కరోనా విలయతాండవంతో సినీ సెలబ్రిటీలంతా ఇంకా ఇంటికే పరిమితమయ్యారు. లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా షరతులతో కూడిన షూటింగ్ అనుమతులు వచ్చినప్పటికీ.. సెట్స్ పైకి రావడానికి సందేహిస్తున్నారు. తాజా పరిస్థితుల దృష్ట్యా ఇంకా చాలామంది సినీ తారలు తమ తమ షూటింగ్స్ స్టార్ట్ చేయలేదు. ఈ నేపథ్యం లోనే తమ అభిమాన వర్గాలతో టచ్లో ఉండేందుకు గాను సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గా ఉంటున్నారు. అయితే గత కొంతకాలంగా ఎలాంటి షూటింగ్స్లో పాల్గొనకుండా హోమ్ క్వారంటైన్లో ఉన్న మెగా పవర్ స్టార్ .. తాజాగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా కొన్ని ఫోటోలు షేర్ చేస్తూ ఆసక్తికర సందేశం పోస్ట్ చేశారు. ఈ ఖాళీ సమయంలో ఫిట్నెస్పై స్పెషల్ ఫోకస్ పెట్టిన ఆయన భారీ వర్కవుట్స్ చేస్తున్నారు. సదరు పిక్స్ షేర్ చేసిన చెర్రీ ''మెదడు జిమ్ చేయమంటోంది.. హృదయం ఇక చాలంటోంది'' అంటూ ఆసక్తికర సందేశం పోస్ట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది. వావ్! చెర్రీ లాజిక్ భలే ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ప్రస్తుతం మూవీలో నటిస్తున్నారు రామ్ చరణ్. లాక్డౌన్ కారణంగా వాయిదాపడ్డ ఈ మూవీ షూటింగ్ త్వరలోనే రీ ఓపెన్ కానుందని టాక్. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో భారీ ఎత్తున ఈ మూవీ తెరకెక్కిస్తున్నారు. చిత్రంలో రామ్ చరణ్.. అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. ఆయన సరసన ఆలియా భట్ హీరోయిన్గా నటిస్తోంది. Also Read:
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3ee2NzJ
No comments:
Post a Comment