Sunday 30 June 2019

కృష్ణను పరామర్శించిన చంద్రబాబు, బాలయ్య

భార్య విజయనిర్మలను కోల్పోయి బాధలో ఉన్న నటశేఖరుడు కృష్ణను టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పరామర్శించారు. నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్, గల్లా జయదేవ్‌తో కలిసి ఆదివారం హైదరాబాద్ నానక్‌రామ్ గూడలోని ఇంటికి వెళ్లి ఆయన్ని పరామర్శించారు. కాసేపు ఆయనతో మాట్లాడారు. వీరి వెంట సూపర్ స్టార్ మహేష్ బాబు, తనయుడు వీకే నరేష్ కూడా ఉన్నారు. ప్రముఖ నటి, దర్శకురాలు, నిర్మాత విజయనిర్మల ఈనెల 27న కన్నుమూసిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్‌లో 27వ తేదీ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. భార్య మృతితో కృష్ణ శోకసంద్రంలో ముగినిపోయారు. 50 ఏళ్లుగా ఒకరినొకరు ఒక్క క్షణం కూడా విడిచిపెట్టకుండా జీవించారు. ఎక్కడివెళ్లినా, ఏ కార్యక్రమానికి వెళ్లినా కలిసి వెళ్లాల్సిందే. అలాంటి జీవిత భాగస్వామి ఒక్కసారిగా తనను ఒంటరిని చేసి వెళ్లిపోవడంతో ఆ బాధను తట్టుకోవడం కృష్ణ వల్ల కాలేదు. కన్నీమున్నీరు అయ్యారు. శోకసంద్రంలో ముగినిపోయిన కృష్ణను ప్రముఖులంతా పరామర్శిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ఇప్పుడు చంద్రబాబు, బాలయ్య.. కృష్ణను ఓదార్చారు. కృష్ణను పరామర్శించిన అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. విజయనిర్మల మరణవార్త తనను ఎంతగానో బాధ కలిగించిందని అన్నారు. నటిగానే కాకుండా రాజకీయ నేతగా ఆమెతో దగ్గర సంబంధాలున్నాయని చంద్రబాబు చెప్పారు. 1999లో టీడీపీ తరఫున కైకలూరు నుంచి విజయనిర్మల పోటీచేసిన విషయాన్ని ఈ సందర్భంగా బాబు గుర్తుచేశారు. కృష్ణ కుటుంబానికి తన సంతాపాన్ని తెలియజేస్తున్నానని చెప్పారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2ZRqSWm

No comments:

Post a Comment

'Don't Involve My Family!'

'My weakness is my family, and the people I love.' from rediff Top Interviews https://ift.tt/2lOucDz