సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటారో అందరికీ తెలిసిందే. అయితే మంచు లక్ష్మీ ఇప్పుడు వెకేషన్ను పూర్తి చేసుకుని ఇండియాకు వచ్చేశారు. అలా సడెన్గా ఇండియాకు తిరిగి రావడం వెనుకా కారణం ఉంది. మంచు లక్ష్మీ తన షూటింగ్లతో బిజీగా కానున్నారు. ఈ క్రమంలో మంచు లక్ష్మీ తన వెకేషన్ను పూర్తి చేసుకుని నిన్ననే హైద్రాబాద్లో అడుగుపెట్టేశారు. అలా నిన్న ఇంటికి వచ్చిన మంచు లక్ష్మీ మళ్లీ తన రొటీన్ పనిలో పడ్డారు. వ్యాయామం, మేకప్ అంటూ అన్ని పనులను చేసుకున్నారు. ఇక మంచు వారు క్రమశిక్షణకు మారు పేరు అన్న సంగతితెలిసిందే. ఏదైనా షూటింగ్ ఉందని అంటే.. వారు టైంను కచ్చితంగా ఫాలో అవుతుంటారు. ఉదయం ఏడు అంటే ఏడింటి వరకే సెట్లో ఉంటారు. అలా నేడు ఉదయం మంచు లక్ష్మీ తన షూటింగ్ సెట్లో అడుగుపెట్టారు. అంతా రెడీ అయింది.. ఇక షూటింగ్కు సిద్దమని అనుకునే టైంలోనే అసలు సమస్య వచ్చి పడిందట. ఈ మేరకు మంచు లక్ష్మీ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఒక్కోసారి మనం ఎన్నో అనుకుంటాం..కానీ ఇంకేదో జరుగుతుంది కదా? అన్నట్టుగా చెప్పుకొచ్చారు. నేను ఉదయాన్నే లేచాను.. షూటింగ్ కోసం రెడీ అయ్యాను.. సరిగ్గా ఆ సమయంలోనే సాంకేతిక సమస్యలు తలెత్తాయి.. షూటింగ్ క్యాన్సిల్ అయింది.. మనిషి తలిచాడు.. దేవుడు తిరస్కరించాడు అన్నట్టుగా వ్యవహారం ఉందని మంచు లక్ష్మీ తన పరిస్థితి మీద కౌంటర్లు వేసుకున్నారు. మొత్తానికి ఉదయం పూటే మంచు లక్ష్మీకి ఇలాంటి అనుభవం ఎదురైందన్న మాట.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3ekkDUN
No comments:
Post a Comment