సినీ నటుడు '' స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. నిర్విరామంగా ప్రజల కోసం ఆయన చేస్తున్న సేవలకు గాను కీర్తి కిరీటం లభించనుంది. 'మనం సైతం' వ్యవస్థాపకుడిగా కాదంబరి అందిస్తున్న అద్వితీయ సేవలను గుర్తించి ఆయనకు ప్రతిష్టాత్మక 'గ్లోబల్ పీస్ యూనివర్సిటీ' వారు 'గౌరవ డాక్టరేట్' ప్రకటించారు. పాత్రికేయుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన కాదంబరి కిరణ్.. విలక్షణ నటుడిగా పేరు గడించి 'మనం సైతం' పేరుతో స్వచ్చంద సంస్థకు శ్రీకారం చుట్టారు. ఈ సంస్థ ద్వారా నిస్వార్ధంగా సేవలందిస్తున్నారు. ముఖ్యంగా కరోనా క్లిష్ట కాలంలో కాదంబరి అందిస్తున్న సేవలు ఆయనకు మరింత పేరు ప్రతిష్టలు తెచ్చిపెడుతున్నాయి. కాగా కాదంబరి సేవలు గుర్తించి ఆయనకు 'గౌరవ డాక్టరేట్' ప్రకటించడం పట్ల పలువురు సినీ ప్రముఖులతో పాటు రాజ్యసభ సభ్యులు, ప్రముఖ తెరాస యువనేత జోగినపల్లి సంతోష్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తనకు శుభాకాంక్షలు తెలిపిన వారికి కృతజ్ఞతలు తెలిపిన కాదంబరి ఈ డాక్టరేట్తో తన బాధ్యత మరింత పెరిగిందని భావిస్తున్నానని అన్నారు. డాక్టరేట్ ప్రధానోత్సవ కార్యక్రమం త్వరలోనే నిర్వహించనున్నామని 'గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ' ప్రతినిధి తెలిపారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3izAijk
No comments:
Post a Comment