Thursday, 14 November 2019

హాస్పిటల్లో ఉంటే ఇష్టమొచ్చినట్లు రాసేస్తారా: కృష్ణంరాజు

ప్రముఖ నటుడు, కేంద్ర మాజీ మంత్రి అస్వస్థతకు గురయ్యారని, కొంతకాలంగా ఆయన నుమోనియాతో బాధపడుతున్నారని వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. బుధవారం రాత్రి ఊపిరి తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందిగా ఉందని దాంతో కుటుంబ సభ్యులు ఆయన్ను బంజారాహిల్స్‌లోని కేర్ హాస్పిటల్‌లో చేర్పించారని వదంతులు వినిపించాయి. అయితే దీనిపై తాజాగా కృష్ణంరాజు స్పందించారు. తన గురించి మీడియా వర్గాలు ఇష్టమొచ్చినట్లుగా రాసేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు నుమోనియా వచ్చిన మాట నిజమేనని, కాకపోతే రెగ్యులర్ చెకప్ నిమిత్తం హాస్పిటల్‌కు వెళితే పలు మీడియా వర్గాలు సీరియస్‌గా ఉందని రాసేశాయని మండిపడ్డారు. ‘నేను హాస్పిటల్‌కు వెళ్లిన మాట నిజమే. కాకపోతే నుమోనియా ట్రీట్‌మెంట్‌లో భాగంగా రెగ్యులర్ చెకప్ నిమిత్తం వెళ్లా్ల్సి వచ్చింది. అక్కడ కొందరు జర్నలిస్ట్‌లు నన్ను చూశారు. దాంతో నన్ను కానీ నా కుటుంబాన్ని కానీ ఎలాంటి వివరాలు అడగకుండా నోటికొచ్చింది రాసేశారు. నేను బాగానే ఉన్నాను. చెకప్ పూర్తవగానే త్వరలో డిశ్చార్జ్ అవుతాను. మీడియా రాసిన వార్తలు చదివి నా ఫ్యాన్స్ చాలా కంగారుపడుతున్నారు. వారి ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ఇబ్బందిపడుతున్నాను. నేను క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నవారికి ధన్యవాదాలు’ అని తెలిపారు. ఇదిలా ఉంటే, కృష్ణంరాజు ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు. కానీ, యాక్టివ్ పాలిటిక్స్‌లో అయితే ఆయన లేరు. అప్పుడప్పుడు పార్టీ కార్యక్రమాల్లో మాత్రమే పాల్గొంటున్నారు. మరోవైపు, ఆయన తన తమ్ముడు కుమారుడు ప్రభాస్‌తో ఒక సినిమాను నిర్మిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌తో కలిసి గోపీకృష్ణ మూవీస్ బ్యానర్‌పై ఈ సినిమాను కృష్ణంరాజు నిర్మిస్తున్నారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది ప్రభాస్‌కు 20వ సినిమా. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభంకానుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/33OKD3d

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....