పవన్ రీ ఎంట్రీ తర్వాత చకచకా సినిమాలను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే వకీల్సాబ్తో సందడి చేసిన పవర్స్టార్ ఇప్పుడు ఒకవైపు భీమ్లానాయక్..మరో వైపు హరిహర వీరమల్లు చిత్రాలను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ రెండు చిత్రాల్లో భీమ్లా నాయక్ విషయానికి వస్తే సాగర్ చంద్ర దర్శకుడయినా.. పవన్ స్నేహితుడైన త్రివిక్రమ్ అంతా తానై సినిమాను నడిపిస్తున్నాడు. ఇక హరిహర వీరమల్లు విషయంలో క్రిష్ సీనియర్ డైరెక్టర్. పీరియాడిక్ బ్యాక్డ్రాప్లో హరిహర వీరమల్లు చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే ఇందులో కొంత పోర్షన్ పవన్కు నచ్చలేదని, దీంతో స్క్రిప్ట్లో సజేషన్స్, మార్పుల కోసం స్నేహితుడు త్రివిక్రమ్ను రంగంలోకి దించాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే అసలు సమస్య ఏంటంటే.. డైరెక్టర్ క్రిష్ తన సినిమా స్క్రిప్ట్ విషయంలో మరొకరు వేలు పెడిగే సహించలేరు. మణికర్ణిక విషయంలో అదే జరిగింది. కంగనా రనౌత్తో గొడవపడి క్రిష్ బయటకు వచ్చేసిన సంగతి తెలిసిందే. మరిప్పుడు పవన్ కోరిక మేరకు త్రివిక్రమ్కు క్రిష్ తన సినిమా స్క్రిప్ట్ చేంజ్ చేయడానికి ఒప్పుకుంటాడా! అనేది మిలియన్ డాలర్స్ ప్రశ్నగా మారింది. ఓ సీనియర్ దర్శకుడిని పవన్ ఇబ్బంది పెడుతున్నాడంటూ సోషల్ మీడియాలో వినిపిస్తోన్న వార్తల్లో నిజానిజాలేంటో తెలియాలంటే ఆగక తప్పదు. మొఘల్ కాలానికి చెందిన గజదొంగ కథతో హరిహర వీరమల్లు కథాంశం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్రలో కనిపించనున్నారు. పంచమి అనే పాత్రలో నిధి అగర్వాల్ నటిస్తుంది. బాలీవుడ్ బ్యూటీ జాక్వలైన్ కూడా మరో పాత్రలో నటిస్తుంది. ఎ.ఎం.రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమా విడుదలవుతుంది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3BIy3D3
No comments:
Post a Comment