Thursday, 23 January 2020

పెళ్లైన విషయం దాచి మోసం చేశాడు: పోలీసులకు ఫిర్యాదు చేసిన నటి

భర్త వేధింపులకు గురిచేస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది ఓ తమిళ నటి. శివకార్తికేయన్ నటించిన ‘మాన్ కారటే’ సినిమాలో చిన్న పాత్రలో నటించిన ఆమె.. ఏడాది క్రితం రెండో పెళ్లి చేసుకుంది. ఇదివరకే ఆమెకు పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ భర్తతో విభేదాలు రావడంతో విడిపోయారు. ఆ తర్వాత ఆమె ఓ జిమ్ సెంటర్‌ను పెట్టుకుని తన పిల్లలను పోషించుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆమెకు శరవణన్ అనే 40 ఏళ్ల వ్యక్తి పరిచయమయ్యాడు. మాయమాటలు చెప్పి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన వారం రోజులు అనుమానం రాకుండా బాగానే చూసుకున్నాడు. ఆ తర్వాత లేనిపోని నిందలు వేసి ఆమె సంపాదించిన డబ్బు కాజేయాలని చూశాడు. ఈ నేపథ్యంలో శరవణన్‌కి ఇదివరకే పెళ్లైందన్న నిజం నటికి తెలిసింది. అంతేకాదు తన మొదటి భార్యతో కలిసి ప్లాన్ వేసి నటిని పెళ్లి చేసుకున్నాడట. ఇదంతా ఆమె ఆస్తి కోసం చేశాడట. ఈ విషయాన్ని సదరు నటి పోలీసుల ఫిర్యాదులో పేర్కొంది. తన పిల్లలను కూడా టార్చర్ పెడుతున్నట్లు తెలిపింది. READ ALSO: అంతేకాదు ఇంటికి ఫ్రెండ్స్‌ని తీసుకొచ్చి వారిని ఎంటర్‌టైన్ చేయాలని అంటున్నాడట. దాంతో అతన్ని వదిలించుకుని పిల్లల్ని తీసుకుని వేరే కాపురం పెట్టింది. ఈ విషయం తెలిసి శరవణన్ నటిని కిడ్నాప్ చేయించాలని కుట్రపన్నాడు. దాంతో ఎలాగోలా వారి నుంచి తప్పించుకుని తమిళనాడులోని తిరుమంగళం ప్రాంతంలో ఉన్న మహిళా పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది. ఇన్‌స్పెక్టర్ విజయలక్ష్మి ఈ కేసును పరిశీలిస్తున్నారు. READ ALSO:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/36nl3m8

No comments:

Post a Comment

'Nowhere In Empuraan Did They Mention Godhra'

'They just showed riots created by some political party. They never mentioned the name of the place or the political party.' from ...