సెలెబ్రిటీలందరూ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటున్నారు. తమ ఫాలోవర్లతో నిత్యం టచ్లో ఉంటూ సందడి చేస్తుంటారు. అయితే ఇందులో కొందరు నిత్యం క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్ పెడుతుంటారు.. మరికొందరు లైవ్లోకి వచ్చి మాట్లాడుతుంటారు.. ఇంకొందరు కేవలం పోస్ట్లు చేస్తుంటారు. అయితే మెగా హీరోలు మాత్రం ఇలాంటివేమీ చేయరు. సమయం సందర్భం చూసి కొన్ని పోస్ట్లు పెడుతుంటారు. కానీ మొదటిసారిగా సుప్రీమ్ హీరో మాత్రం సోషల్ మీడియాలో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ పెట్టారు. అంతకు ముందు మెగా ఫ్యామిలీలో నాగబాబు మాత్రమే ఇలాంటి సెషన్స్ పెట్టేవారు. ఈ మద్య ఆయన కూడా ఎక్కువ యాక్టివ్గా ఉండటం లేదు. కానీ తాజాగా సాయి ధరమ్ తేజ్ ఇటువంటి పనులు మొదలుపెట్టారు. మొదటిసారిగా ఇన్ స్టాలో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్ పెట్టారు. ఇందులో అనేక ప్రశ్నలను నెటిజన్లు సంధించగా.. సాయి ధరమ్ తేజ్ తన స్టైల్లో సమాధానం ఇచ్చారు. చాలా మంది కూడా మెగా ఫ్యామిలీకి సంబంధించిన ప్రశ్నలే సంధించారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు, రామ్ చరణ్, వరుణ్ తేజ్, నిహారిక, శ్రీజ, సుష్మితల గురించి అడిగారు. చిరంజీవి పవన్ కళ్యాణ్లు ఇన్సిపిరేషన్ అని, పవన్ కళ్యాణ్ గురువు అని, నవ్వడం నేర్పించింది నాగబాబు అని ఇలా చెప్పుకొచ్చారు. రామ్ చరణ్ సూపర్ మెన్ అని వరుణ్ తేజ్ బ్యాట్ మెన్ అని అన్నారు. ఇక ఓ నెటిజన్ మాత్రం నంబర్ చెప్పమని అడిగేశాడు. మీకు పెద్ద అభిమానిని అని చెబుతూ నంబర్ అడిగేశాడు. దీనికి సాయి ధరమ్ తేజ్ సమాధానంగా ఓ కౌంటర్ వేశాడు. శివమణి సినిమాలోని షేకి మాస్ సీన్కు సంబంధించిన మీమ్ను షేర్ చేశారు. మీకు నంబర్ ఇస్తే నా పరిస్థితి ఇలా అవుతుందని అన్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3xIbBbE
No comments:
Post a Comment