Thursday 16 July 2020

Rashmika Mandanna: సమంతకు స్పెషల్ థాంక్స్.. రాశి ఖన్నా, కళ్యాణి ప్రియదర్శన్‌లకు సవాల్!!

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ బృహత్తర కార్యక్రమంలో భాగమవుతున్నారు. పలువురు నటీనటులు, దర్శకనిర్మాతలు ఎవరికి వారు పెద్దఎత్తున మొక్కలు నాటి తమ అభిప్రాయాలను సామాజిక మాధ్యమాలలో తెలియజేస్తున్నారు. పర్యావరణ సమతుల్యాన్ని కాపాడుతూ భావితరాలకు మెరుగైన వాతావరణం ప్రసాదించడంలో అంతా భాగం కావాలని పిలుపునిస్తున్నారు. తాజాగా ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంది క్రేజీ హీరోయిన్ . హీరోయిన్ ఇచ్చిన చాలెంజ్ స్వీకరించి తన ఇంటి ఆవరణంలో మొక్కలు నాటింది రష్మిక. ఈ విషయాన్ని తన ఇన్స్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలియజేస్తూ తనను నామినేట్ చేసినందుకు సమంతకు స్పెషల్ థాంక్స్ చెప్పింది. ఈ సందర్భంగా తన అభిమానులను, అదేవిధంగా యువతీ యువకులను పెద్దఎత్తున మొక్కలు నాటి ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు మొక్కలు నాటాల్సిందిగా రాశి ఖన్నా, కళ్యాణి ప్రియదర్శన్‌లకు సవాల్ విసిరింది రష్మిక మందన. Also Read: వరుస విజయాలు ఖాతాలో వేసుకుంటూ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న రష్మిక.. ఈ ఏడాది ఆరంభంలోనే ''సరిలేరు నీకెవ్వరు, భీష్మ'' సినిమాలతో సత్తా చాటింది. ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన 'పుష్ప' సినిమాలో నటిస్తోంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో పూర్తి పల్లెటూరి అమ్మాయిగా అబ్బురపరిచే పాత్రలో కనిపించనుందట రష్మిక.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/38Zd8yq

No comments:

Post a Comment

'Looking to export from India in next 5 years'

'All competitors are sourcing within the country, so we'll be at the same level of competition.' from rediff Top Interviews ht...