Saturday, 24 July 2021

బాలయ్య బాబుతో మరో సినిమా ప్లాన్ చేసిన పూరీ.. ఈసారి అలా గెలుపు కోసం పాటుపడే హీరోగా..

డేరింగ్ అండ్ డాషింగ్ దర్శకుడు సినిమాలంటే వాటికి ఓ ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. హీరోకి ప్రత్యేకమైన క్యారెక్టరైజేషన్.. హీరోయిన్‌కి డిఫరెంట్ రోల్ ఇచ్చి.. విభిన్నమైన సినిమాలు తీయడంలో పూరీ ఎప్పుడు ముందు వరుసలో ఉంటారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో లైగర్ అనే సినిమాలో బిజీగా ఉన్నారు పూరీ. దీంతో పాటు ఆయన కొన్ని కొత్త సినిమాలు కూడా చేసే ప్లాన్‌లో ఉన్నారు. కొన్ని రోజుల క్రితం ఆయన బాలకృష్ణతో కలిసి.. ‘పైసా వసూల్’ అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తాపడినా.. ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం బాలకృష్ణ.. బోయపాటి కాంబినేషన్‌లో ‘అఖండ’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో త్రిపాత్రాభినయం చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే ప్రస్తుతం పూరీ జగన్నాధ్, బాలకృష్ణ కాంబినేషన్‌లో మరో సినిమా రూపొందనుందట. ఇప్పటికే పూరి జగన్నాధ్ ఓ ఇంట్రెస్టింగ్ కథను బాలకృష్ణకు చెప్పగా.. ఆయన వెంటనే ఓకే చెప్పారని తెలుస్తోంది. తండ్రి కొడుకుల మధ్య సాగే ఈ కథలో ఇండియట్ కి కొనసాగింపుగా ఉంటుందట. అయితే తండ్రి పాత్ర పాయింట్ ఆఫ్ వ్యూలో కథ సాగుతుందట. కొడుకు గెలుపు కోసం తండ్రి ఏం చేశాడు అనేదే మెయిన్ లైన్ అని.. సినిమాలో ఎమోషన్ ఉన్నా.. మెయిన్ గా యాక్షన్ బేస్డ్ గానే సినిమా నడుస్తోందని తెలుస్తోంది. ఈ సినిమాని సమ్మర్ తరువాత నుండి మొదలుపెట్టేలా పూరి ప్లాన్ చేస్తున్నాడట.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3y6D1rO

No comments:

Post a Comment

'Mark Mobius Saw India's Rise Before Other Investors'

'Mark Mobius's life was dedicated to investing.' from rediff Top Interviews https://ift.tt/V6zhcgU