Sunday, 12 July 2020

బిగ్ బాస్ కంటెస్టెంట్లకు ఛాలెంజ్ విసిరిన సామ్రాట్

నటి కీర్తి రెడ్డి సోదరుడు నటుడిగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఈయన ‘బిగ్ బాస్’ షోలో పాల్గొనడం ద్వారా మరింత పాపులర్ అయ్యారు. నాని హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 2లో సామ్రాట్ పాల్గొన్నారు. కౌశల్ మండ విజేతగా నిలిచిన ఈ సీజన్‌లో గీతా మాధురి, తనీష్, టీవీ9 దీప్తి, రోల్ రైడా, అమిత్, యాంకర్ శ్యామల, తేజస్వి, భాను, నందిని రాయ్ తదితరులు కంటెస్టెంట్లుగా ఉన్నారు. అయితే, తన బిగ్ బాస్ ఫ్యామిలీకి సామ్రాట్ ఇప్పుడు ఒక ఛాలెంజ్ విసిరారు. అది గ్రీన్ ఇండియా ఛాలెంజ్. Also Read: తన సోదరి శిల్పా రెడ్డి పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న సామ్రాట్.. ఆదివారం రెండు మొక్కలను నాటారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్ చేశారు. అయితే, ఈ ఛాలెంజ్‌కు ఆయన ఒకరిద్దరిని కాకుండా తన ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు అందరినీ నామినేట్ చేశారు. అలాగే, తనతో పాటు బిగ్ బాస్‌లో పాల్గొన్న కంటెస్టెంట్లను నామినేట్ చేశారు. వాళ్లంతా కూడా మరికొంత మందిని నామినేట్ చేసి మొక్కలు నాటించాలని కోరారు. తాను మొక్కలు నాటిన సందర్భంగా సామ్రాట్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేపట్టిన హరితహారం కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా విజయవంతమైంది. హరితహారం స్ఫూర్తితో ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇప్పటికే మనం నీరు కొనుక్కుంటున్నాం.. భవిష్యత్తులో ఆక్సిజన్ కొనుక్కునే పరిస్థితి రాకూడదు. భవిష్యత్ తరాలకు మనం ఇచ్చేది ఒకటే మంచి వాతావరణాన్ని అందించడం. కాబట్టి మనందరం మొక్కలు నాటి సంరక్షించే బాధ్యత తీసుకోవాలి. నేను కూడా ప్రతిరోజు ఆఫీసుకి వెళ్ళే సమయంలో తప్పకుండా నేను నాటిన మొక్కను రక్షించే బాధ్యత తీసుకుంటాను. ఎన్ని కష్టాలు వచ్చినా, కరోనా సమయంలో కూడా చెట్లు నాటే కార్యక్రమం ఆగకూడదు’’ అని అన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2W6JmCP

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....