Thursday 16 July 2020

ఛార్మి ఇంట విషాదం.. మాటలు రావడం లేదంటూ ఎమోషనల్ పోస్ట్

టాలీవుడ్ హీరోయిన్, నిర్మాత చోటుచేసుకుంది. ఆమె కుటుంబంలో ఒకరైన అత్త.. ఈ లోకాన్ని విడిచివెళ్ళింది. ఈ మేరకు ఆమె ఫోటోను పోస్ట్ చేస్తూ తన ట్విట్టర్ ఖాతా ద్వారా భావోద్వేగపూరిత సందేశం పోస్ట్ చేసింది ఛార్మి. మీరు లేరని తెలిసి మాటలు రావడం లేదంటూ ఎమోషనల్ అయింది. ''ఇక మీరు లేరు అనే మాటే వినలేకపోతున్నా.. కానీ జీవితంలో జరిగేది జరగక మానదు. నిన్ననే మనం చివరగా వీడియో కాల్‌లో మాట్లాడుకున్నాం. కానీ అదే చివరిది అవుతుందని భావించ లేదు. మీరు లేరని తెలిసి మాటలు రావడం లేదు.. పైన స్వర్గంలో కూడా నీకు నచ్చినట్టుగా వైన్ తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటావని అనుకుంటున్నాను. పైన ఉన్న అప్పితో కలిసి ఎంతో అమూల్యమైన సమయాన్ని గడుపుతావని ఆశిస్తున్నాను. నిన్ను, నీ చిరునవ్వును మిస్ అవుతున్నా. నా ప్రియమైన ఆంటీ నీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా'' అని పేర్కొంటూ మెసేజ్ పోస్ట్ చేసింది ఛార్మి. Also Read: పూరి జగన్నాథ్‌తో కలిసి సినిమాల నిర్మాణంలో భాగం పంచుకుంటున్న ఛార్మి.. ఇటీవలే ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ లాభాలు గడించింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ, అనన్య పాండే హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న 'ఫైటర్' మూవీ నిర్మాణంలో భాగం పంచుకుంటోంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడింది. అతిత్వరలో తిరిగి ఈ మూవీ షూటింగ్ రీ ఓపెన్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2OzXsZk

No comments:

Post a Comment

When Amitabh, Rajesh Khanna Broke The Ice

Amitabh Bachchan: 'Success didn't affect me at all.' from rediff Top Interviews https://ift.tt/mXlOqDN