి ఆధ్యుడు అయిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథను భారత ప్రజలకు తెలియజేయాలనే నిశ్చయంతో చిరంజీవి ఈ సినిమాను చేస్తున్నారు. ఇది చిరంజీవికి డ్రీమ్ ప్రాజెక్ట్. అందుకే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఖర్చుకు వెనకాడకుండా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఈనెల 18న ట్రైలర్ రాబోతోంది. అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడులవుతోంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, ఈనెల 18న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించనున్నట్టు ఇప్పటికే నిర్మాణ సంస్థ ప్రకటించింది. అయితే, ఈ వేడుక వాయిదా పడే అవకాశం ఉందని తెలిసింది. 18వ తేదీన భారీ వర్ష సూచన ఉండటంతో వేడుకను 22వ తేదీకి మార్చినట్టు సమాచారం. ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ ఇదే నిజం అంటున్నారు. అయితే, ట్రైలర్‌ను మాత్రం ముందు ప్రకటించిన తేదీకే అంటే 18న విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, నయనతార, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, తమన్నా, అనుష్క శెట్టి, రవి కిషన్ ప్రధాన పాత్రలు పోషించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/306S3ks

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....