Sunday 17 November 2019

LIVE: వైభవంగా ఏఎన్నార్ నేషనల్ అవార్డ్స్.. చీఫ్ గెస్ట్ చిరంజీవి

దిగ్గజ నటుడు, నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు పేరిట ఏర్పాటుచేసిన ఏఎన్నార్ నేషనల్ అవార్డ్స్‌ను ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ అవార్డును కిందటేడాది ఎవరికీ ఇవ్వలేదు. అందుకని, ఈ ఏడాదితోపాటు గత సంవత్సర అవార్డును కలుపుకుని ఇప్పుడు ప్రకటించారు. 2018 సంవత్సరానికి గాను దివంగత నటి శ్రీదేవికి, 2019 సంవత్సరానికి గాను ప్రముఖ నటి రేఖకు ఏఎన్నార్ నేషనల్ అవార్డులను ప్రకటించారు. ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా జరుపుతున్నారు. ఏఎన్నార్ నేషనల్ అవార్డ్స్ ఫంక్షన్ ఆదివారం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన చేతుల మీదుగా ఈ అవార్డులను అందజేస్తారు. శ్రీదేవి తరఫున ఆమె భర్త బోనీ కపూర్ అవార్డును అందుకుంటారు. అలాగే రేఖకు చిరంజీవి అవార్డును అందజేస్తారు. See Photo Story: కాగా, ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో సినీ ప్రముఖులంతా పాల్గొన్నారు. అక్కినేని కుటుంబ సభ్యులతో పాటు టి.సుబ్బరామిరెడ్డి, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లైవ్ టెలీకాస్ట్‌ను కింది వీడియోలో చూడొచ్చు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2OmBgkG

No comments:

Post a Comment

'Looking to export from India in next 5 years'

'All competitors are sourcing within the country, so we'll be at the same level of competition.' from rediff Top Interviews ht...