Thursday 22 July 2021

ప్రియమణి వివాహం చెల్లదు.. ఇప్పటికీ ఆయన నా భర్తే! ముస్తఫా రాజ్ మొదటి భార్య సంచలనం

ఓ వైపు తన భర్త ముస్తఫా రాజ్‌పై గొప్పలు చెప్పుకుంటూ ఆయన దొరకడం అదృష్టం అంటుంటే మరోవైపు ఆయన మొదటి భార్య.. అసలు వీళ్ళిద్దరిదీ అక్రమ వివాహం అంటూ రంగంలోకి దిగింది. రీసెంట్‌గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో అసలు విషయాలు బయటపెడుతూ సంచలన కామెంట్స్ చేసింది ముస్తఫా రాజ్ మొదటి భార్య ఆయేషా. ముస్తఫా తనకు మాజీ కాదని, ఇప్పటికీ భర్తే అని ఆమె అంటోంది. 2010 సంవత్సరంలో ఆయేషాను పెళ్లాడాడు ముస్తఫా రాజ్. వీరికి ఇద్దరు సంతానం. అయితే పెళ్లయ్యాక కొన్నేళ్ల పాటు దాంపత్య జీవితం కొనసాగించిన ఈ జంట.. ఆ తర్వాత విడిపోయారు. అనంతరం 2017 సంవత్సరంలో హీరోయిన్ ప్రియమణిని పెళ్లాడాడు ముస్తఫా. అప్పటి నుంచి ప్రియమణి- ముస్తఫా కలసి జీవిస్తున్నారు. తన భర్త ప్రోత్సాహంతో ఇటీవలే తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది ప్రియమణి. 'నారప్ప' మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఇప్పుడు తనను, తన పిల్లలను ముస్తఫా రాజ్ పట్టించుకోవడం లేదంటూ ఆయేషా మీడియా ముందుకు రావడం సంచలనంగా మారింది. ముస్తఫా తనకు మాజీ కాదని, ఇప్పటికీ భర్తే అని చెబుతున్న ఆయేషా.. ప్రియమణితో ఆయన వివాహం చెల్లదని అంటోంది. ఆయన ప్రియమణిని పెళ్లి చేసుకునే నాటికి కనీసం తాము విడాకులు కూడా అప్లై చేయలేదని, ఇది అక్రమ వివాహం అనేది ఆమె ఆరోపణ. కాగా, దీనిపై ముస్తఫా రియాక్షన్ మరోలా ఉంది. పిల్లల పెంపకం కోసం అవసరమైనంత డబ్బును ఆయేషాకు క్రమం తప్పకుండా పంపిస్తున్నానని, నిజంగా అదే జరగకపోతే ఇంతకాలం ఎందుకు సైలెంట్‌గా ఉందని ప్రశ్నిస్తున్నాడు ముస్తఫా. ఇదంతా డబ్బులు లాగడానికి చేసే ప్రయత్నమని ఆయన అంటున్నాడు. ఏదేమైనా ప్రియమణి పెళ్లి విషయం మాత్రం ప్రస్తుతం జనాల్లో హాట్ టాపిక్ అయింది. చూడాలి మరి దీనిపై ప్రియమణి ఎలా స్పందిస్తుందనేది!.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3eKzRCr

No comments:

Post a Comment

'I Plan To Sue This Minister For 100 Cr'

'Her outrageous comments cannot be allowed to slide under the crack.' from rediff Top Interviews https://ift.tt/cMw6vd5