బడా నిర్మాత డీవీవీ దానయ్య సమర్పణలో రాజమౌళి రూపొందిస్తున్న పాన్ ఇండియా మూవీ కోసం దేశవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. పీరియాడికల్ బ్యాక్డ్రాప్లో రూపొందుతున్న ఈ సినిమాలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో , గోండు వీరుడు కొమురం భీం పాత్రలో యంగ్ టైగర్ కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ ఇద్దరి లుక్స్ భారీ రెస్పాన్స్ తెచ్చుకొని సినిమాపై హైప్ పెంచేశాయి. నిజానికి అల్లూరి సీతారామరాజు, కొమురం భీం వేర్వేరు ప్రాంతాలకు చెందిన వేర్వేరు నేపథ్యాలు ఉన్న వ్యక్తులు. అయినా వాళ్లిద్దరూ కలిస్తే ఎలా ఉంటుందనే ఊహకు రూపమిస్తూ రాజమౌళి ఈ సినిమా కథ రాశారట. కథంతా స్వాతంత్య్రానికి పూర్వం జరుగుతుంది. అయితే ఈ కథలో అల్లూరి, కొమరం భీం ఇద్దరూ చనిపోతారని, మళ్లీ పునర్జన్మ ఎత్తడం జరుగుతుందని సమాచారం. ఇదే కథను తనదైన కోణంలో ప్రెజెంట్ చేయబోతున్నారట జక్కన్న. ఈ పునర్జన్మ కాన్సెప్ట్ క్లైమాక్స్కి ముందే జరుగుతుందని, ఆ ఎపిసోడ్ సినిమాకే హైలైట్ అయ్యేలా జక్కన్న శ్రద్ద తీసుకున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇకపోతే ఈ భారీ మూవీలో ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్ హీరోయిన్గా నటిస్తుండగా, రామ్ చరణ్ సరసన ఆలియా భట్ ఆడిపాడుతోంది. రీసెంట్గా ఆలియా తిరిగి షూటింగ్లో జాయిన్ అయింది. కీలకపాత్రలో సీనియర్ హీరోయిన్ శ్రీయ, బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ కీలకపాత్రలో కనిపించనున్నారు. రే స్టీవెన్ సన్, అలిసన్ డూడి, సముద్రఖని ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఎలాగైనా త్వరలోనే షూటింగ్ పనులన్నీ కంప్లీట్ చేసి అక్టోబర్ 13వ తేదీన ఈ భారీ సినిమాను ప్రేక్షకుల ముందుంచాలని సన్నాహాలు చేస్తున్నారు రాజమౌళి.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2V4q3wm
No comments:
Post a Comment