చాలా రోజుల గ్యాప్ తర్వాత మెగాస్టార్ మరో అద్భుతమైన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్లో ఆయన ఓ వీడియో ద్వారా ప్రస్తుతమున్న పరిస్థితులపై సందేశాన్ని అందించారు. కరోనా కట్టడికి మాస్క్ తప్పనిసరిగా ధరించండి. మిమ్మల్ని మీరు కాపాడుకోండి. మీ కుటుంబాన్ని, దేశాన్ని కూడా కాపాడండి.. ప్లీజ్.. అంటూ ట్విటర్లో ఒక వీడియోను ట్వీట్ చేశారు. చిరునవ్వు ముఖానికి అందం. కానీ ఆ చిరునవ్వు కలకాలం నిలవాలంటే.. మాస్క్ ధరించాలంటూ యువ హీరోయిన్ ఈషా రెబ్బతో కలిసి చిరు ‘మెగా’ సందేశం ఆకట్టుకుంటోంది. Read More: అదేవిధంగా ఆర్ఎక్ష్ 100 హీరో కార్తికేయతో కలిసి కూడా చిరు మరో వీడియో సందేశం అందించారు. మీసం మెలేయడం వీరత్వం అనేది ఒకపుడు.. కానీ ఇపుడు మాస్క్ ధరించడం వీరుడి లక్షణం అంటూ మరో వీడియోను కూడా ఆయన షేర్ చేశారు. రానున్న రోజుల్లో కరోనా మరింత మహమ్మారిగా మారనుందన్న డబ్ల్యూహెచ్ఓ హెచ్చరికల నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని చిరంజీవి కోరారు. దయచేసి ప్రాథమిక జాగ్రత్తలను పాటిస్తూ..ఐక్యంగా పోరాడి ఈ బాధలను తొలగించు కుందామంటూ చిరు విజ్ఞప్తి చేశారు. హీరోయిన్ , కనిపించిన ఈ రెండు వీడియోలు ఫ్యాన్స్ను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. మాస్క్ మస్ట్ అంటూ...చిరు చేసిన ఈ ట్వీట్లు మరోసారి అంతా ఆలోచించేలా చేస్తున్నాయి.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2CJmWR1
No comments:
Post a Comment