Tuesday, 14 July 2020

పేద విద్యార్థులకు అండగా .. ప్రభుత్వ స్కూళ్లు దత్తత తీసుకున్న ప్రముఖ హీరో

చాలామంది సెలబ్రిటీలు ఓవైపు సినిమాలతో బిజీగా ఉన్నా మరోవైపు సామాజిక సేవల్లో కూడా బాగానే పార్టిసిపేట్ చేస్తుంటారు. స్వచ్ఛంద సేవా సంస్థలు నిర్వహిస్తూ... పేదవారికి, తమ అభిమానులకు తోచిన సాయం చేస్తుంటారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలివుడ్ ఇలా ఏ భాషలో చూసినా చాలామంది సినీ ప్రముఖులు నిత్యం ఏదో ఓ సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు. కరోనా సమయంలో కూడా సినీ కార్మికుల కోసం సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చిన సంగతి తెలిసింది. ప్రధాని, ముఖ్యమంత్రుల సహాయ నిధికి కూడా కరోనా కోసం కోట్లు, లక్షల్లో విరాళాలు అందించారు. కొందరు సెలబ్రిటీలు అయితే గ్రామాల్ని సైతం దత్తత తీసుకొని అక్కడ కావాల్సిన వాటిని ఏర్పాటు చేస్తున్నారు. Read More: తాజాగా ప్రముఖ కన్నడ హీరో పేద విద్యార్థుల కోసం ముందుకు వచ్చాడు. సినిమాల ద్వారా స్టార్ హీరో అనిపించుకన్న ఈ నటుడు..ఇపుడు రియల్ హీరో కూడా అనిపించుకున్నాడు. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాల్లో తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 4 ప్రభుత్వ పాఠశాలలను సుదీప్ దత్తత తీసుకున్నాడు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేలా స్కాలర్ షిప్ ప్రోగ్రామ్స్ నిర్వహించడంతోపాటు వారికి డిజిటల్ క్లాస్ రూంలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు వాలంటీర్స్ టీంతో కలిసి ప్లాన్ చేశాడు. Read More: సుదీప్ స్కూళ్లున్న ప్రాంతాలు, అక్కడున్న వసతులు, ఇతర అంశాలను స్టడీ చేసేందుకు ఇప్పటికే వాలంటీర్లను ఆయా ప్రాంతాలకు పంపిచాడు. అక్కడున్న సమాచారం మొత్తాన్ని సేకరించాడు. సుదీప్ ఇదంతా చాలా గోప్యంగా చేస్తున్నట్లు సమాచారం. సైరా చిత్రం తర్వాత సుదీప్ ఫాంటోమ్‌, కిట్టీ-కోటిగొబ్బ 3, బిల్లా రంగా భాషా, థగ్స్ ఆఫ్ మాల్గుడి చిత్రాలతో బిజీగా ఉన్నాడు. తన నటనతో కన్నడతోపాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సుదీప్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/30biHG7

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....