సీనియర్ హాస్యనటుడు, మాజీ ఎమ్మెల్యే బాబూ మోహన్కు నోటి దురుసు కాస్త ఎక్కువ అనే సంగతి చాలా మందికి తెలుసు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తులపై నోరు పారేసుకున్న వీడియోలు కొన్ని అప్పట్లో వైరల్ అయ్యాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తన నియోజకవర్గంలో తనను ప్రశ్నించిన ఒక ఓటర్పై బూతులతో విరుచుకుపడ్డారు బాబూ మోహన్. ఆ వీడియో అప్పట్లో విపరీతంగా వైరల్ అయ్యింది. అయితే, ఇప్పుడు బాబూ మోహన్ మాట్లాడిన మరో వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ‘భైరవద్వీపం’ సినిమా షూటింగ్ రోజుల్ని గుర్తుచేసుకుని బాలకృష్ణపై ప్రశంసల వర్షం కురిపించిన బాబూ మోహన్.. మధ్యలోకి మెగాస్టార్ చిరంజీవిని లాగారు. అంతే, ఈ వీడియోను బాలయ్య అభిమానులు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు. ‘భైరవద్వీపం’ సినిమాలో బాలకృష్ణ పక్కనే బాబూ మోహన్ ఉంటారు. ఆయనతో పాటు గర్రంపై వెళ్తుంటారు. అవే విషయాలు కొంత మందితో బాబూ మోహన్ పంచుకున్నారు. ఈ వీడియో ఎప్పుడు తీసిందో తెలీదు కానీ, తాజాగా బయటికి వచ్చేసింది. Also Read: ‘‘భైరద్వీపంలో బాలకృష్ణ, నేను గర్రాలపై వెళ్తాం. బాలకృష్ణ మొనగాడు గుర్రం నడపడంలో. ఆడతాడు గుర్రాలతో. ఎగిరి దూకుతుంటాడు వాటి మీదికి. నిజంగా బాలకృష్ణలా ఎవ్వరూ.. చిరంజీవి, గిరంజీవి ఎవ్వరూ గుర్రం నడపజాలరు. అసలు ఏం పట్టుకోకుండా ఉత్తగా జూలు పట్టుకుని పోతుంటాడు’’ అని బాబూ మోహన్ ఆ వీడియోలో వెల్లడించారు. బాబూ మోహన్ చెప్పేదంతా అక్కడున్నవారు చాలా శ్రద్ధగా వింటున్నారు. ఏదో ఫ్లోలో చిరంజీవి, గిరంజీవి అని బాబూ మోహన్ అనేశారు కానీ.. నిజానికి మెగాస్టార్ అంటే ఆయనికీ అభిమానమే. గతంలో చాలాసార్లు చిరంజీవి గురించి బాబూ మోహన్ గొప్పగా చెప్పారు. ఇప్పుడు బాలకృష్ణ గురించి చెబుతూ నోరుజారారు. ఇంకేముంది, ఆయుధం దొరికింది. సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తున్నారు నందమూరి అభిమానులు. వాస్తవానికి ‘కొదమ సింహం’, ‘కొండవీటి దొంగ’ సినిమాల్లో చిరంజీవి గుర్రం మీద స్వారీ చేయలేదా..? అంతెందుకు మొన్నొచ్చిన ‘సైరా నరసింహారెడ్డి’లో గుర్రంపై రాజులా వచ్చారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/31z4cuy
No comments:
Post a Comment