స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తోన్న హ్యాట్రిక్ మూవీ ‘అల... వైకుంఠపురములో...’. పూజా హెగ్డే హీరోయిన్. శ్రీమతి మమత సమర్పణలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ పతాకాలపై అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12 విడుదలయ్యేందుకు ఈ సినిమా సిద్ధమవుతోంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే ఒక పాటను విడుదల చేశారు. సిద్ శ్రీరామ్ ఆలపించిన ‘సామజవరగమన’ అంటూ సాగే ఆ పాట విశేషంగా ఆకట్టుకుంది. సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అద్భుతంగా ఉందంటూ అంతా కొనియాడారు. మంచి క్లాస్ ట్యూన్తో కూడిన మెలోడి ఇది. అయితే, ఇప్పుడు ఈ సినిమాలోని మంచి మాస్ నంబర్ను అభిమానులకు రుచి చూపించబోతున్నారు బన్నీ. ఈ పాట ఎలా ఉండబోతోందో రేపు (అక్టోబర్ 21న) టీజర్ ద్వారా తెలియజేయనున్నారు. ‘రాములో రాములా..’ అంటూ సాగే ఈ పాటను దీపావళి రోజు విడుదల చేయనున్నారు. అయితే, పాట మీద అంచనాలను పెంచేందుకు రేపు ఒక చిన్న బిట్ వదులుతున్నారు. సాయంత్రం 4.05 గంటలకు సాంగ్ టీజర్ను విడుదల చేయనున్నట్లు బన్నీ స్వయంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఇది క్యాచీ సాంగ్ అని, అందరికీ నచ్చుతుందని బన్నీ పేర్కొన్నారు. ఇలాంటి మాస్ నంబర్ బన్నీ నుంచి వస్తుందంటే ఫ్యాన్స్ ఇక పూనకాలే. గెట్ రెడీ..!
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/33RXuRX
No comments:
Post a Comment