Saturday, 30 November 2019

``ఇద్దరి లోకం ఒక్కటే`తో మరో హిట్ కన్‌ఫర్మ్‌`

ఉయ్యలా జంపాల సినిమాతో టాలీవుడ్‌కు హీరోగా పరిచయం అయిన రాజ్‌ తరువాత తరువాత మంచి విజయాలతో ఆకట్టుకున్నాడు. ఇటీవల సక్సెస్‌ల విషయంలో కాస్త తడబడినా.. త్వరలో అంటే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఆడు మగాడ్రా బుజ్జి ఫేం జీఆర్‌ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సక్సెస్‌ ఫుల్ ప్రొడ్యూసర్‌ దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో రాజ్‌ తరుణ్‌కు జోడిగా అర్జున్‌ రెడ్డి ఫేం షాలిని పాండే నటిస్తోంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను డిసెంబర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్‌. ఇప్పటికే ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ రెండు పాటలను విడుదల చేశారు. ఈ రెండు పాటలకు మంచిరెస్సాన్స్‌ రావటంతో సినిమా మీద పాజిటివ్‌ బజ్‌ క్రియేట్ అయ్యింది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కథా కథనాలు సినిమా అవుట్‌పుట్‌ చాలా బాగా వచ్చిందన్న టాక్‌ వినిపిస్తోంది. అవుట్‌పుట్‌ మీద నమ్మకంతో సినిమాను సొంతంగా రిలీజ్ చేస్తున్నాడు. సినిమా సక్సెస్‌ను జెడ్జ్‌ చేయటంలో మంచి పేరున్న దిల్ రాజు ఈ సినిమాను స్వయంగా రిలీజ్‌ చేస్తుడంటంతో బిజినెస్‌ కూడా భారీగా జరుగుతోంది. ఈ సినిమాతో రాజ్‌ తరుణ్‌ ఖాతాలో మరో హిట్ ఖాయం అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ఇప్పటికే శాటిలైట్‌, డిజిటల్‌ రైట్స్‌తోనే సినిమా బ్రేక్‌ ఈవెన్‌ అయ్యింది. థియెట్రికల్‌ రిలీజ్‌ ద్వారా వచ్చే మొత్తం అంతా లాభాలే అని నిర్మాత దిల్‌ రాజు స్వయంగా ప్రకటించారు. దీంతో రిలీజ్‌కు ముందే రాజ్‌ తరుణ్‌, జీఆర్‌ కృష్ణల కాంబినేషన్‌లో హిట్‌ కొట్టేసింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2LaWgdn

No comments:

Post a Comment

FM: 'Focus Of Budget Was To Keep Stable Growth Going'

'We kept this Budget on a larger plank, rather than on one incident, however serious.' from rediff Top Interviews https://ift.tt/F...