Sunday 20 October 2019

నేనేదో కన్నీరు పెట్టానట.. స్పందించిన పరుచూరి గోపాలకృష్ణ

హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్‌లో ఆదివారం జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మీటింగ్‌లో ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఆవేదన చెందారని, కన్నీరు పెట్టుకుంటూ బయటికి వచ్చేశారని వార్తలు వచ్చాయి. వాస్తవానికి ఈ విషయాన్ని మా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్, ఎస్‌వీబీసీ చైర్మన్, కమెడియన్ పృథ్వీ స్వయంగా మీడియాకు వెల్లడించారు. కానీ, దీనిలో నిజం లేదని పరుచూరి గోపాలకృష్ణ చెప్పారు. దీన్ని ఖండిస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. ‘‘మా నటీనట సంఘం నేటి ఆంతరంగిక సమావేశంలో కొందరు సభ్యుల తీరు నచ్చక నేను బయటకు వచ్చేసాను. నేనేదో కన్నీరు పెట్టుకుని వచ్చాను అని కొన్ని ఛానల్స్‌లో చూసాను. అది పొరపాటు, ఖండిస్తున్నాను’’ అని పరుచూరి తన ఫేస్‌బుక్ పోస్టులో పేర్కొన్నారు. కాగా, ఆదివారం జరిగిన ‘మా’ సమావేశంలో అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుల మధ్య తగాదా జరిగింది. సభ్యులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో సమావేశం గందరగోళంగా మారినట్టు విశ్వసనీయ సమాచారం. దీనికితోడు అధ్యక్షుడు వీకే నరేష్ లేకుండా ఈసీ సమావేశం నిర్వహించడం పట్ల కొంత మంది జీవిత, రాజశేఖర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారట. Also Read: ఈ గందరగోళ పరిస్థితుల్లో పరుచూసి గోపాలకృష్ణను కూడా మాట్లాడనివ్వలేదని పృథ్వీ ఇప్పటికే చెప్పారు. దీంతో సమావేశం మధ్యలోనే ఆయన బయటికి వచ్చేశారు. ఆయనేకాదు చాలా మంది సభ్యులు మధ్యలోనే వెళ్లిపోయినట్టు తెలిసింది. అయితే, సమావేశం చాలా బాగా జరిగిందని, అస్సలు గొడవలేమీ జరగలేదని కరాటే కళ్యాణి చెప్పడం విశేషం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/35Qed9M

No comments:

Post a Comment

'I Want To See Myself As Johnny Depp'

'I don't think I ever lost the confidence as an actor.' from rediff Top Interviews https://ift.tt/JMxUyhe